-
బ్యాంక్లోన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలంటే..
బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. అన్ని సందర్భాల్లోనూ రుణం దొరకండ అంత తేలికేమీ కాదు. కొందరికి ఎంత ప్రయత్నించినా అప్పు దొరకడం కష్టం అవుతుంది. అన్నీ సవ్యంగా ఉన్నాయి అనుకున్నప్పటికీ బ్యాంకులు రుణ దరఖాస్తును తిరస్కరిస్తోంది. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు రుణగ్రహీత ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం. రుణ దరఖాస్తును తిరస్కరించేందుకు చాలా కారణాలుంటాయి. అంతకు ముందు తీసుకున్న రుణాల చెల్లింపు తీరు, ఆదాయాన్ని మించిన అప్పుల్లాంటివీ ఇందులో ఉంటాయి. రుణ దరఖాస్తు తిరస్కరించిన వెంటనే మళ్లీ కొత్తగా వేరే బ్యాంకులో దరఖాస్తు చేయకముందు చాలా విషయాలు సరిచేసుకోవాలి. మీ దరఖాస్తును బ్యాంకు ఎందుకు తిరస్కరించిందో కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రుణదాతలు కచ్చితంగా దీన్ని తెలియజేస్తారు. క్రెడిట్ స్కోరు 700 పాయింట్ల లోపు ఉన్నప్పుడు రుణ దరఖాస్తును ఆమోదించడం కష్టం. తగినంత ఆదాయం లేకపోవడం, ఇప్పటికే ఉన్న రుణాల వాయిదాలు మీ ఆదాయంలో 50-60 శాతానికి చేరడం, వాయిదాలను ఆలస్యంగా చెల్లించడం, ఉద్యోగంలో సమస్యలు, తాకట్టు పెట్టిన ఆస్తులకు సంబంధించి చట్టపరమైన చర్యల వంటి వాటివల్లా దరఖాస్తు తిరస్కరించే ఆస్కారం ఉంది. మీ క్రెడిట్ నివేదికలో తప్పుడు వివరాలూ కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. వాయిదాలు చెల్లింపులో.. రుణ తిరస్కరణ ఎదురుకాకుండా చూసుకునేందుకు ఆరోగ్యకరమైన రుణ చరిత్రను నిర్వహించడం ఎంతో కీలకం. వాయిదాలను సకాలంలో చెల్లించాలి. 750కి మించి క్రెడిట్ స్కోరున్నప్పుడు రుణ దరఖాస్తును సులభంగా ఆమోదిస్తారు. తక్కువ స్కోరు వల్లే రుణం లభించలేదు అని తేలితే.. ముందుగా స్కోరును పెంచుకునేందుకు ప్రయత్నించాలి. చిన్న మొత్తంలో ఉన్న అప్పులను పూర్తిగా చెల్లించేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు క్రమంగా పెరుగుతుంది. తప్పుడు వివరాలుంటే.. వ్యక్తిగత గుర్తింపు ధ్రువీకరణ, చిరునామా, సంతకం, పాన్, ఆధార్ ఇలా పలు వివరాలను రుణ దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఇవన్నీ రుణదాతల యాప్లోనే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వీటిలో ఏ చిన్న పొరపాటు గుర్తించినా, రుణ దరఖాస్తు ఆమోదం పొందదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలు సరిచూసుకోవాలి. నిత్యం లోన్లు అడుగుతుంటే.. కొంతమంది అవసరం లేకపోయినా వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డుల కోసం బ్యాంకులను సంప్రదిస్తారు. ఇలా మీరు అడిగిన ప్రతిసారీ మీ క్రెడిట్ స్కోరు స్వల్పంగా తగ్గుతుంది. కాబట్టి, తక్కువ వ్యవధిలోనే బహుళ రుణ దరఖాస్తులు మీ క్రెడిట్ స్కోరును గణనీయంగా దెబ్బతీస్తాయి. మీ స్కోరును కాపాడుకునేందుకు సాధ్యమైనంత వరకూ తక్కువ దరఖాస్తులు చేయడం మేలు. అనేకసార్లు దరఖాస్తు చేస్తే.. మీరు అప్పుల మీదే ఆధారపడుతున్నారని బ్యాంకులు భావించే అవకాశం ఉంది. తనిఖీలు చేసుకోండి.. క్రెడిట్ నివేదికలో తప్పులు దొర్లినప్పుడు వాటిని వెంటనే గుర్తించేలా ఉండాలి. కాబట్టి, క్రెడిట్ నివేదికను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. కొన్ని క్రెడిట్ బ్యూరోలు నెలకోసారి వీటిని ఉచితంగానే అందిస్తాయి. మీ ఆర్థిక ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఇవి తోడ్పడతాయి. ఏదైనా పొరపాట్లు ఉంటే, వెంటనే వాటిని గుర్తించి, సరి చేసుకునేందుకు వీలవుతుంది. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నప్పుడు, అది పెరిగేందుకు కొంత సమయం పడుతుంది. రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డు బాకీల్లాంటివి సకాలంలో చెల్లించాలి. అప్పుడు మీపై బ్యాంకులకు విశ్వాసం పెరిగి, రుణ దరఖాస్తును వేగంగా ఆమోదించే అవకాశాలుంటాయి. -
స్వయం ఉపాధి ఒక మంచి త‘రుణం’
సంగారెడ్డి: హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 481 స్వశక్తి మహిళా సంఘాల్లో 5,106 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో గ్రూపునకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు పొందుతున్నారు. ప్రతీ సంఘం ప్రణాళికలు రచించుకుంటూ సీనియార్టీ ప్రకారం బ్యాంక్లో రుణాలు పొందుతూ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటున్నారు. సభ్యుల ఏకగ్రీవ తీర్మాణంతో అప్పులు తీసుకొని వాటిని కీస్తీల వారిగా అప్పులు చెల్లిస్తూ బ్యాంక్లకు నమ్మకం కలిగిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (మార్చి 2024)గాను 99 గ్రూపులకు గాను 8.36 కోట్ల రుణాల టార్గెట్ విధించగా, ఇందులో 85 గ్రూపులు రూ.9.80 కోట్లు టార్గెట్ను మించి రుణాలు పొందారు. మరో రూ.1.50 కోట్లకు రుణాల ప్రతిపాదనలు పంపినట్లు మెప్మా సీఈఓ రాజు తెలిపారు. ఈ నిధులు మంజూరైతే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల కంటే హుస్నాబాద్ మెప్మా అగ్రగ్రామిగా నిలువనుంది. ఈ రుణాలతో మహిళలు ముఖ్యంగా టైలరింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడర్, పాడి పశువుల పెంపకం వంటి యూనిట్లను ఎంచుకొని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వీధి వ్యాపారులకు రూ.కోట్లలో.. హుస్నాబాద్ పట్టణంలోని వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం కింద చేయూతను అందిస్తుంది. ఒక్కో వ్యాపారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాన్ని బ్యాంక్ల ద్వారా అందిస్తున్నారు. ఈ ఏడాది హుస్నాబాద్ పట్టణంలో వీధి వ్యాపారుల గుర్తింపుపై సర్వే చేసి 1,566 మందిని గుర్తించారు. ఇందులో 1,365 మంది రుణం కోసం దరఖాస్తు చేసుకోగా, 1332 మందికి మొదటి విడతగా రూ.10 వేల చొప్పున రూ.1.33 కోట్ల రుణం మంజూరు చేశారు. రెండో విడతగా 865 మంది వ్యాపారులకు టార్గెట్ చేయగా, 837 మందిని గుర్తించారు. ఇందులో 712 మందికి బ్యాంక్ అధికారులు సమ్మతం తెలుపగా, 690 మందికి రూ.20 వేల చొప్పున 1.38 కోట్లు రుణం అందజేశారు. మూడో విడతలో 161 మందిలో 154 మంది గుర్తించి 150 మందికి రూ.50వేల చొప్పున రూ.75 లక్షల రుణాన్ని బ్యాంక్ అధికారులు మంజూరు చేశారు. ఈ రుణాలను వీధి వ్యాపారులు క్రమం తప్పకుండా చెల్లిస్తూ, మళ్లీ అధికంగా ఎక్కువ రుణాలు పొందేలా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. పీఎం స్వనిధి రుణాల్లో హుస్నాబాద్ జిల్లాలోనే టాప్గా నిలిచింది. మహిళా సంఘాలు ఆర్థిక పురోగాభివృద్ధికి అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదుగుతున్నారు. హుస్నాబాద్లోని మహిళా సంఘాల సభ్యులు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు టార్గెట్ను మించి పొందారు. మరో కోటి రూపాయలు వస్తే జిల్లాలోనే హుస్నాబాద్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అగ్రభాగాన నిలువనుంది. అలాగే, వీధి వ్యాపారులకు ఇచ్చే పీఎం స్వనిధి రుణాల్లో హుస్నాబాద్ టాప్లో నిలిచింది. వీధి వ్యాపారులకు బ్యాంకు అధికారులు రూ.కోట్లలో రుణాలు ఇవ్వడం గమనార్హం. ఆర్థికంగా ఎదగడానికే.. మహిళలు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. వారు నచ్చిన యూనిట్లను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారు. నెల వారి కిస్తీలు సక్రమంగా చెల్లిస్తూ బ్యాంకులకు నమ్మకం కలిగిస్తున్నారు. అలాగే వీధి వ్యాపారులకు బ్యాంక్ల ద్వారా రుణాలు అందిస్తున్నాం. జిల్లాలోనే అత్యధికంగా వీధి వ్యాపారులు రుణాలు పొందారు. – రాజు, మెప్మా సీఈఓ, హుస్నాబాద్ -
'బ్యాంక్లోన్ కావాలా'! అంటూ.. భారీ మోసం! అసలేం జరిగిందంటే..?
మహబూబాబాద్: లోన్ పేరిట ఓ ప్రభుత్వ ఉద్యోగితో పాటు ఆమె భర్త, కూతురు, మరో ఇద్దరు మోసం చేశారని, వీరిపై ఎస్పీ కరుణాకర్కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు శనివారం తెలిపారు. బాధితురాలి కథనం ప్రకారం మహాముత్తారం మండలం మాదారానికి చెందిన పెరుమాండ్ల పోశమ్మ కాటారం మండల మేడిపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తోంది. పాఠశాలలోని ఓ ఉపాధ్యాయురాలు, ఆమె భర్త పదే పదే బ్యాంక్లోన్ కావాలా అని అడేగేవారు. దీంతో రూ.2లక్షల లోన్ ఇప్పించమని కోరింది. ఈ క్రమంలో సదరు ఉద్యోగి భర్త మంథనికి తీసుకెళ్లి ధ్రువపత్రాలపై సంతకాలు తీసుకున్నారు. వారం తర్వాత గోదావరిఖని ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా రూ.6 లక్షల రుణం మంజూరైనట్లు తెలిపారు. బ్యాంక్ ద్వారా రూ.3 లక్షలు విత్డ్రా చేసుకోగా, మరో 3 లక్షలు అకౌంట్లో లేవు. దీనిపై సదరు ఉద్యోగి భర్తను నిలదీయగా తనకు సంబంధం లేదని చెప్పారు. ఈ ఘటనపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సమస్య తలెత్తుతుందని బెదిరించడంతో మిన్నుండిపోయింది. ఈ క్రమంలో 15 రోజుల క్రితం లోన్ ఈఎంఐ చెల్లించడం లేదని ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులు ఇంటికి రాగా విషయం బయటపడింది. ఐసీఐసీఐ బ్యాంక్లో రూ.6లక్షలతో పాటు బాధితురాలికి తెలియకుండా తన పేరిట సదరు ఉద్యోగి, ఆమె భర్త, తన కూతురు, మరో ఇద్దరు కాటారం ఎస్బీఐలో రూ.14 లక్షల లోన్ తీసుకున్నారు. బాధితురాలి చెక్కులను చోరీ చేసి లోన్ డబ్బును బ్యాంక్ నుంచి డ్రా చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోశమ్మ కోరారు. ఈ విషయమై కాటారం ఎస్బీఐ మేనేజర్ వెంకట్ను ‘సాక్షి’ వివరణ కోరగా పోశమ్మకు తమ బ్యాంక్లో ఎలాంటి లోన్ లేదని తెలిపారు. -
7లక్షలు అప్పు చేసి కారు కొన్నా.. లోన్ త్వరగా తీర్చేందుకు ఏమైనా ఫండ్స్ ఉన్నాయా?
నేను ఇటీవలే ప్రత్యామ్నాయ రుణ సాధనాల గురించి వింటున్నాను. ముఖ్యంగా ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్ల గురించి తెలిసింది. వీటికి మంచి చరిత్ర ఉందా? అవి 12 శాతం వరకు రాబడిని ఆఫర్ చేస్తున్నాయి. వీటితో ఏదైనా రిస్క్ ఉంటుందా? – శ్రీరామ్ రామనాథన్ ఈక్విటీలన్నవి సంపద సృష్టికి అనుకూలమైనవి. ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) సాధనాలు పెట్టుబడి రక్షణ, క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఉద్దేశించినవి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ (ప్రత్యామ్నాయ సాధనాలు) సంప్రదాయ ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్, నగదుకు అదనపు వ్యూహాలు మాత్రమే. ఇవి ప్రధానంగా ఐదు విభాగాలు. హెడ్జ్ ఫండ్స్, ప్రైవేటు క్యాపిటల్, నేచురల్ రీసోర్సెస్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీటన్నింటిలోనూ లిక్విడిటీ తక్కువ. నియంత్రణలు తక్కువ. పారదర్శకత తక్కువ. వ్యయాలు ఎక్కువ. రిస్క్, రాబడులకు సంబంధించి చారిత్రక డేటా తక్కువగా ఉంది. అందుకుని ఈ అస్సెట్ క్లాస్ (ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్) అనేది రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సూచనీయం కాదు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ వ్యాపారాలకు స్వల్పకాల రుణ సదుపాయమే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్. సాధారణంగా వీటిని బ్యాంకులు సమకూరుస్తుంటాయి. ప్రైవేటు క్యాపిటల్ పరిధిలోకి ఇవి వస్తాయి. ఇది చాలా పూర్వం నుంచి ఉన్న సాధనం. బ్యాంకులే దీనికి సారథ్యం వహిస్తున్నాయి. ఇందులో రాబడులు పరిమితం. నూరు శాతం నష్టానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. మీరు ఏదైనా కంపెనీకి రుణంపై వస్తువులు సరఫరా చేశారనుకుందాం. దానికి బిల్లు జారీ చేస్తారు. రుణ కాల వ్యవధి ముగిసిన తర్వాత ఆ బిల్లు మొత్తాన్ని కొనుగోలుదారుడు చెల్లిస్తాడు. ఈ రుణం కాల వ్యవధి సాధారణంగా 30–90 రోజులుగా ఉంటుంది. అంటే మీరు సరఫరా చేసిన వస్తువుల బిల్లు మొత్తం మీకు తిరిగి వచ్చేందుకు ఇన్ని రోజుల పాటు ఆగాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ లోపే మీకు డబ్బులు అవసరపడ్డాయని అనుకుంటే అప్పుడు బ్యాంకు వద్దకు వెళ్లి ఈ బిల్లును ఇచ్చి దాన్ని నగదుగా మార్చుకోవచ్చు. మరి బ్యాంకులకు ఇందులో ప్రయోజనం ఏమిటి? బ్యాంకులు ఈ బిల్లు మొత్తంలో కొంత తగ్గించి మిగిలినది ఇస్తాయి. అందుకే దీనికి ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అనే పేరు వచ్చింది. నూరు సంవత్సరాలకు పైగా బ్యాంకులు ఈ వ్యాపారం చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం ఇది అందుబాటులోకి వచ్చింది. పలు ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఇన్వాయిస్కు మీరు ఫండ్ సమకూర్చిన తర్వాత, డబ్బులు తిరిగి రాకపోతే పరిస్థితి ఏంటి? అన్నది ఆలోచించుకోవాలి. ఇన్వెస్టర్గా రాబడుల కంటే రిస్క్ను అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది. అదే బ్యాంకులు అయితే డిఫాల్ట్ ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కలిగి ఉంటాయి. ఇందులో లిక్విడిటీ ఉండదు. మీరు విక్రయించాలనుకుంటే కొనుగోలు చేసే వారు లభించడం కష్టం. వీటికంటే ఈక్విటీలు మెరుగైన సాధనం. కారు కొనుగోలుకు రూ.7 లక్షల రుణం తీసుకున్నాను. దీన్ని ఏడేళ్ల కంటే ముందుగా తీర్చేసేందుకు ఏవైనా ఫండ్స్ను సూచించగలరా? – ఆదిత్య కారు రుణాన్ని ముందుగా చెల్లించేయాలన్న మీ ఆలోచన మంచిది. అయితే కారు వంటి తరిగిపోయే ఆస్తి కొనుగోలుకు రుణం తీసుకోవడాన్ని సాధారణంగా ప్రోత్సహించం. మీరు ఏడేళ్లలోపు రుణం తీర్చేయాలని అనుకుంటున్నారు కనుక.. మీరు స్వల్పకాలం నుంచి మధ్యకాలిక మ్యూచువల్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. దీనివల్ల మీరు పెట్టుబడిని రక్షించుకోవడంతోపాటు రాబడులు సొంతం చేసుకోగలరు. మూడు నుంచి నాలుగేళ్ల తర్వాత కారు రుణాన్ని చెల్లించేద్దామని అనుకుంటే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒక ఆప్షన్. ఇవి ఈక్విటీ, డెట్లో ఇన్వెస్ట్ చేసి, అచ్చమైన డెట్ కంటే మెరుగైన రాబడులు ఇస్తాయి. మూడు నాలుగేళ్లలోపే తీర్చేయాలని భావిస్తే ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. -
HYD: అతిపెద్ద సైబర్ స్కాం గుట్టురట్టు.. ఇన్సూరెన్స్, క్రెడిట్కార్డు, లోన్ డేటా..
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ స్కామ్ను బయటపెట్టారు. దేశంలో కోట్లాది మంది పర్సనల్ డేటాను అమ్మకానికి పెట్టిన సైబర్ దొంగలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా 16 కోట్ల మంది దేశపౌరుల డేటా అమ్మకానికి గురైనట్టు వివరించారు. వివరాల ప్రకారం.. డేటాను చోరీ చేస్తూ అమ్ముతున్న సైబర్ కేటుగాళ్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. డేటా దొంగతనంపై హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో సైబరాబాద్ పరిధిలో ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కాగా, వీరిని ఢిల్లీ, నాగపూర్, ముంబైకి చెందిన ముఠాగా గుర్తించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయ్యింది. దేశ భద్రతకు భంగం కలిగేలా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారు. బీమా, లోన్లకు అప్లై చేసిన నాలుగు లక్షల మంది డేటా చోరీకి గురైంది. కోట్లాదిగా సోషల్ మీడియా ఐడీలు, పాస్వర్డ్లు కూడా లీకయ్యాయి. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా, ఢిల్లీలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల డేటా చోరీకి గురైంది. ఈ ముఠా సభ్యులు ఇన్సూరెన్స్, క్రెడిట్కార్డులు, లోన్ అప్లికేషన్ల నుంచి వివరాల సేకరిస్తున్నారు. డేటా చోరీ గ్యాంగ్లకు ఆయా కంపెనీల్లో కొందరు ఉద్యోగులు సాయం చేస్తున్నారు. సెక్యూరిటీ ఉందనుకున్న బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా నేరగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. సేకరించిన వ్యక్తిగత డేటాను అమ్మేస్తున్నారు. ఇప్పటికే పలు ముఠాలను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇది కూడా చదవండి: గుట్టుగా అబార్షన్ల దందా! రూ.30వేలు ఇస్తే లింగ నిర్ధారణ పరీక్ష -
సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా బ్యాంకు లోన్ పొందండిలా..!
-
ఇదేం చోద్యం.. ఏకంగా చెరువు భూమినే తనఖా పెట్టేశారు!
