-
ఆ దేవుడైనా జాలిచూపలేదే.. తండ్రి ఒడిలో చిన్నారి మృతి
చిత్తూరు జిల్లా: మండలంలోని పాలమాకులపల్లె వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. బెంగళూరులోని సింగసంద్రలో ఉంటున్న దాపు శ్రీధర్ కుమార్(46), అతని భార్య లక్షి్మ(42), కుమారై అధ్విక(3)తో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కారులో బయలుదేరారు. ఉదయం 6.15 గంటల ప్రాంతంలో బంగారుపాళెం మండలం పాలమాకులపల్లె వద్ద రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని కారు బస్సు కిందకు దూసుకుపోయింది. దీంతో ముగ్గురూ దుర్మరణం చెందారు. కారు డ్రైవర్ వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. కారు ముందు సీటులో శ్రీధర్కుమార్ తన కుమార్తె అధ్వికను ఒడిలో కూర్చుని పెట్టుకున్నాడు. భార్య లక్ష్మీ వెనుక సీటులో కూర్చుంది. కారు బస్సు కిందకు దూసుకెళ్లినప్పుడు తండ్రి ఒడిలో చిన్నారి మృతి చెందిన దృశ్యం చూసిన ప్రయాణికులు, స్థానికుల కంట తడిపెట్టారు. ఆ దేవుడైనా కనికరించలేదే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్తంభించిన ట్రాఫిక్ పాలమాకులపల్లె వద్ద హైవేపై ప్రమాదం చోటు చేసుకోవడంతో పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు సుమారు రెండు గంటలు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఇది మూడో ప్రమాదం పాలమాకులపల్లె వద్ద హైవేపై ఇది మూడో ప్రమాదమని స్థానికులు, వాహనదారులు తెలిపారు. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్లే పల్లెవెలుగు బస్సులు పాలమాకులపల్లె వద్ద సర్వీసు రోడ్డు వీదుగా వెళ్లాల్సి ఉందని, డ్రైవర్లు బస్సులను హైవేపై నిలపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గత నెల ఇక్కడే ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ఐదుగురు గాయపడినట్లు చెప్పారు. అంతకు మునుపు ఆర్టీసీ బస్సు కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. -
శ్రీకాకుళం బాలిక కేసులో ట్విస్టులు.. నిందితుడి కూతురే డాక్టర్..
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య కేసు సంచలన మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి అరెస్ట్పై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలిని బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే, నిందితుడు సివిల్ ఇంజినీర్ వెంకటరమణకు భారీగా డబ్బు, రాజకీయ పలుకుబడి ఉందని బాధితులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కేసు మలుపు తిరుగుతుందేమోనని భయం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి విషయంలో కూడా జీజీహెచ్లో నిందితుడి కూతురు వైద్యురాలి ఉండటంతో పోస్టుమార్టం రిపోర్ట్ మార్పిడి ప్రయత్నాలపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్బంగా బాధితురాలి పేరెంట్స్ మాట్లాడుతూ..‘నా కూతురికి న్యాయం చేయాలి. న్యాయం జరగకపోతే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. నిందితుడికి ఉరి శిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలి’ అని డిమాండ్ చేశారు.జరిగింది ఇది.. శ్రీకాకుళం జిల్లాలో హిరమండలంలో ఓ గ్రామానికి చెందిన దంపతుల ఏకైక కుమార్తె(17) విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి వచ్చింది. స్థానికంగా సివిల్ ఇంజినీరుగా పని చేస్తున్న వెంకటరమణ.. ‘అమ్మాయికి పాఠాలు చెబుతాను.. నా వద్దకు పంపండి’ అని తల్లిదండ్రులను ఒప్పించాడు. కుమార్తె భవిష్యత్తు బాగుండాలని ఆశించిన వారు నమ్మకంతో అందుకు అంగీకరించారు. ఈ నెల 22న బాలికను శ్రీకాకుళం తీసుకురావాలని వెంకటరమణ సూచించడంతో తండ్రి స్వయంగా తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక తాను శ్రీకూర్మంలో ఉన్నానని.. ఇక్కడికి రావాలని వెంకటరమణ ఫోన్లో చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి శ్రీకూర్మం వెళ్లారు. బాలికను అక్కడే ఉంచిన వెంకటరమణ.. తండ్రిని వెనక్కి పంపేశాడు.అనంతరం, ఈ నెల 23న బాలికను విశాఖలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి పైశాచికంగా దాడి చేశాడు. ‘మీ కుమార్తె అనారోగ్యానికి గురైంది’ అంటూ 24న తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. వారికి బాలికను అప్పగించడంతో స్వస్థలానికి తీసుకెళ్లారు. అప్పటికీ ఆమె కొనఊపిరితో ఉన్నప్పటికీ... ‘మీ కుమార్తె చనిపోయింది. అందుకు నేనే కారణం. ఈ విషయం బయటకు చెప్పకుండా దహన సంస్కారాలు నిర్వహించండి. మీకు డబ్బు ఇస్తాను’ అని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. కొనఊపిరితో ఉన్న కుమార్తెను వారు శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలు వద్ద ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రికి బుధవారం తీసుకొచ్చారు. ‘చదువు చెబుతానంటే నమ్మి పంపించాం. మా బిడ్డను చంపేశాడు. నిందితుడిని కఠినంగా శిక్షించండి. న్యాయం చేయండి’ అని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
గొంతుకోసి.. ఇంటి ఆవరణలో పూడ్చేసి..
కళ్యాణదుర్గం రూరల్: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన పాపానికి అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తనే ఓ ఇల్లాలు విచక్షణారహితంగా హతమార్చింది. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతుకోసి ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టింది. అప్పుల బాధ తాళలేక తన భర్త ఎటో వెళ్లిపోయాడంటూ చుట్టుపక్కల వారిని నమ్మించింది. అయితే, మూణ్ణెల్ల తర్వాత కూతురితో జరిగిన గొడవలో నిందితురాలే మాట జారడంతో హత్య విషయం అందరికీ తెలిసిపోయింది. ఆపై స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలివీ.. పద్ధతి మార్చుకోమన్నందుకు పాతిపెట్టింది.. కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామానికి చెందిన హనుమంతుకు సుకన్యతో 18 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇంటర్ చదివే కూతురు అమృత, కుమారుడు సందీప్ ఉన్నారు. దంపతులిద్దరూ గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సుకన్య మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని హనుమంతు గమనించాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పిచూశాడు. అయినా ఆమె లెక్కచేయలేదు. ఈ క్రమంలో ముణ్ణెళ్ల క్రితం హనుమంతు మద్యం తాగి ఇంటికొచ్చాడు. తమ మధ్యలోకి వచ్చిన మూడో వ్యక్తి గురించి ప్రశ్నిస్తూ భార్య సుకన్యతో గొడవపడ్డాడు. దీంతో సుకన్య భర్తపై దాడి చేసి గొంతుకోసింది. హనుమంతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో ఆమె ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టింది. అనంతరం.. అప్పుల బాధ తాళలేక తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఇరుగుపొరుగు వారిని నమ్మించింది. తల్లీకూతుళ్ల గొడవతో వెలుగులోకి.. సుకన్య తన కూతురు అమృతతో శుక్రవారం గొడవపడింది. ఆ ఆవేశంలో.. ‘నిన్నూ మీ నాన్నలాగే చంపేస్తా’ అంటూ నోరుజారింది. దీంతో హనుమంతు హత్య విషయం అందరికీ తెలిసిపోయింది. సుకన్య కళ్యాణదుర్గం రూరల్ పోలీస్స్టేషన్లో లొంగిపోయింది. రూరల్ సీఐ గణేశ్ తన బృందంతో ఘటనా స్థలానికి వెళ్లి మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పోలీసులపై బాలుడి హత్య కేసు నిందితుడి దాడి
తాడిపత్రి టౌన్: ఆస్తి కోసం బామ్మర్దిని హత్య చేసిన వ్యక్తిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో పోలీసులపై ఒక్కసారిగా దాడి చేశాడు. ఘటనా స్థలంలో ఉన్న బీరు సీసాతో కానిస్టేబుల్, సీఐపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో నిందితునిపై సీఐ ఆరు రౌండ్లు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం కోనుప్పలపాడులో బుధవారం గోవిందు, లక్ష్మీకాంతమ్మ దంపతుల కుమారుడు వేమచంద్ర (7)ను కిడ్నాప్ చేసి చంపేసిన విషయం తెలిసిందే. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా వేమచంద్ర పెద్ద అక్క భర్త (బావ) సర్వేష్ ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు. హత్య జరిగిన తీరును తెలుసుకునేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ ఎలా హత్య చేశాడో పోలీసులకు వివరిస్తూ ముందుకు వెళ్లిన సర్వేష్... సమీపంలో దొరికిన బీరు బాటిల్తో కానిస్టేబుల్ వెంకటేష్ పై దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీఐ రామసుబ్బయ్యపైనా దాడికి తెగబడ్డాడు. వెంటనే సీఐ గాల్లోకి కాల్పులు జరిపారు. నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, అతని కాళ్లపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం నిందితుడిని, గాయపడిన పోలీసులను తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. సర్వేష్ ను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. తాడిపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్, సీఐలను ఎస్పీ జగదీష్ పరామర్శించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. -
తెల్లారిన బతుకులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు, నెల్లూరు (టౌన్), కలిగిరి : తెల్లవారుజామున 5.30 గంటల సమయం.. బస్సు మార్కాపురం హైవే మీద దూసుకుపోతోంది. యర్రగొండపాలెం వద్ద స్టీరింగ్ మొరాయించడంతో డ్రైవర్ తాత్కాలికంగా మరమ్మతులు చేసి బస్సును నడుపుతున్నాడు. రాయవరం మెడికల్ కాలేజీ, పలకల గనుల మధ్య కొండ మలుపు తిరుగుతోంది. అదే సమయంలో.. చీమకుర్తి నుంచి కంకర లోడు టిప్పర్ ఎదురుగా రావడంతో బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో అప్పటికే మరమ్మతులకు గురైన బస్సు స్టీరింగ్ జామ్ కావడంతో అదుపు తప్పింది.. వేగంగా వచ్చి టిప్పర్ మధ్యలో ఉన్న ఆయిల్ ట్యాంకును ఢీ కొట్టింది. దీంతో వెలువడిన మంటలు క్షణాల్లో బస్సును అంటుకున్నాయి. మరోవైపు బస్సులో ఉన్న బ్యాటరీ పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే అగ్నికీలల్లో ప్రయాణికులు కాలి బూడిదైపోయారు. పలువురు ప్రాణాలను కాపాడుకునేందుకు బస్సు డోరు, కిటికీ అద్దాలను పగులగొట్టి బయటపడేందుకు ప్రయత్నించారు. 13 మంది సజీవ దహనం కాగా చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. బస్సు నుంచి దూకి 28 మంది ప్రాణాలు కాపాడుకున్నారు. మాటలకందని ఈ విషాదం అందరినీ కలిచివేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం శివారులోని పలక గనుల సమీపంలో గురువారం వేకువ జామున ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కళ్లెదుటే కాలిపోతుంటే..తండ్రి ఎదుటే కుమారుడు... భార్య కళ్లెదుటే భర్త, చిన్నారి.. అగ్ని కీలలకు ఆహుతి కావడంతో బాధితులను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు. కళ్లెదుట తమవారు సజీవ దహనమవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో విలవిల్లాడారు. ఘటనా ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. క్షతగాత్రుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.స్టీరింగ్కు తాత్కాలిక మరమ్మతులు చేసి..బస్సు తొలుత ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వద్దకు రాగానే స్టీరింగ్ బేరింగ్ చెడిపోయింది. దాంతో బస్సును సుమారు గంటసేపు అక్కడే ఆపి తాత్కాలిక మరమ్మతులు చేశారు. అనంతరం బస్సు రాయవరం పలకల గనులు దాటి కొండ మలుపు వద్దకు రాగానే చీమకుర్తి నుంచి వస్తున్న కంకర లోడు టిప్పర్ ఎదురొచి్చంది. దాంతో బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో అప్పటికే మరమ్మతులకు గురైన స్టీరింగ్ బిగుసుకుపోయి అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ముందే హెచ్చరించిన ప్రయాణికులు..?బస్సు కండీషన్పై ప్రయాణికులు, డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. బస్సు కండీషన్ సరిగా లేదని డ్రైవర్ అంగీకరించినట్లు కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. అనంతరం కొద్దిసేపటికే మార్కాపురం సమీపంలో ఈ ఘోరం జరిగిపోయింది. జగిత్యాల నుంచి కలిగిరికి..ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల నుంచి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరికి వెళుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో బయలుదేరింది. జగిత్యాల, కోరుట్ల, నిర్మల్, నిజామాబాద్, ఆర్మూరు, భీంగల్, కామారెడ్డి, రామాయంపేట, మేడ్చల్లో ప్రయాణికులు ఎక్కారు.మొత్తం 45 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సులో మాచర్లలో ముగ్గురు ప్రయాణికులు దిగారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. ట్రావెల్స్ బస్సు అరుణాచల్ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయింది. యార్లగడ్డ కోటేశ్వరరావు, తండ్రి గణపతిరావు, కొమరోలు, కృష్ణా జిల్లా అడ్రసు పేరుతో ఉంది. బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలియగానే కలిగిరి పంచాయతీ జిర్రావారిపాళెం తిప్ప వద్ద ఉన్న ట్రావెల్స్ కార్యాలయాన్ని మూసివేశారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు...ఈ ఘోర ప్రమాదంలో ముక్కు పచ్చలారని 5 నెలల చిన్నారి, ఆరేళ్ల బాలిక, ఐదుగురు మహిళలు, మరో ఏడుగురు పురుషులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. తేరుకునే సమయం కూడా లేకపోవడంతో ఊపిరాడక మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. కాగా, బస్సు డ్రైవరు పందెం యువరాజ్ ప్రమాదం జరిగిన వెంటనే పారిపోతూ పొదల్లో స్పృహ తప్పి పడిపోయాడు. ఉదయం 8.30 గంటలకు స్థానికులు గుర్తించారు.అనంతరం అతన్ని అంబులెన్స్లో జీజీహెచ్కు తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. టిప్పర్ యజమాని అశోక్ రెండు నెలల క్రితమే వాహనాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులను తొలుత మార్కాపురం జీజీహెచ్కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 12 మంది క్షతగాత్రులను ఒంగోలు జీజీహెచ్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. పూర్తిగా కాలి, ముద్దలుగా మారి...పోలీసులు, అధికారులు ప్రమాద స్థలానికి చేరుకునే లోపే బస్సు కాలి బూడిద కావడంతో ఇనుప కడ్డీలు మాత్రమే మిగిలాయి. బొగ్గులా మారిన మాంసపు ముద్దలు కనిపించాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద 14 మృతదేహాలను వెలికి తీశారు. గుర్తు పట్టలేని విధంగా మసి బొగ్గులా మారిన మృతదేహాలు కంటనీరు పెట్టించాయి. మృతదేహాలను మార్కాపురం జీజీహెచ్కు తరలించారు. కాగా, బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రివర్గం గురువారం విచారం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. గురువారం ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించారు.స్పందించని డయల్ 100, 108ప్రమాదం జరిగిన వెంటనే డయల్ 100కు అనేక సార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని ఓ యువతి వాపోయింది. 20 సార్లు ఫోన్ చేసిన తరువాత 108 స్పందించినట్లు పేర్కొంది. బాధితులను పరామర్శించేందుకు మార్కాపురం జీజీహెచ్కు వచ్చిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎదుట ఈ విషయాన్ని వెల్లడించి రోదించింది.బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారంమృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియాసాక్షి, న్యూఢిల్లీ: మార్కాపురం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని మోదీ ప్రకటించారు. నా మనసును తీవ్రంగా కలచివేసిందిబస్సు ప్రమాదంపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద గురువారం జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతిచెందడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన మనసును తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దారుణ ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గాయపడినవారికి ప్రత్యేక వైద్య బృందాలతో అత్యుత్తమ వైద్యసేవలు అందించడంతోపాటు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రోడ్డు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయంపార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డిమార్కాపురం: రాయవరం పలకల గనుల వద్ద గురువారం జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ఆ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించిన అనంతరం స్థానిక జీజీహెచ్లో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.‘‘గత ఏడాది అక్టోబరులో కర్నూలులో కూడా ఇలాంటి బస్సు దుర్ఘటనే జరిగింది. మళ్లీ అటువంటి దుర్ఘటన మార్కాపురంలో జరగడం దురదృష్టకరం’’ అని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.మార్కాపురం జీజీహెచ్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన మెడికల్ కాలేజీని ఇక్కడ నిర్మించి ఉంటే నాణ్యమైన వైద్యం అందేదని, ఒంగోలుకు తరలించాల్సిన పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడే మెడికల్ కాలేజీని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నేతలు అన్నా రాంబాబు, దద్దాల నారాయణ యాదవ్ తదితరులు ఉన్నారు.మృతుల వివరాలు1. అంబటి అనిల్ (27) (కొనకనమిట్ల మండలం పెదారికట్ల)2. అంబటి లియో (5 నెలలు) (కొనకనమిట్ల మండలం పెదారికట్ల)3. తమ్మిశెట్టి పిచ్చమ్మ (80) (కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామం)4. తమ్మిశెట్టి రుక్మిణి (26) (కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామం)5. ఉప్పు రమాదేవి (కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి)6. బండారు పద్మ (28) (కనిగిరి)7. దేవేండ్ల రామయ్య (బీసీ కాలనీ, కనిగిరి)8. పొదిలి మహేంద్ర (వెలిగండ్ల మండలం చౌడవరం)9. నర్సింగ్ ప్రభావతి (36) (పొదిలి మండలం ఉన్నగురవయ్యపాలెం)10. నర్సింగ్ చైత్ర (6) (పొదిలి మండలం ఉన్నగురవయ్యపాలెం)11. ముత్తంగి వెంకటేశ్వర్లు(45) (ఉదయగిరి మండలం దాసరిపల్లి, నెల్లూరు జిల్లా)12. కత్తి జయరాములు (బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా)13. ఆత్మకూరు చిన్నా (45) (కలిగిరి మండలం బొమ్మరాజుపల్లి, నెల్లూరు జిల్లా)14. చిలకపాటి వెంకటేష్ (కొండాపూర్ మండలం గొట్టిగుండాల, నెల్లూరు జిల్లా)సొంతూళ్లో వేడుకల కోసం బయలుదేరి.. జగిత్యాలక్రైం/రాయికల్/రుద్రంగి: జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ రమణయ్య, ఆయన వద్ద పనిచేస్తున్న మనోహర్, ప్రభావతి, రాయికల్ మండలం అయోధ్యతోపాటు రామారావుపల్లికి వలస వచి్చన ఉప్పు రమాదేవి, రుద్రంగిలో తాపీమేస్రీగా పనిచేస్తున్న దేవండ్ల రామయ్య, దుబ్బాల రత్తమ్మ, అయోధ్యలో మేస్త్రీ వద్ద పనిచేస్తున్న దుబ్బాల కిరణ్, పునుగోటి వెంకటేశ్ శ్రీరామనవమి సందర్భంగా స్వగ్రామాలకు హరికృష్ణ ట్రావెల్స్లో బుధవారం సాయంత్రం బయల్దేరారు. వీరిలో ప్రభావతి, రమాదేవి, దేవండ్ల రామయ్య మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే చనిపోయారు. కొడుకును కాపాడి.. తల్లి సజీవదహనం మార్కాపురం జిల్లా కనిగిరి మండలం మాడాదివరిపల్లికి చెందిన ఉప్పు మాలాద్రి భార్య రమాదేవి, కొడుకు మనోహర్తో కలిసి ఆరేళ్లుగా రామారావుపల్లిలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల కోసం రమాదేవి కుమారుడితో కలిసి బయల్దేరింది. బస్సులో మంటలు చెలరేగగానే.. రమాదేవి కొడుకును బయటకు తోసేసింది. అప్పటికే మంటలు ఎగిసిపడడంతో రమాదేవి కాలిబూడిదైనట్లు మనోహర్ చెప్పాడు. చిట్టీ డబ్బులు కట్టేందుకు.. : నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం దాసరవెల్లికి చెందిన వెంకటేశ్, కిరణ్ అయోధ్యలో పోలయ్య తాపీమేస్త్రీ వద్ద రెండు నెలలుగా ఉపాధి పొందుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా తాము తీసుకున్న చిట్టీ డబ్బులు చెల్లించేందుకు పోలయ్య భార్య రత్తమ్మతో కలిసి బయల్దేరారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేష్కు భార్య, కుమారుడు, కూతురు సంతానం. రత్తమ్మ, కిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. ⇒ జరగడానికి 10 నిమిషాల ముందు కుమారుడు వేలుతో ఫోన్లో మాట్లాడాడని, తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వచి్చందని కుటుంబసభ్యులు వాపోయారు.మృతుల్లో తండ్రీకొడుకులుకామారెడ్డి క్రైం: మార్కాపురం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన అనిల్ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతను భార్య సౌధ, కుమారుడు లియో (5 నెలలు)తో కలిసి మూడు రోజుల క్రితం కామారెడ్డికి బంధువుల ఇంటికి వచ్చారు. కుమారుడు లియోకు కేశఖండనం చేయించాలని స్వగ్రామానికి వెళ్లాలని భావించారు. వారితోపాటు సమీప బంధువులిద్దరితో కలిసి మార్కాపురంకు బుధవారం రాత్రి కామారెడ్డి నుంచి బయలుదేరారు. బస్సులో మంటలు రేగినప్పుడు అనిల్ తన భార్యను కిటికీలోంచి బయటకు తోసివేసినట్లు తెలిసింది. ఆ క్రమంలో కిందపడిపోయిన కుమారుడిని వెతికి తెచ్చేలోపు మంటలు వ్యాపించడంతో ఇద్దరూ చనిపోయారని బంధువులు తెలిపారు. అనిల్, అతని కుమారుడు మృతి చెందారు.ఇంటికి వెళ్తూ.. లక్ష్మణచాంద: ఏపీ ప్రకాశం జిల్లా రామచంద్రపురం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన బండారు వెంకటరమణయ్య, బండారు పద్మ దంపతులు. నాలుగేళ్ల క్రితం, మణి, వెంకట్రావ్ దంపతులు ఆరేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రానికి వలస వచ్చి తాపీమేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం స్వగ్రామం అంకభూపాలపురం వెళ్లడానికి బండారు పద్మ, మణి, మణి బావ కుమారుడైన రోహాన్ ఆర్మూర్ నుంచి జగిత్యాల వెళ్లి అక్కడి నుంచి ఓ ట్రావెల్ బస్లో బయల్దేరారు. బస్సు కంకర టిప్పర్ను ఢీకొని మంటలు చేలరేగడంతో పద్మ మంటల్లోనే కాలి బూడిదైంది. మణి, రోహాన్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మణి ప్రస్తుతం కోమాలో ఉంది. తిరుగు ప్రయాణంలోసిరికొండ: బస్సులో ప్రయా ణిస్తున్న వారు ఉపాధి నిమిత్తం నెల రోజుల కిందట నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వివిధ గ్రామాలకు వచ్చారు. శ్రీరామనవమి ఉత్సవాల కోసం వారు బుధ వారం రాత్రి వారి స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. మార్కాపురం జిల్లా ఎలగండ్ల మండలం చౌడారం గ్రామానికి చెందిన మహేంద్ర, అబ్రహం, ప్రవీన్.. గడ్కోల్ గ్రామంలో రమణయ్య మేస్త్రీ వద్ద పనులకు వచ్చారు. వీరిలో మహేంద్ర(28) చనిపోయాడు.సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో పలువురు మంది మృతి చెందడం.. పలువురు తీవ్ర గాయాలవడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బస్సు నిర్మల్ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న నేపథ్యంలో ప్రమాదంలో మృతిచెందిన వారు.. గాయపడిన వారి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం సహాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఏపీ సీఎస్తో మాట్లాడారు. పలువురి సంతాపం బస్సు ప్రమాదం అత్యంత బాధాకరమని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు కోరారు. రోడ్డు ప్రమాదంపై కేంద్రమంత్రులు బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు, బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్రెడ్డి ఎమ్మెల్సీ డా.సి.అంజిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ముగ్గురు చిన్నారులకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భువనేశ్వరి అనే ఓ తల్లి తన ముగ్గురు చిన్నారులకు విషం ఇచ్చింది. అనంతరం తాను కూడా విషం తాగి ఆత్యహత్యాయత్నం చేసింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆ మహిళ అత్త అపస్మారక స్థితిలో ఉన్న ఆ నలుగురిని చూసి షాక్కు గురయింది. స్థానికుల సహాయంతో వెంటనే వారిని కడప రిమ్స్ (RIMS) ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి , ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ప్రొద్దుటూరులో తీవ్ర విషాదం నెలకొంది. -
బాలుడి కిడ్నాప్ విషాదాంతం.. బావే హంతకుడు
అనంతపురం: తాడిపత్రి బాలుడి కిడ్నాప్ విషాదాంతమైంది. ఏడేళ్ల బావమరిదిని హేమచంద్రను బావ సర్వేష్ ప్రాణం తీసినట్లు పోలీసులు గుర్తించారు.యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామానికి చెందిన హేమచంద్ర నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో బాలుడిని సర్వేష్ కిడ్నాప్ చేశాడు. అయితే, స్కూల్ నుంచి ఇంటి రావాల్సిన హేమచంద్ర ఎంతకీ ఇంటికి రాకపోవడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ దర్యాప్తులో అనుమానితుల గురించి పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలో బాలుడి అక్క భర్త సర్వేష్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడిని సర్వేష్ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డబ్బు కోసం నిందితుడు సర్వేష్ తన బావమరిదిని హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తుండగా, నిర్జీవంగా పడి ఉన్న హేమచంద్ర మృతదేహం లభ్యమవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
సహకరించకపోతే జీవితం నాశనం చేస్తా..!
గుంటూరు: నరసరావుపేట నియోజకవర్గంలోని మహిళా ఉద్యోగి ఇక్కడ ఇటీవల వరకు పనిచేశారు. ఆమె అంతకు ముందు వేరే మండలంలో పనిచేసిన సమయంలో అక్కడ అధికారి కార్యాలయ ప్రాంగణంలోనే కాకుండా, వాష్రూమ్ వంటి వ్యక్తిగత ప్రదేశాల వద్ద కూడా అనుసరిస్తూ ఆమెను భయభ్రాంతులకు గురిచేసేవిధంగా ప్రవర్తించాడు. అప్పట్లో దీనికి ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, సూపరింటెండెంట్ ఇతర ఉద్యోగులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. ఆ వేధింపుల తీవ్రత కారణంగా ఆ మహిళా ఉద్యోగి పనిచేయలేక సెలవులు పెట్టుకొన్నారు. ఆ మహిళ ప్రయాణించే సమయంలో కూడా ఆమె కారును అడ్డగించి వేధించడం, బెదిరించాడు. గత ఉద్యోగాల వివరాలు తెప్పించి తప్పుడు రిపోర్టులు రాసి సస్పెండ్ అయ్యేలా చేస్తానని, లైంగికంగా సహకరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని, లేకపోతే జీవితం నాశనం చేస్తానంటూ అధికారి బహిరంగంగా బెదిరించాడంటూ తన ఫిర్యాదులో ఆ మహిళా ఉద్యోగి పేర్కొంది. అతని నుంచి తన ప్రాణానికి, తన కుటుంబ భద్రతకు తక్షణ ముప్పు ఉందని, తనకు ఏదైనా అనూహ్య ఘటన జరిగితే, దానికి పూర్తి బాధ్యత సదరు అధికారిదేనని ఆ మహిళ పేర్కొంది. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు ఆ ఉద్యోగిని మరో చోటికి బదిలీ చేశారు. సదరు మహిళా ఉద్యోగి సైతంమరో ప్రదేశంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది సజీవదహనం
సాక్షి, ప్రకాశం: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో కంకర లోడుతో వస్తున్న టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.పోలీసుల వివరాల మేరకు.. తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరికి వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(నెంబర్ -AP39UC5265).. మార్కాపురం రాయవరంలో ప్రమాదానికి గురైంది. పలకల క్వారీల మలుపు వద్ద చీమకుర్తి నుంచి కంకర లోడుతో వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగగా, బస్సు పూర్తిగా దగ్ధం అయింది. ఈ దుర్ఘటనలో ఘటన స్థలంలో 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. బస్సు ప్రమాదం సమయంలో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు క్యాబిన్లో గుర్తు పట్టలేని విధంగా నాలుగు మృతదేహాలు ఉన్నాయి. ప్రమాదం ఉదయం 6-6.30 గంటల మధ్య ఈ ఘోరం జరిగినట్లు సమాచారం. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, ఘటనా స్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మృతిచెందినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టిప్పర్ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సులో మంటలు వ్యాపించాయి. ప్రమాదంతో బస్సు అద్దాలు పగలగొట్టి కొందరు ప్రయాణికులు కిందకి దూకారు. స్లీపర్ బస్సు కావడంతో బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. మృతుల్లో ఎక్కువ మంది స్లీపర్ బెర్తులపై ఉన్నవాళ్లేనని తేలింది. బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా బస్సులోనే మృత దేహాలు : డీఎస్పీబస్సు ప్రమాదంపై మార్కాపురం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) నాగరాజు మీడియాతో మాట్లాడారు. 'ఇంకా బస్సులోనే మృతదేహాలున్నాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. గాయపడ్డవారికి మార్కాపురం ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది’ అని చెప్పారు. ఘటన స్థలిని పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలుబస్సు ప్రమాద ఘటన స్థలిని దర్శి ఎమ్మెల్యే, వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. ట్రావెల్ ఏజెన్సీపై విచారణ జరపాలి. బస్సు ఫిట్నెస్ పైనా సమీక్ష చేయాలి. మార్కాపురంలో మెడికల్ కాలేజీ, పెద్దాసుపత్రి ఉండి ఉంటే క్షతగాత్రులను ఒంగోలు పంపించాల్సి వచ్చేది కాదు. జిల్లా ఏర్పాటు చేసినా ఇక్కడ సరైన వైద్యం లేదని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అన్నారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిహైదరాబాద్: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో పలువురు మంది మృతి చెందడం.. కొందరికి తీవ్ర గాయాలపాలవడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నుంచి నెల్లూరు జిల్లా కనిగిరికి వెళుతున్న నేపథ్యంలో బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారు.. గాయపడిన వారి వివరాలు తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఏపీ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించాలని సీఎం సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం సహాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఏపీ సీఎస్తో మాట్లాడారు. -
గిరిజన బాలిక అనుమానాస్పద మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి చెందిన 17 ఏళ్ల గిరిజన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక తల్లితండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు ఊరూరా వెళ్లి సర్కస్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల కిందట విజయనగరం జిల్లా ఎస్.కోటకు వెళ్లగా అక్కడ వెంకట్రావు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వెంకట్రావు తరచూ బాలిక ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను ఒప్పించి బాలికను విజయనగరం జిల్లా ఎస్.కోట ప్రాంతంలో ఓ కాలేజీలో ఇంటర్లో చేర్పించాడు. ఇటీవల పరీక్షలు పూర్తి కావడంతో బాలిక తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. మరుసటి రోజునే వెంకట్రావు ఫోన్ చేసి బాలికను పంపించాలని కోరగా.. అప్పటికే నీరసంగా ఉండడంతో కొద్ది రోజుల తర్వాత పంపిస్తామని తల్లిదండ్రులు చెప్పారు. వెంకట్రావు ససేమిరా అంటూ ఇంగ్లిష్ నేర్పించేందుకు ప్రైవేట్ పెట్టిస్తానని, ఆదివారం వస్తున్నానని బాలికను అప్పగించాలని చెప్పాడు. ఆ ప్రకారమే వెంకట్రావుకు బాలికను అప్పగించారు. మరుసటి రోజు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంటి పై నుంచి మీ పాప పడిపోయి మృతి చెందిందని చెప్పాడు. మీరు ఎస్.కోట రావా ల్సిన అవసరం లేదని వంగరాడమెట్ట సమీపంలోకి వస్తే అక్కడే ఖననం చేసేద్దామని చెప్పాడు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఎస్.కోట బయలుదేరగా మధ్యలోనే వారిని ఆపి అంత్యక్రియలు జరిపించేందుకు ఒప్పించాడు. ఇంతలో బాలికలో కదలికలు కనిపించడంతో తల్లిదండ్రులు హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా రాగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తుండగా బాలిక మృతి చెందింది.బాలిక శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నాయని, అత్యాచారం తర్వాత హత్య చేసి ఉండవచ్చని అక్కడివారు తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. వెంకట్రావు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ వివేకానంద నేతృత్వంలో విచారణ ప్రారంభించారు. -
ధర్మవరంలో సీఐ భార్య ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం జీఆర్పీ (రైల్వే) సీఐ అశోక్కుమార్ భార్య చాముండేశ్వరి (40) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ధర్మవరం శివరామ్నగర్లో అశోక్కుమార్ దంపతులు నివాసముంటున్నారు. వీరి కుమార్తె వర్షితారాణి అనంతపురంలో డిగ్రీ ఫస్టియర్, కుమారుడు పునీత్రాయ్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. మంగళవారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం దంపతులిద్దరూ నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచిన అశోక్కుమార్ భార్య పక్కన కనిపించకపోవడంతో ఆమెను పిలుస్తూ మరో బెడ్రూమ్లోకి వెళ్లారు. అప్పటికే ఆ గదిలోని ఫ్యాన్కు వేసుకున్న ఉరికి విగత జీవిగా వేలాడుతున్న చాముండేశ్వరిని గమనించి.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. టూ టౌన్ సీఐ రెడ్డప్ప, మృతురాలి కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చాముండేశ్వరి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని మృతురాలి అన్న శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
గమ్యం చేరేలోగా విధి రాసిన మృత్యురాత
