breaking news
-
జత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్!
సాక్షి, విజయవాడ: ముంబై జూనియర్ ఆర్టిస్ట్ కాదంబరీ జత్వానీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆమెను పెద్ద బ్లాక్మెయిలర్గా పేర్కొన్న సీఐడీ.. బెదిరింపుల ద్వారా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేల్చేసింది.కుక్కల విద్యాసాగర్ నుంచి బ్లాక్మెయిల్ ద్వారా డబ్బులు తీసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించింది. సుమారు రూ.1.31 కోట్లు బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసిందని.. ఇందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను సాంకేతిక ఆధారాలతో పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో జత్వానీ కుటుంబ సభ్యుల పాత్ర లేదని సీఐడీ ఛార్జ్షీట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఐపీఎస్ అధికారులపై చర్యల అంశంగతంలో జత్వానీని వేధించారంటూ కూటమి నేతలు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. జత్వానీ కేసును అడ్డుపెట్టుకుని గత వైఎస్సార్సీపీ హయాంలో పని చేసిన పోలీసు అధికారులను వేధించేందుకు పెద్ద కుట్ర జరిగిందని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. జత్వానీని ఏపీకి తీసుకొచ్చి అధికారులపై తప్పుడు కేసులు పెట్టించారని, ఆమెకు అనుకూలంగా ఎల్లో మీడియా ప్రచారం చేసిందని విమర్శలు ఆ సమయంలో వెల్లువెత్తాయి. అంతేకాదు ఐపీఎస్ అధికారులపై కూటమి అధికారంలోని వచ్చాక తీసుకున్న చర్యలను కూడా రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. విద్యాసాగర్కు నోటీసులుసీఐడీ ఛార్జ్షీట్ నేపథ్యంలో కుక్కల విద్యాసాగర్కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా పలు కీలక అంశాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.జత్వాని లేఖతో మరో మలుపుసీఐడీ ఛార్జ్షీట్ నేపథ్యంలో జత్వాని ఓ లేఖ విడుదల చేసింది. తనను ఈ వ్యవహారంలో బలిపశువును చేశారని ఆమె అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే అడ్డంగా దొరికిపోయాక టీడీపీ, దాని అనుకూల మీడియా మళ్లీ కొత్త డ్రామాకు తెర తీస్తున్నట్లు స్పష్టమౌతోంది.జత్వానీ కేసు గతంలో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అప్పట్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జత్వానీకి మద్దతుగా నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఆమెకు స్టార్ హోటళ్లలో వసతి, విమాన ప్రయాణాలు, ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించడం కూడా హాట్టాపిక్గా మారింది. అంతేకాకుండా విజయవాడ దుర్గగుడిలో ప్రోటోకాల్ దర్శనం కల్పించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే తాజాగా సీఐడీ ఛార్జ్షీట్లో జత్వానీపై బ్లాక్మెయిల్ ఆరోపణలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడంతో.. కూటమి ప్రభుత్వం హడావుడి చేసి అభాసుపాలైందనే చర్చ నడుస్తోంది.జత్వాని కేసు నేపథ్యంలో అప్పటి కీలక పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. డీజీపీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ క్రాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేశారు. తాజాగా సీఐడీ ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలతో ఈ కేసు మరోసారి రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
మద్యం మత్తులో వేధిస్తున్న కుమారుడిని హత్యచేసిన తల్లి
చల్లపల్లి: తాను ఏరోజైతే బిడ్డకు జన్మనిచ్చిందో అదే రోజు ఆ తల్లి కొడుకుని కొట్టి చంపింది. మంగళవారం పోలీస్స్టేషన్కు వెళ్లి విషయం చెప్పింది. కృష్ణాజిల్లా, చల్లపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చల్లపల్లి పడమర వీధిలో నివాసం ఉంటున్న మోతుకూరి నాగమణికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు శివ ఏసీ రిపేర్ పని చేసుకుంటూ కొన్నేళ్లుగా దూరంగా వేరే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. నాగమణి పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్(35) వద్దే ఉంటోంది. అతడు ముఠాపని, డెలివరీ బాయ్గా పని చేస్తుంటాడు. మద్యానికి బానిసైన దుర్గాప్రసాద్ తరచూ తల్లితో గొడవపడేవాడు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి కూడా ఇంట్లో తల్లీకొడుకులు ఇద్దరూ వాదులాడుకున్నారు. తెల్లారిన తరువాత నాగమణి తన పనులు చేసుకుంటూ ఇరుగుపొరుగు వారితో సాధారణంగానే మాట్లాడింది. 10.30 గంటల సమయంలో పోలీస్స్టేషన్కు వెళ్లింది. రాత్రి తాను, తన కొడుకు దుర్గాప్రసాద్ గొడవ పడ్డామని, సహనం నశించి బలమైన వస్తువుతో కొట్టగా తన కొడుకు చనిపోయాడని పోలీసులకు చెప్పింది. అవాక్కయిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా దుర్గాప్రసాద్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు.తలపై ఇనుప రాడ్డుతో కొట్టిన గాయాలు ఏడు నుంచి తొమ్మిది వరకూ గాట్లు ఉన్నట్లు తెలిసింది. చల్లపల్లి పోలీసులు వివరాలు, ఆధారాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేశారు. మృతుడు దుర్గాప్రసాద్ ఫేస్బుక్ అకౌంట్లో దొరికిన వివరాలను బట్టి అతను జూలై 20, 1991న జన్మించాడు. పుట్టిన రోజునాడే జన్మనిచ్చిన తల్లి చేతిలోనే దుర్గాప్రసాద్ హతమయ్యాడు. -
రాళ్లతో కొట్టి వైఎస్సార్సీపీ బీఎల్ఏ హత్య