పట్టాదారులమంటూ.. కోర్టు ఆదేశం ఉందంటూ పోలీసులు బందోబస్తుతో నాడెం చెరువు తూమును ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకోవడంతో ధ్వంసం చేయించిన వారు తోక ముడిచారు. ఆ తర్వాత బుల్డోజర్ను సీజ్ చేసి కారకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా మూడు నెలల క్రితం జరిగిన సంఘటన. తాజాగా హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ బ్యాంకులో చెరువు భూమిని తనఖా పెట్టి రూ.12కోట్ల రుణం తీసుకోవడంతో నాడెం చెరువు పేరు తిరిగి తెరపైకి వచ్చింది. ఘట్కేసర్: చెరువులు, కుంటలు, జల వనరుల సంక్షరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి వారి మాటలకు భిన్నంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు లేకపోవడంతో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. తాజాగా వెంకటాపూర్ నాడెం (నల్ల) చెరువులోని భూమిని తనఖా పెట్టి కొందరు రూ.12 కోట్ల రుణం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. నాడెం చెరువుపై ఆధారపడి వెంకటాపూర్కు చెందిన 105 మంది ముదిరాజ్ మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. నీటిని తొలగించే అధికారం లేకున్నా... రెవెన్యూ రికార్డులో ఉన్న చెరువును అందులో ఉన్న నీటిని తొలగించే అధికారం నీటి పారుదల శాఖ అధికారులకే ఉంది. నాడెం చెరువులో నీరు లేదంటూనే చెరువులో చేపలు పట్టొందంటూ కొందరు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్డు ఆర్డర్ ఉందని ఆగస్టు 3, 2022న పోలీస్బందో బస్తుతో చెరువు కల్వర్టును ధ్వంసం చేశారు. మత్స్యకారులు చెరువులోకి దిగితే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారని మత్స్యకారులు గతంలో ఆరోపించారు. తక్షణమే రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కోర్టు ఆదేశం చూపించాలని కోరడంతో తోక ముడుచుకున్నారు. పోలీసుల అండతోనే ధ్వంసం.. చెరువులో చేపలు పడితే కేసు పెడతామని గతంలో పోలీసులు బెదిరించారని మత్స్యకారులు పేర్కొన్నారు. పోలీసుల అండతోనే అక్రమార్కులు కల్వర్టు ధ్వంసం చేశారని అప్పట్లో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. మత్స్యకారుల నుంచి విషయం తెలుసుకున్న అధికారులు తూము ధ్వంసాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్రమార్కులపై రెవెన్యూ, ఇరిగేషన్, రోడ్డు భవనాల శాఖాధికారులు ఘట్కేసర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఎన్ఓసీ ఇవ్వలేదు ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ పరమేశ్ను వివరణ కోరగా బ్యాంకు రుణం కోసం మేము ఎటువంటి ఎన్ఓసీ ఇవ్వలేదని తెలిపారు. బ్యాంకు డాక్యూమెంట్లు చూస్తే కాని ఏమి చెప్పలేమని పేర్కొన్నారు. చెరువు విస్తీర్ణం 62 ఎకరాలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ సర్వేనంబర్ 814, 816లో 62 ఎకరాల విస్తీర్ణంలో నాడెం చెరువును నీటి పారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఘట్కేసర్ పరిసరాల్లో భూమి విలువ పెరగడంతో అక్రమార్కుల కన్ను చెరువుపై పడింది. రాజకీయ నాయకుల అండతో నీటిని తొలగించి చెరువు లేకుండా చేయాలని యత్నిస్తున్నారు. చెరువులోని భూమికి రుణం ఎలా ఇచ్చారు.? భూమి పరిశీలించకుండానే చెరువులో నీట మునిగిన భూమికి బ్యాంకు ఎలా రుణం ఇచ్చిందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. లక్ష రుణం కోసం చెప్పులరిగేలా తిప్పుకునే బ్యాంకు అధికారులు నీటిలో ఉన్న భూమికి రుణం ఇవ్వడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!) -
రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది
తిరువనంతపురం: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. అదృష్టం కలిసొచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతుంటారు. కేరళలో ఓ వ్యక్తికి ఇలాగే జరిగింది. అయితే అతనికి కష్టం, అదృష్టం ఒకేసారి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పుల్లో కూరుకుపోయి బాధపడుతున్న అతడ్ని అదృష్టం వరించి లక్షాధికారిని చేసింది. వివరాలు.. కొల్లాం జిల్లా మినగపల్లికి చెందిన ఓ మత్స్యకారుడికి భార్య, పిల్లలు ఉన్నారు. అవసరాల నిమిత్తం ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 9 లక్షలు లోన్ తీసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల అది తీర్చలేకపోయాడు. అక్టోబర్ 12న చేపలు పట్టుకునేందుకు వెళ్తుండగా ప్రభుత్వానికి చెందిన అక్షయ లాటరీ రూ.70 లక్షల విలువైన టికెట్ కొనుగోలు చేశాడు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చే సరికి అతనికి బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చింది. ఇంటిని తాకట్టు పెట్టి తీసుకున్న లోన్ డబ్బులు రూ.9 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు పంపించింది. లేకుంటే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొంది. బ్యాంక్ నోటీసులు చూసిన మత్స్యకారుడు తీవ్ర కుంగుబాటుకి లోనయ్యాడు. ఏం చేయాలో.. లోన్ డబ్బులు ఎలా కట్టాలో తెలియక తల పట్టుకున్నాడు. చివరికి ఇంటిని అమ్మి అయినా లోన్ కట్టాలని నిర్ణయించుకున్నాడు. చదవండి: లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది! అంతలోనే ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లువిరిశాయి. నోటీసులు అందుకున్న కొన్ని గంటల్లోనే అక్షయ లాటరీ టికెట్ దక్కినట్లు కాల్ వచ్చింది. రూ. 70 లక్షల విలువైన మొదటి బహుమతి గెలుచుకున్నట్లు చెప్పారు. దీంతో పీకల్లోతు అప్పుల్లో ఉన్న మత్య్సకారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. లాటరీ డబ్బుల గురించి మాట్లాడుతూ.. ముందుగా ఇంటి లోన్ను తీర్చనున్నట్లు తెలిపారు. అలాగే తమ పిల్లలకు మంచి చదువులు అందించి వారిని గొప్ప స్థాయిలో నిలబెట్టాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వాట్సాప్లో మహిళా పోలీసులకు ప్రైవేటు ఫోటోలు.. చిక్కుల్లో డీఎస్పీ -
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్ అయ్యారు. పీఎన్బీ నుంచి రూ.52 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారనే అభియోగాల నేపథ్యంలోనే ఆమెను సీబీఐ అధికారులు హైదరాబాద్లోని నివాసం నుంచి మంగళవారమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆపై హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించారు అధికారులు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో లోన్ తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో సీబీఐ ఇప్పుడు ఆమెను అదుపులోకి తీసుకోవడం విశేషం. బెంగళూరు అధికారులు కేవలం విచారణ కోసం తీసుకెళ్లారా? లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా? అనే దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఏపీలో ఆరు పార్టీల తొలగింపు! -
చెన్నై ఆర్థిక నేరాల విభాగం కోర్టుకు సుజనా చౌదరి
-
బ్యాంకును మోసగించారని సీబీఐ కేసు నమోదు
సాక్షి, అమరావతి: హైదరాబాద్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను రూ.61.71 కోట్ల మేర మోసంచేసిన కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కండ్ర ప్రసన్నకుమార్రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు ఇద్దరు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నెల్లూరులో ఆయన నివాసంతోపాటు మరో రెండుచోట్ల సీబీఐ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. కండ్ర ప్రసన్నకుమార్రెడ్డి శ్రీరాజరాజేశ్వరి రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్ పేరిట తప్పుడు పత్రాలు సమర్పించి హైదరాబాద్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నుంచి 2017, 2018ల్లో రూ.65.50 కోట్ల రుణం తీసుకున్నారు. 2018లో బ్యాంకు ఆ ఖాతాను నిరర్ధక ఆస్తి (ఎన్పీఏ)గా ప్రకటించింది. దీంతో ప్రసన్నకుమార్రెడ్డి రూ.80 లక్షల రుణం చెల్లించారు. అప్పటికే ఆయన తన ఖాతాలోని నగదును నిబంధనలకు విరుద్ధంగా ఇతర ఖాతాలకు తరలించినట్టు బ్యాంకు గుర్తించింది. వ్యాపార అవసరాల కోసం తీసుకున్న రుణాన్ని ఇతర అవసరాలకు మళ్లించారు. ప్రసన్నకుమార్రెడ్డి తప్పుడు టర్నోవర్ పత్రాలు చూపించి రుణం తీసుకున్నారని కూడా నిర్ధారణ అయింది. దీనిపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీబీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ధాన్యం కొనుగోళ్లకు 12 వేల కోట్ల బ్యాంక్ రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ.12 వేల కోట్ల రుణం తీసుకోనుంది. మరోవైపు 6,983 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా కోతలు మొదలైన జిల్లాల్లో ఇప్పటికే 536 కేంద్రాలను ఏర్పాటు చేసి 1,200 టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేసింది. అలాగే ధాన్యం కొనుగోలుకు 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవగా ఇప్పటివరకు 1.6 కోట్ల గన్నీ బ్యాగులను సేకరించింది. మరో 6.15 కోట్ల బ్యాగుల కోసం ఆర్డర్ ఇవ్వగా ఇంకో 8 కోట్ల బ్యాగులను టెండర్ ద్వారా సేకరించనుంది. అందుబాటులో రూ. 4,350 కోట్లు .. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైతే రైతులకు చెల్లించేందుకు అవసరమైన నిధులను కూడా పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ఈ శాఖ దగ్గర రూ. 4,350 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తంతో 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయవచ్చు. కాగా, కేంద్రం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చెల్లింపులు ప్రతిరోజు రూ.40 కోట్ల వరకే చేసేలా ఫ్రీజింగ్ పెట్టడంతో రాష్ట్రంలో ధాన్యం సేకరణ పరిస్థితిని వివరించి ఒకేరోజు రూ.1,900 కోట్లు విడుదలయ్యేలా మంత్రి గంగుల కమలాకర్ చర్యలు తీసుకున్నారు. కాగా, వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 51 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు మంత్రి గంగుల తెలిపారు. -
మీనా జ్యువెలర్స్ గ్రూప్పై సీబీఐ కేసు నమోదు
-
అప్పు కోసం బ్యాంకుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్కు షాక్.. పాన్ కార్డుపై అప్పటికే..