కర్నూలు : గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిఇంటికి వెళ్తున్న ద్విచక్రవాహనదారుడికి ప్రమాదం జరిగితే.. అతనికి సాయం చేద్దామని మానవత్వంతో స్పందించిన మరో ఇద్దరిని మృత్యువు వెంటాడింది. ఒకేచోట వెనువెంటనే జరిగిన ప్రమాదాలతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన కర్నూలు నగరంలో బుధవారం జరిగింది. వివరాలు.. కల్లూరు శివప్ప నగర్లోని శాంతినికేతన్ స్కూల్ వెనుక నివాసం ఉండే కుమ్మరి శేఖర్(28) మట్టి పెంకుల పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి తలనొప్పి మాత్రలు తీసుకుని కృష్ణానగర్ వైపు నుంచి బైక్పై ఇంటికి వెళ్తుండగా హంద్రీ బ్రిడ్జిపై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. సమాచారం అందడంతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రఫీ, మరో కానిస్టేబుల్ సందీప్తో పాటు హైవే మొబైల్ సిబ్బంది, రోడ్డు సేఫ్టీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో చెరుకులపాడు గ్రామానికి చెందిన చాకలి అజిత్ కుమార్(26), శరీన్నగర్కు చెందిన బండారు కన్నా(23) బైక్పై వెళ్తున్నారు. ప్రమాదం జరిగిందని తెలిసి పోలీసులకు సహాయ పడుతున్నారు. అదే సమయంలో బెంగళూరు వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న గ్రానైట్ లారీ ముందున్న ట్రావెల్స్ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఘటనా స్థలంలో నిలబడి ఉన్న జనం మీదకు దూసుకెళ్లింది. దీంతో బండారు కన్నా, అజిత్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దిన్ సిబ్బందితో అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ప్రత్యేక అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బండారు కన్నా, చాకలి అజిత్కుమార్ మృతిచెందారు. చాకలి అజిత్ కుమార్ రివైండింగ్ దుకాణంలో పనిచేస్తుండగా, బండారు కన్నా గౌండా పని చేస్తుస్తున్నాడు. మొదటి ప్రమాదంలో మృతిచెందిన కుమ్మరి శేఖర్కు భార్యతోపాటు ఇద్దరు పిల్లలు. మృతుడి తండ్రి మద్దిలేటి ఇచి్చన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి అరగంట వ్యవధిలో జరిగిన రెండు ప్రమాద ఘటనలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మొత్తం 7 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ట్రాఫిక్ విధుల్లో ఉన్న హెడ్కానిస్టేబుల్ రఫీతోపాటు మరో ఇద్దరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వా«దీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం తాగి మితిమీరిన వేగంతో డ్రైవ్ చేయడమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలినట్టు సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు. -
దేశవ్యాప్తంగా బెజవాడ ‘ఉగ్ర’ లింకులు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ)/విజయవాడ లీగల్: బెజవాడ ‘ఉగ్ర’ లింకులు దేశవ్యాప్తంగా విస్తరించినట్టు గుర్తించిన పోలీసులు వారి కోసం వేట మొదలుపెట్టారు. పాకిస్థాన్లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. విజయవాడలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మహమ్మద్ రహ్మతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్, మీర్జా సోహైల్ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు.. తీవ్రవాద భావజాలాన్ని వ్యాపింపచేస్తున్న కేసులో బుధవారం మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు హైదరాబాద్కు చెందిన మహిళ కాగా, మరొకరు బీదర్కు చెందిన యువకుడు ఉన్నారు. ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేయగా.. మరో 8 మంది ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు విజయవాడ పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లారు. ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో నిందితులను గుర్తించామని.. 7 రాష్ట్రాల్లో ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు చేశామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 15 మంది గుర్తింపు తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న బృందంలో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో మొత్తం 15 మంది క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. 13 మందిపై విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం విజయవాడకు చెందిన రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సోహైల్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. వారినుంచి సీజ్ చేసిన సెల్ఫోన్ల ఆధారంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం (సీఐ సెల్) గుర్తించింది. మరో ఇద్దరిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. 7 రాష్ట్రాల్లో ఇటువంటి వారి ఉనికిని ఇప్పటికే గుర్తించి వారిని పట్టుకునే బాధ్యతలను విజయవాడ నగరంలోని వేర్వేరు పోలీస్స్టేషన్ల సీఐలకు అప్పగించారు. మొత్తం 9 బృందాలు ఆయా రాష్ట్రాలకు చేరుకుని నిందితుల నివాసం ఉండే స్థానిక పోలీస్స్టేషన్లకు సమాచారాన్ని అందించారు. అక్కడి పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే హైదరాబాద్ చంచల్గూడ ప్రాంతానికి చెందిన సయిదా బేగం(38)తో పాటు కర్ణాటకలోని బళ్లారికి చెందిన అబ్దుల్ సలాం(38)ని మంగళవారం రాత్రి నగర పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చి బుధవారం చీఫ్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితులిద్దరికీ న్యాయమూర్తి బి.రాధారాణి వచ్చే నెల 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారిని జైలుకు తరలించారు. హ్యాండ్లర్లపైనా గురి బిహార్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకు చెందిన యువకులు తీవ్రవాద భావాల్ని వ్యాప్తి చేస్తున్న గ్రూప్లో సభ్యులుగా ఉన్నట్టు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. దిల్ఖాష్ (బిహార్), లక్కీ అహమ్మద్ (ఢిల్లీ), అస్మానుల్లా ఖాన్ (బిహార్), జిషణ్ (రాజస్థాన్), మీరా ఆసిఫ్ అలీ (పశ్చిమ బెంగాల్), షారుక్ఖాన్ (మహారాష్ట్ర), షేక్ ఫీజర్ రెహమాన్ (మహారాష్ట్ర)లను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు విదే శాల్లో ఉండే అల్ హకీమ్ షుకూర్ (హ్యాండ్లర్), ఇతర హ్యాండ్లర్ల గురించి కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు ఇటీవల రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ప్రార్థనా మందిరాల్లో జరిగే సమావేశాలకు హాజరయ్యారా అనే దిశగా పోలీసులు విచారణ చేప ట్టారు. నిందితులతో సన్నిహితంగా ఉంటున్న వారి వివరాలను గోప్యంగా సేకరించినట్టు తెలు స్తోంది. స్థానికంగా ఉండే యువకులతో మొ హ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మొహ్మద్ డానిష్ మతపరమైన సమావేశాలకు హాజరై అక్కడ యువకులను ఏమైనా ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు చేశారా అనే దిశగా పోలీసులు విచారణ సాగుతోంది. తోడు కోసమై ఉగ్రవాద ముఠా వలలో..సైదా బేగంకు ప్రేమ పేరుతో వల వేసిన ఐసిస్ సానుభూతిపరులు సోషల్ మీడియా ఐడీలు తీసుకుని దుర్వినియోగం సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): హైదరాబాద్లోని చంచల్గూడకు చెందిన వితంతు మహిళ సయీదా బేగం (38) తోడు కోసం పాకులాడుతూ ఉగ్రవాద సానుభూతిపరుల ఉచ్చులో చిక్కింది. ఈమె సోషల్ మీడియా ఐడీలు సంగ్రహించిన ఉత్తరప్రదేశ్, బిహార్ వాసులిద్దరు ఐసిస్తో పాటు అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఏక్యూఐఎస్) భావజాల వ్యాప్తి కోసం వినియోగించారు. ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు మంగళవారం గుట్టురట్టు చేసిన అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ కేసులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చంచల్గూడకు చెందిన సయీదా బేగం భర్త ఇమ్రాన్ఖాన్ నాలుగేళ్ల క్రితం చనిపోయారు. అప్పటినుంచి ఇళ్లల్లో పనిచేస్తూ తన కుమారుడిని (7) పోషించుకుంటోంది. సోషల్ మీడి యాలో యాక్టివ్గా ఉండే సయీదా బేగం తోడుగా ఉండే వ్యక్తి కోసం సామాజికమాధ్యమాల్లో అన్వేషిస్తోంది. దీనిని ఉగ్రవాద సానుభూతిపరులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈమెతో చాటింగ్స్ చేస్తూ, ఆసక్తి ఉన్నట్టు నటిస్తూ తమ లక్ష్యాలను సాధించడానికి యత్నించారు. దీనిలోభాగంగా నిషేధిత ఉగ్రవా ద సంస్థ ఐసిస్ సానుభూతిపరుడు ఉత్తరప్రదేశ్కు చెందిన హరీష్ అలీ, బిహార్కు చెందిన షాద్మన్ దిల్ఖుష్ సయిదాబేగం ఐడీలతో ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. యూపీ ఏటీఎస్ అధికారులు ఈనెల 15న హరీష్ అలీని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే దిల్ఖుష్, సయీదాబేగంను అరెస్టు చేసిన పోలీసులు తొలుత ఈమెను ఐసిస్ సానుభూతిపరురాలిగా అనుమానించారు. అయితే విచారణలో దిల్ఖుష్, సయీదా వెల్లడించిన వివరాల ఆధారంగా అభియోగ పత్రాలు దాఖలు సమయంలో కేసు నుంచి సయీదా పేరు తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం. -
భార్యాభర్తల మృతికి కారణమైన ఒకే స్కూటీ!
పల్నాడు జిల్లా: మండల కేంద్రమైన రెంటచింతల గ్రామ సమీపంలో నున్న మిట్టగుడిపాడు క్రాస్ బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని జెట్టిపాలెం గ్రామానికి చెందిన పల్లెర్ల జ్యోతి(35) గుంటూరులో చదువుతున్న తన కుమారుడు శ్రీనివాసరెడ్డిని రెంటచింతలలో గుంటూరు బస్సు ఎక్కించి అనంతరం స్థానిక బ్యాంక్లో తన ఖాతాకు సంబంధించిన పనిని ముగించుకుని జెట్టిపాలెంకు స్కూటీపై బయలు దేరింది. మిట్టగుడిపాడు క్రాస్ వద్ద బైపాస్ రోడ్డు దాటుతుండగా గురజాల నుంచి మాచర్ల వైపు అతివేగంగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో స్కూటీ సుమారు 60 మీటర్లు దూరం ఎగిరి పడింది. ఈ ప్రమాదంతో తలకు, చేతులకు, కాళ్లకు తీవ్రగాయాలు కాగా పల్లెర్ల జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో డ్రైవర్ ఎం.మల్లిఖార్జునరావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి గురజాల ఇన్చార్జి డీఎస్పీ వెంకట రమణ, ఎస్ఐ సీహెచ్ నాగార్జున వెంటనే చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందో విచారించారు. మృతురాలి తల్లి చేర్రెడ్డి నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పంచనామ నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.భార్యాభర్తల మృతికి కారణమైన ఒకే స్కూటీ! మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పల్లెర్ల జ్యోతి నడిపిన స్కూటీ 5 సం. కిందట ఆమె భర్త పల్లెర్ల రామచంద్రారెడ్డి దివ్యాంగుడు కావడంతో మూడు చక్రాల స్కూటీ మీద పొలం వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో బోల్తాపడి తీవ్రంగా గాయపడ్డాడు. రామ చంద్రారెడ్డి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ స్కూటీకి ఉన్న మూడవ చక్రం తీసివేసి జ్యోతి ద్విచక్ర వాహనంగా వినియోగిస్తుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమాదంలో ఆమె మృతిచెందింది. వేర్వేరు ప్రమాదాలలో తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన రామచంద్రారెడ్డి, జ్యోతిల 14, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు అనాధలుగా మారారు. 2025 మార్చి 1 వ తేదిన జాతీయ అధికారులు, ట్రాన్స్పోర్టు అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ కూడలిని బ్లాక్స్పాట్గా గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏడాది కాలంలో ఇక్కడే పలు రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు వీధులపాలైనట్లు స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని స్థానిక కోరుతున్నారు. -
భర్తను చంపి చెరువులో పడేసిన భార్య..!
