-
ఆ హీరో సడన్గా దగ్గరకు వచ్చి వింతగా ప్రవర్తించాడు: భాగ్యశ్రీ
మైనే ప్యార్ కియా(తెలుగులో ప్రేమ పావురాలు) చిత్రంతో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టింది భాగ్యశ్రీ. ఒకప్పుడు హీరోయిన్గా రాణించిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతోంది. ఆ మధ్య ప్రభాస్ రాధేశ్యామ్, బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ మూవీ ఛత్రపతిలోనూ కనిపించింది. తాజాగా ఈ నటి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. అందువల్ల స్కూల్లో చదువుకునే రోజుల్లో మా క్లాస్లో అబ్బాయిలతో మాట్లాడేదాన్నే కాదు. కానీ అనుకోకుండా హిమాలయ దస్సానీతో ప్రేమలో పడ్డాను. మా ప్రేమ విషయం నాన్నకు ఎక్కడ తెలిసిపోతుందో? తను ఎలా స్పందిస్తాడో? అని టెన్షన్ పడేదాన్ని. ఊటీలో షూటింగ్.. ఆ రోజు సినిమాల్లోకి వచ్చేంతవరకు కూడా అది సీక్రెట్గానే ఉంచాను. మైనే ప్యార్ కియా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నా విషయం సల్మాన్కు తెలిసింది. ఆ తర్వాత మేము దిల్ దీవానా బిన్ సజ్నాకే సినిమా చేశాం. ఈ మూవీ షూటింగ్ కోసం ఊటీలో నెలరోజులపాటు ఉన్నాం. అప్పుడు సల్మాన్ వచ్చి నా చెవిలో పాట పాడాడు. పదేపదే ఏదో గుసగుసలాడుతున్నట్లుగా దగ్గరకు వచ్చి పాటలు పాడుతూనే ఉన్నాడు. అంతకుముందెన్నడూ అలా ప్రవర్తించలేదు. ఇతడేంటి? నాతో ఫ్లర్ట్ చేస్తున్నాడు? తనకిది సరదాగా ఉందా? అని చిరాకెత్తుకొచ్చింది. హీరోను తిట్టేశా.. తనను పక్కకు తీసుకెళ్లి ఏమైంది నీకు? ఎందుకిలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు.. బుద్ధిగా నడుచుకో అని చెప్పాను. అప్పుడతడు నీ ప్రేమ విషయం తెలిసిపోయిందిలే, అందుకే ఆటపట్టిస్తున్నా అన్నాడు. నీ ప్రియుడిని సెట్స్కు పిలువు.. ఎవరికీ అనుమానం రాకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. అలా హీరో అండతో దస్సానీని కలుసుకుని మాట్లాడేదాన్ని. అందరూ అతడిని సల్మాన్ ఫ్రెండ్ అనుకున్నారు' అని చెప్పుకొచ్చింది. కాగా భాగ్యశ్రీ.. 1990లో హిమాలయ దస్సానీని పెళ్లాడింది. వీరికి అవంతిక, అభిమన్యు సంతానం. చదవండి: ఆ బుజ్జిని గుర్తుపట్టారా? ఈమె మిడిల్ క్లాస్ మదర్! -
సినిమా వాళ్లపై ప్రజల్లో అలాంటి అభిప్రాయం: రాధేశ్యామ్ నటి కామెంట్స్!
మైనే ప్యార్ కియా (తెలుగులో ప్రేమ పావురాలు) సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టిన బాలీవుడ్ భామ భాగ్యశ్రీ. మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ కిసీ కీ జాన్ చిత్రంలో కనిపించింది. అంతేకాక గతేడాది ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఈ ఏడాదిలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన చత్రపతి చిత్రంలోనూ కనిపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన భాగ్యశ్రీ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో పనిచేసేవారు మంచి వ్యక్తులు కాదని ప్రజలు భావిస్తారని అన్నారు. అయితే వారి అభిప్రాయాల కారణంగా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని భాగ్యశ్రీ చెప్పింది. ఇలాంటివి ఆమెను ఎలా ప్రభావితం చేస్తాయనే అనే విషయంపై తన అభిప్రాయాలను పంచుకుంది. (ఇది చదవండి: నీచమైన బతుకులు, మానసికంగా చంపుతున్నారు.. ఏడ్చేసిన అమర్ తల్లి) బాలీవుడ్లో ఉన్న అభిప్రాయాల గురించి అడిగినప్పుడు, భాగ్యశ్రీ మాట్లాడుతూ.. 'బాలీవుడ్లో పనిచేసే వ్యక్తులు మంచి వ్యక్తులు కాదనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఈ విషయంలో మనం ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉండాలి. ఎవరైనా వంట చేస్తున్నట్టు లేదా శుభ్రం చేస్తున్నట్టు సోషల్ మీడియా పోస్ట్ చేస్తే.. ప్రజలు వాటికి కూడా.. 'మీరు అవన్నీ చేయకూడదు, ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా' అని సలహాలిస్తారు. నిజంగా చెప్పాలంటే మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి. మన ఆహారం మనమే వండుకోవాలి. మేము మీలాగా సాధారణ మనుషులమే. కానీ ప్రజలు మరింత రూడ్గా, సున్నితంగా మారినప్పుడే ఇలాంటి సమస్య ఎదురవుతుందని' ఆమె అన్నారు. గతంలో సినిమాలపై భాగ్యశ్రీ మాట్లాడుతూ.. 