కనగానపల్లి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గూండాల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లిలో మంగళవారం వైఎస్సార్సీపీ బీఎల్ఏ అంకె నగేష్ (42)ను టీడీపీ సానుభూతి పరులు రాళ్లతో దాడి చేసి చంపేశారు. ఇచ్చిన బాకీ అడిగినందుకు.. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంకె లక్ష్మన్న సోదరుడు అంకె నగేష్ కనగానపల్లిలో వైఎస్సార్సీపీ తరఫున బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)గా పనిచేస్తున్నాడు. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్న నగేష్ అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అంకె మురళికి కొంత నగదు అప్పుగా ఇచ్చాడు. రెండేళ్లుగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవటంతో రెండు రోజుల క్రితం నగేష్ వారి ఇంటికి వెళ్లి అడిగాడు. ఈ సందర్భంలోనే మురళీ కుటుంబ సభ్యులు నగేష్ తో గొడవకు దిగారు. ‘‘నీకు డబ్బులు ఇచ్చేది లేదు’’ అని తేల్చి చెప్పారు. దీంతో వారిపై మంగళవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటానికి నగేష్, తన అన్న కుమారుడు అంకె పురుషోత్తంతో కలిసి వెళ్తుండగా మురళి, అతని కుటుంబ సభ్యులు కాపు కాసి రాళ్లు, ఇటుక పెళ్లలతో దాడి చేశారు. నగేష్కు ఛాతీ, తలపై గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఘటనలో పురుషోత్తం తలకు కూడా తీవ్ర గాయమైంది. సమీపంలో ఉన్న నగేష్ బంధువులు అక్కడికి చేరుకొని గాయపడ్డ ఇద్దరినీ ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన నగేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య రాధమ్మ, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకుని పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కనగానపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నగేష్ హత్యతో కనగానపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నగేష్ హత్యకు ఆర్థికలావాదేవీలే కారణంగా కనిపిస్తున్నా.. ఇందులో రాజకీయ దురుద్దేశాలూ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. నగేష్ పార్టీ బీఎల్ఏగా గ్రామంలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులూ వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో వారు ముందుకు రాకూడదన్న ఉద్దేశంతోనే టీడీపీ సానుభూతిపరులు నగేష్ హత్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వడ్ల దస్తగిరి బాబు, నితీష్, వంశీ, వన్నూరప్ప, మురళి, సురేష్, అక్కులప్ప, నాగమణి, జ్యోతి, అఖిల, లక్షి్మదేవిలపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. -
కీచకుడిపై చట్టపరమైన చర్యలు
కాకినాడ క్రైం: ఇద్దరు మైనర్లు, ఆమె తల్లిపై ఘాతుకానికి పాల్పడిన కీచకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ‘సాక్షి’ పత్రికలో సోమవారం ప్రచురితమైన ‘కీచకుడి చేతిలో విలవిల’ కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, జిల్లా పోలీస్ శాఖ నుంచి నివేదిక కోరామన్నారు. జరిగిన నేరంపై ఆధారాలు లభ్యమయ్యాయని, ఫిర్యాదుతో నిమిత్తం లేకుండా నేరం చేసిన వ్యక్తిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మిని వివరణ కోరగా, బాధిత కుటుంబంతో సహా బాధ్యుడిని తమ కార్యాలయానికి పిలిపించి మాట్లాడామన్నారు. బాధితులు జరిగిన ఘోరాన్ని వివరించి లిఖిత పూర్వకంగా నిర్ధారించారన్నారు. మైనర్లు, ఆమె తల్లిపై జరిగిన ఘాతుకం నిజమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బాలికకు ఆరోగ్య పరీక్షలు, ఆమెకు చదువుకు ఏర్పాట్లు, నేరానికి పాల్పడిన యువకుడిపై చట్టపరమైన చర్యలు అనే మూడు అంశాలను సిఫారసు చేస్తూ కలెక్టర్కు నోట్ఫైల్ పంపామన్నారు. అలాగే ఎస్పీ బిందుమాధవ్కు వీరబాబు అనే బాధితుల బంధువు నుంచి మెయిల్ వచ్చిందని, ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడుతున్నామని కాకినాడ త్రీ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. భార్య, అత్త, మైనర్ మరదలిపై అత్యాచారం చేసిన అల్లుడు! -
రెండు ప్రమాదాల్లో ఏడుగురు జల సమాధి
ఎటపాక/ఉయ్యాలవాడ/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు నీట మునిగి మృత్యువాత పడ్డారు. పోలవరం జిల్లా ఎటపాక మండలంలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో పడి చనిపోగా.. నంద్యాల జిల్లాలో జీవాలు మేపుకునేందుకు వెళ్లి కుందూ నదిలో పడి ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. వివరాలివీ.. పోలవరం జిల్లా ఎటపాక మండలంలోని గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన 11 మంది గిరిజనులు శనివారం ఉదయం గొల్లగూడెం సమీపాన గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లారు. ఊకే రమేష్ (37) నదిలో పడిపోయాడు. ఈత రాకపోవటంతో నీటిలో మునిగిపోతుండడంతో బాసిబోయిన బాలరాజు (40) అతడిని కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో బాలరాజును రమేష్ గట్టిగా పట్టుకోవటంతో ఇద్దరూ మునిగిపోసాగారు. వారితో పాటే వల పట్టుకుని ఉన్న ఊకే లక్ష్మి (37), ఊకే సుశీల (37), తుర్రం భారతి (40) తమ వద్దనున్న చున్నీలు, వలలు విసిరి వారిద్దరినీ కాపాడే ప్రయత్నం చేయగా వీరు కూడా మునిగిపోసాగారు. అది గమనించిన మరికొందరు మహిళలు ఆ ఐదుగురినీ కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ ఐదుగురూ గల్లంతవగా.. ఒడ్డునున్న మహిళలు కేకలు వేయడంతో సమీపంలోని జాలర్లు గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.కొద్దిసేపటికి ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎటపాక పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెలంగాణలోని భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతులందరూ వ్యవసాయ కూలీలు. వీరిలో నలుగురుకి వివాహం కాగా రమేష్ అవివాహితుడు. వారి ఆకస్మిక మృతితో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం అలముకుంది. పశువులు మేపుకునేందుకు వెళ్లి.. నంద్యాల జిల్లా బోడెమ్మనూరు గ్రామంలో చోటుచేసుకున్న మరో ఘటనలో.. జీవాలను మేపేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృత్యువాత పడ్డారు. రోజులానే శనివారం ఉదయం పశువులు మేపుకునేందుకు రసూల్బీ (38), బీబీ అలియాస్ దేవి (50)తో పాటు మౌనిక కుందూ నది ఆవల ఇంజేడు గ్రామ పొలాల్లో మేపుకునేందుకు బయల్దేరారు.అయితే, నదిలోని నీటి గుంతలోకి మేకలు వెళ్లడంతో రసూల్బీ వాటికోసం ఆ గుంతలోకి దిగింది. ఈమె మునిగిపోతుండడాన్ని గమనించిన బీబీ (దేవి) ఆమెను కాపాడేందుకు నీటిలోకి దిగింది. ఇద్దరూ ఊపిరాడక నదిలో గల్లంతయ్యారు. ఒడ్డునున్న మౌనిక జరిగిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా వారు నదిలో గాలించి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు. మృతులిద్దరూ వరుసకు అత్తాకోడళ్లు. వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనులు మృత్యువాత పడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన బృందం చేపలు పట్టేందుకు గోదావరిలోకి వెళ్లగా వీరిలో ఐదుగురు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండటం హృదయవిదారకమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ కోరారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
మద్యం మత్తు.. తండ్రి చేతిలో తనయుడి హత్య
కోనేరు సెంటర్: మద్యం మత్తులో ఉన్న తండ్రీకొడుకులు గొడవ పడగా..ఆగ్రహంతో కుమారుడిని తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..బందరు మండలం బోట్లవానిపాలెంకు చెందిన బొల్లా రామ్మోహనరావు తాపీ పని, అతడి పెద్ద కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి (30) పెయింటింగ్ పని చేస్తుంటారు. నాలుగేళ్ల క్రితం కళ్యాణ్కు గూడూరు మండలానికి చెందిన దుర్గాభవానితో వివాహం కాగా, తన భార్యతో పాటు అతడు తన అత్తవారి ఊర్లో ఉంటున్నాడు. మంగినపూడి బీచ్కి సమీపంలో పెయింటింగ్ పనులకు వచ్చిన కళ్యాణ్..రెండు రోజులుగా తల్లిదండ్రుల వద్దే ఉన్నాడు. గురువారం రాత్రి తండ్రీకొడుకులు మద్యం తాగారు. అనంతరం కళ్యాణ్ తన తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో తండ్రీకొడుకులు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుకున్నారు. ఓ దశలో తీవ్ర ఆగ్రహంతో తండ్రి రామ్మోహనరావు మంచంపై పడుకుని ఉన్న కళ్యాణ్ తలపై సరుగుడు బాదుతో బలంగా కొట్టగా తలకు గాయాలై కళ్యాణ్ స్పృహ కోల్పోయాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో బంధువులు అతడిని మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ఆసుపత్రికి వచ్చి ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుని భార్య దుర్గాభవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
దారుణం.. ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిపై..
సాక్షి, చిత్తూరు జిల్లా: వీ.కోటలో వెలుగు దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిని తల్లి హింసించింది.. ప్రియుడితో కలిసి కసాయి తల్లి.. కుమారుడిపై బ్లేడుతో దాడి చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నతల్లి తన ప్రియుడుతో కలిసి కొడుకును అతి కిరాతకంగా చిత్రహింసలకు గురిచేసింది.వీ.కోట ఈశ్వర్ నగర్లో నివాసముంటున్న ఇంద్రజకు భర్త చనిపోగా.. ఎర్ర చేనుకు చెందిన రాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి ఏడేళ్ల కొడుకు విశాల్ అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి.. ప్రియుడుతో కలిసి శరీరం, ప్రైవేట్ పార్ట్లలో బ్లేడుతో విచక్షణారహితంగా కోసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలుడిని కాపాడి ఆసుపత్రికి తరలించింది. -
చనువుగా మాట్లాడతూ.. ఓచర్ రాస్తానని నమ్మించి..
తూర్పు గోదావరి, కైకలూరు: బ్యాంకులో అన్నీ తెలిసిన వ్యక్తిగా చలామణి అవుతాడు. అక్కడ వస్తువులు సర్దుతున్నట్టు నటిస్తూ బ్యాంకు సిబ్బందితో చనువుగా మాట్లాడతాడు. చదువురాని డ్వాక్రా మహిళలను టార్గెట్ చేస్తూ.. అదును చూసి ఫేక్ ఓచర్లు రాసి సొమ్ములు కాజేస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ మీరావలి.ఇదే తరహాలో కృష్ణా, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మీరావలిపై 50కు పైగా కేసులు నమోదయ్యాయి. బ్యాంకుల వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళలు, వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని తాను బ్యాంకు ఉద్యోగి, డ్వాక్రా సీసీనంటూ నమ్మించి నగదు తీసుకుని కౌంటర్లో చెల్లిస్తానని నమ్మిస్తున్నాడు. వారికి ఫేక్ ఓచర్ అందించి సొమ్ముతో ఉడాయిస్తున్నాడు.మోసం బట్టబయలు ఇలా.. కలిదిండి మండలం గుర్వాయిపాలేనికి చెందిన బొల్లా ముత్యాలమ్మ గత నెల 6న కలిదిండి ఎస్బీఐ బ్యాంకుకు డ్వాక్రా రుణ వాయిదా చెల్లించేందుకు వెళ్లింది. అప్పటికే కొన్ని రోజులుగా డ్వాక్రా మహిళలకు తాను బ్యాంకు సిబ్బంది, వెలుగు కార్యాలయానికి చెందిన వ్యక్తిగా మీరావలి నమ్మిస్తూ వచ్చాడు. దీంతో ఓచర్ రాసి నగదు కౌంటర్లో చెల్లిస్తానని చెప్పగా ముత్యాలమ్మ నమ్మింది. అతడికి రూ.61 వేలు ఇవ్వగా.. కౌంటర్ వద్దకు వెళ్లి నగదు చెల్లించకుండా అప్పటికే తన జేబులో సిద్ధం చేసుకున్న చెల్లింపు రశీదును ఆమెకు ఇచ్చి మోసం చేశాడు.ఆ రశీదు తీసుకుని ఆమె ఇంటికి వెళ్లిపోయింది. తాజాగా తిరగి వాయిదా చెల్లించేందుకు వెళ్లగా, అసలు బండారం బయట పడింది. ఆమె కలిదిండి పోలీసులను ఆశ్రయించగా.. బ్యాంకులో సీసీ పుటేజీని పరిశీలించి నాగూల్ మీరావలిని గుర్తించారు. అతడికి ఆచూకీ తెలిసిన వారు పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. బ్యాంకుల వద్ద ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కలిదిండి ఎస్సై పవన్కుమార్ సూచించారు. -
వివాహేతర సంబంధం.. ప్రియుడిని రాడ్డుతో కొట్టి దారుణ హత్య!
ప్రకాశం, సంతమాగులూరు(అద్దంకి): వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రియుడిని మహిళ కుమారుడు రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన సంతమాగులూరు మండలం పాతమాగులూరులో గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పాతమాగులూరుకు చెందిన సజ్జల పిచ్చిరెడ్డి (47) వ్యవసాయం చేస్తుంటాడు.ఆయనకు భార్య అనూష, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, పిచ్చిరెడ్డికి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళ కుమారుడు విష్ణువర్ధన్ చైన్నెలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి చైన్నె నుంచి వచ్చిన విష్ణు నేరుగా ఇంటికి వెళ్లాడు. అప్పటికే తన ఇంట్లో ఉన్న పిచ్చిరెడ్డిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. విష్ణును గమనించిన పిచ్చిరెడ్డి భయంతో బయటకు పరుగులు తీశాడు. అయితే, అతన్ని వెంబడించిన విష్ణువర్ధన్ ఇనుప రాడ్తో తలపై బలంగా కొట్టడంతో పిచ్చిరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.బుధవారం రాత్రి బయటకు వెళ్తున్నానని చెప్పిన భర్త తిరిగి రాకపోవడంతో.. ఆ మహిళ ఇంటికే వెళ్లి ఉంటాడని భార్య అనూష భావించింది. గురువారం ఉదయం భర్త హత్యకు గురయ్యాడన్న వార్త తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరైంది. తన భర్తను సదరు మహిళ కుమారుడే హత్య చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంతమాగులూరు సీఐ శేషగిరిరావు సమాచారంతో దర్శి డీఎస్పీ పి.బాలమురళీకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు.లొంగిపోయిన నిందితుడుహత్యకు పాల్పడిన విష్ణువర్ధన్ తన తల్లితో కలిసి వెళ్లి అద్దంకి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గతంలోనే వీరి సంబంధం గురించి తెలుసుకున్న విష్ణువర్ధన్.. తమ ఇంటికి రావొద్దని పిచ్చిరెడ్డిని తీవ్రంగా హెచ్చరించినట్లు స్థానికులు చెబుతున్నారు.ఉలిక్కిపడ్డ మండల వాసులుఫ్యాక్షన్ ప్రాంతంగా గుర్తింపు ఉన్న పాతమాగులూరులో ఉదయాన్నే హత్య వార్త దావానలంలా వ్యాపించింది. ఏ రాజకీయ హత్య జరిగిందోనని మండల ప్రజలు తొలుత తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, హత్యకు దారితీసిన అసలు కారణం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
‘నేను భర్తగా భావించే సాయే నా అంత్యక్రియలు చేయాలి’
సాక్షి, ప్రకాశం: సోషల్ మీడియా పరిచయం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తాను భర్తగా భావించిన వ్యక్తికి మరో యువతితో నిశ్చితార్థం జరిగిందని మనోవేదనకు గురైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపినేని సాయి సుమంత్, కీర్తి అనే ఇద్దరికీ సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. సుమంత్ దుబాయ్లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా, కీర్తి ముంబైలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారు.అయితే, కీర్తికి తెలియకుండా సుమంత్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయమై కీర్తి అతడిని నిలదీయగా.. సుమంత్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన కీర్తి ఆత్మహత్య చేసుకుంది. తనువు చాలించే ముందు ఆమె ఒక లేఖ రాసింది. తాను భర్తగా భావించే సాయి సుమంత్ చేతుల మీదుగానే తన అంత్యక్రియలు నిర్వహించాలన్నదే తన ఆఖరి కోరికని ఆ లేఖలో పేర్కొంది.కీర్తి మరణానంతరం ఆమె మృతదేహాన్ని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులోని సాయి నివాసానికి తీసుకువచ్చారు. చనిపోయిన కీర్తి మెడలో సాయి తాళి కట్టాలని, ఆమె అంత్యక్రియలను అతడే జరపాలని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు అక్కడ ఆందోళనకు దిగారు.ఈ క్రమంలో సాయి సుమంత్ తల్లిదండ్రులు కీర్తి కుటుంబ సభ్యులను బెదిరించి, ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు -
కిర్లంపూడి: అంబటి రాంబాబుపై కేసు నమోదు
సాక్షి, కాకినాడ: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.ముద్రగడ పద్మనాభం మృతిచెందిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని తిరస్కరించారు. తమ కుటుంబ నిర్ణయం మేరకే అంతిమ కార్యక్రమాలు జరపాలని స్పష్టం చేశారు. అయితే.. ప్రభుత్వం తరఫున పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ముద్రగడ అంత్యక్రియల సమయంలో.. గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే సమయంలో అంబటి రాంబాబు, మరికొందరు వైఎస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అధికార లాంఛనాలు నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఉన్నతాధికారుల సమక్షంలోనే విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు ఆరోపించారు.ఈ ఘటనపై ఏఆర్ ఎస్ఐ వెలుదూటి అప్పలరాజు, పలువురు కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేశారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తున్న సమయంలో అంబటి రాంబాబు పోలీసులను తోసివేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైఎస్సార్సీపీ నేతలపై బీఎన్ఎస్ 132, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేతలు ఈ కేసును ఖండిస్తున్నారు. ముద్రగడ కుటుంబం ప్రభుత్వ లాంఛనాలను వద్దని స్పష్టంగా చెప్పినప్పటికీ.. ప్రభుత్వం బలవంతంగా గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించిందని ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నారు. -
ప్రియుడితో కలిసి.. భర్తను పరుగెత్తించి చంపిన భార్య..!
నిండా రెండేళ్లు పూర్తి కాని వివాహ బంధం. దానికి ప్రతిఫలంగా పుట్టిన ఏడు నెలల బిడ్డ. అన్యోన్యంగా సాగుతోందని బంధువులు అనుకున్న కాపురం. భార్య వివాహేతర సంబంధం కాలనాగులా మారి భర్తను కాటేసింది. భార్య తోడ్పాటుతో ఆమె ప్రియుడి చేతిలో భర్త హతమయ్యాడు. జీవిత భాగస్వామి పన్నిన వ్యూహంలో చిక్కుకుని అతను ప్రాణాలు కోల్పోయాడు. సాక్షి, చిత్తూరు : శాంతిపురం మండలం కెనమాకులపల్లి పంచాయతీ బోయనపల్లికి చెందిన యువతికి రెండేళ్ల క్రితం తమిళనాడులోని సూలగిరికి చెందిన రమేష్తో పెద్దలు పెళ్లి చేశారు. ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారని ఇరు కుటుంబాల వారు భావించారు. ఏడు నెలల క్రితం ఆ యువతి ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. రెండు నెలల క్రితం అత్తారింటికి వెళ్లింది. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటే ఆమెకు పుట్టిన ఊరిలో మరో యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసినట్టు తెలిసింది. ఈ క్రమంలో తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తప్పించాలని భార్య ప్రియుడితో కలిసి పథకం పన్నింది. రెండు రోజుల క్రితం ఆమె భర్త రమేష్ తో కలిసి పుట్టింటికి వచ్చింది. మంగళవారం భర్త, బిడ్డను గుడుపల్లి మండలంలోని మల్లప్ప కొండౖపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. ఈ విషయాన్ని ముందుగానే ప్రియుడికి చేరవేసింది. అతను తన స్నేహితుడితో కలిసి మల్లప్పకొండపై ఆలయానికి వెళ్లే మార్గంలో కాపు కాసి బైకును అడ్డుకున్నట్టు తెలిసింది. దాడి జరుగుతోందని గమనించిన రమేష్ తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో రోడ్డు నుంచి దాదాపు 100 మీటర్లు తనను వెంబడించిన ప్రియుడు, తన స్నేహితుడు విచక్షణారహితంగా నరికినట్టు సంఘటనా స్థలంలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం యువతి, తన ప్రియుడు, ప్రియుడి స్నేహితుడు కలిసి మృతుడికి చెందిన బైకుపైనే వెళ్లిపోయినట్టు సమాచారం. చంటి బిడ్డతో గుడికి వెళ్లిన దంపతులు తిరిగిరాకపోవడంతో బంధువులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. వారు పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో మల్లప్ప కొండపై శవం ఉందనే సమాచారం రావడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. యువతి తన భర్తతో కలిసి మల్లప్ప కొండ వైపు వెళ్తున్న దృశ్యాలను సీసీటీవీ పుటేజీల్లో గుర్తించారు. భర్త శవం దొరకడంతో భార్య, బిడ్డ ఏమయ్యారని ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులతో కలిసి యువతి బైకుపై వెళుతున్నట్టు సీసీ టీవీల్లో తేలింది. భార్య, తన ప్రియుడు మరో వ్యక్తితో కలిసి రమేష్ ను హతమార్చినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న యువతి ఇంకా మైనర్ అని బోయనపల్లి గ్రామస్తులు చెప్పారు. రెండేళ్ల క్రితం తను 9వ తరగతి చదువుతుండగానే ఈ బాలికకు పెద్దలు పెళ్లి చేశారని పేర్కొన్నారు. -
సీఐ వేధింపులతోనే చచ్చిపోతున్నా..
సాక్షి, నరసరావుపేట, పిడుగురాళ్ల: పోలీసుల వేధింపులు తాళలేక మైనార్టీ వర్గానికి చెందిన ఓ ఉద్యోగి పుట్టినరోజు నాడే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం ఉదయం పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. సివిల్ పంచాయితీలో తలదూర్చడమే కాకుండా తాను చెప్పినట్లు వినకుంటే గంజాయి కేసు నమోదు చేస్తానని పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు బెదిరించడంతో చనిపోతున్నానని, తన చావుకి పోలీసులే కారణమని సూసైడ్ లెటర్లో షేక్ దరియా హుస్సేన్ (49) పేర్కొన్నాడు. పట్టణంలోని బిలాల్ మసీద్ సమీపంలో దరియాహుస్సేన్ తన ఇంట్లో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుడి భార్య షేక్ అమిరున్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... » సత్తెనపల్లిలోని ఉర్దూ అకాడమీలో లైబ్రేరియన్గా ఉద్యోగం చేస్తున్న దరియా హుస్సేన్ 2016లో తన భార్య షేక్ అమీరున్ పేరిట రెండు రేకుల ఇళ్లను కొనుగోలు చేశాడు. పులికూరి ప్రశాంత్ పేరిట ఉన్న ఆ ఇళ్లను అతడి తల్లి లక్ష్మి విక్రయించారు. అయితే ఆ ఇళ్లు 22 ఏ జాబితాలో ఉన్నందున రిజి్రస్టేషన్ కాలేదు. దీంతో స్వా«దీన అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఏడాది తర్వాత మరికొంత నగదు చెల్లించాలంటూ లక్ష్మి ఒత్తిడి చేసింది. దీంతో దరియా హుస్సేన్ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతం తుది తీర్పు దశలో ఉంది. ఈ క్రమంలో పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు ఈ నెల 14వ తేదీన ఇళ్లు ఖాళీ చేయాలంటూ దరియా హుస్సేన్ను తీవ్ర స్థాయిలో బెదిరించారు. లేదంటే గంజాయి కేసు నమోదు చేసి కుటుంబం మొత్తాన్ని ఇబ్బందులకు గురి చేస్తామని హెచ్చరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దరియా హుస్సేన్ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకొని మృతి చెందాడు. ఎస్పీకి పీజీఆర్ఎస్లో అర్జీలు పెట్టుకున్నా సీఐ వేధింపులు ఆగలేదని మృతుడి కుటుంబీకులు వాపోయారు. మైనార్టీ ఉద్యోగి మరణానికి కారణమైన సీఐ వెంకట్రావుపై కేసు నమోదు చేయాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రానున్న జగనన్న ప్రభుత్వంలో సీఐ వెంకట్రావు తప్పులన్నింటికి చట్ట ప్రకారం శిక్షలు పడతాయని హెచ్చరించారు. బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. » మృతుడు తన సూసైడ్ నోట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్లను ప్రస్తావించాడు. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు, పోలీసు సిబ్బంది తనను ఇబ్బంది పెట్టారని వెల్లడించాడు. సీఐ ఎస్.వెంకట్రావు తమ ఇంటికి తాళాలు వేయించినట్లు తెలిపాడు. రాజీకి టీడీపీ నేతల యత్నం.. తన మరణానికి పోలీసులే కారణమని మృతుడు దరియా హుస్సేన్ సూసైడ్ లేఖలో పేర్కొనడంతో రంగంలోకి దిగిన టీడీపీ నేతలు రాజీ యత్నాలు ప్రారంభించారు. సామాన్యులు కావటంతో సామదాన భేదదండోపాయాలను ప్రయోగించి కేసును పక్కతోవ పట్టించే కుట్రలకు తెర తీశారు. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు సివిల్ పంచాయితీలలో తలదూర్చడంతో ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్యా యత్నాలకు ఒడిగట్టడం గమనార్హం.ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళతోపాటు ఓ దళిత యువకుడు వీరిలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు ఉన్నతాధికారులు సీఐ వెంకట్రావును వెనుకేసుకొస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. పోలీసుల వేధింపులతో మరణించిన షేర్ దరియా హుస్సేన్ కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేయాలని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా డిమాండ్ చేశారు. -
సర్కారు కిరాతకంలో మరో లాకప్డెత్!
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు సర్కారులో వరుస లాకప్ డెత్లు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్, తర్వాత శవాన్ని మాయం చేయడం సర్కారు కిరాతకానికి పరాకాష్ట. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మరో లాకప్ డెత్ చోటు చేసుకుంది. బంగారు గొలుసు చోరీ కేసులో నెల్లూరు జిల్లా మనుబోలు పోలీసులు తీసుకొచ్చిన బొల్లి ఏడుకొండలు (50) మంగళవారం పోలీసు స్టేషన్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసు దెబ్బలకే అతను చనిపోయాడని స్థానికులు అంటుండగా.., గడ్డి మందు తాగి చనిపోయాడని పోలీసులు అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ బంగారు గొలుసు దొంగతనం కేసులో చెరుకుమూడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలును మనుబోలు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో విచారించారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్పై విడిచి పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఏడుకొండలు గ్రామంలో ఉన్నాడని ఎవరో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరుకుమూడి వెళ్లి ఏడుకొండలును తిరిగి అదుపులోకి తీసుకుని, స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదినట్లు సమాచారం. దెబ్బలకు తాళలేక అతను మృతి చెందడంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని చెరుకుమూడి దారిలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏడుకొండలు మృతదేహాన్ని ఎవరికీ చూపించకుండా పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఏడుకొండలు సోదరి మంగళవారం రాత్రి స్టేషన్ చేరుకుని మా తమ్ముడిని తీసుకొ చ్చి, ఏమి చేశారంటూ విలపించడం కంట తడి పెట్టించింది. కాగా, ఏడుకొండలు గడ్డి మందు తాగి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. -
కర్నూలులో ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
ఆంధ్రప్రదేశ్: కర్నూల్ జిల్లాలో ఈరోజు ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగరంలో లారీ ఢీకొనడంతో ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా ఫ్లైఓవర్పై ఏపీ స్పెషల్ బెటాలియన్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి వాకింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో వెనుకనుంచి వచ్చిన లారీ అతనిని బలంగా ఢీకొనడంతో ఫ్లైఓవర్ పై నుండి క్రిందపడి కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఏపీ స్పెషల్ బెటాలియన్లో పోలీస్గా విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది. -
పల్నాడులో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామానికి చెందిన భారతి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఘటనాస్థలిలో పోలీసులు ఓ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో ‘నా చావుకు ఎవరూ కారణం కాదు‘ అని భారతి రాసినట్లు తెలుస్తోంది. భారతి ఈ ఘోర నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను పోలీసులు విచారిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సూసైడ్ లెటర్ పరిశీలన అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
కోనసీమ రావులపాలెంలో యువకుడు దారుణ హత్య..
ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు దుండగులచేతిలో హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా, రావులపాలెంలో విషాదకర ఘటన జరిగింది. ఓ గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు తలను బండరాళ్లతో మోది కిరాతకంగా హత్యచేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి అను సాయి అలియాస్ నల్లసాయిగా గుర్తించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
విశాఖ: టెకీ రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ అరెస్టు
ముస్సోరీ: ఉత్తరాఖండ్లోని ముస్సోరీ హిల్ స్టేషన్ హోటల్లో గత కొన్నిరోజులక్రితం తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి అనుమానస్పద స్థితిలో మరిణించిన విషయం తెలిసిందే.అయితే, ఈ హత్యకు ప్రధాన నిందితుడు తన అల్లుడు శ్రీ చరణే అని మృతిరాలి తండ్రి పలు ఆరోపణలు చేశారు. తండ్రి చేసిన ఆరోపణలతో రంగంలోకి దిగిన పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుపై భర్త శ్రీచరణ్ని డెహ్రాడూన్ పోలీసులు అరెస్టు చేశారు. -
తిరుపతి జిల్లాలో డ్రగ్స్ కలకలం
సాక్షి, తిరుపతి: జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాల వ్యవహారం కలకలం రేపింది. కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు బీటెక్ విద్యార్థి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టైన నిందితులు తెల్ల గుణశేఖర్ (శెట్టిపల్లి గ్రామం), ఎస్. అశ్విన్ కుమార్ (కొర్లగుంట, తిరుపతి), పడమల రాహుల్ యాదవ్ (కొర్లగుంట, తిరుపతి)గా గుర్తించారు. వీరు చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో ఎండీఎంఏ (మెత్) డ్రగ్స్ను కాలేజీ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.నిందితుల నుంచి సుమారు రూ.3 లక్షల విలువైన 62 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు, నాలుగు సెల్ఫోన్లు, రెండు డిజిటల్ వెయింగ్ మెషీన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. -
టీటీడీ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లకు పైగా టోకరా!
