breaking news
-
పట్టపగలే విద్యార్థిని కిడ్నాప్
చాగలమర్రి: కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థినిని గుర్తు తెలియని దుండగులు పట్టపగలే కిడ్నాప్ చేశారు. ఈ ఘటన గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో చోటు చేసుకుంది. వివరాలు.. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం కానగూడూరుకు చెందిన మంత్రాల గౌస్, మస్తాన్బీల కుమార్తె షాజిదా స్థానిక డిగ్రీ కాలేజీలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. రోజూ కానగూడూరు నుంచి చాగలమర్రిలోని కాలేజీకి బస్సులో వచ్చి వెళ్తుంటుంది. షాజిదా తనకు అనారోగ్యంగా ఉందని.. ఇంటికి వెళ్లడానికి అనుమతివ్వాలని గురువారం ఉదయం 11.30 సమయంలో ప్రిన్సిపాల్ను కోరింది. ఆమె తండ్రితో ఫోన్లో మాట్లాడిన అనంతరం ప్రిన్సిపాల్ ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. కాలేజీ గేటు దాటి బయటికి వచ్చిన షాజిదాను.. అక్కడే కాపు కాచి ఉన్న దుండగులు బలవంతంగా కారులోకి లాగేసి.. ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తండ్రికి షాజిదా ఫోన్ చేసి.. కిడ్నాప్ విషయాన్ని చెప్పింది. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ సురేశ్, ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళిధర్రెడ్డి చాగలమర్రికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే విద్యార్థినిని కిడ్నాప్ చేయడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు. -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటుచేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. మృతుల్లో చిన్నారి సైతం ఉన్నట్టు తెలిసింది. అయితే, ఇసుక టిప్పర్ లారీ.. రాంగ్ రూట్ వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. కారును టిప్పర్ ఢీకొట్టిన తర్వాత.. వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
దమ్ మారో దమ్..
ప్రొద్దుటూరు క్రైం: ‘రేయ్ రాజు ఎక్కడున్నావ్ రా.. నా దగ్గర ‘స్కోర్’ అయిపోయింది. నిన్ననే నువు తీసుకున్నావ్ అంట కదా.. అర్జంట్గా స్కోర్ తీసుకొని సెక్షన్కు రా.. అక్కడికి నేను వస్తున్నాను’ ఇటీవల గంజాయి కేసుల్లో పట్టుబడిన విద్యార్థుల సెల్ఫోన్లను పోలీసులు పరిశీలించగా ఇలాంటి సంభాషణలు కనిపించాయి. వాటిని చూసి పోలీసులు సైతం నివ్వెర పోయారు. గంజాయి అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఎప్పటి నుంచే అందుబాటులో ఉంది. అయితే నాడు వృద్ధులు, భిక్షాటన చేసే వాళ్లు సేవించేవాళ్లు. అప్పట్లో దీన్ని వ్యాపార దృక్పథంతో కాకుండా వ్యసన పరులు గంజాయి మొక్కలను ఇంటి పెరట్లో పెంచేవారు. అయితే ప్రస్తుతం గంజాయి రూ. లక్షలు కురిపించే వ్యాపారంగా మారింది. వైఎస్సార్ కడప జిల్లా్లలో వ్యాపార కేంద్రంగా పేరు గాంచిన ప్రొద్దుటూరులో గంజాయి వ్యాపారం రోజు రోజుకు విస్తరిస్తోంది. అన్ని వ్యాపారాల మాదిరే ఇప్పుడు గంజాయి వ్యాపారం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులే లక్ష్యంగా వ్యాపారం ప్రొద్దుటూరులో కొన్నేళ్ల క్రితం వరకు గంజాయి ఊసేలేదు. ప్రతి శనివారం ఇతర ప్రాంతాల నుంచి భిక్షాటన నిమిత్తం ఇక్కడికి వచ్చే కొందరు వ్యక్తుల వద్ద మాత్రమే దొరికేది. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయిని ఆదాయ వనరుగా మార్చారు. కొందరు వ్యక్తులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి వ్యాపారం చేస్తున్నారు. అరకు నుంచి ప్రొద్దుటూరుకు రైళ్లలో తెస్తున్నారు. అక్కడ 1 కిలో రూ. 5000లకు తీసుకొచ్చి ప్రొద్దుటూరులో రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. కిలోల లెక్కన కొనుగోలు చేసిన వ్యక్తులు పొట్లాల రూపంలో స్థానికంగా ఉన్న విద్యార్థులకు అమ్ముతున్నారు. ఒక్కో పొట్లం రూ.200, రూ.300 రూ.500లకు విక్రయిస్తున్నారు. గ్రూప్ ప్యాక్ అయితే (విద్యార్థులు పెట్టుకున్న పేరు) రూ. 1000కి విక్రయిస్తారు. ఒక్క పొట్లం గంజాయిని 5–6 మంది కలిసి సేవిస్తారు. గ్రూప్ ప్యాక్ అయితే 10 మందికి పైగా కలిసి ఉపయోగిస్తారు. ఇక్కడి నుంచి జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కడప, గండికోట ప్రాంతాలకు కూడా గంజాయిని పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అరకొర దాడులతో కట్టడి సాధ్యమా పట్టణంలో పెద్ద ఎత్తున గంజాయి వ్యాపారం సాగుతోంది. విద్యార్థులు సైతం దీని బారిన పడటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే పోలీసుల అరకొర దాడులు, నిఘా లోపం కారణంగా గంజాయి కట్టడి కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ప్రొద్దుటూరు పోలీసులు 10 గంజాయి కేసులు నమోదు చేసి 35 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12కిలోలుపైగా గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. అలాగే ప్రొద్దుటూరు ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే 7 కేసులు నమోదు చేసి 20 మందిని అరెస్ట్ చేశారు. 13 కిలోలుపైగా గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. గంజాయి సేవించే వారికి క్యాన్సర్ ముప్పు గంజాయి ప్రభావం శరీరంలోని అన్ని భాగాలపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గంజాయి నుంచి విడుదలయ్యే టెట్రాహైడ్రోకానాబినాల్ రసాయనం మనిషి జుట్టులో 90 రోజులు, మూత్రంలో 30 రోజులు, లాలాజలంలో 24 గంటలు, రక్తంలో 12 గంటల పాటు ఉంటుంది. అయితే ఆయా వ్యక్తులు ఎన్ని సార్లు గంజాయిని తీసుకుంటారనే దానిపై ఇది అ«ధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీనిలోని టీహెచ్సీ రసాయనం శరీరంలోని అనేక కణజాలాలు, అవయవాలకు చేరుతుంది. టీహెచ్సీ మత్తును పెంచుతుందని, గంజాయిని పీల్చుకున్న వెంటనే ఇది రక్తంతో పాటు మెదడుకు చేరకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మెదడులోని న్యూరాన్లు అదుపు తప్పుతాయని అంటున్నారు. తద్వారా నిరాశ, మానసిక సమస్య వస్తుంది. గంజాయి సేవించే వారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. గంజాయి సేవించే విధానంలో కొత్త పంథా.. సాధారణంగా గంజాయి పొగను పీల్చుకొని ఆనందం పొందుతుంటారు. అయితే ప్రొద్దుటూరులోని యువకులు కొత్తదనంతో గంజాయిని ఆస్వాదిస్తున్నారు. గంజాయి ఎండు మొక్కలను నీళ్లలో ఉడకబెట్టి వాటి ద్రావణాన్ని తాగుతూ మత్తులోకి వెళ్తున్నారు. కొందరు విద్యార్థులు గంజాయి పొగను పీల్చడానికి పఫ్ స్మార్ట్ మెటల్ బాంగ్ షూటర్ పైప్ను ఉపయోగిస్తున్నారు. వీటిని ఆన్లైన్లో తెప్పించుకొని మరీ వాడుతున్నారు. ఇంకొందరు యువకులైతే ఓసీబీ పేపర్లో గంజాయి చుట్టుకొని సేవిస్తున్నారు. ఓసీబీ పేపర్లు కూడా స్థానికంగా ఉన్న కొన్ని దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఇక యువకులు అధిక శాతం సిగరేట్లలో గంజాయి నింపుకొని తాగుతున్నారు. గంజాయినే ఎందుకు వాడుతున్నారంటే.. ‘మార్కెట్లో లభించే అనేక రకాల మద్యం మత్తును కలిగిస్తుంది కదా.. అవన్నీ అందుబాటులో ఉండగా గంజాయికి ఎందుకు అలవాటు పడ్డారు..’ అని గంజాయి కేసులో పట్టుబడిన యువకులను పోలీసులు ప్రశ్నించారు. అందుకు వారు చెప్పిన సమాధానం ఏంటంటే.. ‘ మద్యం తాగితే మహా అంటే రెండు, మూడు గంటలు మత్తులో ఉంటాం. అదీ గాక మద్యానికి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. కానీ గంజాయి పొగను ఒక సారి పీల్చితే రెండు, మూడు రోజుల పాటు అదే మత్తులో ఉంటాం.పైగా తక్కువ ఖర్చుతో ఇది లభిస్తుంది. అందుకే దీనికి అలవాటు పడ్డాం..’అని యువకులు బదులిచ్చారు. కాగా ప్రొద్దుటూరులోని బొల్లవరం బైపాస్రోడ్డు, రామేశ్వరం ప్రభుత్వ పక్కా గృహాల సముదాయ ప్రాంతం, మోడంపల్లె బైపాస్ రోడ్డు తదతర ప్రాంతాల్లో యువకులంతా పోగై గంజాయిని సేవిస్తున్నారు. పట్టణంలోని రామేశ్వరం, జిన్నారోడ్డు, మోడంపల్లె, దస్తగిరిపేట, శ్రీనివాసనగర్, అమృతానగర్ తదితర ప్రాంతాల్లో గంజాయి సేవించే యువకులు అధికంగా ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసు వర్గాల సమాచారం. ప్రత్యేక కోడ్ లాంగ్వేజ్..ప్రొద్దుటూరులో ఇంజినీరింగ్ కాలేజీలతో పాటు ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇటీవల ఎక్సైజ్, పోలీసు అధికారులు దాడులు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న పలువురిని అరెస్ట్ చేశా రు. ఇలా అరెస్ట్ అయిన నాలుగైదు కేసుల్లోనూ ఇంటర్, డిగ్రీ, బిటెక్ చదువుతున్న విద్యార్థులే ఉన్నారు. పోలీసుల విచారణలో అనేక విష యా లు వెలుగు చూశాయి. విద్యార్థులు ప్రత్యేక కోడ్ లాంగ్వేజ్తో ఇన్స్ట్రాగ్రాంలో చాటింగ్ చేస్తున్నారు. గంజాయికి వీరు పెట్టుకున్న పేరు ‘స్కోర్’. వీరంతా కలుసుకునే ప్రాంతాన్ని ‘సెక్షన్’ గా పిలుచుకుంటారు. మొబైల్లోని వారి ఇన్స్ట్రా గ్రాంలను ఎవరైనా చెక్ చేసినా గుర్తు పట్టకుండా ఉండేందుకు ఈ కోడ్ లాంగ్వేజ్ను ఎంచుకున్నారు. గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టాంగంజాయి అమ్మకాలపై నిఘా పెట్టాం. మాకు సమాచారం వచ్చిన వెంటనే ఆకస్మిక దాడులు చేస్తున్నాం. ఇటీవల పట్టుబడిన వారిలో విద్యార్థులే అధికంగా ఉన్నారు. తల్లిదండ్రులు దృష్టి సారించపోతే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. గంజాయికి బానిస అవుతున్న వారు కొత్త పద్ధతుల్లో మత్తును ఆస్వాదిస్తున్నారు. ఎక్కడైనా గంజాయి విక్రయిస్తుంటే మాకు సమాచారం అందించండి. – సురేంద్రారెడ్డి, ప్రొద్దుటూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ -
అడవిలో మృత్యు ఘోష
పాకాల: ఆ అడవిలో ఏం జరిగింది..? పదిహేను రోజుల క్రితం చనిపోయినట్టుగా కనిపిస్తున్న ఆ మృతదేహాలు ఎవరివి..? ఆ అడవిలోకి ఎందుకెళ్లారు.? ఆత్మహత్య చేసుకునేందుకా ? లేక ఎవరైనా వారిని కిడ్నాప్ చేసి అక్కడకు తీసుకొచ్చి చంపేశారా..? అసలు ఏం జరిగింది..? గుర్తు పట్టలేని విధంగా కనిపిస్తున్న ఆ మృత దేహాలు ఎవరివి..? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. తిరుపతిజిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండల పరిధిలోని గాదంకి టోల్ ప్లాజా వద్ద ఉన్న స్టార్ హోటల్ వెనుక భాగంలోని అటవీ ప్రాంతంలో నాలుగు మృత దేహాలను ఆదివారం స్థానికులు గుర్తించారు. ఒక ఆడ, ఒక మగ మృత దేహాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. మరో రెండు గుంతలు తీసి ఏదో పూడ్చినట్టుగా దానిపై రాళ్లు పెట్టడాన్ని గుర్తించారు. బహుశా ఇద్దరు పిల్లలనూ చంపి ఆ గుంతల్లో పూడ్చినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ కుటుంబం ఎక్కడిది..? ఎందుకు అక్కడకు వచ్చింది ? ఆత్మహత్య చేసుకున్నారా ? హత్యకు గురయ్యారా..? అన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. చీకటిపడటంతో పోలీసులు పూడ్చిన మృతదేహాలను వెలికితీయలేకపోయారు. జాతీయ రహదారికి ఆనుకుని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో మృతదేహాలు బయటపడడం పోలీసుల్లో కలవరం రేపింది. మృత దేహాలు కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో ముందుగా మృతి చెందిన వారు ఎవరు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉలిక్కిపడిన పరిసర గ్రామాల ప్రజలు అడవిలో ఒక చెట్టుకు మగ వ్యక్తి మృత దేహం వేలాడుతుండగా, ఆ చెట్టు కిందనే మహిళ మృత దేహం పడుంది. ఆ మృత దేహాలకు సమీపంలోనే రెండు గొయ్యిలు కనిపిస్తుండడం, ఆ గొయ్యిలపై రాళ్లు పెట్టి ఉండటంతో అందులో కూడా మృతదేహాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అడవిలో మృత దేహాలు బయటపడడంతో ఉలిక్కిపడ్డ పరిసర గ్రామాల ప్రజలు ఘటనా స్థలికి చేరుకుని అయ్యోపాపం..! అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణ సాగుతోంది ఇలా.. అడవిలో మృత దేహాలు ఎవరివన్న కోణంలో పోలీసులు ముందుగా దర్యాప్తు ప్రారంభించారు. గాదంకి టోల్ప్లాజా వద్ద అనుమానంగా తిరుగుతున్న వారి చిత్రాలు, అటవీ ప్రాంతంలోకి వెళ్లే దారులకు ఆనుకుని ఉన్న హోటళ్ల వద్దనున్న సీసీ పుటేజీలు, అడవిలో దొరికిన మృత దేహాల వద్ద కనిపించే దుస్తుల రంగులను ఆధారంగా చేసుకుని పరిశీలన చేస్తున్నారు. ముందుగా మృత దేహాలను గుర్తిస్తే ఆ తరువాత మరణానికి గల కారణాలను తెలుసుకోవచ్చన్న కోణంలో పాకాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు తమిళనాడువాసులు!ఘటనా స్థలంలో పోలీసులకు ఒక నోకియా ఫోన్, కళై సెల్వన్ పేరుమీద ఉన్న తంజావూరు క్రిస్ ఆసుపత్రి ప్రి్రస్కిప్షన్ లభించింది. దీంతో మరణించినవారు తమిళనాడుకు చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. -
మా కుమారుడిది ముమ్మాటికీ హత్యే.!
దేవరాపల్లి: తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికే హత్యేనని దేవరాపల్లి మండలం కాశీపురానికి చెందిన డెక్క నవీన్ తల్లిదండ్రులు చెబుతున్నారు. డెక్క నవీన్(23) చెన్నైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. స్నేహితులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన తమ కుమారుడు నవీన్ మేడ మీద నుంచి కింద పడి చనిపోయాడంటూ ఓ యువతి ఫోన్ నుంచి మరో యువకుడు ఫోన్ చేసి చెప్పడం పట్ల వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ప్రేమించిన రాంబిల్లి మండలం వెంకటాపురానికి చెందిన యువతితో పాటు ఆమె తల్లి, వారి బంధవులు పథకం ప్రకారం తమ కుమారుడిని తీర్థ యాత్ర పేరుతో తీసుకెళ్లి హతమార్చారని మృతుడి తల్లిదండ్రులు రాంబాబు, విజయ, చెల్లెలు రేష్మ ఆరోపించారు. నవీన్ మృతిపై నిష్పాక్షికంగా విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు. ప్రేమిస్తే ఇంత దారుణంగా హతమారుస్తారా అంటూ గుండెలవిసేలా రోదించారు. తమకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. హోంమంత్రిని, ఎస్పీని, ఎమ్మెల్యేను కలిసి తమ కుమారుడి మృతిపై విచారణ చేసి న్యాయం చేయమని కోరతామని శనివారం విలేకర్లకు మృతుడి తల్లిదండ్రులు తెలిపారు. బతుకుతెరువు కోసం అచ్యుతాపురం వలస కాశీపురానికి చెందిన నవీన్ కుటుంబం సుమారు 12 సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం అచ్యుతాపురం మండలం చినపూడి గ్రామానికి వలస వెళ్లారు. నవీన్ తండ్రి రాంబాబు అక్కడ ఓప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఇంటర్, ఐటీఐ చదివిన నవీన్ అథ్లెటిక్స్లో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగి రాణిస్తున్నాడు. అతను చదువుకునే సమయంలో తనతో చదివిన అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆమె మరో రాష్ట్రంలో చదువుతుండగా, నవీన్ రెండు నెలల కిందట తమ కుటుంబం నివాసం ఉంటున్న ప్రాంతంలోని ఓ ప్రైవేటు కంపెనీలో చిరు ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళుతున్నానంటూ నవీన్ తన తల్లికి చెప్పి ఈ నెల 8వ తేదీ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. ఎప్పటికప్పుడు తల్లికి ఫోన్ చేసేవాడు. 10న ఉదయం 11 గంటల ప్రాంతంలో అరుణాచలం ఆలయానికి వెళ్లిన నవీన్ తన తల్లితో అక్కడి నుంచే వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అదే రోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నవీన్కి తల్లి విజయ ఫోన్ చేయగా, చెన్నై వెళ్తున్నామంటూ చెప్పాడు. ఈ నెల 11న (గురువారం) ఉదయం తన కుమారుడు ప్రేమిస్తున్న యువతి ఫోన్తో మరో యువకుడు మాట్లాడుతూ నవీన్ మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి విజయకు చెప్పారు.కాశీపురంలో విషాదఛాయలు నవీన్ మృతితో స్వగ్రామం కాశీపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. చెన్నై నుంచి నవీన్ మృతదేహాన్ని శనివారం ఉదయం కాశీపురానికి తీసుకువచ్చారు. ఆనందపురం నుంచి నవీన్ స్నేహితులు, కుటుంబ సభ్యులు బైక్ ర్యాలీతో స్వగ్రామం తీసుకువచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు భోరున విలపించిన తీరు అందర్నీ కంటనీరు పెట్టించింది. తమలాంటి కడుపు కోత మరెవ్వరికి రాకూడదంటూ మృతుడి తల్లి రోదించింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అశ్రునయనాల మధ్య కాశీపురం శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. చెన్నైలో కేసు నమోదునవీన్ మృతిపై అతని మేనమామ నాళం వాసు చెన్నైలోని కె–10 కొయంబేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్య, ఆత్మహత్య అని నిర్ధారణకు వస్తామని పోలీసులు చెప్పినట్లు సమాచారం. -
నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, నెల్లూరు: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో గత రాత్రి(శుక్రవారం) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఓ యువతిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. బాధితురాలు బీఫార్మసీ విద్యార్థిని మైథిలి ప్రియగా తెలుస్తోంది. మైథిలికి, నిఖిల్కు కొంతకాలంగా స్నేహం ఉంది. ఈ క్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచాడు. ఆపై ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు నిఖిల్. ఘటన అనంతరం నిందితుడు పీఎస్లో లొంగిపోయాడు. మైథిలీ మృతదేహాన్ని నెల్లూరు మార్చురీకి తరలించారు పోలీసులు. మరోవైపు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ మైథిలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. -
కుటుంబం...బ్యాంకు బాధ్యతలు బ్యాలెన్సు చేయలేక పోతున్నా..
అన్నమయ్య జిల్లా: కుటుంబం, బ్యాంకు పరిధిలోని బాధ్యతలను సమన్వయం చేయలేక తనువు చాలిస్తున్నట్లు స్వహస్తాలతో లేఖరాసి తాను పనిచేస్తున్న బ్యాంకులోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో సంచలనంగా మారింది. రాయచోటిలోని కరూర్ వైశ్యా బ్యాంకులో మేనేజర్ పవన్ కుమార్ నాయుడు (38) శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో బ్కాంకులోని మరుగుదొడ్డిలో తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుండుపల్లి మండలం, చప్పిడివారిపల్లికి చెందిన పవన్ కుమార్ నాయుడు ఐదు నెలల క్రితం బ్యాంక్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మరుగుదొడ్డిలోకి వెళ్లిన మేనేజర్ ఎంతసేపటికీ బయటకు రాలేదు. బ్యాంకు ఉద్యోగులు పిలిచినా పలుకలేదు. దీంతో డోర్ పగులకొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించడం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. వెంటనే బ్యాంక్ ఉద్యోగులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాయచోటి అర్బన్ ిసీఐ బివి చలపతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్యకు గల కారణాలు లేఖలో రాసిపెట్టినట్లు తెలిసింది. కుటుంబ బాధ్యతలను, బ్యాంకు పని ఒత్తిడిని సమన్వయం చేసుకోవడంలో విఫలం అయ్యానని రాసినట్లు తెలిసింది. బ్యాంకులో పని ఒత్తిడి కారణంగానే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుని భార్య అనూష ఆరోపిస్తున్నారు. పోలీసులు లేఖను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ిసీఐ తెలిపారు. అయితే లేఖలో రాసిన విషయాలతోపాటు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని బ్యాంక్ సిబ్బంది, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పంచనామా నిమిత్తం బ్యాంక్ మేనేజర్ మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పవన్ కుమార్ నాయుడుకు భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. -
సినిమాను మించి ట్విస్టులు.. చంపేసి.. విసిరి పారేసి..