'నేను 80వ దశకంలో బాలీవుడ్లో అరంగేట్రం చేశా. సినిమాల్లోకి ప్రవేశించినప్పుడే ఇలాంటి భావం ప్రజల్లో అప్పటికే ఉంది. సినిమాలు చాలా చెడ్డ ప్రపంచం. మంచి కుటుంబం నుంచి వచ్చిన ఏ వ్యక్తిని చిత్ర పరిశ్రమకు వెళ్లనివ్వరు. ఇలాంటి అభిప్రాయం 30 సంవత్సరాల క్రితమే చూశా. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ప్రస్తుతం సెట్ డిజైనింగ్ నుంచి మేకప్ వరకు ప్రతి అంశంలోనూ మహిళలు ఉన్నారు. ఇది ఎప్పటికీ పరిశ్రమలో ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నా.' అని అన్నారు. భాగ్యశ్రీ ప్రస్తుతం సజిని షిండే కా వైరల్ వీడియోలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో రాధికా మదన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. మడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో సుబోధ్ భావే కూడా నటించారు. (ఇది చదవండి: సిద్దార్థ్ ఎమోషనల్ మూవీ 'చిన్నా' ఓటీటీ పార్ట్నర్ ఇదే!) -
ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ కొడుకు ఇప్పుడు హీరో.. ఎలా ఉన్నాడో తెలుసా? (ఫొటోలు)
-
సల్మాన్తో రిలేషన్లో ఉందా?.. ఏకంగా నా భర్తనే అడిగారు: హీరోయిన్
మైనే ప్యార్ కియా చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన బాలీవుడ్ భామ భాగ్యశ్రీ. ఈ సినిమా తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో రిలీజైంది. సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తొలి సినిమాకే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. తెలుగులో ఓంకారం, యువరత్న రాణా, రాధేశ్యామ్ చిత్రాల్లో నటించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్లో ఎదురైన చేదు సంఘటనలను పంచుకుంది. (ఇది చదవండి: ఏజెంట్పై ఫలితంపై అఖిల్ రియాక్షన్..) మైనే ప్యార్ కియా సినిమా తనకు సక్సెస్తోపాటు కొన్ని ఇబ్బందులు కూడా తీసుకువచ్చిందని భాగ్యశ్రీ వెల్లడించారు. ఈ చిత్రం విడుదలైనప్పుడు సల్మాన్తో రిలేషన్లో ఉందని బీటౌన్లో మాట్లాడుకున్నారు. పలు పత్రికల్లోనూ వీరిద్దరి గురించి పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఓ మీడియా ప్రతినిధి ఈ విషయంపై తన భర్తను ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ' నా కుమారుడు అభిమన్యు పుట్టిన తర్వాత రోజు నన్ను కలవడానికి ఒక మహిళా రిపోర్టర్ వచ్చారు. విషెస్ చెప్పిన ఆమె అక్కడే ఉన్న నా భర్తను ఓ ప్రశ్న అడిగింది. సల్మాన్ఖాన్తో మీ భార్య రిలేషన్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించింది. ఆ క్షణం నేను షాకయ్యాను. నా జీవితంలో అలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదు. అప్పటి నుంచి నేను ఫిల్మ్ మ్యాగజైన్స్ చదవడం మానేశా. సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా.' అని అన్నారు. (ఇది చదవండి: బాలీవుడ్ క్వీన్.. సూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్!) అంతేకాకుండా.. సల్మాన్ ఎంతో మంచి వ్యక్తి అని.. అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘మైనే ప్యార్ కియా’ రిలీజైన కొంతకాలానికే తన స్నేహితుడు హిమాలయ దాసానిని వివాహం చేసుకున్నారు భాగ్యశ్రీ. ఇక పెళ్లి తర్వాత కూడా భాగ్యశ్రీ తక్కువ సినిమాలే చేశారు. గతేడాది విడుదలైన ‘రాధేశ్యామ్’తో ఆమె తెలుగు తెరపై సందడి చేశారు. ఇందులో ఆమె ప్రభాస్కు తల్లిగా కనిపించారు. ఇటీవల విడుదలైన హిందీ వర్షన్ ఛత్రపతి హీరోకు తల్లి పాత్రలో నటించారు. -
న్యూజెర్సీలో ఆపి కన్వెన్షన్ లాంచ్ రెడ్ కార్పెట్ డిన్నర్ గాలా
అగ్రరాజ్యం అమెరికాలో ఎంతో సేవ చేస్తున్న అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ -ఆపి 41వ వార్షిక కన్వెన్షన్ ముహూర్తం ఖరారైంది. ఫిలడెల్ఫియాలో ఈ ఏడాది జులై 6 నుంచి 9వ తేదీ వరకు జరగనుంది. ఈ సందర్భంగా న్యూజెర్సీలో ఆపి కన్వెన్షన్ లాంచ్ రెడ్ కార్పెట్ డిన్నర్ గాలా జరిగింది. న్యూయార్క్లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, బాలీవుడ్ ఐకాన్ భాగ్యశ్రీతో పాటు ఆపి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో, లైవ్ మ్యూజిక్ ఆహుతులను ఆకట్టుకుంది. ఫిలడెల్ఫియాలో జరిగే ఆపి 41వ కన్వెన్షన్కు అందరూ విచ్చేసి, విజయవంతం చేయాలని న్యూజెర్సీ స్టేట్ ఆపి ఫ్రెసిడెంట్ డాక్టర్ ప్రదీప్ షా కోరారు. కన్వెన్షన్ అద్భుతంగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆపి ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement