Actress Bhagyashree: టాలీవుడ్‌పై నటి భాగ్యశ్రీ ప్రశంసలు, బాలీవుడ్‌పై షాకింగ్‌ కామెంట్స్‌..

Actress Bhagyashree Shocking Comments On Bollywood In a Interview - Sakshi

రాధేశ్యామ్‌తో రీఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ

Bhagyashree Shocking Comments On Bollywood: ఒకప్పుడు టాలీవుడ్‌ను చిన్న చూపు చూసిన బాలీవుడ్‌ స్టార్‌ నటీనటులు ఇప్పుడు తెలుగు సినిమాలపై కన్నేస్తున్నారు. బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లు మన తెలుగు హీరోలతో నటించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కొందరు హీరోహీరోయిన్లు కూడా ఈ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చేశారు. బాలీవుడ్‌ ‘భాయిజాన్‌’ సల్మాన్‌ ఖాన్‌ కూడా త్వరలోనే తెలుగు తెరపై సందడి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు చాలా మంది హీరోలు, నటులు తెలుగు నటించాలని ఉందంంటూ వారి మనసులో మాట చెప్పేస్తున్నారు. అంతేకాదు మన తెలుగు సినిమాలను సైతం అక్కడ రిమేక్‌ చేస్తున్నారు.

చదవండి: సమంతపై జిమ్‌ ట్రైనర్‌ జునైద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో సీనియర్‌ నటి భాగ్యశ్రీ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా పాన్‌ ఇండియా చిత్రం రాధేశ్యామ్‌తో భాగ్యశ్రీ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 80, 90లలో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ వెలుగువెలిగిన ఆమె పెళ్లి అనంతరం సినిమాలకు దూరమయ్యారు. రాధేశ్యామ్‌లో ప్రభాస్‌కు తల్లి పాత్రతో ఆమె మళ్లీ వెండితెరపై అలరించనున్నారు. రాధేశ్యామ్‌ మార్చి 11న విడుదలకు కాబోతున్న తరుణంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా భాగ్యశ్రీ  ప్రస్తుతం బాలీవుడ్‌లో అన్ని పాత కథలు, కాపీ స్క్రీప్ట్స్‌ వస్తున్నాయని అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

చదవండి: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవాలి అన్నాడు: ‘చంద్రలేఖ’ హీరోయిన్‌

అలాగే తెలుగు మలయాళ ఇండస్ట్రీలో కొత్త స్క్రిప్ట్స్, కొత్త కథలు వస్తున్నాయన్నారు. కొత్త టాలెంట్, ఓటిటి ప్లాట్ ఫామ్స్ వల్ల సినిమా స్థాయి రోజు రోజుకు ఇంటర్నేషనల్ స్థాయికి మారుతుందని, ప్రజలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను, అలాంటి కథలనే ఇష్ట పడుతున్నారని చెప్పారు. భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, యంగ్ జనరేషన్ నుంచి కొత్త కథలు, కొత్త సినిమాలు వస్తున్నాయన్నారు. అందుకే తానూ న్యూ టాలెంట్ పీపుల్స్‌తో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top