గుంటూరు: ఈనెల 19వ తేదీన యనమదల / ఈదులపాలెం గ్రామాల పరిధిలోని ఎన్హెచ్ 16 సమీపానున్న చెరువులో నడుముకు రాయికట్టి గోనెసంచిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహం తాలూకా మిస్టరీ వీడింది. మద్యం మత్తులో ఉన్న భర్తను తాడుతో కట్టేసి, కర్రలతో కొట్టి భార్యే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసులో మృతుడి భార్య, మరో ముగ్గుర్ని ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈనెల 19న మృతుడి నడుంకు రాయిని తాడుతో కట్టి, గోనెసంచిలో పెట్టిఉంచారని అందిన సమాచారం మేరకు.. ప్రత్తిపాడు పీఎస్ సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతన్ని ఎవరైనా హత్య చేసి ఉంటారని, ఆ దిశగా దక్షిణ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ మధుసూదన్రావు పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గుంటూరు దాసరిపాలెం గ్రామంలోని ఓ కుటుంబం ఇంటి సామగ్రి, పశువులతో పరారవుతున్నట్లు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెం ప్లాట్స్లో ఉంటున్న తెనాలి ఐతానగర్ బత్తులవారివీధికి చెందిన ఉప్పుతల్ల లక్ష్మి అలియాస్ తన్నీరు తిరుపతమ్మ, ప్రస్తుతం తెనాలి పెదరావూరులో ఉంటున్న చౌడవరం సీఆర్నగర్కు చెందిన భార్యభర్తలు సిద్ధి అంకమ్మ, సురేష్ పేరేచర్ల లక్ష్మీనరసింహకాలనీ ఐదో వీధికి చెందిన ఓ మైనర్గా గుర్తించారు. చెరువులో మృతదేహం తన్నీరు వెంకటేశ్వర్లు (30)గా గుర్తించి, మృతురాలి భార్య తిరుపతమ్మ, ఆమె సోదరి అంకమ్మ, భర్త సురేష్, సోదరుడు మైనర్ను అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన కరల్రు, ఇనుప పలుగు, పారలు, మోటార్సైకిళ్లు స్వా«దీనం చేసుకున్నారు. హత్య చేశారిలా.. వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై, భార్య తిరుపతమ్మను శారీరక, మానసికంగా వేధించేవాడు. పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేసినా అతనిలో మార్పురాలేదు. ఈనెల 17న వెంకటేశ్వర్లు, తిరుపతమ్మకు మళ్లీ వివాదం నెలకొంది. దీంతో తిరుపతమ్మ ఆతన సోదరి, బావ, మైనర్లకు సమాచారం అందించింది. దీంతో భార్య, ఆ ముగ్గురు కల్సి వెంకటేశ్వర్లను తాడుతో కట్టేసి, కరల్రతో తీవ్రంగా కొట్టగా మృతిచెందాడు. తొలుత భర్త మృతదేహన్ని ఇంట్లో పూడ్చాలని అనుకున్నా, స్థానికులకు అనుమానం వస్తుందని భావించారు. దీంతో మిరపకాయల గోనె సంచిలో మృతదేహం వేసుకుని మోటార్సైకిళ్లపై తీసుకెళ్లి చెరువులో పడవేశారు. అయితే మృతదేహాం పైకి తేలకుండా నడుముకు రాయిని తాడుతో కట్టేసి చెరువులో వేశారని దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసుని చేధించిన సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి, సిబ్బందిని జిల్లాఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు. సమావేశంలో దక్షిణ ఇన్ఛార్జ్ డీఎస్పీ మధుసూదన్రావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
వలపు వల.. విశ్రాంత ఉద్యోగి విలవిల
మార్టూరు: వలపు వలకు ఓ విశ్రాంతి ఉద్యోగి చిక్కాడు. కిలాడీ మాయలో పడి ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ.1.09 కోట్లు పోగొట్టుకున్నాడు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి గ్రామానికి బాధితుడు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా పెదనందిపాడు సమీపంలోని పుసులూరు గ్రామానికి చెందిన పొన్నం వెంకటేశ్వర్లు, ఆయన భార్య ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. వెంకటేశ్వర్లు గతేడాది ఆగస్టులో పదవీవిరమణ చేశారు. కొన్ని నెలల నుంచి మార్టూరు మండలం కోలలపూడి గ్రామంలోని బంధువులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో నెలరోజుల కిందట కందుకూరి మౌనిక పేరుతో ఓ యువతి ఫేస్బుక్ ద్వారా వెంకటేశ్వర్లుతో పరిచయం పెంచుకొంది. తన సమీప బంధువు దాసరి నీరజ్ కుమార్ 15 ఏళ్లుగా ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ బాగా గడించాడని చెబుతూ అతన్ని సైతం వెంకటేశ్వర్లుకు పరిచయం చేసింది. చాటింగ్.. వీడియో కాల్స్తో సన్నిహితంగా.. అంతేకాక మౌనిక, వెంకటేశ్వర్లు వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్స్ సైతం చేసుకుంటూ పరస్పరం సన్నిహితమయ్యారు. ఈ క్రమంలో మౌనిక, నీరజ్ కుమార్ ఆన్లైన్ ట్రేడింగ్లో విశేష అనుభవశాలి అంటూ హర్ష అనే మరో యువకుడిని సైతం వెంకటేశ్వర్లుకు పరిచయం చేశారు. వెంకటేశ్వర్లు తమను నమ్మాడు అని గ్రహించిన మౌనిక బృందం తమ ప్లాన్ అమలు ప్రారంభించారు. వెంకటేశ్వర్లు చేత మొదటిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న రూ.10 వేలు ఆన్ లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టించి రూ.11,900 లాభం చూపించారు. రెండోసారి రూ.50 వేల పెట్టుబడికి రూ.20 వేల లాభాన్ని, మూడో సారి రూ.2 లక్షలు పెట్టించి రూ.40 వేల లాభాలు వచ్చాయని వెంకటేశ్వర్లు ఖాతాలో జమ చేశారు. ఆపై ముగ్గురూ కలిసి వెంకటేశ్వర్లును నమ్మించి అతని బ్యాంకు ఖాతాలో ఉన్న కోటి తొమ్మిది లక్షల రూపాయిలను ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట స్వాహా చేశారు. ఫోన్కు స్పందించకపోవడంతో... తాము అనుకున్న పనిపూర్తయ్యాక నిందితులు ముగ్గురూ బాధితుడు వెంకటేశ్వర్లుకు ఫోన్కు అందుబాటులో లేకపోవడంతో విషయం అర్థమైంది. ఈ మోసం గురించి వెంకటేశ్వర్లు మొదట బయటకు చెప్పుకోలేదు. జీవితకాలం సంపాదించిన సొమ్ము అంతా పోవడంతో తట్టుకోలేక ఆదివారం మార్టూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. -
సినిమా స్టంట్ను తలపించిన స్కార్పియో యాక్సిడెంట్
అన్నమయ్య జిల్లా: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రాయచోటి రింగ్ రోడ్డు పరిధిలోని గాలివీడు–వరిగ మార్గంమధ్యలో స్కార్పియో వాహనం బోల్తాపడి ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. సినిమా చిత్రీకరణను తలదన్నేలా స్కార్పియో వాహనం పల్టీలు కొట్టుకుంటూ రోడ్డుకు పడమటి వైపున ఉన్న రాళ్లకుప్పపై పడింది. వాహనం రాయచోటి పట్టణ టీడీపీ నాయకునికి చెందినది కావడం గమనార్హం. దీంతో గాయపడ్డ వారిని గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించినట్లు తెలిసింది. సంఘటనపై ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలియవచ్చింది.స్కూటర్ను ఢీకొన్న కారుసంబేపల్లె : మండల పరిధిలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై బడ్డారెడ్డిగారిపల్లె సమీపంలో స్కూటర్ను కారు ఢీకొన్న సంఘటన చోటు చేసుకొంది. మండల పరిధిలోని అడవికమ్మపల్లె గ్రామం పాళెంగడ్డ దళితవాడకు చెందిన నాగబాబు సొంత పనులు చూసుకొని సొంత గ్రామానికి వెళ్తుండగా.. అరుణాచలం నుంచి ప్రొద్దుటూరు వెళుతున్న కారు బుడ్డారెడ్డిగారిపల్లె సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని 108 సహాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆటో ఢీకొని..మదనపల్లె అర్బన్ : ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లె పట్టణం అమ్మచెరువుమిట్టకు చెందిన వెంకటరమణ(40), శ్రీనివాసులు(45) కూలీ పనులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో శనివారం సొంత పనులపై ద్విచక్రవాహనంలో పట్టణంలోకి బయలుదేరారు. దారిలో గొల్లపల్లె బైపాస్ రోడ్డులో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
పండుగ వేళ.. తీరని విషాదం
భద్రాచలం అర్బన్/ఉయ్యూరు రూరల్/కుక్కునూరు/మంగళగిరి టౌన్/ఎటపాక: గోదావరి తీరం వెంట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కొల్లుగూడెం దగ్గర గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు ఏపీ వాసులు, ఇద్దరు భద్రాచలం వాసులుగా తేలింది. ముగ్గురి మృతదేహాలు లభించాయి. భద్రాచలం పట్టణానికి చెందిన చారిగుంట్ల శ్రీకర్గుప్తా(21) విజయవాడలోని అమరావతి ఎస్ఆర్ఎమ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం, పొడిచేటి అభిరామ్(21) భద్రాచలంలో వేద విద్య అభ్యసిస్తున్నారు. వీరు ఏపీ, తెలంగాణ సరిహద్దులోని గోదావరి నదిలో గతంలో దిగిన ఫొటోలను తమ స్నేహితులకు చూపించారు. దీంతో ఆ ప్రదేశం బాగుందని మిత్ర బృందం భావించింది. ఈక్రమంలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్నామని చెప్పి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కనుమూరు గ్రామానికి చెందిన దగ్గుబాటి నవదీప్(19), ఉయ్యూరుకు చెందిన గోక తేజజ్ఞసాయి(19), మదనపల్లెకు చెందిన సతీశ్(19)తో పాటు మరో ఇద్దరు స్నేహితులైన సీహెచ్.దీపక్, గడ్డం హర్షవర్ధన్ ఐదుగురు గురువారం ఉదయం భద్రాచలం చేరుకున్నారు. వీరందరూ విజయవాడ సమీపంలోని విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. స్థానికులైన శ్రీకర్, అభిరామ్తో కలిసి మధ్యాహ్నం భద్రాచలం శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. అనంతరం శుక్రవారం ఉదయం సరదాగా ఫొటోలు దిగేందుకు ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉన్న గోదావరి తీరానికి బయలుదేరారు. లోతు ఉన్న ప్రాంతం కావడంతో.. కొల్లుగూడెం దగ్గర గోదావరి నదిలో నీటి పాయ అవతలి ఒడ్డు(కుక్కునూరు) దిశగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నదిలో ఇసుక తిన్నెల్లో సుమారు రెండు కిలోమీటర్లు దూరం నడిచి, నీరు ఉన్న ప్రాంతానికి వారంతా చేరుకున్నారు. వీరు చేరుకున్న ప్రదేశానికి ఎగువన కిన్నెరసాని నది గోదావరిలో కలుస్తుండగా దిగువన కొంత దూరంలో పాములేరు వాగు కలుస్తుంది. దీంతో పెద్ద బండరాళ్లతో కూడిన ఆ ప్రదేశంలో నీరు ఎక్కువగా ఉంది. ఇక్కడ నీటి లోతు ఇరవై అడుగుల పైనే ఉంటుందని అంచనా. ఇది ప్రమాదకర ప్రదేశమని తెలియని విద్యార్థులంతా తమ ఫోన్లు ఒడ్డున ఉంచి నీళ్లలోకి దిగారు.సాయం అందలేదు వారిలో ముందుగా తేజజ్ఞ లోతును అంచనా వేయలేక మునిగిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరుగా శ్రీకర్గుప్తా, అభిరామ్, నవదీప్, సతీశ్ కూడా మునిగారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ హఠాత్పరిణామంతో నీళ్లలో ఉన్న దీపక్ బయటకు వచ్చాడు. నీళ్లలోకి వెళ్లి గల్లంతవుతున్న వారిని కాపాడేందుకు హర్షవర్ధన్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలాగే, భద్రాచలం వైపు ఒడ్డు నుంచి రెండు కిలోమీటర్ల దూరాన ఉండడం, కుక్కునూరు వైపు పూర్తిగా నీరు ఉండడంతో సమీపంలో సాయం చేసే వారెవరూ కనిపించలేదు. కనీసం చేపలు పట్టే వారు కూడా ఆ సమయంలో లేరు. ఉదయం 11గంటలకు గోదావరిలో నీటి పాయ దగ్గరకు చేరుకుంటే కాసేపటికే 11–15 గంటలకు ప్రమాదం జరిగింది. నీళ్లలో మునిగిన స్నేహితులు ఎంతకూ బయటకు రాకపోవడంతో తమ ఫోన్ల ద్వారా 11–30 గంటలకు బయటకు సమాచారం చేరవేశారు.