ఎన్టీఆర్ జిల్లా: కన్న తండ్రే కాలయముడయ్యాడు. తనను గంజాయి కేసులో పట్టించిందని కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలవగానే కూతురును కొట్టి చంపాడు. శవాన్ని మూటగట్టి కాల్వలో పడేసి పరారయ్యాడు. ఈ విషాదకర ఘటన మైలవరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాగమ్మకు ఐదుగురు కూతుళ్లు.రెండో భార్య నాగేంద్రమ్మకు ఒక కూతురు, కుమారుడు. అయితే ఇద్దరి భార్యలను మైలవరంలో వేరు వేరు ఇళ్లలో ఉంచి కాపురం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య నాగేంద్రమ్మతో కలిసి గంజాయి విక్రయిస్తున్న బాజీ గత మే నెలలో పోలీసులకు పట్టుబడ్డాడు. వీరిద్దరికీ కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో రెండో భార్య నాగేంద్రమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న తన కూతురు గాయత్రి(13), కుమారుడిని జి.కొండూరు మండల పరిధిలోని విద్యానగరంలో ఉంటున్న తన అక్క స్వప్న వద్ద వదిలి వెళ్లింది. బాజీ మొదటి భార్య నాగమ్మ తన భర్త ఒక్కడినే బెయిల్పై విడిపించడంతో గత జూలైలో జైలు నుంచి బాజీ విడుదలయ్యాడు.ఆ కోపంతోనే.. గాయత్రి గతంలో జి.కొండూరు మండలం కుంటముక్కలకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై బాజీ అతని రెండో భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆచూకీ గుర్తించి వారిద్దరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన గాయత్రి తన తండ్రి బాజీ నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించి ప్రేమించిన యువకుడితో కలిసి గంజాయి విక్రయ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించింది. కూతురు వల్లే తాను, తన భార్య జైలు కెళ్లామని బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో జైలు నుంచి రాగానే తన రెండో భార్య అక్క వద్ద ఉన్న గాయత్రిని రెండు నెలల క్రితం తన ఇంటికి తీసుకొచ్చి హింసించసాగాడు.ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీ సాయంత్రం ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టడంతో గాయత్రి మృతి చెందింది. ఆ తర్వాత శవాన్ని మూటకట్టి అద్దెకు తీసుకున్న ట్రక్కు ఆటోలో వేసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా కళ్లారా చూసిన మొదటి భార్య నాగమ్మ, ఆమె కూతుళ్లు శవాన్ని తీసుకెళ్లిన తర్వాత రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లి, ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.ఈ విషయం బయటకు పొక్కడంతో మైలవరం పోలీసులు గాయత్రి పెద్దమ్మ స్వప్నని పిలిపించి ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాజీ పోలీసులకు భద్రాచలం ఏరియాలో రెండు రోజుల క్రితం పట్టుబడ్డాడు. విచారణలో తన కూతురు గాయత్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలు స్తోంది. శవాన్ని ఖమ్మం జిల్లా మధిర శివారులో కాల్వలో పడేసినట్లు చెప్పడంతో పోలీసులు డ్రోన్ల సాయంతో ఆ దిశగా గాలింపు చేపట్టారు. అయితే గాయత్రి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. -
‘నాన్నా... నాకు ఊపిరి ఆడటం లేదు’
సాక్షి,కర్నూలు: దేవనకొండలో మానవత్వాన్ని మంటగలిపే దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ తండ్రి తన ఎనిమిది నెలల పసికందును నీటి డ్రమ్ములో ముంచి హత్య చేశాడు. తండ్రి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయిన ఆ చిన్నారి చివరి శ్వాస... ఊహించుకుంటేనే గుండె ద్రవించిపోతుంది. ‘నాన్నా... నాకు ఊపిరి ఆడటం లేదు’ అనే మాటలు చెప్పలేని వయసులో ఉన్నా, ఆ అమాయక బిడ్డ బాధ ప్రతి ఒక్కరి మనసును చివుక్కుమనిపిస్తోంది.పోలీసుల వివరాల మేరకు.. దేవనకొండకు చెందిన నరేష్ గురువారం పొలంలో తన ఎనిమిది నెలల కుమారుడిని నీటిడ్రమ్ములో ముంచి ప్రాణాలు తీశాడు. అనంతరం పోలంలో ఉన్న భార్య శ్రావణిని తీవ్రంగా గాయపరిచాడు. అప్రమత్తమైన బాధితురాలి అత్తమామలు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నరేష్కు నేరచరిత్ర ఉంది. ఇప్పటికే మొదటి భార్య హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. అయితే, నరేష్ తల్లిదండ్రులు అతడికి రెండో వివాహం జరిపించారు. కానీ వివాహం జరిగిన కొద్దికాలానికే నరేష్ తన రెండో భార్య శ్రావణిపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంపై భార్య,భర్తల మధ్య గొడవలు జరిగేవి.ఈ క్రమంలో భార్య శ్రావణిని హతమార్చేందుకు నరేష్ కుట్ర చేశాడు. ఇందులో భాగంగా ఇవాళ కుటుంబసభ్యులతో కలిసి పొలం వెళ్లిన నరేష్ ఘాతుకానికి ఒడిగట్టాడు. నెలల పసికందును నీటి డ్రమ్ములో ముంచి ప్రాణాలు తీశాడు. ఆపై భార్యపై మారణాయుధాలతో తెగబడ్డారు. నిందితుది దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కూలిపోయిన బతుకులు
తనకల్లు/ వేంపల్లె : వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు. కూలి కాస్త ఎక్కువగా వస్తుందన్న ఆశతో జిల్లాదాటి వచ్చారు. రోజంతా టమాట తొలగింపు పనుల్లో అలసిపోయారు. సూర్యుడు అస్తమించే వేళ ఆ రోజు అందిన కూలి తీసుకుని స్వగ్రామాలకు ఆటోలో పయనమయ్యారు. ఇంట్లో బిడ్డల గురించి ఒకరు, భార్య ఆరోగ్యం గురించి మరొకరు ఇలా ఆలోచిస్తూ వెళ్తున్నారు. కానీ ఆటో బోల్తా పడగా వారి జీవితాలు అక్కడే ముగిసిపోయాయి. కూలీలతో వెళ్తున్న ఓ ఆటో మండలం పరిధిలోని కొక్కంటి సమీపంలోని మించిలవారికోట రోడ్డు వద్ద బోల్తా పడడంతో వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన వ్యసాయ కూలీలు పట్టా దేవనాథ్ (45), బత్తల హేమలత (32) మృతి చెందారు.