కర్నూలు : టీడీపీ ఖాకీచకంపై వైఎస్సార్సీపీ నేతలు యుద్ధం ప్రకటించారు. ఇకపై పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
పోలీసులను అడ్డం పెట్టుకుని వేధించే వారి ‘భారతం పడతామంటూ కదం తొక్కారు. కర్నూలు నగరంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. పిడికిళ్లు బిగించి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహంతో నినాదాలు చేశారు.
పాలన చేతగాక ప్రశ్నించే వారిని పోలీసులతో అరెస్టు చేయించే విధానాన్ని తప్పుబట్టారు. ఇక సహించేది లేదని, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.
టీడీపీ నేతల మాటలు వినొద్దని, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రజల పక్షాన విధులు నిర్వర్తించాలని పోలీసులకు సూచించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు యువకులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు.