తిరుపతి క్రైం: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. టీటీడీ నకిలీ లోగో, ఈవో స్టాంపులతో దొంగ నియామకపత్రాలు అందించి మోసం చేశాడు. దీనిపై బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్కుమార్రెడ్డి అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం తిరుపతిలోని కొందరు నిరుద్యోగులను కలిసి తనను న్యాయవాదిగా పరిచయం చేసుకున్నాడు. టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగుల స్థానంలో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారని నమ్మించాడు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం తనకు బాగా తెలుసునని, ఆయన ద్వారా ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశలు కల్పించాడు. జూనియర్ అసిస్టెంట్తోపాటు ఇంకా రకరకాల పోస్టులు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.50లక్షల వరకు వసూలు చేశాడు. నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి.. మోసగాడు డబ్బులు తీసుకున్న అనంతరం టీటీడీ నకిలీ లెటర్ హెడ్, ఈవో స్టాంపు, సంతకంతో కూడిన అపాయింట్మెంట్ లెటర్లు అందించాడు. అయితే, ఉద్యోగాల్లో చేరిక (జాయినింగ్) ప్రక్రియ కొనసాగుతోందంటూ కొంతకాలం ఆగాలని చెప్పాడు. చాలారోజులు ఎదురు చూసిన బాధితులకు అనుమానం వచ్చి టీటీడీలో ఉద్యోగ నియామకాల గురించి ఆరా తీయగా... ఎటువంటి పోస్టులు భర్తీ చేయలేదని తేలింది. దీంతో తాము మోసపోయామని ఇద్దరు బాధితులు శుక్రవారం తిరుపతి ఈస్ట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక యువకుడికి జూనియర్ అసిస్టెంట్ పోస్టు వచ్చినట్లు ఇచ్చిన నకిలీ అపాయింట్మెంట్ లెటర్ తామిద్దరం, తమకు తెలిసిన మరికొందరు కలిపి రూ.కోటి వరకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు కిరణ్కుమార్రెడ్డి ఎవరు? ఏం చేస్తుంటారు? టీటీడీ నకిలీ లోగో, లెటర్ హెడ్, ఈవో స్టాంప్ తయారు చేయడం, దొంగ నియామకపత్రాలు అందించడం, పెద్ద ఎత్తున ఆరి్థక లావాదేవీలు సాగించడం వెనుక ఇంకా ఎవరి ప్రమేయం అయినా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా, 25 మంది వరకు బాధితులు ఉంటారని, వారి నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. -
పాముకాటుకు గురైన యువతి మృతి
కూనవరం/చింతూరు : పాముకాటుకు గురైన కుమార్తె సమ్మక్కను బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు అష్టకష్టాలుపడి డోలీలో తరలించినా ఫలితం లేకపోయింది. ఎన్ని ఆస్పత్రులకు తరలించినా ఆమె పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి ప్రాణాలు విడిచింది. తమ బిడ్డను బతికించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆమె తల్లిదండ్రులు సూట్రు లక్ష్మారెడ్డి దంపతులు బోరున విలపించారు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం కూటూరు గట్టు (ఎత్తయిన కొండలు) పరిధిలోని కార్మానుకొండ గ్రామంలో కొండరెడ్డి తెగకు చెందిన సూట్రు లక్ష్మారెడ్డి దంపతుల నలుగురు సంతానంలో పెద్ద కుమార్తె సమ్మక్క ప్రియ (18). ఇంటర్ వరకు చదివింది. ఈనెల 6న సమ్మక్క ప్రియ పాము కాటుకు గురైన విషయం తెలిసిందే.నాలుగు కొండల నడుమ ఉన్న ఆ గ్రామం నుంచి డోలీ కట్టి కొండలు ఎక్కుతూ దిగుతూ ఏడు కిలోమీటర్ల మేర కాలిబాటన కూటూరు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడి వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్నర్సు ప్రాథమిక చికిత్స చేసి చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించమన్నారు. అక్కడ నుంచి భద్రాచలానికి.. పరిస్థితి విషమించడంతో గుంటూరు జీజీహెచ్కి తరలించగా అక్కడ తన కుమార్తె మరణించినట్లు లక్ష్మారెడ్డి చెప్పాడు. తన కుటుంబాన్ని చింతూరు ఐటీడీఏ పీఓ ఆదుకోవాలని లక్ష్మారెడ్డి వేడుకున్నాడు.అధికారుల నిర్లక్ష్యంవల్లే.. అయితే, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సమ్మక్క ప్రియ మృతిచెందిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు లోతా రామారావు చింతూరులో ఆరోపించారు. పాముకాటుకు గురైన బాలికకు సకాలంలో వైద్యం అందక మృతిచెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల తీరు కారణంగానే నిండు ప్రాణం బలైందని.. గిరిజనుల ప్రాణాలపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఘటన ఉదాహరణని ఆయన చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణమే రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఏజెన్సీలోని అన్ని పీహెచ్సీల్లో 24 గంటలూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. -
చోరీ చేసి ఇంటికి నిప్పంటించిన దొంగలు!
గుంతకల్లు రూరల్: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నివాసం ఉంటున్న రైల్వే మహిళా ఉద్యోగి ఇంట్లోకి బుధవారం రాత్రి దుండగులు చొరబడి నగలు, నగదు కొల్లగొట్టారు. ఆధారాలు కనిపించకూడదని ఇంటికి నిప్పంటించి వెళ్లిపోయారు. బాధితురాలు తెలిపిన వివరాలు మేరకు.. ఉమాదేవి రైల్వేలో పాంచ్మెన్గా పని చేస్తున్నారు. ఆమె భర్త కూడా రైల్వేలోనే ఉద్యోగం చేస్తుండేవాడు. మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ఉమాదేవి ఇద్దరు పిల్లలను చదివిస్తూ, వారి పెళ్లిళ్ల కోసం బంగారం, వెండి పోగు చేసుకుంది. ఇద్దరు బిడ్డలు మహారాష్ట్రలో డిగ్రీ చదువుతుండటంతో ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది.బుధవారం రాత్రి యధావిధిగా ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడి 25 తులాల బంగారు నగలు, 50 తులాల వెండి వస్తువులు, రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. ఉదయం 4.30 గంటల సమయంలో ఇంట్లో నుంచి పొగలు, మంటలు వస్తుండడాన్ని గమనించిన స్థానికులు ఉమాదేవికి, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇంట్లోని దుస్తులు, బీరువాలోని డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, ఏటీఎం కార్డులు, ఫ్రిడ్జ్, రెండు టీవీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయని, కట్టుబట్టలు మిగిలాయని బాధితురాలు బోరున విలపించింది. గుంతకల్లు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్, కసాపురం ఎస్ఐ టీపీ వెంకటస్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్టీంతో ఆధారాలు సేకరించారు. -
ఒక ప్రశ్న.. రెండు నిండు ప్రాణాలు బలి!
సాక్షి, తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పద్మావతి కళ్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఓ వివాహ వేడుకకు వచ్చిన వ్యక్తిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఇద్దరు వ్యక్తులు.. ఆ తర్వాత అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయితే దర్యాప్తులో షాకింగ్ విషయం వెలుగు చూసింది.పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ జంట హత్యల వెనుక కుటుంబ వివాదమే కారణమని తెలుస్తోంది. ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్.. తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీళ్ల వివాహానికి మునిరత్నం, మణికంఠలు దగ్గరుండి సహకరించారు. అయితే.. కొన్ని నెలలుగా సునీల్ భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కారణం ఏంటో చెప్పడం లేదని.. ఎంత బతిమాలినా సునీల్ వినలేదని తెలుస్తోంది. ఈ విషయంలో పెద్దలు సర్దిచెప్పాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో.. బుధవారం రాత్రి తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఓ వివాహానికి అతను హాజరైన విషయం సంపూర్ణమ్మకు తెలిసింది. దీంతో తన కుమార్తెకు అండగా ఉన్న మునిరత్నం, మణికంఠలకు ఆమె సమాచారం ఇచ్చింది. వాల్లిద్దరూ వివాహ మండపానికి చేరుకుని సునీల్ను నిలదీశారు. నీ భార్యను ఎందుకు వదిలేశావు? అని ప్రశ్నించారు. దానికి సునీల్ నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ సమయంలో సునీల్తో పాటు అతడి తమ్ముడు, అక్క, మరో బంధువు అక్కడికి చేరుకున్నారు. ఆ నలుగురూ కలిసి మునిరత్నం, మణికంఠలపై కత్తులతో దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.దాడిలో తీవ్రంగా గాయపడిన మునిరత్నం సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న మణికంఠను తిరుపతి.. రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. వీళ్లిద్దరూ జీవకోనకు చెందిన వాళ్లుగా తెలుస్తోంది. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం, సీఐ శ్రీనివాసులు, వెస్ట్ సీఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించారు. నిందితులు అదుపులోకి.. విచారణ కొనసాగింపుభార్యాభర్తల గొడవ.. పెళ్లి వేదికలో మొదలైన వివాదం.. చివరకు ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన తిరుపతిలో సంచలనంగా మారింది. జంట హత్యలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న సునీల్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు పూర్తి కారణాలు, దాడిలో పాల్గొన్న వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. -
సుప్రీం కోర్టుకు చేరిన సాయికృష్ణ కేసు
సాక్షి, అమరావతి: గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నిందితుడు, సస్పెండెడ్ సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.సీఐ నాగరాజు కస్టడీ విచారణకు సంబంధించి హైకోర్టు విధించిన నిబంధనలపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలన్న ఆదేశంపై అభ్యంతరం తెలిపిన సిట్.. దర్యాప్తు ప్రక్రియకు ఇది ఆటంకంగా మారుతుందని పేర్కొన్నట్లు సమాచారం.హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలేంటంటే..గాదె సాయికృష్ణ మృతి కేసులో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి సీఐ నాగరాజును ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తోంది. అయితే కస్టడీ విచారణ విషయంలో ఏపీ హైకోర్టు కొన్ని షరతులు విధించింది. దర్యాప్తు అధికారుల విచారణలో పారదర్శకత కోసం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని, అలాగే విచారణ సమయంలో నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా సీఐ నాగరాజును ఒక రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, మిగిలిన రోజులు రాజమండ్రి జైలులోనే విచారించాలని సూచించింది.సుప్రీంకు వెళ్లిన సిట్హైకోర్టు ఆదేశాలపై సిట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కస్టడీ విచారణ సమయంలో ఇలాంటి పరిమితులు ఉంటే దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు సంబంధించిన అంశాలు, సాక్ష్యాల సేకరణ, నిందితుడిని ప్రశ్నించే విధానంపై హైకోర్టు ఆదేశాలు తమ దర్యాప్తు పరిధిని ప్రభావితం చేస్తున్నాయని సిట్ తన అభ్యర్థనలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.లాకప్డెత్ కేసులో కీలక విచారణగాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీస్ కస్టడీ.. అనంతరం కనిపించకుండా పోవడం.. చివరకు లాకప్లో హింసించడం కారణంగానే మృతి చెందాడని.. ఆనవాలు కూడా దొరక్కుండా శవం మాయం చేశారని తేలింది. ఈ కేసులో నిజానిజాలను తేల్చేందుకు సిట్ దర్యాప్తు చేపట్టింది. సీఐ నాగరాజు పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కస్టడీ విచారణ కీలకంగా మారింది. అయితే.. సిట్ తనను ఇరికించేందుకు కుట్ర చేస్తోందని, ఇందులో భాగంగానే కస్టడీకి కోరిందని.. విచారణ పేరిట తనను టార్చర్ చేయకుండా రక్షణ కల్పించాలని నాగరాజు న్యాయస్థానాన్ని లేఖ రాయడంతో కేసు కీలక మలుపు తిరిగినట్లైంది. -
తిరుపతిలో జంట హత్యలు
తిరుపతి క్రైం: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపం సముదాయంలో బుధవారం రాత్రి జంట హత్యలు కలకలం రేపాయి. ఒక మహిళతో పాటు నలుగురు వ్యక్తులు వెంటాడి వేటాడి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో జీవకోన ప్రాంతానికి చెందిన మునిరత్నం(50) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సుబ్బారెడ్డి నగర్కు చెందిన మణికంఠ(41)ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మావతి కళ్యాణ మండపం సముదాయంలో నాలుగు కళ్యాణ మండపాలున్నాయి. బుధవారం రాత్రి ఒక మండపంలో వివాహం జరుగుతోంది. రాత్రి 9.30 గంటల సమయంలో కొందరు దుండగులు రెండు బైక్లపై అక్కడికి చేరుకున్నారు. కల్యాణ మండపం సముదాయంలోని నిర్మానుష్య ప్రాంతంలో మునిరత్నం, మణికంఠపై వారు దాడి చేశారు. మునిరత్నం, మణికంఠ చిరువ్యాపారులు. మునిరత్నం రెండు నెలల కిందట ఓ వివాహం జరిపించాడు. దాని నేపథ్యంలో ఏర్పడిన వివాదమే ఈ దారుణానికి దారితీసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, ఘటనలోని కొన్ని దృశ్యాలను పద్మావతి కళ్యాణ మండపంలో విధులు నిర్వర్తిస్తున్న వాచ్మన్ తన సెల్ఫోన్లో చిత్రీకరించినట్టు తెలిసింది.