తిరిగి వెళ్తూ.. తిరగిరాని లోకాలకువైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం కొండప్పగారిపల్లి, ఆంజనేయపురం, బురుజుపల్లి గ్రామాలకు చెందిన పలువురు వ్యవసాయ కూలీలు మంగళవారం ఉదయం ఆటోలో శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలంలోని అగ్రహారంపల్లికి చెందిన ఓ రైతు పొలంలో టమాట కోసేందుకు వచ్చారు. పని ముగిసిన అనంతరం అదే ఆటోలో స్వగ్రామాలకు బయలుదేరారు. అయితే మించిలివారికోట రోడ్డు వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పడంతో రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బత్తల హేమలతకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అదే ఆటోలో ప్రయాణిస్తున్న బూరుజుపల్లికి చెందిన పట్టా దేవనాథ్, పట్టా బయన్న, శివగంగ, కొండప్పగారిపల్లికి చెందిన పెద్ద గంగులయ్య, బురుజుపల్లికి చెందిన పట్టా బయప్ప, గాయపడ్డారు. షయం తెలుసుకున్న ‘వందేమాతరం టీం’ సభ్యులు బాగేపల్లి అశోక్, బాలు, నవీన్, తండేల్ తదితరులు క్షతగాత్రులను తమ ఉచిత అంబులెన్స్లో తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పుట్టా దేవనాథ్ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ గోపి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బత్తల హేమలతకు భర్త రామాంజనేయులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి శివగంగ, బేబీ, గణేష్లు అనే ముగ్గురు పిల్లలు ఉండగా తల్లి వెంట కుమార్తె శివగంగ కూడా కూలి పనులకు వెళ్లింది. శివగంగకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు దేవనాథ్కు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు బయప్ప, బయన్నలు ఉన్నారు. వీరు డిగ్రీ, ఇంటర్ చదువుకుంటున్నారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కూలీలు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
మద్యం మత్తులో పోలీసులపై యువకుల దాడి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మద్యం మత్తులో ఒక రౌడీషీటర్, మరో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. రాజమహేంద్రవరంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్, హోంగార్డుపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నాగబాబు, హోంగార్డు కాళి ఆదివారం రాత్రి విధుల్లో భాగంగా కోటిపల్లి బస్టాండ్ వద్దకు వెళ్లారు. అక్కడ ఓ జ్యూస్ షాప్ వద్ద రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ కర్రి దుర్గా సూర్యప్రసన్నకుమార్, రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కట్టుంగ హరీష్, ధవళేశ్వరానికి చెందిన వినోద్కుమార్ మద్యం మత్తులో వేరే వ్యక్తులతో గొడవపడుతున్నారు. వారిని నాగబాబు, కాళి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన సూర్యప్రసన్నకుమార్, హరీష్, వినోద్కుమార్ కలిసి కానిస్టేబుల్ నాగబాబు, హోంగార్డు కాళిపై దాడి చేశారు. దుర్భాషలాడుతూ అర్ధగంటకు పైగా కదలనీయకుండా అడ్డుకున్నారు. అనంతరం కానిస్టేబుల్, హోంగార్డు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అనకాపల్లి: ఖైదీల పరారీ కేసు.. వెలుగులోకి కీలక అంశాలు
సాక్షి, అనకాపల్లి: చోడవరం జైలు నుంచి రిమాండ్ ఖైదీలు పరారీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి కీలక వస్తున్నాయి. జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఖైదీలు పరారీ అయినట్టు అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా వెల్లడించారు. ఖైదీలు తప్పించుకోవడానికి సహాయం చేసిన మరో ఖైదీపై కేసు నమోదు చేశారు.చోడవరం సబ్ జైలు నుంచి పరారైన ఖైదీలను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు ఖైదీలను విశాఖలో గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికి సహకరించిన రిమాండ్ ఖైదీ ఏకస్వామిపై కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులు విచారణ చేపట్టారు.సినీ ఫక్కీలో వార్డెన్పై దాడి చేసి.. సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారైన సంగతి తెలిసిందే. ఐదుగురు జైలు వార్డర్లు, రక్షణ గేట్లు తప్పించుకుని వారు పారిపోయారు. పింఛన్ డబ్బులు కాజేసిన కేసులో పంచాయతీ సెక్రటరీ నక్కా రవికుమార్, చోరీ కేసులో ఖైదీలుగా అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలులో ఉన్నారు. వీరిద్దర్నీ జైలులో ఖైదీలకు వంట చేయడానికి వినియోగిస్తున్నారు. రోజూలాగే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సబ్ జైలులో వంట చేసేందుకు వీరిని జైలు గదిలోంచి బయటకు తీసుకొచ్చారు. వంటకు ఉపక్రమించే సమయంలో ముగ్గురు వార్డర్లు లోపల, ఒక వార్డరు మెయిన్ గేటు వద్ద సబ్ జైలర్ తన గదిలో విధి నిర్వహణలో ఉన్నారు.ఆ సమయంలో నక్కా రవికుమార్ మెయిన్ గేటుకు లోపల గ్రిల్ గేటుకు మధ్య విధి నిర్వహణలో ఉన్న వార్డర్ వీర్రాజుపై సుత్తితో దాడి చేశాడు. అనంతరం ఆయన జేబులో ఉన్న తాళాలు లాక్కొని.. మెయిన్ గేటు తాళం తీసి పారిపోతుండటం చూసి, మరో ఖైదీ రాము కూడా పరారయ్యాడు. పారిపోతున్న వారిని పట్టుకునేందుకు జైలు వార్డర్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చోడవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణ మీదుగా ఖైదీ లు మెయిన్ రోడ్డుకు చేరుకుని పరారయ్యారు. అనంతగిరి మండలం బోకూరు పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఈ ఏడాది ఏప్రిల్లో పింఛన్ డబ్బులు కాజేసిన కేసులో రవికుమార్ కు పాడేరు కోర్టు రిమాండ్ విధించించింది. బెజవాడ రాము ఈ ఏడాది జులై 23వ తేదీన మాడుగులలో దొంగతనం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. -
భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ..!
శ్రీకాకుళం క్రైమ్: పెరుగుతున్న సాంకేతికతతో పాటు రోజురోజుకీ సైబర్ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. రోజుకో మోసంతో సైబరాసురులు రూ.కోట్లలో భారీగా సొమ్ము కొల్లగొడుతున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు పట్టిపీడించిన ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలే ప్రస్తుతం ట్రెండింగ్లో నిలుస్తున్నాయి. ప్రముఖ వైద్యులు, ఉపాధ్యాయ, రాజకీయ, వ్యాపారవర్గాలు, ఇంజినీర్లు సైతం సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకొని దారుణంగా మోసపోతున్నారు. మోసపోయాక పరువు పోతుందేమోనని కొందరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయకపోయినా.. మరికొందరు భారీ అమౌంట్లు కావడంతో నేరుగా జిల్లా ఉన్నతాధికారి వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ లెక్కకు మించి సైబర్ కేసులు వివిధ స్టేషన్లలో పెండింగ్లోనే ఉంటున్నాయి. మరికొన్ని స్టేషన్లలో అయితే కనీసం కేసు కట్టడానికి సాహసించలేని స్థితిలో ఉండడం గమనార్హం. నమ్మారో.. నట్టేటా మునిగినట్లే.. » శ్రీకాకుళం సబ్ డివిజన్ కేంద్రంగా ఇటీవల ఒక ప్రముఖ వైద్యుడు ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ.37.50 లక్షలు మోసపోయాడు. ఎప్పటినుంచో స్టాక్ మార్కెట్లోనే కాకుండా వివిధ మార్గాల్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్న ఆ వైద్యుడికి ఒక ఆపరిచిత వ్యక్తి వాట్సాప్ కాల్చేసి చిట్కాలు చెబుతాననడంతో సరే అన్నాడు. ముందుగా ఓ గ్రూపు క్రియేట్ చేసి అందులో సభ్యులను పరిచయం చేశాడు. రూ.10 లక్షలు పెడితే అదనంగా మరో రూ.10 లక్షలు వస్తుందని, రూ.20 లక్షలు పెడితే రూ.20 లక్షలు, రూ.30 లక్షలు పెడితే రూ.30 లక్షలు వస్తుందని మాయమాటలు చెప్పాడు. తన చిట్కాల ద్వారా గ్రూపులో సభ్యులకొస్తున్న అమౌంట్ స్క్రీన్షాట్లు తీసి వైద్యుడికి పెట్టసాగాడు. నమ్మకం కుదిరాక వైద్యుడు పలుమార్లు రూ.2 లక్షలు, రూ.3 లక్షలు.. ఇలా వేస్తూనే ఉన్నాడు.. విత్డ్రా ఆప్షన్లో డబ్బులు అదనంగా కనిపిస్తుండడం తన అకౌంట్లో యాడ్ అవుతున్నట్లు ఆశ పుట్టింది. అలా ఒక రూ.15 లక్షల వరకు వేశాడు. డబ్బులైతే ఆప్షన్లో కనిపించి విత్ డ్రా అవ్వకపోవడంతో అపరిచిత వ్యక్తిని అడగగా.. మీరు కడుతుంటే ఒకేసారి వస్తాయనడంతో రూ.37 లక్షల వరకు కట్టేశాడు. కానీ అప్పటికీ విత్ డ్రా అవ్వకపోవడంతో పాటు అపరిచిత వ్యక్తికి ఫోన్చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. గ్రూపులో కూడా వైద్యుడిని రిమూవ్ÐŒ చేసేశారు. ఇక చేసేదేమీలేక వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇదే తరహాలో కాశీబుగ్గ పోలీస్స్టేషన్లో ఆర్మీకి చెందిన ఒక వ్యక్తి రూ.కోటికి పైగా సైబరాసురుల చేతిలో నష్టపోయానని ఫిర్యాదు చేయడంతో భారీ అమౌంట్ కావడంతో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా.. ఇప్పటివరకు కేసు అయితే నమోదు చేయలేకపోయారు. » రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన దుంప కృష్ణ చిత్తూరు జిల్లా మెట్టూరు ఎస్బీఐలో ఒప్పంద ఉద్యోగిగా చేస్తున్నాడు. వాట్సాప్ ద్వారా వచ్చే వీడియోలు చూసి సబ్స్రై్కబ్ చేసుకున్న కృష్ణకు సైబర్ కేటుగాళ్లు టెలిగ్రామ్ ద్వారా లింకులు పంపించి గేమ్లు ఆడించారు. బహుమతులు, డబ్బులొస్తున్నట్లు ఆన్లైన్లో చూపించడంతో కృష్ణ రూ.11.50 లక్షల వరకు ట్రేడింగ్ చేశాడు. చివరికి డబ్బులు ఎంతకీ అకౌంట్లో పడకపోవడంతో జేఆర్పురం పోలీసులకు ఫిర్యాదు చేయగా జీరో అఫైర్ నమోదు చేసి చిత్తూరు జిల్లా మెట్టూరుకు కేసు బదిలీ చేశారు.కేసులు నమోదు చేయలేని దుస్థితి ఈ తరహానే కాకుండా వివిధ సైబర్ మోసాలపై జిల్లాలో భారీస్థాయిలో కేసులు పెండింగ్లో ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్కో స్టేషన్లో 4 నుంచి 6 వరకు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మోసం చేసే కేటుగాళ్లు వివిధ రాష్ట్రాలు, దేశాలు వారు కావడంతో అక్కడికి వెళ్లి ఆ అధికారులతో సమన్వయం చేసుకుని నోటీసులిచ్చేవరకే చేయగలుగుతున్నారు. ఈలోగా దారి ఖర్చులు, వసతి ఖర్చులు అన్నీ వీరిపైనే భారంగా పడుతున్నాయి. పోనీ కోర్టు వరకు నేరస్తులు వస్తున్నారంటే అదీ లేదు. ఒకట్రెండు సార్లు వచ్చీ ఆ తర్వాత వారి జాడే కనిపించనంతగా మాయమవుతున్నారు. దీంతో ఇటువంటి కేసులు కట్టాలంటేనే తమకు తలనొప్పిగా మారుతున్నాయంటూ కొంతమంది పోలీసు అధికారులే చెబుతుండడం శోచనీయం. అత్యాశే కారణం ప్రస్తుతం సైబర్ నేరాలు జిల్లాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రజలు అత్యాశతో వారి వలలో పడుతున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్టు వంటి మోసాలకు ఎక్కువగా చదువుకున్నవారే బలవుతున్నారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో గతంలో కంటే ఇప్పుడు కేసులు ఎక్కువగా నమోదు చేస్తున్నాం. క్షణాల్లో సైబర్ సెల్ నంబర్ 1930కు ఫిర్యాదు చేసి పోలీసులను, బ్యాంకు ప్రతినిధులను సంప్రదిస్తే మంచిది. – డీఎస్పీ వివేకానంద, శ్రీకాకుళం -
కళ్లలో కారం చల్లి.. కత్తులతో దాడి చేసి
మహానంది: అధికార పార్టీ నేతల అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తపై గుర్తుతెలియని దుండగులు కళ్లలో కారం పొడి చల్లి కత్తులతో దాడి చేశారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బుసిగారి నాగరాజు తమ్ముడు సురేష్పై నలుగురు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన నంద్యాల మండలం అయ్యలూరిమెట్ట వద్ద గురువారం రాత్రి జరిగింది. బాధితుల వివరాల మేరకు.. అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ గురువారం రాత్రి ఆర్ఎంపీ వద్ద వైద్యం పొంది ఇంటికి వస్తుండగా అయ్యలూరిమెట్ట సమీపంలోని చెరువు, గోదాం ప్రాంతంలో నలుగురు అటకాయించారు. కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. అక్కడున్నవారు గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యారు. సురేష్ ను స్థానికులు 108లో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడి విషయమై ఎస్ఐ గంగయ్యయాదవ్ను వివరణ కోరగా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే దౌర్జన్యాలు: శిల్పా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారని, ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఇప్పటికే నాలుగు హత్యలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేష్ ను ఆస్పత్రిలో పరామర్శించిన శిల్పా.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని, లేదంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్వగ్రామంలోనే ఓ యువకుడిపైన, వైశ్యులతో పాటు మరికొందరిపైనా దాడి చేశారన్నారు. గ్రామాల్లో పదిమంది టీడీపీ నాయకులు ఉంటే తలా ఒక బెల్ట్షాప్, మంత్రులకు శాఖల తరహాలో టీడీపీ నాయకులకు దోపిడీ శాఖలు కేటాయించారని ఆరోపించారు. అందరినీ గుర్తుపెట్టుకుంటామని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఎమ్మెల్యే దాడి చేసినా సీఎం, డిప్యూటీ సీఎం స్పందించకపోవడం దారుణం అని పేర్కొన్నారు. -
కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి
దర్మవరం అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ రౌడీషీటర్ను కొందరు వ్యక్తులు కారుతో ఢీ కొట్టి వేట కొడవళ్లతో నరికి చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ధర్మవరం కొత్తపేటకు చెందిన తలారి లోకేంద్ర(26) గురువారం స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్తూ శ్రీనిధి మార్ట్ వద్ద ఆగాడు. ఇంతలో వెనుకనుంచి వేగంగా వచ్చిన కారు అతడి బైక్ను ఢీకొట్టింది. కిందపడిపోయిన లోకేంద్రపై కారులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ముఖం, మెడపైన అతి కిరాతకంగా నరికారు. అనంతరం అదే కారులో వెళ్లిపోయారు. ఇందతా సీసీ కెమెరాలో రికార్డయింది. హత్య జరిగిన స్థలాన్ని ఇంచార్జి సీఐ నాగేంద్రప్రసాద్ పరిశీలించారు. లోకేంద్ర తండ్రి బైరవుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. లోకేంద్ర హంతకులు నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. కొత్తపేటలో బొప్పాయి కాయలు విక్రయించే బైరవుడు కుమారుడైన లోకేంద్ర అవివాహితుడు. గంజాయి తాగుతూ జులాయిగా తిరుగుతున్నాడు. ఏడాది క్రితం రైల్వే స్టేషన్లో రూ.15 ఆటో బాడుగ విషయంలో శ్రీనివాసులురెడ్డి అనే వృద్ధుడిని బండరాళ్లతో కొట్టి హత్య చేసిన కేసులో, 6 నెలల క్రితం ఓ మహిళను ఆటోలో తీసుకెళ్లి రేగాటిపల్లి పొలాల్లో హత్యాచారం చేసిన కేసులోనూ ప్రధాన నిందితుడు. 2019లో హోంగార్డుపై దాడి చేశాడు. దీంతో లోకేంద్రపై పోలీసులు రౌడీïÙట్ తెరిచార -
స్టాక్స్లో పెట్టుబడి పేరుతో రూ.5.25 కోట్ల మోసం
విశాఖపట్నం: స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన ముగ్గురు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకానగర్కు చెందిన ఒక వ్యక్తిని సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా సంప్రదించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.5.25 కోట్లు దోచుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.పోగొట్టుకున్న డబ్బులో రూ.27 లక్షలను బాధితుడు రాజస్థాన్లో ఉదయ్పూర్కి చెందిన వ్యక్తి ఐడీఎఫ్సీ బ్యాంక్ ఖాతాకు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేశారు. ఆ డబ్బు పలు ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. వీటిలో కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన పాసుల వేణు, మామిడిపల్లి విజయ్ ఖాతాలు ఉన్నట్లు తేల్చారు.దీనితో ఒక ప్రత్యేక పోలీసు బృందం కరీంనగర్కు వెళ్లి విచారణ చేపట్టింది. వేణు బ్యాంక్ ఖాతా ద్వారా జగిత్యాలకు చెందిన దుర్గం గోపీకృష్ణ సైబర్ నేరగాళ్లకు డబ్బు పంపుతున్నట్లు తేలింది. అక్రమ లావాదేవీల్లో అమెరికా డాలర్, క్రిప్టో కరెన్సీలను కూడా వినియోగించడం గమనార్హం. ఈ ఘటనలో వేణు, గోపీకృష్ణలతోపాటు నర్మెట్ట జీవ అనే మరో సైబర్ నేరస్తుడు అరెస్ట్ అయ్యాడు. -
భర్త దూరమయ్యాడని.. తానూ తిరిగిరాని లోకానికి..
కాకినాడ రూరల్: సాఫీగా సాగే వారి పచ్చని సంసారాన్ని అప్పుల సుడిగుండం ముంచేసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న రెండేళ్ల మగ బిడ్డకు పుట్టినరోజును స్తోమతకు మించి ఘనంగా చేశారు. ఆ అప్పు భారంగా మారడంతో, ఈ ఏడాది జూలై నెలలో భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకటిన్నర నెలలు తిరక్కుండానే బిడ్డతో కలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబానికి విషాదాంతమే మిగిలింది. సర్పవరం పోలీసుల వివరాల మేరకు, కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలోని భావనారాయణపురం గాంధీనగర్కు చెందిన జనపల్లి ఆకాంక్ష(25) తన బిడ్డ సార్విక్(2)కు పురుగు మందు పట్టించి, తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంది.చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కరప మండలం గురజనాపల్లికి చెందిన ఆకాంక్షకు, సర్పవరం గ్రామానికి చెందిన జనపల్లి గోపితో మూడేళ్ల క్రితం వివాహమైంది. కాకినాడ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో కాంట్రాక్ట్ వర్కర్గా గోపి పనిచేసేవాడు. జూలైలో బిడ్డ సార్విక్ రెండో పుట్టిన రోజును ఘనంగా జరిపారు. ఇందుకు రూ.3 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పు ఇచ్చినవారి ఒత్తిడిని తట్టుకోలేక గోపి జూలై 22న మద్యంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆకాంక్ష మానసికంగా కుంగిపోయింది. కొన్ని రోజులు పుట్టింటి వద్ద, కొంతకాలం అత్తింటి వద్ద ఉండేది. భర్తపై బెంగతో గత నెల 31న మధ్యాహ్నం సర్పవరంలోని ఇంట్లో సోడాలో పురుగు మందు కలిపి బిడ్డకు పట్టించి, తాను తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున ఇద్దరూ మృతి చెందారు. ఆకాంక్ష తల్లి డోనం శాంతికుమారి ఫిర్యాదు మేరకు సర్పవరం ఏఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. పోస్ట్మార్టం అనంతరం సర్పవరం భావనారాయణపురంలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
మద్యం మత్తులో తండ్రి హత్య
కరప: కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతున్న మద్యం బంధాలను చిదిమేస్తోంది. మద్యం మత్తు తండ్రీకొడుకుల మధ్య ఘర్షణకు దారి తీసి, చివరికి తండ్రిని తనయుడు కడతేర్చేలా చేసిన ఘటన కాకినాడ జిల్లా కరప పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మొండి గ్రామానికి చెందిన కాలాడి సూర్యచంద్రరావు(50)కు నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు ధనుంజయ్కు వివాహం కాగా వేరు కాపురం పెట్టాడు. భార్య అనారోగ్యంతో మరణించగా, తండ్రి మిగిలిన ముగ్గురి కుమారులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో సూర్యచంద్రరావు మద్యానికి బానిసయ్యాడు. రెండో కుమారుడు చంద్రశేఖర్ పనిచేస్తూ, అన్నీ చూసుకుంటూ, వంట చేసి పెడుతుంటాడు. చిన్నకుమారుడు మహేష్ ఫిట్స్ వ్యాధిగ్రస్తుడు. ఈ నేపథ్యంలో మంగళవారం మహేష్ కు మందులు తీసుకురమ్మని తండ్రికి చంద్రశేఖర్ రూ.500 ఇచ్చాడు. సూర్యచంద్రరావు ఆ డబ్బుతో మద్యం తాగి వచ్చాడు. దీంతో అప్పటికే మద్యం తాగి ఉన్న చంద్రశేఖర్ తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున తండ్రి తలపై గొడ్డలి తిరగేసి దాడి చేయడంతో సూర్యచంద్రరావు మృతి చెందాడు. సమాచారం అందుకున్న కాకినాడ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
సీఐ వేధిస్తున్నాడంటూ ఆత్మహత్యాయత్నం
సాక్షి టాస్క్ ఫోర్స్: పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేధిస్తున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం బండ్లపల్లి పంచాయతీ కమ్మవారిపల్లికి చెందిన ఆదికేశవ కుమారుడు భాస్కర్నాయుడు సెల్ఫీ వీడియోలో ఆరోపిస్తూ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నంచాడు. ఆ వీడియోలో ‘కొత్తచెరువు సీఐ జి. మారుతీశంకర్ కేసుల పేరుతో వేధిస్తున్నాడు. రోజూ స్టేషన్కు రావాలని కబురు పంపిస్తున్నాడు. రౌడీïÙట్ తెరిచామని.. స్టేషన్కు సకాలంలో రాకుంటే మరిన్ని కేసులు నమోదుచేస్తామని బెదిరించారు.అనవసరంగా నాపై కొందరు రాజకీయ నాయకులు కుట్ర పన్నినట్లు అర్ధమవుతోంది. అందుకే సీఐ ద్వారా వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేకున్నా’.. అంటూ వివరించాడు. అనంతరం.. తన పొలంలోకి వెళ్లి పురుగుల మందు సేవించాడు. స్థానికులు గమనించి అతనిని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ నుంచి అనంతపురం తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు.కూటమి నేతల ఒత్తిళ్లతో.. కొన్ని రోజులుగా కొత్తచెరువు మండలంలో అనేకమందిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే కేసు నమోదుచేసి బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ కూటమి నేతల ఒత్తిళ్లతో పోలీసులు కేసుల పేరుతో వేధిస్తుండడంతో ఇప్పటికే బాధితులు కొందరు గ్రామాలు విడిచి వెళ్లిపోయారు. తప్పు ఎవరిదనే విషయంపై ఆరా తీయకుండా.. కూటమి నేతలు చెప్పినట్లు విధులు నిర్వర్తిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు మండిపడుతున్నారు. -
రైలు పట్టాల మీద కొడుకు.. పట్టాల కింద తండ్రి మృతదేహం
సాక్షి,కాకినాడ: తునిలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గొడవ పడి..ట్రైన్ ఎక్కేందుకు వెళ్తున్న తండ్రీ కొడుకును మరో రైలు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తండ్రీ కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. పాయకరావుపేటకు చెందిన అనీల్ తన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భార్యపై అలిగి తన స్వస్థలమైన గుంటూరు వెళ్లేందుకు కుమారుడితో కలిసి తుని రైల్వేస్టేషన్కు బయల్దేరాడు.పట్టాలపై నుంచి స్టేషన్కు వచ్చే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ట్రైన్ వారిద్దరిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో కుమారుడి మృతదేహాన్ని పాయకరావుపేట-తునికి మధ్యలో ఉన్న తాండవ వంతెనపైన..తండ్రి మృతదేహాన్ని తాండవ నదిలో తుని రైల్వే పోలీసులు గుర్తించారు. కుమారుడిపేరు గుణశేఖర్. మరోవైపు,భర్త,కొడుకు ఆచూకీ లభ్యం కాకపోవడం అనిల్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కంప్లయింట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో తుని రైల్వే పోలీసులు,పాయకరావు పేట పోలీసులు సంయుక్తంగా తాండవ వంతెనపై జరిగిన ప్రమాదంలో తండ్రి అనీల్, కుమారుడు గుణ శేఖర్ల మృతదేహాలను గుర్తించారు. -
విశాఖలో విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్
మధురవాడ (విశాఖ జిల్లా): మాట వినలేదని ఓ విద్యార్థి చేయిని టీచర్ విరగ్గొట్టిన ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురవాడ ఆదిత్యనగర్లో ఉన్న శ్రీ తనుష్ ప్రైవేట్ స్కూల్లో మధురవాడకు చెందిన నరేష్ (13) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం క్లాసులో ఇద్దరు విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన సోషల్ టీచర్ మోహన్..కోపంతో నరేష్ను కొట్టి, షర్ట్ పట్టుకుని గట్టిగా తోశాడు. దీంతో బాధిత విద్యార్థి ఇనుప బెంచీపై పడడంతో చెయ్యి విరిగింది. అంతటితో ఆ టీచర్ ఆగకుండా.. అక్కడే మోకాళ్లపై నరేష్ను కూర్చోబెట్టి అమానుషంగా ప్రవర్తించాడు.ఇంటికి వెళ్లి విద్యార్థి తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పగా..వారు వైద్యం నిమిత్తం నరేష్ను నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. టీచర్ మోహన్ పరారీలో ఉన్నాడు. బుధవారం వినాయక చవితి సందర్భంగా సెలవు కావడంతో, గురువారం పాఠశాలకు చేరుకున్న తండ్రి ఆదినారాయణ ఇతర కుటుంబ సభ్యులు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ బిడ్డకు న్యాయం చేయకపోతే ఊరుకునేది లేదంటూ నినదించారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల అసోసియేషన్ ప్రతినిధులు స్కూల్ యాజమాన్యానికి వంత పాడటం గమనార్హం. ఘటనాస్థలికి మండల విద్యాశాఖ అధికారి అనురాధ, పీఎంపాలెం పోలీసుస్టేషన్ ఎస్ఐ సునీత చేరుకుని విచారణ చేట్టారు. -
బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం
నంద్యాల: బాలికను బెదిరించి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్బాషా తెలిపిన వివరాలు.. నంద్యాలకు చెందిన బాలిక(16)ను కొన్ని నెలల కిందట సలీంనగర్కు చెందిన అబీద్, అప్రోజ్ అనే యువకులు బెదిరించి.. అత్యాచారం చేశారు. అప్పటి నుంచీ బాలికను బెదిరిస్తూ.. వారు అఘాయిత్యానికి పాల్పడుతున్నారు.ఈ క్రమంలో బాలికకు నెలసరి సరిగ్గా రాకపోవడం.. తరుచూ కడుపునొప్పి అని చెబుతుండడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భం దాల్చిందని తేల్చారు. తల్లి గట్టిగా నిలదీయడంతో.. జరిగిన ఘోరాన్ని బాలిక చెప్పింది. వెంటనే బాలిక తల్లి నంద్యాల టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరు నిందితులపై అత్యాచారం, పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
విశ్రాంత ఉద్యోగికి సైబర్ నేరగాళ్ల టోకరా
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. విడతలవారీగా రూ.30.70 లక్షలను స్వాహా చేశారు. నూజివీడుకు చెందిన నీలపాల చిన్నిరాజు సింగరేణి కాలరీస్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేసి 2011లో రిటైరయ్యారు. నూజివీడులో నివసిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 17న సాయంత్రం 4.41 గంటలకు ఒక వ్యక్తి ఫోన్ చేసి తాను సబ్ ఇన్స్పెక్టర్ సందీప్రావునని చెప్పి మాట్లాడారు. సుధాఖత్ ఖాన్ అనే నేరస్తుడిని తాము 2024 నవంబరు 2న ఢిల్లీలో అరెస్టు చేశామని, అతని వద్ద మీ ఆధార్ కార్డు ఉందని చెప్పాడు. ‘‘నేరస్తుడితో మీకు సంబంధాలు ఉండొచ్చుననే అనుమానం ఉంది. విచారణకు ఢిల్లీ రావాల్సి ఉంటుంది’’. అని ఫోన్లో ఒత్తిడి చేశాడు. ఆ తరువాత మరో వ్యక్తి ఫోన్ చేసి తాను సీబీఐ ఆఫీసర్ ఆకాశ్ కుల్హరినని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కొంత మొత్తం భద్రత డిపాజిట్ కింద జమ చేయాలని, తమకు సహకరించకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించాడు.దీనికి భయపడిపోయిన చిన్నిరాజు తన ఇల్లు, బంగారం తాకట్టు పెట్టి విడతల వారీగా నిందితులు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో రూ.30,70,450 జమ చేశారు. ఆగస్టు 14 నుంచి నిందితులు చిన్నిరాజుతో సంప్రదింపులు నిలిపివేయడంతోపాటు ఆయన నంబరును బ్లాక్ చేయడంతో అనుమానమొచి్చన చిన్నిరాజు తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. -
కుమార్తెలు, మరిదే హంతకులు.. వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
సాక్షి, అనకాపల్లి: బాటజంగాలపాలెంలో మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్ట్ 14 వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి సొంత కుమార్తెలు, మరిదే హంతకులుగా తేల్చిన పోలీసులు.. మృతురాలు విశాఖలోని కూర్మన్నపాలెం రాజీవ్ నగర్కు చెందిన బంకిళ సంతుగా గుర్తించారు.ఆస్తి తగాదాలు, తల్లిపై కోపంతో చిన్నాన్న సహాయంతో హత్యకు ప్లాన్ చేసిన కూతుర్లు.. ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు అర్ధరాత్రి టవల్తో మెడ బిగించి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. డెడ్బాడీని కారులో తీసుకెళ్లిన నిందితులు.. బాటజంగాలపాలెం దగ్గర ప్రెటోల్ పోసి తగలబెట్టారు. -
పింఛన్ నోటీసుతో దంపతుల బలవన్మరణం
సాక్షి టాస్క్ ఫోర్స్ : కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై కక్ష కట్టింది. ఏకపక్షంగా లక్షలాది పింఛన్లు తొలగిస్తూ పింఛన్దారుల కడుపు కొడుతోంది. పింఛన్ పొందడానికి పూర్తిగా అర్హత ఉన్నప్పటికీ.. అడ్డగోలుగా తొలగింపులకు పూనుకొంది. దీంతో ఇకపై ఎలా బతకాలని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. ఆత్మస్థైర్యం కోల్పోయిన వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలుకు చెందిన కొల్లి అప్పారావు(45)కు రెండు కళ్లు కనిపించవు. పదేళ్లుగా దివ్యాంగ పింఛన్ పొందుతున్నాడు. ఇటీవల పింఛన్ రీ వెరిఫికేషన్కు రావాలంటూ నోటీసు అందింది. అందులో ఇతనికున్న 70 శాతం వికలాంగత్వాన్ని ఏకంగా 40 శాతానికి తగ్గించినట్లు స్పష్టం చేశారు. దీంతో తన పింఛన్ ఆపేస్తారని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంతో మందికి ఇప్పటికే ఆపేశారని, తనకు కూడా ఆపేస్తే మనం ఎలా బతకాలని భార్య లలిత(42)తో చెప్పుకుని మదనపడ్డాడు. ఇన్ని ఇబ్బందులు పడేకంటే చనిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చి శనివారం అర్ధరాత్రి దంపతులిద్దరూ పురుగు మందును ఫినాయిల్లో కలుపుకుని తాగారు. కొద్ది సేపటి తర్వాత తల్లిదండ్రులను గమనించిన వారి కుమార్తె దేవి (ఇంటర్ చదువుతోంది) భయపడిపోయింది. తల్లిదండ్రులిద్దరూ విషం తాగి మృతి చెందడంతో ఆమె కూడా అక్కడే మిగిలిపోయిన అదే విషపు ద్రావణం తాగింది. ఆదివారం ఉదయం వీరి ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో పక్క ఇంట్లో ఉంటున్న బంధువులు లోపలికి వెళ్లి చూశారు. దంపతులిద్దరూ మృతి చెంది ఉండగా, దేవి ప్రాణాలతో ఉండటం గమనించి శ్రీకాకుళం రిమ్స్కి తరలించారు. అక్కడ వైద్య చికిత్స పొందుతూ కొద్దిగా కోలుకున్న ఆమె.. ఈ మేరకు జరిగిన సంఘటనను మీడియా, బంధువులకు వివరించారు.సీఐ రాకతో మారిన సీన్ శ్రీకాకుళం రూరల్ సీఐ సీహెచ్ పైడపునాయుడు రిమ్స్కు వచ్చి దేవితో మాట్లాడారు. అధికార పార్టీ నేతల సూచన మేరకు.. తన తల్లిదండ్రులిద్దరూ పింఛన్ ఆపేస్తారనే భయంతో కాకుండా కుటుంబ గొడవల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని దేవితో చెప్పించారు. కాగా, అంత వరకూ ఎక్కడ అర్ధంతరంగా తన పింఛన్ ఆగిపోతుందేమోనని తన తండ్రి నిత్యం ఆలోచించేవారని ఆమె అక్కడ అందరికీ వివరించింది.శ్రీకాకుళం ఆర్డీఓ, గార తహసీల్దార్లు సైతం కుటుంబ వివాదాలే కారణం అని నివేదిక సమర్పించారు. వాస్తవానికి వీరిది పేద కుటుంబం. పింఛన్పై ఆధార పడి బతుకుతున్నారనేది గ్రామంలో అందరికీ తెలుసు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆ విద్యార్థినితో ఇలా చెప్పించడం తగదని చర్చ జరుగుతోంది.పింఛన్ రాదని గుండె ఆగింది!అన్నమయ్య జిల్లాలో టైలర్ మనోవేదనతో మృతిరాయచోటి టౌన్: వచ్చే నెల నుంచి పింఛన్ రాదని ఓ టైలర్ తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించాడు. దీంతో ఆ కుటుంబం వీధిన పడింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలివీ.. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని కొత్తపల్లెకు చెందిన టైలర్ మహబూబ్ బాషా (50)కు భార్య, నలుగురు పిల్లలు. అతని కుడి కన్నుతో ఏమీ కనపడకపోవడంతో కంటివైద్యుడి సంప్రదించాడు. పరీక్షల అనంతరం ఇక చూపురాదని డాక్టర్ తేల్చిచెప్పారు. దీంతో ఇంటివద్దే ఉంటున్నాడు. వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో ప్రభుత్వ పెన్షన్ వస్తోంది. ఇప్పుడిదే అతనికి ప్రధాన జీవనాధారం. ఇంతలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి పింఛన్ రాదని మున్సిపల్ కార్యాలయం నుంచి నోటీసు రావడంతో బాషా షాక్కు గురయ్యాడు. ఇంటి బాడుగ చెల్లించడంతో పాటు ఇల్లు గడిచేది ఎలాగని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతనిని రాయచోటిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు తిరపతికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.‘అంధత్వం’ కనిపించదా? ఇద్దరు అంధుల పింఛన్లు తొలగింపు కౌతాళం: కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని గుడికంబాలి గ్రామానికి చెందిన నాగమ్మ, హనుమేష్ పింఛన్లను ప్రభుత్వం అన్యాయంగా తొలగించింది. దీంతో వారు ఆదివారం తమ ఇంటి వద్ద అంధత్వ సరిఫికెట్లను చూపుతూ నిరసన తెలిపారు. తమకు పుట్టినప్పటి నుంచే అంధత్వం ఉందని, ఎంతో ఆసరా అయిన పింఛన్ను తొలగిస్తే ఎవరు అన్నం పెడతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము రూ.75 నుంచి పింఛన్ అందుకుంటున్నామని, వందశాతం అంధత్వం ఉన్నా పింఛన్ తొలగిస్తే ఎలా బతకాలి అని ప్రశ్నించారు. ఇక గుళ్లు, గోపురాల వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని వాపోయారు. ‘పింఛన్లను ఇప్పించే మార్గం చూడండి సారూ’ అంటూ వేడుకున్నారు.