గజ ఈతగాళ్లతో గాలింపుస్నేహితులు ఐదుగురు గల్లంతైన సమాచారాన్ని దీపక్, హర్ష కలిసి శ్రీకర్ గుప్తా తండ్రికి ఫోన్లో చెప్పారు. దీంతో ఆయన భద్రాచలం పోలీసు, అగి్నమాపక శాఖ అధికారులతో పాటు ఎటపాక అధికారులకు కూడా ఫోన్ చేశారు. గజ ఈతగాళ్లతో అక్కడికి చేరుకున్న అధికారులు గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు శ్రీకర్, నవదీప్, అభిరామ్ మృతదేహాలు బయటపడగా.. సతీష్కుమార్, తేజజ్ఞ ఆచూకీ తెలియరాలేదు. ఉయ్యూరు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతి విషాద చాయలు అలుముకున్నాయి.మృతులు, గల్లంతైన వారి వివరాలు 01) చారుగుళ్ల శ్రీకర్ గుప్తా(21), అమరావతి ఎస్ఆర్ఎమ్లో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: చారుగుళ్ల రామకృష్ణ, భద్రాచలం 02) దగ్గుబాటి నవదీప్(19), విజయవాడ కేఎల్యూలో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: ఫణీంద్రనాథ్, కనుమూరు గ్రామం, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 03) పొడిచేటి అభిరామ్(19), వేదవిద్య తండ్రి: వంశీ, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ 04) పాశం సతీష్ కుమార్(19), అమరావతి ఎస్ఆర్ఎమ్లో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: పాశం నారాయణ, మదనపల్లె, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ 05) గోకా తేజజ్ఞ సాయి(19), అమరావతి ఎస్ఆర్ఎంలో బీటెక్ సెకండ్ ఇయర్ స్వస్థలం: ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్స్థానిక అధికారుల తీరుపై తీవ్ర విమర్శ యువకులు నదిలో గల్లంతైన ఘటనలో ఆంధ్ర అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. యువకులు గల్లంతైన విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు, అధికారులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టగా ఆ తరువాత ఘటనా స్థలానికి ఎటపాక, కుక్కునూరు మండల అధికారులు వచ్చారు. ఈ ప్రాంతం తమ పరిధి కాదంటే.. తమ పరిధి కూడా కాదంటూ వాదించుకున్న తీరు స్థానికంగా వివాదాస్పదంగా మారింది. కనీసం మండల సరిహద్దులు తెలియకుండా అధికారులు విధులు నిర్వహిస్తున్నారా ? అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఆదుకోవాల్సింది పోయి తమ ప్రాంతం కాదంటూ తప్పించుకునే వ్యవహార శైలి సరైనది కాదని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ సరిహద్దులు తెలియకుండా పాలనా వ్యవస్థ ఎలా నడిపిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.విద్యార్థుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సాక్షి, అమరావతి: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతై ముగ్గురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విషాదకరమని, ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్థులు ఇలా మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం మృతుల కుటుంబాలకు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా మృతుల కుటుంబాలకు సానుభూతి సాక్షి, అమరావతి: ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
సస్పెన్షన్లో ఉన్న ఏఎస్ఐ అనుమానాస్పద మృతి
పెనమలూరు: విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఏఎస్ఐగా పని చేస్తూ ఇటీవల సస్పెన్షన్కు గురైన వీరవల్లి గోపి వెంకటదుర్గాప్రసాద్ (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...దుర్గాప్రసాద్ (58) పటమట లంకలో భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు స్టేషన్లలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఏఎస్ఐగా పటమట పోలీస్ స్టేషన్లో క్రైం విభాగంలో పని చేస్తున్న సమయంలో ఆయనపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన బుధవారం పెదపులిపాక చిన్నకట్ట రోడ్డులో ఓ గేదెల షెడ్డు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండగా, స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు వర్గాల్లో కలకలం విధుల నుంచి సస్పెన్షన్కు గురైన దుర్గాప్రసాద్ అనుమానాస్పద స్థితిలో మరణించడం పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. ఏఎస్ఐపై ఒత్తిడి పెరగడంతోనే మృతి చెందాడని చర్చించుకుంటున్నారు. ఇటీవల పటమట పంట కాలువ రోడ్డులో అర్ధరాత్రి ఓ షాపు తెరిచి ఉండగా నైట్ రౌండ్స్లో ఉన్న ఏఎస్ఐ షాపు యజమానిని మందలించిన ఘటనపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయని చెబుతున్నారు. కాగా విజయవాడ పటమట లంకలో ఉంటున్న ఏఎస్ఐ పెదపులిపాక కట్ట సమీపంలోని గేదెల షెడ్డు వద్దకు ఎందుకు వచ్చాడన్నది మిస్టరీగా ఉంది. మరోవైపు తన తండ్రి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడని మృతుని కుమారుడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. -
మైకంలో ముంచారు..!
ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను బురిడీ కొట్టించడం తన పేటెంట్ హక్కని చంద్రబాబు మరోసారి నిరూపించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియాకు తలుపులు బార్లా తెరిచారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన లోకేశ్ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. డ్రగ్స్ బ్యాచ్కు వత్తాసు పలుకుతూ ప్రజలను మోసగిస్తున్నారు. మాదక ద్రవ్యాల బానిసలను అరెస్టు చేయాలని ఎన్నికల ముందు వేదికల మీద వీరావేశంతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్.. టీడీపీ కూటమి గంజాయి దందాపై మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోతున్నారు. వెరసి అధికారంలోకి రాగానే చంద్రబాబు తన నిజ స్వరూపం ప్రదర్శించారు. రాష్ట్రాన్ని టీడీపీ డ్రగ్స్ మాఫియాకు అప్పగించేసి తన మార్కు మోసాన్ని పునరావృతం చేశారు. దీంతో మాయల ఫకీరు మాయమాటలు నమ్మి మోసపోయిన బాలనాగమ్మలా తయారైంది రాష్ట్రం పరిస్థితి. టీడీపీ కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలో డ్రగ్స్, గంజాయి రాజధానిగా ముద్ర వేసుకుని జాతీయ స్థాయిలో చెడ్డపేరు తెచ్చుకుంటోంది. -సాక్షి, అమరావతి నాడు ప్రజల్ని మభ్య పెట్టేందుకే విష ప్రచారం..చంద్రబాబు బృందం పన్నాగం తాము అధికారంలోకి వస్తే చాలు డ్రగ్స్, గంజాయిలను అరికడతామన్న చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ మాటలు ఎన్నికల ముందు కోటలు దాటాయి. నాడూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేసేందుకు గంజాయి, డ్రగ్స్ దందా పెరిగిపోయిందంటూ ఊరూవాడా దుష్ప్రచారానికి తెర తీశారు. అందుకు టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా వత్తాసు పలికింది. కారు కూతలు, కాకి లెక్కలతో ప్రజల్ని తప్పుదారి పట్టించాయి. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గంజాయి దందాను ఉక్కుపాదంతో అణచివేసింది. అందుకోసమే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) అనే వ్యవస్థను ప్రత్యేకంగా నెలకొల్పి విస్తృత అధికారాలు కల్పించింది. ‘సెబ్’ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో(ఏవోబీ)లో దశాబ్దాలుగా సాగుతున్న గంజాయి సాగును కూకటి వేళ్లతో పెకిలించి వేసింది. ఆపరేషన్ పరివర్తన్ను రెండు దశల్లో విజయవంతంగా నిర్వహించి 11,500 ఎకరాల్లో గంజాయి సాగును నిర్మూలించింది. దశాబ్దాలుగా గంజాయి సాగును జీవనాధారంగా చేసుకున్న గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. తద్వారా ఏవోబీలో గంజాయి సాగు అన్నదే లేకుండా చేసింది. అయినా సరే.. చంద్రబాబు, లోకేశ్ రాజకీయ దురుద్దేశాలతో నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే చాలు వంద రోజుల్లోనే గంజాయి, డ్రగ్స్ అనేవే లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఈ దుష్ప్రచార కుట్రలో చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ పాలు పంచుకుని మరింత దిగజారుడు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఏకంగా 34 వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారని... ఈమేరకు కేంద్ర నిఘా వర్గాలు తనకు తెలిపాయంటూ దుష్ప్రచారం చేశారు. అందుకు గంజాయి బ్యాచ్లే కారణమని ఆరోపణలు చేశారు. ఇలా చంద్రబాబు ముఠా ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా పక్కా పన్నాగంతో దుష్ప్రచారానికి బరి తెగించింది. నాడు దుష్ప్రచార రాద్ధాంతం.. నేడు డ్రగ్స్ దందాపై మౌనమే సిద్ధాంతంఇదీ పవన్ కళ్యాణ్ తీరు రాష్ట్రంలో 34 వేల మంది బాలికలు కనిపించకుండా పోయారని గతంలో విష ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ తాను ఉప ముఖ్యమంత్రి కాగానే ఆ మాటే ఎత్తడం లేదు. మరి ఆ బాలికలను సురక్షితంగా వారి కుటుంబాల దగ్గరకు చేర్చేందుకు ఏ చర్యలు తీసుకున్నారంటే సమాధానమే చెప్పడం లేదు. ఎందుకంటే.. వైఎస్సార్సీపీ హయాంలో బాలికలు కనిపించకుండా పోయారని తాను చేసింది తప్పుడుప్రచారమేనన్న నిజం ఆయనకు తెలుసు కాబట్టే!నాడు చంద్రబాబు కుట్ర స్క్రిప్ట్ ప్రకారమే అవాస్తవ ఆరోపణలతో పవన్ నటించారన్నది స్పష్టమైంది. ఇక ప్రస్తుతం టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకున్నారని వెల్లడైనా సరే పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. కూటమి ప్రభుత్వంలో ఈ 20 నెలల్లోనే 280 మంది మహిళలపై లైంగిక దాడులు జరిగినా.. వారిలో 15 మందిపై హత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చినా పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు. ఎందుకంటే.. ఈసారి చంద్రబాబు ఆయనకు స్క్రిప్ట్ ఇవ్వలేదు కదా!నేడుడ్రగ్స్ దందాకు రాచబాటమత్తు మందుల రాజధానిగా ఏపీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు తన నిజ స్వరూపం ప్రదర్శించారు. టీడీపీ గంజాయి, డ్రగ్స్ మాఫియాకు తలుపులు బార్లా తెరిచారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అణచివేసిన గంజాయి దందాను మళ్లీ తెరపైకి తెచ్చారు. చంద్రబాబుకు వీరవిధేయులైన టీడీపీ సీనియర్ నేతల కుటుంబాలే రింగ్ మాస్టర్లుగా డ్రగ్స్ దందాకు బరి తెగించారు. ఏవోబీలో గంజాయి సాగును మళ్లీ పట్టాలు ఎక్కించడంతోపాటు.. ఒడిశా, చత్తీస్ఘడ్ నుంచి గంజాయి స్మగ్లింగ్కు ఏపీని గేట్వేగా మార్చేశారు. ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలను తమ గంజాయి దందాకు మార్కెట్గా చేసుకున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు డోర్ డెలివరీ... ఫామ్హౌస్లో రేవ్ పార్టీలంటే చాలు బల్్కగా సరఫరా... విద్యా సంస్థలే లక్ష్యంగా రిటైల్ అమ్మకాలు...! ఇలా వివిధ రీతుల్లో గంజాయి, డ్రగ్స్ మార్కెటింగ్ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇక ద్రవరూప గంజాయి (లిక్విడ్ గంజాయి) మాఫియా అయితే అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. సాధారణ గంజాయి కిలో రూ.12 వేలు ఉంటే... లిక్విడ్ గంజాయి లీటరు రూ.లక్ష ధర పలుకుతుండటమే అందుకు కారణం. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ‘గంజాయి వద్దు బ్రో..’ అనే నినాదాలతో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ టీడీపీ గంజాయి మాఫియా దర్జాగా దందా సాగిస్తున్నా కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఏటా రాష్ట్రం గుండా రూ.600 కోట్ల విలువైన 5 లక్షల కిలోల గంజాయి దందా సాగుతోందని పోలీసు వర్గాలే అంచనా వేస్తున్నాయి. ఇక అప్ఘనిస్తాన్, నేపాల్ నుంచి తెప్పిస్తున్న కొకైన్ లాంటి డ్రగ్స్ దందా మరో రూ.500 కోట్లు ఉంటుందని చెబుతున్నాయి. దాంతోపాటు టీడీపీ మద్యం మాఫియా ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాను ఏకంగా కుటీర పరిశ్రమ తరహాలో ఊరూవాడా నెలకొల్పి దోపిడీకి పాల్పడుతోంది. ఏటా రూ.5 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల దోపిడీయే లక్ష్యంగా దందా సాగిస్తోంది. ‘దమ్మారో... దమ్’ అంటున్న కూటమి నేతలు మరోవైపు టీడీపీ కూటమి నేతలు దమ్మారో దమ్..! అంటూ డ్రగ్స్, గంజాయి మత్తులో జోగుతున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుదీర్రెడ్డి డ్రగ్స్ మత్తులో జోగుతూ ఇటీవల పోలీసులకు చిక్కారు. గతేడాది భీమవరం ఎమ్మెల్యే పి.రామాంజనేయులు కుమారుడు కూడా హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో చిక్కారని జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచురితం కావడం గమనార్హం. తాజాగా ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్లో డ్రగ్స్ సేవించి అడ్డంగా దొరికారు. అయినా సరే కేవలం షోకాజ్ నోటీసుతో చంద్రబాబు సరిపుచ్చారు. తమ అధినేత అండ చూసుకునే ఎంపీ పుట్టా మహేశ్ సోమవారం లోక్సభ సమావేశాలకు దర్జాగా హాజరయ్యారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
రెండో తరగతి బాలికపై వృద్ధుడి అఘాయిత్యం
చింతలపూడి: సభ్య సమాజం తలదించుకునే ఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఆడుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో తరగతి చదువుతున్న ఓ చిన్నారి రెండు రోజుల క్రితం తన ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. అదే గ్రామానికి చెందిన రాముడు (53) ఆ బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడి బారి నుంచి బయటపడిన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతలపూడి పోలీసులు రాముడుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు సీఐ క్రాంతికుమార్ తెలిపారు. -
నట్టింట నలుగురి ప్రాణాలు బలిగొన్న బైక్
పుంగనూరు : ద్విచక్ర వాహనం నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువులు పీల్చి, నిద్రలోనే నలుగురు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరులో కలకలం రేపింది. పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉంటున్న మురళి, రేవతి దంపతులకు కార్తీక్ (15), సుమబిందు (14), చందన (7), చరిత (7) అనే నలుగురు పిల్లలున్నారు. మురళి తండ్రి రామచంద్ర కూడా వీరితో కలిసే ఉంటారు. ఈ క్రమంలో మురళికి చెందిన బజాజ్ సీటీ–100 ద్విచక్ర వాహనం మరమ్మతుకు గురైంది. మెకానిక్ వద్ద ఇంజిన్ బోరు చేయించాడు. మెకానిక్ సూచన మేరకు శనివారం రాత్రంతా బండిని స్టార్ట్ చేసి పెట్టాడు. అయితే బండి ఆన్లో ఉన్నందున ఎవరైనా తీసుకెళ్తారనే భయంతో ఏకంగా ఇంటి హాలులో ఉంచాడు. రాత్రి భోజనం చేశాక మురళి దంపతులు మిద్దెపైన రూములో నిద్రకు ఉపక్రమించారు. సుమబిందు బంధువుల ఇంటికి వెళ్లగా.. కింద ఇంట్లో తండ్రి రామచంద్ర (75), కుమారుడు కార్తీక్, కవల పిల్లలు చరిత, చందన తలుపులు వేసుకుని పడుకున్నారు. రాత్రి వారు ఆ బైక్ నుంచి వెలువడిన విష వాయువు (కార్బన్ మోనాక్సైడ్)ను పీల్చి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.ఉదయం మురళి, రేవతి కిందకు వచ్చి చూస్తే నలుగురూ అచేతనంగా పడి ఉన్నారు. తొలుత ఏం జరిగిందో తెలియక గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి పరిశీలించి, నలుగురు మృతి చెందినట్లు గుర్తించారు. బైక్కు బోర్ చేసిన తర్వాత ఇంజిన్ స్మూత్గా మారే సమయంలో విష వాయువులు వెలువడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో అర్ధరాత్రి విష వాయువు వెలువడి ఉంటుందని, వారు నిద్రలో ఉన్నందున దాన్ని గుర్తించేలోపే అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెంది ఉంటారని వైద్యులు చెబుతున్నారు. సీఐ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మాజీ మంత్రి, సీనియర్ నేత డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి.. మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషాకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి పంపారు. మృతుల కుటుంబాలను పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాతవద్దే పడుకుంటామంటూ తనువు చాలించారు ‘అమ్మా.. నాయనా.. మేము తాత కాడే పడుకుంటాం.. మీరు మిద్దెపైన పడుకోండి..’ అని శనివారం రాత్రి కన్నబిడ్డలు మాట్లాడిన మాటలను తలుచుకుంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. తాత కూలి పనులు చేస్తూ, తండ్రి కులవృత్తి (సెలూన్ షాపు) చేస్తూ సంతోషంగా ఉండేవారు. అందరూ కలిసి మెలసి ఉంటున్న తమలో నలుగురిని తమ సొంత ద్విచక్ర వాహనమే కబళించేస్తుందని మురళి, రేవతి దంపతులు ఊహించలేకపోయారు. వాహనాన్ని ఆన్ చేసి ఇంటి ముందు పెడితే దొంగల బెడదతో పాటు ఇరుగు పొరుగు వారు శబ్దానికి ఇబ్బందులు పడతారని భావించి ఇంటి లోపల హాల్లో ఉంచడమే తన కొంప ముంచిందని మురళి గుండెలవిసేలా విలపించాడు. హాలులో కిటికీ లేకపోవడంతో బైక్ నుంచి వెలువడిన విష వాయువు త్వరగా బయటకు వెళ్లే మార్గం లేకే ఈ దారుణం చోటు చేసుకుందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. యువకుడి బలి
గన్నవరం: ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. వాహన తనిఖీల పేరిట ట్రాఫిక్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురైన స్కూటీపై వెళ్తున్న సోదరుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన ఘటన వెలుగు చూసింది. వివరాలిలా.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన పలగాని శివాజీ కొడుకులు ప్రణయ్(22) కేఎల్యూలో ఇంజినీరింగ్ ఫైనలియర్, కౌషిక్ విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. కౌషిక్ను పెద్దఅవుటపల్లిలో ట్యూషన్లో వదిలేందుకు సోదరుడు ప్రణయ్ స్కూటీపై బయలుదేరారు. మార్గమధ్యలో స్థానిక శ్రీనివాస హేచరీస్ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారనే భయంతో స్కూటీని వెనక్కి తిప్పాడు. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్ వారిని పట్టుకునేందుకు వెంబడించాడు. కంగారులో ప్రణయ్ రాంగ్రూట్లో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణయ్ ఛాతీకి, తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కౌషిక్ కూడా గాయపడ్డాడు. ట్రాఫిక్ పోలీసులు ఆటోలో ప్రణయ్ను పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహమే ప్రణయ్ మృతికి కారణమంటూ పలువురు ఆరోపించారు.బాధిత కుటుంబానికి వంశీ పరామర్శ..రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన వైఎస్సార్సీపీ కేసరపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు పలగాని శివాజీని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆదివారం పరామర్శించారు. తొలుత ప్రణయ్ భౌతికకాయానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రణయ్ అంతిమయాత్రలో వంశీమోహన్తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
‘పచ్చ’ మత్తు.. జనం చిత్తు
సాక్షి, అమరావతి: ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుని దొరికి పోవడంతో ఆ పార్టీ పరువు బజారున పడింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేరాఫ్గా మారిందని ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్, గంజాయి మాఫియా చెలరేగిపోతోందని, పచ్చ పార్టీ నేతలు మత్తుకు బ్రాండ్ అంబాసిడర్గా మారారని నెటిజన్లు సోషల్ మీడియాలో కడిగి పారేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడి బాగోతాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు అండ్ కో కానీ, ఎల్లో మీడియా కానీ నోరు మెదపడం లేదని ఎత్తి చూపుతున్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దందా బయటపడినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పార్టీని పోలీసులు ఛేదించినా టీడీపీ కూటమి పెద్దలే చిక్కుతున్నారు. టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులే డ్రగ్స్ మత్తులో జోగుతూ దొరుకుతున్నారు. ఎందుకంటే డ్రగ్స్ దందా సాగిస్తున్నదే టీడీపీ పెద్దలు కావడంతో.. హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో డ్రగ్స్ పార్టీల్లో వాళ్లే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రజా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు ఉంటే చాలు.. డ్రగ్స్ దర్జాగా ఫాం హౌస్లకు నడచి వస్తాయన్నది బహిరంగ రహస్యంగా మారింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కడంతో ఆ విషయం మరోసారి నిరూపితమైంది. టీడీపీ కూటమి పెద్దల కనుసన్నల్లో సాగుతున్న డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం మాఫియా రాష్ట్రాన్ని కొల్లగొడుతోంది. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా యావత్ దేశంలో బరితెగించి దందా సాగిస్తోంది. డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడతామని 2024 ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తుండటంతో పోలీసు శాఖ చోద్యం చూస్తూండిపోవాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థీకృతమైన డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యం మాఫియా రాష్ట్రాన్ని అమాంతం కబళించేస్తోంది. డ్రగ్స్: డోర్ డెలివరీ ⇒ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. ఏకంగా కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసే డ్రగ్స్ దందా రాష్ట్రంలో వేళ్లూనుకుంటోంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ దందాకు రాష్ట్రం అడ్డాగా మారిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డ్రగ్ డీలర్లు తమ దందాకు ఆంధ్రప్రదేశ్నే ప్రధాన మార్కెట్గా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ⇒ కొన్ని నెలల క్రితం ఢిల్లీ నుంచి నూజివీడు మీదుగా విజయవాడకు తరలిస్తున్న ఎండీఎంఏ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్రంలో డ్రగ్స్ దందా తీవ్రతకు ఓ నిదర్శనం మాత్రమే. ఆ ఉదంతం రాష్ట్రంలో డ్రగ్స్ దందాలో కేవలం గొరంతేనని.. వాస్తవానికి రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ దందా కొండంత ఉందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. దేశంలో ప్రధాన నగరాలే కేంద్రంగా విస్తరించిన డ్రగ్స్ మాఫియా, రాష్ట్రంలో మాత్రం ఊరూరా విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, అమృత్సర్ తదితర నగరాల్లోని డ్రగ్స్ మాఫియా ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న డ్రగ్స్ను మార్కెట్ చేయడానికి ఏపీనే గమ్యస్థానంగా ఎంచుకుంది. ⇒ వివిధ రూపాల్లోని ఎండీఎంఏ డ్రగ్స్ను రాష్ట్రంలోకి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అందుకోసం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ వంటి ప్రధాన నగరాలతోపాటు హిందూపూర్, నంద్యాల, నూజివీడు, ఏలూరు, జగ్గయ్యపేట, భీమవరం, రాజమహేంద్రవరం, విజయనగరం వంటి దాదాపు 50 పట్టణాల్లో కూడా డ్రగ్స్ మాఫియా ఏజెంట్ల వ్యవస్థను నెలకొల్పింది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం కొరియర్ సర్వీసులను వాడుకుంటున్నాయి. ⇒ ఏజెంట్లు అందుకున్న డ్రగ్స్ను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి డ్రగ్స్ వెండర్స్ (విక్రేతలు)కు అందిస్తున్నారు. ఆ వెండర్స్ వాటిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు. డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని విద్యా సంస్థలనే తమ దందాకు కేంద్రంగా చేసుకుంది. ఏజెంట్ల ద్వారా డ్రగ్స్ పొందిన వెండర్స్ విద్యా సంస్థల ప్రాంగణాలకు సమీపంలోనే వాటిని విక్రయిస్తున్నారు. అందుకోసం ఉన్నత విద్యా సంస్థల సమీపంలోనే బడ్డీ కొట్టులు, స్ట్రీట్ వెండర్స్ రూపంలో డ్రగ్స్ విక్రయాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. సిగరెట్లు, చాక్లెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో విక్రయిస్తున్నారు. విజయవాడలోని ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాల సమీపంలో విక్రయించేందుకే ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసు ద్వారా నూజివీడు మీదుగా డ్రగ్స్ తరలించడమే అందుకు తాజా నిదర్శనం. కేసుల నమోదు గోరంత.. స్మగ్లింగ్ కొండంత ⇒ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి దందా యథేచ్ఛగా సాగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. నామ మాత్రంగా కేసులు నమోదు చేస్తూ కనికట్టు చేసేందుకు యత్నిస్తున్నారు. రాష్ట్రంలో సాగుతున్న డ్రగ్స్ దందాతో పోలిస్తే నమోదు చేస్తున్న కేసులు 10% మాత్రమేనని పోలీసు వర్గాలే చెబుతుండటం గమనార్హం. ⇒ 2024లో రాష్ట్రంలో 1,600 ఎన్డీపీఎస్ (నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్) కేసులు నమోదయ్యాయి. 2025లో 1,836 కేసులు నమోదు చేసి 46,011 కేజీల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. వాస్తవానికి రాష్ట్రం మీదుగా సాగుతున్న డ్రగ్స్ దందా.. ఇందుకు పదుల రెట్లు అధికంగా ఉంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మత్తుకు బ్రాండ్ అంబాసిడర్లు పచ్చ బాబులే డ్రగ్స్, గంజాయి దందా సాగించడమే కాదు.. టీడీపీ కూటమి కీలక నేతల కుటుంబ సభ్యులు డ్రగ్స్ మత్తులో మజా చేస్తూ హల్చల్ చేస్తున్నారు. తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకొని అడ్డంగా దొరికారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుదీర్ రెడ్డి డ్రగ్స్ మత్తులో జోగుతూ పోలీసులకు చిక్కారు. గత ఏడాది భీమవరం ఎమ్మెల్యే పి.రామాంజనేయులు కుమారుడు కూడా హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో చిక్కారని జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచురితం కావడం గమనార్హం.చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం⇒ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ను రెండు దశల్లో సమర్థవంతంగా అమలు చేసింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)ను ఏర్పాటు చేసి పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ⇒ రాష్ట్రంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో దశాబ్దాలుగా సాగిస్తున్న గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించింది. ఏకంగా 11,500 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. అందుకోసం రూ.500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని అమలు చేసింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థవంతంగా కట్టడి చేసింది. సెబ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి విస్లృతంగా తనిఖీలు చేసి అక్రమ రవాణాను అడ్డుకుంది. ⇒ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ డ్రగ్స్పై పట్టు వదిలేసింది. కక్షపూరితంగా సెబ్ను రద్దు చేసింది. కొత్తగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ ఆ వ్యవస్థకు ఎలాంటి మౌలిక వసతులు సమకూర్చలేదు. విస్తృత అధికారాలు కల్పించలేదు. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా డ్రగ్స్ దందాకు టీడీపీ సీనియర్ నేత కుటుంబం అండదండలు ఉండటంతో ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఉదాసీనంగా ఉంటోందన్న విషయం స్పష్టమైంది. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం కావడంతో పోలీసు శాఖ చోద్యం చూస్తోంది.కబళిస్తున్న నకిలీ మద్యం ⇒ ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల దందానే లక్ష్యం ⇒ డ్రగ్స్ దందాతోపాటు టీడీపీ కూటమి పెద్దలు రాష్ట్రంలో నకిలీ, కల్తీ మద్యం రాకెట్ను వ్యవస్థీకృతం చేశారు. ఏకంగా కుటీర పరిశ్రమ స్థాయిలో ఊరూవాడా యూనిట్లను ఏర్పాటు చేసి నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారు. తొలి ఏడాదే రూ.5 వేల కోట్ల మేర మద్యం దందాకు పాల్పడ్డారు. ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పచ్చ మాఫియా చెలరేగిపోతోంది. ⇒ అన్నమయ్య, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఎన్టీఆర్, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాల్లో బయటపడిన నకిలీ మద్యం తయారీ యూనిట్ల నిర్వాహకులు టీడీపీ నేతలే కావడంతో పచ్చ ముఠా బండారం బట్టబయలైంది. ఆ కేసుల్లో పాత్రధారులైన టీడీపీ చోటా నేతలను మాత్రమే ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కానీ నకిలీ మద్యం రాకెట్ సూత్రధారులైన టీడీపీ పెద్దలపై ఈగ వాలనివ్వ లేదు. ⇒ టీడీపీ కీలక నేతలే ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు కాబట్టి.. రాష్ట్రంలో నకిలీ/కల్తీ మద్యం రాకెట్ దందాను టీడీపీ మద్యం సిండికేట్ వ్యవస్థీకృతం చేసింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీల ద్వారా ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను అక్రమంగా కొనుగోలు చేస్తోంది. ⇒ రాష్ట్రంలో ఉన్న 20 మద్యం డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల ఆ«దీనంలోనే ఉండటం సిండికేట్ దందాకు కలసివస్తోంది. అలా సేకరించిన స్పిరిట్ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నారు. ఆ విధంగా భారీగా కొనుగోలు చేసిన స్పిరిట్తో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దాన్ని టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న 4,346 మద్యం దుకాణాలు, దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలు, 540 బార్ల ద్వారా దర్జాగా విక్రయిస్తున్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్ మద్యంగా నమ్మబలుకుతూ కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. -
అప్పుల భారంతో అన్నదాతల బలవన్మరణం
ఎమ్మిగనూరురూరల్/గుంతకల్లు రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తోంది. సకాలంలో పంట రుణాలు అందించక.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మరో వైపు రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో అప్పులు తీర్చే మార్గం లేక .. అవమానాలు భరించలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తిమ్మాపురంలో..: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురం గ్రామానికి చెందిన బీజీ అశోక్(28) నాలుగు ఎకరాల్లో పత్తి, మిరప, ఉల్లి సాగు చేశాడు. పంటలు, ఇంటి ఖర్చుల కోసం రూ. 9.50 లక్షల వరకు అప్పు చేశాడు. పంటలు సరిగ్గా పండకపోవడంతో నష్టం వచ్చింది. అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆదివారం సాయంత్రం అశోక్ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అతడికి భార్య రాధ, ఉషశ్రీ(3), సాన్విక(01) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు చెప్పారు. గుంతకల్లులో..: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం సంతోష్ నగర్లో ఉంటున్న కురుబ రామిరెడ్డి(53) వ్యవసాయం కలిసి రాక.. అప్పులు తీసుకున్న వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు...కర్నూలు జిల్లా హాలహర్నికి చెందిన కురుబ రామిరెడ్డి వ్యవసాయం కోసం దాదాపు రూ.10 లక్షల మేర అప్పు చేశారు. తీర్చే మార్గం కానరాక ఐదేళ్ల కిందట గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్కు చేరుకున్నాడు. భార్య సుజాత, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులోళ్ల నుంచి వేధింపులు పెరిగిపోవడంతో దిక్కుతోచని రామిరెడ్డి ఈ నెల 12న అర్ధరాత్రి పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రిలో చేరి్పంచగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. కసాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