సాక్షి, హైదరాబాద్: రుణం కోసం బ్యాంకుకు వెళ్లిన ఓ మహిళా కానిస్టేబుల్కు విస్తుపోయే నిజం తెలిసింది. తన ప్రమేయం లేకుండా తన పేరుపై ఇతర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి లోను తీసుకున్న విషయాన్ని బ్యాంకు అధికారులు చెప్పడంతో.. షాక్కు గురై సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించింది. వివరాలు.. సిటీ సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తి స్తున్న మహిళా కానిస్టేబుల్కు డబ్బులు అవస రం కావడంతో రుణం కోసం ఎస్బీఐకు వెళ్లింది. కానిస్టేబుల్ వివరాలు చెక్ చేసిన బ్యాంక్ అధికారులు ఆల్రెడీ మీ పేరుపై రూ.80 వేలు రుణం ఉన్నట్లు తెలిపారు. తన ప్రమేయం లేకుండా లోను ఎవరు తీసుకున్నారని ఆరాతీయగా.. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కానిస్టేబుల్ పాన్కార్డ్పై లోను తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆమె సైబర్క్రైం పోలీసులకు ఫిర్యా దు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధు తెలిపారు. చదవండి: ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఆధార్ కార్డు సేఫ్..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే -
20 రోజుల్లో వివాహం.. ఈఎంఐ ఒత్తిళ్లు తట్టుకోలేక...
రాజేంద్రనగర్: మరో 20 రోజుల్లో ఆ యువకుడి వివాహం. పెళ్లి కార్డులను ముద్రించి ఇంటికి తీసుకువచ్చాడు. ఆదివారం నుంచి పంపిణీ చేద్దామని తల్లిదండ్రులు చెప్పడంతో సరే అన్నాడు. కాగా.. రుణానికి సంబంధించి ఈఎంఐ చెల్లించాలని బ్యాంకు నిర్వాహకులు ఇంటికి ఏజెంట్లను పంపించారని, ఫోన్లలో ఒత్తిడికి గురి చేయడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలోని ఆదర్శనగర్కు చెందిన అవినాష్ వాగ్దే (25) ప్రైవేట్ ఉద్యోగి. నగరానికి చెందిన ఓ యువతితో ఈ నెల 26 అవినాష్ వివాహం జరగాల్సి ఉంది. శనివారం పెళ్లి పత్రికలను ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇంటికి తీసుకువచ్చా డు. ఆదివారం ఉదయం నుంచి కార్డులు పంచుదామని తల్లిదండ్రులు, సోదరుడికి చెప్పాడు. అవినా ష్ రెండు ప్రైవేట్ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించడంలేదు. ఈఎంఐలు చెల్లించాలంటూ ఫోన్లో బ్యాంక్ సిబ్బంది తరచూ ఫోన్ చేస్తు న్నారు. దీంతో పాటు ఇంటికి ఏజెంట్లు వచ్చిపోతున్నారు. పెళ్లి త్వరలో ఉండడం, డబ్బు సమకూర్చకపోవడం తదితర కారణాలతో అవినాష్ మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఇంట్లోని గదిలో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు సంతోష్ వాగ్దే ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవినాష్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోదరుడి మృతికి బ్యాంక్ నిర్వాహకులే కారణమని సంతోష్ వాగ్దే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. -
నకిలీ బంగారంతో లక్షల్లో బ్యాంకు రుణం తీసుకున్న మహిళ!
కంబాలచెరువు(తూర్పు గోదావరి): నకిలీ బంగారంతో బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న మహిళ, ఇద్దరు ఎప్రెంజర్లపై స్థానిక వన్ టౌన్, టు టౌన్ పోలీస్ స్టేషన్లలో శుక్రవారం కేసులు నమోదయ్యాయి. ఆయా బ్యాంకు శాఖల మేనేజర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. కొంతమూరుకు చెందిన శనివారపు అనుపమ స్థానిక సాయికృష్ణ థియేటర్ సమీపంలోని ఆర్యాపురం అర్బన్ బ్యాంకు తాడితోట శాఖలో దపధపాలుగా వన్గ్రామ్ గోల్డ్ తాకట్టు పెట్టి రూ.7.57 లక్షలు అప్పు తీసుకుంది. అలాగే అదే బ్యాంకుకు చెందిన దానవాయిపేట శాఖలోనూ ఈ ఏడాది ఆగష్టు 8న వన్ గ్రామ్ గోల్డ్ పెట్టి రూ.1.59 లక్షలు రుణం తీసుకుంది. కాగా.. బ్యాంకు ఎంప్రెజర్లతో కలసి అనుపమ నకిలీ బంగారం పెట్టి రుణం తీసుకుందంటూ ఆ బ్యాంకు శాఖల మేనేజర్లకు వాట్సాప్ సందేశాలు వచ్చాయి. దీంతో వారు వెంటనే అనుపమ తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసి పరీక్షించగా నకిలీదిగా తేలింది. దీంతో ఆ మేనేజర్లు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో మహిళ, ఎంప్రెజర్లతో పాటు బ్యాంకు సిబ్బంది చేతివాటం ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదిలా ఉండగా.. ఆ బ్యాంకులో సొమ్ములు లేవంటూ మాజీ చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి ఇటీవల ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించి బాహాటంగా చెప్పిన విషయం విదితమే. -
తీసుకుంది 64వేలు.. మూడేళ్లకు రూ.1.11 లక్షలు..లబోదిబోమన్న రైతు
సాక్షి, రంగారెడ్డి: ఓ రైతు బ్యాంకులో తీసుకున్న రుణానికి మూడేళ్లలో అసలు, వడ్డీ కలిపి రెట్టింపు అయ్యాయి. ఈ ఘటన నాగసమందర్ ఎస్బీఐలో శుక్రవారం వెలుగు చేసింది. మండల పరిధిలోని కొండాపూర్కలాన్ గ్రామానికి చెందిన రైతు బి. కాళికారెడ్డి నాగసమందర్ ఎస్బీఐలో పాత అప్పు 68,932 ఉండగా జూలై 21 2017లో మరో రూ. 58 వేల అప్పు తీసుకున్నట్లుగా క్రియేట్ చేసి అప్పును రూ. 1,11,234కు పెంచారు. రైతు సెల్కు ఈ సమాచారం రావడంతో వెంటనే బ్యాంకుకు వచ్చి మేనేజర్కు ఫిర్యాదు చేశారు. చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట విషాదం అక్టోబర్ 3 2018లో రూ. 58 వేలకు బదులుగా రూ. 42,300 అకౌంట్లోంచి తీసివేసి వడ్డీతో పాటు మిగిలిన రూ. 15,700 రైతు కాళికారెడ్డికి అంటగట్టారు. ఇదే విషయాన్ని రైతు కాళికారెడ్డి శుక్రవారం బ్యాంకు మేనేజర్ తిలక్ దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటి మేనేజర్ చేసిన పొరపాటు అయ్యి ఉండవచ్చని, ప్రస్తుతం ఉన్న అప్పును తీర్చాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో లబోదిబోమంటూ ఆందోళనకు దిగాడు. జరిగిన అన్యాయం విషయమై లెటర్ రాసి ఇవ్వు విచారణ జరుపుతామంటూ చెప్పి పంపించారు. చదవండి: తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి.. ఏడాదిగా మరో పరిచయం.. ప్రియుడితో కలిసి విచారణ చేపడతాం తప్పుఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని మేనేజర్ తిలక్ తెలిపారు. రైతు బ్యాలెన్స్ షీట్ను పరిశీలిస్తామన్నారు. అతని అకౌంట్లో ఉన్న మొత్తం రుణాన్ని చెల్లింంచాల్సిందేనని పేర్కొన్నారు. పొరపాటుగా వేసిన డబ్బుల్ని పాత మేనేజర్ చెల్లించాల్సి ఉంటుందన్న ప్రశ్నకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని తెలిపారు. -
YSR Asara: చివరి రోజూ అదే జోరు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: వైఎస్సార్ ఆసరా రెండో విడత కింద రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మరో 79,135 పొదుపు సంఘాలకు రూ.650 కోట్ల మొత్తాన్ని జమచేసింది. గత 12 రోజులుగా (ఈనెల 7 నుంచి) లబ్ధిదారులైన మహిళలు ఎంతో ఉత్సాహంతో ఆసరా సంబరాలు జరుపుకుంటుండగా.. ముగింపు రోజైన సోమవారం 31 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ వేడుకలు ఘనంగా కొనసాగాయి. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు నాటికి ఉన్న తమ బ్యాంకు అప్పును ప్రభుత్వమే భరించి, ఆ డబ్బులను నాలుగు విడతల్లో అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్కు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలు జరిగిన ప్రతిచోటా వేలాది మంది మహిళలు ముఖ్యమంత్రి బొమ్మతో కూడిన బ్యానర్లను చేతబూని ర్యాలీలు నిర్వహించారు. అనంతరం జగన్ చిత్రపటాలకు పూలాభిషేకాలు నిర్వహించారు. అదే సమయంలో.. ఆయా చోట్ల జరిగిన సభల్లో చంద్రబాబు చేతిలో తామెలా మోసపోయిందీ ప్రస్తావించారు. సందడి సందడిగా ఆసరా సంబరాలు ► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఆసరా ఉత్సవాలు సందడిగా సాగాయి. సీఎం వైఎస్ జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ► అనంతపురం జిల్లా పెనుకొండలో సోమవారం మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ► కర్నూలు జిల్లాలో గోరంట్ల, కొత్తకోట, గూడూరు గ్రామాల్లో చెక్కులు అందజేశారు. ► చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గ పరిధిలో రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి పాల్గొన్నారు. శాంతిపురం మండలంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మహిళలకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా దాదాపు 40 గ్రామ సమాఖ్యల నుంచి మహిళలు పెద్దఎత్తున పూర్ణకుంభాలతో వచ్చి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ► శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో ఆసరా సంబరాలు నిర్వహించారు. ► విజయనగరం జిల్లాలో వైఎస్సార్ ఆసరా ఉత్సవాలు సోమవారం సందడిగా సాగాయి. పొదుపు మహిళలకు మెగా చెక్కులను ప్రజాప్రతినిధులు, అధికారులు పంపిణీ చేశారు. డెంకాడ మండలంలో జరిగిన ఆసరా సంబరాల్లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. ► విశాఖ జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో చెక్కులు పంపిణీ చేశారు. భీమిలి మండలం మజ్జివలసలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ► తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండలాల్లో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. కాజులూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఉత్సాహభరితంగా.. ► పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం పొలమూరులో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ చెక్కులను పంపిణీ చేశారు. ► కృష్ణాజిల్లా కలిదిండి మండలం తాడినాడ, విజయవాడ పాయకాపురం పరిధిలోని రాధానగర్లో ఆసరా వేడుకలు జరిగాయి. ► గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. ► ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువులో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆసరా చెక్కులను మహిళలకు పంపిణీ చేశారు. -
పర్యావరణ సానుకూల ప్రాజెక్టులకు భరోసా!
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల పరిశ్రమలు, ప్రాజెక్టులకు (గ్రీన్ ఫైనాన్స్) బ్యాంకుల రుణాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖారా పిలుపునిచ్చారు.తద్వారా సుస్థిర వృద్ధి సాధ్యమవుతుందని విశ్లేషించారు. భారత్ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని అన్నారు. ‘‘గ్రీన్ ఫైనాన్స్ అన్న పదానికి ముందు తగిన నిర్వచనం ఇవ్వాలి. ఈ విభాగానికి సంబంధించి పటిష్ట నియంత్రణను అలాగే ఈ తరహా రంగాలకు మరింత ఫైనాన్స్ రావడానికి ఈ అంశం దోహదపడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయి’’ అని ఎస్బీఐ చైర్మన్ అన్నారు. ఈఎస్జీ (ఇన్విరాన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్) ఇండియా లీడర్షిప్ అవార్డుల కార్యక్రమాన్ని ఉద్దేశించి ఖారా చేసిన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦గ్రీన్ ఫైనాన్స్ విషయంలో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలను తొలుత పరిశీలించాలి. అలాగే ఇందుకు సంబంధించి ఆర్థిక కార్యకలాపాల విషయంలో మూలసూత్రాలను అభివృద్ధి చేయాలి. ఆ రంగంలో వ్యక్తుల అభిప్రాయాలను తీసుకోవాలి. తద్వారా ఒక ‘‘గ్రీన్ ఫైనాన్స్ నిర్వచనం’’ ఆవిష్కరణ జరగాలి. ♦బ్యాంకులు గ్రీన్ ప్రాజెక్ట్లకు తగిన క్రెడిట్ అందించలేకపోతే అలాగే ఆయా ప్రాజెక్టుల పోర్ట్ఫోలియోలో ఇబ్బందులను కనిపెట్టలేకపోతే ఈ విభాగంలో రిటర్న్స్ తీసుకోవాలనుకునే డిపాజిటర్లు, వాటాదారులు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదముంటుంది. ♦ పర్యావరణం, తత్సంబంధ సామాజిక అంశాలు, నిర్వహణ విషయాల్లో ఎస్బీఐ చొరవను పరిశీలిస్తే, 2030 నాటికి కార్బన్ న్యూట్రల్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంక్ తన వంతు ప్రయత్నం చేయనుంది. ఈ దిశలో పలు లక్ష్యాల సాధనకు కృషి చేయనుంది. ♦ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మాత్రమే బ్యాంక్ పరిమితం కాదు. చెట్ల పెంపకం, సేంద్రీయ వ్యవసాయం, క్యాంపస్లో సింగిల్–యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం తదితర చర్యల్లో పురోగతికి బ్యాంక్ తగిన పాత్ర పోషిస్తుంది. – ప్రస్తుతం వ్యాపార రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్థిక క్రియాశీలత మెరుగుపడుతోంది. ఈ పరిస్థితుల్లో వాతావరణానికి జరిగే నష్టం అవకాశాలనూ బ్యాంక్ గుర్తించే పనిలో ఉంది. ♦ పర్యావరణ పరిరక్షణ సానుకూల ప్రాజెక్టుల విషయంలో రుణాల పెంపునకు బ్యాంక్ తగిన కృషి చేస్తోంది. పునరుత్పాదక ఇంధన రంగంలో రుణగ్రహీతలకు బ్యాంక్ రుణ సదుపాయాలను సులభతరంగా అందిస్తోంది. రూ.50 కోట్లు దాటిన రుణాల విషయంలో ఈఎస్జీ విషయంలో ఆయా పారిశ్రామికవేత్తల కృషిని బట్టి వారికి ఒక స్కోర్ను అందించడం జరుగుతోంది. ♦ పర్యావరణ అనుకూల సాంకేతికతలకు ప్రోత్సహించడానికి, సులభతరం చేయడానికి దోహదపడే ప్రొడక్టులను, సేవలను రూపకల్పన చేయడంలో గత కొన్నేళ్లుగా ఎస్బీఐ తగిన ప్రయత్నం చేస్తోంది. ♦2018–19 నుంచి 800 బిలియన్ డాలర్ల విలువైన గ్రీన్ బాండ్లు, గ్రీన్ లోన్ బాండ్లను ఎస్బీఐ జారీ చేసింది. తద్వారా సమీకరించిన నిధులను పర్యావరణ సానుకూల ప్రాజెక్టులకే వినియోగిస్తోంది. ♦కాగా, అక్యూట్ గ్రూప్నకు చెందిన ఈఎస్జీ రేటింగ్ ఏజెన్సీ– ఈఎస్జీరిస్క్.ఏఐ55 ఈ సందర్భంగా పరిశ్రమలోని టాప్–500 టాప్ –500 లిస్టెడ్ కంపెనీల నుండి 21 విజేతలను ప్రకటించింది. -
భార్య భర్తల మధ్య గొడవ.. భర్త అదృశ్యం..
సాక్షి, హోసూరు(తమిళనాడు): అత్తలవాడి గ్రామానికి చెందిన రవి (37) తళి బీడీవో కార్యాలయం వద్ద టీఅంగడి నిర్వహిస్తున్నాడు. గత ఏడాది క్రితం బ్యాంకులో రూ. 5 లక్షల అప్పు తీసుకొన్నాడు. ఈ విషయమై 25వ తేదీ భార్యాభర్తల మధ్య గొడవలేర్పడింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవి బైక్పైన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి అయిన ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన భార్య శిల్ప తళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. చదవండి: ఎంపీ అర్వింద్ వాహనంపై దాడి... -
నేనెవర్ని మోసం చేయలేదు.. విచారణకు సహకరిస్తా: నామా
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్లో మధుకాన్ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నామా జూన్ 25న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''40 ఏళ్ల కిందట మధుకాన్ సంస్థను ప్రారంభించాను.. రాత్రింబవళ్ళు కష్టపడి సంస్థను కాపాడుకున్న. చైనా బార్డర్ లో కనీసం వెళ్లలేని ప్రాంతాల్లో కూడా ఈ సంస్థ వెళ్లి రోడ్లు వేస్తోంది.. ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు. ఈ సంస్థను మా ఇద్దరు సోదరులు చూసుకుంటున్నారు. ఎన్హెచ్ఏఐ అనుమతులు ఇచ్చిన కంపెనీకి ఇవ్వాల్సిన 80 శాతం సైట్ ఇవ్వాలి కానీ 21 శాతం మాత్రమే ఇచ్చింది. కంపెనీల్లో నేను ఎండీగా లేను. నాకు న్యాయవ్యవస్థ పై నమ్మకం ఉంది. 25 న ఈడీ పిలిచింది కచ్చితంగా వెళ్తాను.. నేను అన్నింటికీ సహకరిస్తాను. నేనెప్పుడూ నీతి నిజాయితీగా ఉంటూ, రాబోయే రోజుల్లో అదే విదంగా ప్రజలకు సేవ చేయాలని నడుస్తున్న. నన్ను ఆదరించి సీఎం కేసీఆర్ ఎంపీని చేశారు. నా బలం సీఎం కేసీఆర్, ఖమ్మం ప్రజలు. ''అంటూ పేర్కొన్నారు. ఇక కేసు విషయంలోకి వెళితే.. 2011లో జార్ఖండ్లో రాంచీ– రార్గావ్– జంషెడ్పూర్ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవే–33 పనులను మధుకాన్ కంపెనీ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేజిక్కించుకుంది. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రాంచీ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. మధుకాన్ సంస్థ ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్ను చూపించి.. కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు పొందింది. తర్వాత మధుకాన్ సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. నిజాలేమిటో తేల్చాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) న్యూఢిల్లీని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఈ అంశంలో సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టింది.మధుకాన్ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో భారీగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణలతో మనీల్యాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. చదవండి: టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ షాక్.. -
హోంగార్డు పేరుతో మరో మహిళకు రుణం
ఓ ప్రైవేట్ బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పోలీసు విభాగంలో పనిచేసే హోంగార్డు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈమె పేరుతో బ్యాంకు అధికారులు మరో మహిళకు రూ.8.8 లక్షల వ్యక్తిగత రుణం ఇచ్చేశారు. ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో ఈ సమస్య వచ్చిపడింది. విషయం తెలిసిన హోంగార్డు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమస్యను పరిష్కరించారు. సాక్షి, హైదరాబాద్: నగరంలోని బౌరంపేటకు చెందిన ఓ మహిళ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో హోంగార్డు. ముషీరాబాద్లోని యాక్సస్ బ్యాంకు ఖాతాలో ఈమె జీతం జమవుతోంది. ఆ బ్యాంకు నుంచి రూ.3 లక్షల వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె వివరాలను పరిశీలించిన బ్యాంకు అధికారులు అప్పటికే ఆమె పేరుతో ఇండస్ఇండ్ బ్యాంకులో రూ.8.8 లక్షలు రుణం ఉన్నట్లు గుర్తించారు. అది తీరే వరకు మరో రుణం పొందే అవకాశం లేదన్నారు. కంగుతిన్న ఆ హోంగార్డు ఇండస్ఇండ్ బ్యాంక్కు వెళ్లి ఆరా తీయగా సూరారం ప్రాంతానికి చెందిన మహిళ మీ పాన్కార్డుతో 2018 సెప్టెంబర్ 7న రూ.8.8 లక్షల రుణం తీసుకుందని చెప్పారు. ఇప్పటికీ రూ.5,98,337 బకాయి ఉందన్నారు. పొరపాటు.. బ్యాంకు అధికారులదే.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన వివరాలు వినియోగించి రుణం తీసుకున్నారంటూ హోంగార్డు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ సుంకరి శ్రీనివాసరావు దర్యాప్తు చేశారు. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2018 సెప్టెంబర్లో ఇండస్ఇండ్ బ్యాంక్లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళ పేరు, హోంగార్డు పేరు ఇంటి పేరుతో సహా ఒకటే. రుణం మంజూరు సమయంలో ఈ పేరు ఆధారంగా సంబంధిత వెబ్సైట్లో ఇండస్ఇండ్ బ్యాంకు అధికారులు సెర్చ్ చేశారు. ఆ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న వారి పేరు, పాన్ నెంబర్, సిబిల్ స్కోర్ తదతరాలు కనిపిస్తాయి. అప్పట్లో ఈ బ్యాంకు అధికారులు సెర్చ్ చేసిన సందర్భంలో దరఖాస్తు చేసుకున్న అసలు మహిళతో పాటు మహిళా హోంగార్డు వివరాలు కనిపించాయి. బ్యాంకు అధికారులు పొరపాటున హోంగార్డు పేరు, ఆమె పాన్ నంబర్ను ఫిక్స్ చేస్తూ దరఖాస్తు చేసుకున్న మహిళకు రుణం మంజూరు చేశారు. వాయిదాలను చెల్లిస్తుండటంతో.. అప్పటి నుంచి ఆమె నెలసరి వాయిదాలను సక్రమంగా చెల్లిస్తుండటంతో బ్యాంకు అధికారులకు వివరాలు సరిచూడాల్సిన అవసరం రాలేదు. తాజాగా మహిళ హోంగార్డు రుణం కోసం దరఖాస్తు చేసుకోగా బ్యాంకు అధికారులు జరిపిన పరిశీలనతో తెరపైకి వచ్చింది. ఈ విషయాలను దర్యాప్తులో గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు మూడు పక్షాలను ఠాణాకు పిలించారు. అసలు విషయం వారందరికీ వివరించగా తమ పొరపాటును సరిదిద్దుకునేందుకు అంగీకరించిన ఇండస్ ఇండ్ అధికారులు వివరణ కూడా ఇచ్చారు. -
పెళ్లి లోన్లు పెరుగుతున్నాయి..
సాక్షి, ముంబై: పెళ్లి అనేది అందరికీ ఒక తీపి జ్ఞాపకం. అందుకే ఖర్చుకు వెనకాడకుండా ధనవంతుల నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ స్థోమతకు మించి పెళ్లిళ్లను ఘనంగా నిర్వహిస్తుంటారు. దీనికోసం అనవసరమైతే అప్పులు కూడా చేసి ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పెళ్లి కోసం లోను తీసుకుని వారి సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ముంబైలో వెడ్డింగ్ లోన్ కోసం చేసుకున్న దరఖాస్తుల సంఖ్య 51 శాతం పెరిగింది. దరఖాస్తు చేసుకున్న వారిలో పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా ఉన్నారు. ఈ నెల 9వ తేదీన ప్రపంచ వెడ్డింగ్ డే ఉంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇండియా ల్యాండ్స్ అనే సంస్థ వెడ్డింగ్ లోన్ ట్రెండ్స్ నివేదిక విడుదల చేసింది. అందులో పెళ్లి కోసం నగలు, పంక్షన్ హాల్, కేటరింగ్, పెళ్లికి వచ్చే బంధువులు బస చేసేందుకు ఇలా రకరకాల కారణాలతో లోను కావాలని పెళ్లికి మూడు, నాలుగు నెలల ముందే నుంచే దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపింది. లోను కోసం సుమారు రూ.2 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు దరఖాస్తు చేసుకుంటున్నారని వెల్లడించింది. కాగా పర్సనల్ లోన్ తీసుకునే వారి సంఖ్య 30 శాతం పెరిగింది. పెళ్లి కోసం చేసుకున్న మొత్తం దరఖాస్తుల్లో 22-35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో 42 శాతం మహిళలే ఉన్నారు. దీన్ని బట్టి తమ పెళ్లి భారం తల్లిదండ్రులపై మోపకూడదని ఆడ పిల్లలు భావిస్తున్నట్లు నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. -
రుణం పేరుతో మోసం.. మహిళ అరెస్ట్
తమిళనాడు , అన్నానగర్: చెన్నై సమీపంలో బ్యాంక్లో రుణం ఇప్పిస్తానని సర్టిఫికెట్లు తీసుకొని, వాటి మూలంగా ఇంటి ఉపయోగ వస్తువులు కొని వినూత్న విధానంలో రూ.8 లక్షలు మోసం చేసిన మహిళతో సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై సాలిగ్రామం కేకే గార్డన్కి చెందిన మీనా (35), పారిమునై 3వ సముద్రతీర రోడ్డుకు చెందిన శంకర్ (30) ఇద్దరూ బ్యాంక్లో రుణం ఇప్పిస్తామని ఆన్లైన్ ద్వారా ప్రకటించారు. ఇది నమ్మిన పారిమునైకు చెందిన పౌసియా బేగమ్, ప్రవీణ్కుమార్, చంద్రు వారిని కాంటాక్ట్ చేశారు. రుణం ఇప్పిస్తామని వారి వద్ద ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్టు జిరాక్స్, ఫొటో వంటి సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఈ స్థితిలో వీరందరి సెల్ఫోన్లకి, నెలంతర విధానంలో ఇంటి ఉపయోగ వస్తువులు కొనడం వల్ల మొదటి నెల ఈఎమ్ఐ కట్టమని మెసేజ్ వచ్చింది. దీన్ని చూసి ముగ్గురూ దిగ్భ్రాంతి చెందారు. విచారణలో బ్యాంక్లో రుణం ఇప్పిస్తానని తమ వద్ద సర్టిఫికెట్లు తీసుకున్న మీనా, శంకర్ లిద్దరూ ఆ సర్టిఫికెట్లు ఇచ్చి ఇంటి ఉపయోగ వస్తువులు కొని విక్రయం చేసి మోసం చేసినట్లు తెలిసింది. ముగ్గురూ తనిగ వడక్కు సముద్రతీర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం అరెస్టు చేసి విచారణ చేశారు. ఇందులో వారు బ్యాంక్లో రుణం ఇప్పిస్తామని నమ్మించి సర్టిఫికెట్లు తీసుకొని వారి పేరుతో ఇంటి ఉపయోగ వస్తువులు కొని విక్రయం చేసినట్లు తెలిసింది. ఇలా రూ.8 లక్షల వరకు మోసం చేసినట్లు గుర్తించారు. అనంతరం మీనా, శంకర్ని అరెస్ట్చేశారు. -
రుణం ఇవ్వడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి, మహబూబాబాద్: తనకు మంజురైన రుణాన్ని బ్యాంకు అధికారులు ఇవ్వటం లేదని మనోవేదనకు గురై ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత రైతు భార్య జాటోతు శాంతి, కుమారుడు సోలోమన్ తెలి పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కేసముద్రం మండలంలోని మర్రితండా జీపీ పరిధిలో గల చెరువుముందు తండకు చెందిన జాటోతు శర్వణ్కు ప్రభుత్వం నుంచి రూ.1.30 లక్షల విలువ గల గొర్రెల రుణం మంజురైంది. ఇందుకు సంబంధించి డబ్బుల కోసమని శర్వణ్ మహబూబాబాద్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో గల తన ఖాతాలో డబ్బులు జమచేయమని బ్యాంకు చుట్టూ ఏడాదిన్నర కాలంగా తిరుగుతున్నాడు. అయినప్పటికీ బ్యాంకు అధికారులు ఏదో ఒక కారణం చూపుతూ అతడికి డబ్బులు ఇవ్వడం లేదు. సోమవారం కూడా రోజుమాదిరిగానే డబ్బుల కోసం ఐఓబీకి వెళ్లి అధికారులను అడిగాడు. వారినుంచి సరైన సమాధానం రాకపోవడంతో అదే బ్యాంకులో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108లో చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement