breaking news
-
ఘోర ప్రమాదం: రెయిలింగ్లోకి దూసుకెళ్లిన కారు
తూర్పు గోదావరి జిల్లా: మండలంలోని సింగన్నగూడెం వద్ద జాతీయ రహదారి–30లో ఆదివారం కారు అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొంది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన పురేష్గౌడ్ (22) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన 9 మంది కూలీలు తమిళనాడుకు కూలి పనుల నిమిత్తం వెళ్లి కారులో తిరిగి స్వరాష్ట్రం వెళుతున్న క్రమంలో సింగన్నగూడెం వద్ద కొత్తగా నిర్మించిన రహదారి పక్కనే ఉన్న రెయిలింగ్ను బలంగా ఢీకొన్నారు. రెయిలింగ్ విరిగిపోవడంతో పాటు కారు ముందు భాగం నుంచి మధ్యలోని సీటు భాగంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో పురేష్ గౌడ్ కడుపులోకి రెయిలింగ్ గుచ్చుకోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలు కాగా, ఇందులో జన్మతి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం నిమిత్తం భద్రాచలం తరలించారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ బొడ్డు హేమంత్, ఎస్ఐ సురేష్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఏపీలో కల్తీ పాల కలకలం.. ఇద్దరు మృతి
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర శివారు లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్లో కల్తీపాలు తాగి పలువురు అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. చౌడేశ్వరినగర్కు చెందిన తాడి కృష్ణవేణి (85), కనకరత్నం (70) మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 8 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో వృద్ధులు, చిన్నారులున్నారు. ఒక్కసారిగా మూత్రం బంద్ కావడం, వాంతులు కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో మూడేళ్ల చిన్నారికి డయాలసిస్ చేస్తున్నారు. మరో ఇద్దరు ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు, కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిలైన సమస్యలు తలెత్తినట్టు వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారికి సరఫరా అవుతున్న పాల వల్లే ఈ సమస్య తలెత్తిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. ఎన్ని ఇళ్లకు పాలు అందజేస్తున్నారు.. ఎవరి ఆధ్వర్యంలో సరఫరా జరుగుతోంది.. ఏయే గ్రామాల నుంచి రాజమహేంద్రవరానికి పాలు వస్తున్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గణేష్ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో 150కి పైగా ఇళ్లలో పాలు పోస్తున్నట్టు తెలిసింది. ప్రజలు అస్వస్థతకు గురైన కాలనీల్లో వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేసున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని,అక్కడ పరిస్థితులను లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. మూత్రం నిలిచి.. వాంతులతో ప్రారంభమై..రాజమహేంద్రవరంలో అనూరియా (మూత్రం ఆగిపోవడం) కేసులు రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు అనూరియా లక్షణాలతో స్థానిక కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. వెంటనే ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ జిల్లా సర్వైలెన్స్ అధికారికి సమాచారం అందించడంతో అత్యవసరంగా విచారణ ప్రారంభించారు. కిమ్స్ ఆస్పత్రిని డీఎంహెచ్వో, జిల్లా సర్వైలెన్స్ అధికారి, జిల్లా ఎపిడమాలజిస్ట్తో పాటు ఎపిడమిక్ సెల్ బృందం బాధితులను పరిశీలించింది. వైద్యుల ప్రాథమిక నివేదికలు, కుటుంబ సభ్యుల వివరాలు, కేసు హిస్టరీ ఆధారంగా ఆకస్మికంగా మూత్రపిండాలు వైఫల్యం చెందినట్టు అనుమానం వ్యక్తమవుతోందని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి విచారణలో బాధితులందరూ ఒకే పాల విక్రేత నుంచి పాలు కొనుగోలు చేసి వినియోగించినట్టు గుర్తించామన్నారు. ఇటువంటి మరో నలుగురు బాధితులను ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొంతమందిని కాకినాడ ఆస్పత్రికి కూడా తరలించారు. బాధితులందరూ 60 సంవత్సరాలు పైబడిన వారు కాగా.. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లోని నాలుగు కుటుంబాలకు చెందిన వారుగా గుర్తించారు. అధికారులు స్థానికంగా పాలు, నీళ్ల నమూనాలు సేకరించారు. దీనిపై నివేదిక వచ్చిన తరువాత ఏం జరిగిందనే విషయమై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.ల్యాబ్కు నమూనాలుకల్తీ పాలతో ఇద్దరు మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురవడంతో అధికారులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అప్రమత్తం చేశారు. ఆహారం, నీరు, మల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు, ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. అనుమానిత పాల వనరును ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.5 రోజుల్లో 12 మంది బాధితులు?చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి గడచిన 5 రోజుల్లో సుమారు 12 మంది ఆస్పత్రుల పాలైనట్టు తెలిసింది. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. లాలాచెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
మా ఆయన తేడా..
ధర్మవరం అర్బన్: ‘నా భర్త నపుంసకుడు. అతనికి స్నేహితుడితో అసహజ సంబంధాలున్నాయి. నేను బయట పెడతానన్న భయంతో నన్ను చంపాలని చూస్తున్నారు’ అని ధర్మవరం పట్టణంలోని రామ్నగర్లో నివాసముండే బాధితురాలు తెలిపింది. ఈ మేరకు ఆమె శనివారం స్థానిక ఎన్జీఓ హోంలో విలేకరులకు వివరాలు వెల్లడించింది. ఆమె మాటల్లోనే... ‘నాకు 13 ఏళ్ల క్రితం రామ్నగర్కు చెందిన విద్యుత్ శాఖ లైన్మెన్తో పెళ్లయ్యింది. మొదట్నుంచే అతని ప్రవర్తనలో తేడా కనిపించింది. ఏదో ఒక కారణంతో నన్ను దూరం పెడుతూ వచ్చేవాడు. అతని ప్రవర్తనలో రోజురోజుకూ మార్పులు వచ్చాయి. రాత్రిపూట నేను నిద్రపోయిన తర్వాత బీరువాలోని నా బంగారు నగలు తీసి మెడలో వేసుకునేవాడు. చీర కట్టుకుని, అద్దం ముందు కూర్చుని సంబరపడిపోయేవాడు. కాళ్లు, చేతుల గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకుంటూ మురిసిపోయేవాడు. తోటి లైన్మెన్ నా భర్తకు క్లోజ్ ఫ్రెండ్. వారిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. రాత్రి నేను నిద్రపోయాక నా భర్త మహిళలా అందంగా అలంకరించుకుని స్నేహితుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకునేవాడు. ఇద్దరూ పక్క గదిలో నగ్నంగా పడుకునేవారు. ఒకరోజు ఈ దృశ్యం చూసి నా గుండె పగిలింది. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల బయటకు చెప్పుకోలేకపోయా. నాలో నేనే కుమిలిపోయా. వారి బాగోతం నాకు తెలిసిపోవడంతో అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధించడంతో నా తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ డబ్బులు ఇచ్చారు. అయినా వేధింపులు ఆపలేదు. నేను బతికుంటే ఏదోఒక రోజు వారి బండారం బయటకు వచ్చి జనంలో పరువు పోతుందన్న ఉద్దేశంతో చంపాలని చూస్తున్నారు. నేను భయపడి మూడేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయా. భర్త నుంచి భరణం కావాలని కోర్టును ఆశ్రయించా. అప్పట్నుంచీ నన్ను చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేను, మా నాన్న ఎక్కడికి వెళితే అక్కడికి వస్తూ ఫొటోలు, వీడియోలు తీస్తూ బెదిరిస్తున్నారు. ఈ విషయంపై ఎస్పీ సతీష్ కుమార్కు ఫిర్యాదు చేయగా..ధర్మవరం టూటౌన్ పోలీస్స్టేషన్కు పంపించారు. నా భర్తను, అతని స్నేహితుడిని టూ టౌన్ సీఐ పిలిపించి మందలించారు. అయినా మార్పు రాలేదు. వారి నుంచి ప్రాణహాని ఉంది. నన్ను రక్షించాలి. నాలా మరో ఆడపిల్ల మోసపోకూడదని వారి బాగోతం బయట పెడుతున్నా.’ భర్త, స్నేహితుడిపై కేసు నమోదు రామ్నగర్కు చెందిన మహిళను చంపుతామని బెదిరించిన భర్తతో పాటు అతని స్నేహితుడిపై కేసు నమోదు చేసినట్లు ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టామన్నారు. -
విశాఖ కేజీహెచ్లో శిశు మృతదేహం కలకలం
మహారాణిపేట (విశాఖ): నగరంలోని కేజీహెచ్లో శనివారం నవజాత శిశువు మృతదేహం గోనె సంచిలో లభ్యమైంది. సూపరింటెండెంట్ కార్యాలయం సమీపంలోని లిఫ్ట్ పక్కన, భవనాల వెనుక భాగంలో ఈ మృతదేహం కనిపించడంతో ఆస్పత్రి వర్గాల్లో కలకలం రేగింది. కొద్దిరోజులుగా అక్కడి నుంచి దుర్వాసన వస్తుండటంతో సిబ్బంది పరిశీలించగా, గోనె సంచిలో కుళ్లిన స్థితిలో శిశువు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలోని పిల్లల విభాగం, ప్రసూతి వార్డుల్లో ఈనెల 12 నుంచి జన్మించిన శిశువుల వివరాలు, మరణాల వివరాలను సేకరిస్తున్నారు. ఈనెల 12 తరువాత వివిధ అనారోగ్య కారణాలతో మృతిచెందిన ఎనిమిది మంది శిశువుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, లభ్యమైన ఈ శిశువు మృతదేహం ఎప్పటినుంచి అక్కడ ఉందనే విషయంపై వైద్య సిబ్బంది, పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వన్టౌన్ పోలీస్స్టేషన్ సీఐ పూడి వరప్రసాద్ తెలిపారు. ఆస్పత్రిలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
మైనర్ బాలుడితో కోడలు వివాహేతర బంధం..!
చిత్తూరు అర్బన్: వివాహేతర సంబంధం మోజులో భర్త, అత్తను చంపడానికి ప్లాన్ చేసిన కవిత అలియాస్ వేలాంగని (37) అనే మహిళను చిత్తూరు వన్టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గిరింపేటకు చెందిన ఈ మహిళ, ఓ మైనర్ బాలుడితో వివాహేతర బంధం ఏర్పరచుకుని.. అడ్డుగా ఉన్న తన భర్త, అత్తను చంపాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 3వ తేదీ రాత్రి ఇంట్లో అత్త ఒక్కటే ఉండడంతో ఆమె కళ్లల్లో కారం కొట్టింది ఆపై ఆమె అత్త గొంతు కోసిన మైనర్ బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ మరుసటి రోజున బాలుడిను అరెస్టు చేసి.. తిరుపతి జువెనైల్ హోమ్కు తరలించారు. పరారీలో ఉన్న మహిళను ఎస్ఐ నాగప్ప నాయక్ అరెస్టు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో చిత్తూరు నగరంలోని జిల్లా జైలుకు తరలించారు. -
ప్రేమ పేరుతో వంచన.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: కామాంధుడి వికృతానికి రాష్ట్రంలో మరో విద్యార్థిని బలైంది. ప్రేమ పేరుతో వంచించిన సీనియర్ విద్యార్థి అఘాయిత్యాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ పరిధిలో శుక్రవారం డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఉసురు తీసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాకు చెందిన ఒక కుటుంబం పిల్లల్ని చదివించుకునేందుకు ఊరొదిలి తాడేపల్లి సమీపంలోని ఓ ఊరుకు వచ్చింది. భార్యాభర్తలు కూలినాలి చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కుమారుడు విజయవాడలో చదువుతుండగా కుమార్తెను మంగళగిరిలోని ఓ డిగ్రీ కళాశాలలో చేర్చారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థినిని అదే కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న యర్రబాలేనికి చెందిన రహీమ్ ప్రేమ పేరుతో లొంగదీసుకుని శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ సమయంలో విద్యార్థినికి తెలియకుండా వీడియోలు తీశాడు. రహీమ్ ప్రవర్తనలో మార్పురావడంతో ఆ విద్యార్థిని అతడి ఫోన్ నంబర్ను బ్లాక్చేసింది. ఈ నేపథ్యంలో రహీమ్ తాను, ఆ విద్యార్థిని కలసి ఉన్న వీడియోను ఆమెకు వాట్సాప్ చేశాడు. ఈ పరిణామంతో దిక్కుతోచని ఆమె గతరాత్రి ఇంట్లో మౌనంగా ఉంది. ఏంజరిగిందని తండ్రి, అన్న అడగటంతో.. తాను ఒకరిని ప్రేమించానని, అతడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పింది. దీంతో కాలేజీకి వెళ్లవద్దంటూ మందలించిన తల్లి కుమార్తె వద్ద ఉన్న సెల్ఫోన్ తీసుకుంది. విద్యార్థిని వద్ద నుంచి స్పందన లేకపోవడంతో రహీమ్ కొన్ని వీడియోలను పలువురు విద్యార్థులకు పంపించాడు. పల్నాడు జిల్లా ఈపూరు మండలానికి చెందిన సీనియర్ విద్యార్థికి ఈ వీడియోలు పంపించినట్లు తెలియడంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది. అవమానాన్ని తట్టుకోలేక శుక్రవారం ఇంట్లో సీలింగ్ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని మృతిచెందింది. పనికి వెళ్లిన తల్లి ఇంటికి వచ్చేసరికి విగతజీవిగా ఉరికి వేళ్లాడుతున్న కుమార్తె కనిపించింది. దీంతో గుండెలు పగిలేలా రోదిస్తూ భర్తకు, కుమారుడికి సమాచారం ఇచ్చింది. ఇంటికి వచ్చిన తండ్రి ‘ఒకసారి నేనుమాట్లాడతాను. నువ్వు ఏమీ చేసుకోవద్దు. నిన్ను వేరే కాలేజీలో చేర్పిస్తాను’ అని చెప్పినా ఇలా చేసుకున్నావేంటమ్మా అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. కాలేజీలు, చదువులు బాగుంటాయని సొంత ఊరునుంచి ఇక్కడికి వచ్చి కూతుర్ని బలిచేసుకున్నానంటూ రోదిస్తున్నాడు. జరిగిన విషయాన్ని తాడేపల్లి ఎస్ఐ వెంకటసాయికుమార్కు వివరించాడు. నెలరోజులుగా బ్లాక్మెయిల్ ఆ విద్యార్థినిని రహీమ్ నెలరోజులుగా బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది. తోటి విద్యార్థుల వద్ద అది నా దగ్గరకు ఎందుకురాదు? నా కోరిక ఎందుకు తీర్చదో చూస్తాను.. అంటూ పలుమార్లు అశ్లీలంగా మాట్లాడాడని సమాచారం. గురువారం సాయంత్రం కూడా.. రేపు నాతో మాట్లాడుతుంది.. అంటూ తోటి విద్యార్థులతో చాలెంజ్ చేసిన రహీమ్ ఏకాంతంగా ఉన్న వీడియోలను ఆ విద్యార్థినికి పంపించినట్లు తెలిసింది. నాలుగు రోజులుగా వీడియోలను కాలేజీ విద్యార్థులు పలువురికి పంపించినట్లు తెలిసింది. కొందరు విద్యార్థుల ద్వారా అధ్యాపకులకు కూడా ఈ వీడియోలు షేర్ అయినట్లు సమాచారం. కనీసం అప్పుడైనా కాలేజీ యాజమాన్యం స్పందించి ఉంటే ఈ విద్యార్థిని ప్రాణాలు దక్కేవని భావిస్తున్నారు. -
కంటిపాపను కాటేసిన కామోన్మాదులు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి మానవ మృగంలా ప్రవర్తించాడు. చీకటి పడగానే కామపిశాచిలా మారిపోయి సొంత కుమార్తెపైనే కొన్నేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇదే అదునుగా మేనమామ కూడా అర్ధరాత్రి వేళ బాలికపై లైంగికదాడికి పాల్పడేవాడు. కొన్నేళ్లుగా విజయవాడ జక్కంపూడి కాలనీలో సాగుతున్న ఈ దారుణ కీచకపర్వం బాధితురాలి స్నేహితురాలు, ఓ టీచర్ చొరవతో వెలుగుచూసింది. కామోన్మాదులు ఇద్దరికీ స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ అమానుష ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రోడ్డు ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల కిందట జక్కంపూడి కాలనీకి వలస వచ్చింది. ఆ దంపతులకు ఓ ఆడపిల్ల సంతానం. భర్త పని చేయగా వచ్చిన డబ్బులతో మద్యం తాగి ఇంటిని పట్టించుకోకపోవడంతో భార్య వేరుగా వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాలిక తండ్రి వద్దే ఉండిపోయింది. ఆ పాప ఆలనాపాలన స్థానికులతోపాటు మేనత్త చూసుకోవడంతో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటోంది. ఈ క్రమంలో రోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్న తండ్రి కన్ను బాలికపై పడింది. ఆ బాలిక తండ్రి మూడు నెలల క్రితం చెల్లెలు వరసయ్యే బావమరిది భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె వారుంటున్న ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయింది. అప్పటి నుంచి మూడు నెలలుగా బాలికపై తండ్రి లైంగికదాడికి పాల్పడేవాడు. విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించేవాడు. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అర్ధరాత్రి రెండు గంటల తర్వాత మేనమామ ఇంటికి వచ్చి బాలికపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. చీకటి పడేసరికి భయకంపితురాలు కావడంతో రోజూ చీకటి పడేసరికి బాలిక కంగారుపడడం, భయం భయంగా ఉండడంతో అదే బ్లాక్లో నివసిస్తున్న స్నేహితురాలికి అనుమానం వచ్చి ఆరా తీసింది. దీంతో తనపై జరుగుతున్న అమానుషాన్ని బాధితురాలు చెప్పుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. వెంటనే ఆ స్నేహితురాలు గురువారం సాయంత్రం స్కూల్ టీచర్కు విషయం చెప్పడంతో ఆమె వెంటనే కృష్ణలంకలో ఉన్న సీడబ్ల్యూసీ అధికారులకు సమాచారం అందించారు. వారు శుక్రవారం ఉదయం జక్కంపూడి కాలనీకి వచ్చి బాలికను ప్రశ్నించగా, జరిగిన విషయం వాస్తవమేనని తేలింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో తమ మధ్యే ఉన్న మానవ మృగాలు తండ్రి, మేనమామకు దేహశుద్ధి చేశారు. ఇంతలో కొత్తపేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాలిక తండ్రిని, మేనమామను పోలీస్ స్టేషన్కు తరలించారు. బాలికను ప్రజ్వల హోమ్కు తరలించారు. కొత్తపేట సీఐ కొండలరావు బాలిక నుంచి రిపోర్టు తీసుకున్నారు. -
ఇద్దరు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): ఆన్లైన్ యాప్లలో ఇన్వెస్ట్ చేస్తే అధికలాభాలు వస్తాయని నమ్మించి మోసగించారని అందిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు బెట్టింగ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. తీగ లాగితే డొంక కదిలిన చందాన క్రికెట్ బెట్టింగ్ వెలుగులోకి వచ్చింది. ఎస్పీ అజిత వేజెండ్ల శుక్రవారం వివరాలు వెల్లడించారు. నెల్లూరు ఎన్టీఆర్ నగర్కు చెందిన ఓ వ్యాపారికి బుచ్చిరెడ్డిపాళెం రామకృష్ణానగర్కు చెందిన కె.వేణుగోపాల్తో పరిచయమైంది. ఆయన ఆన్లైన్ యాప్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ ఫోన్ నంబర్ ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన వ్యాపారి పలుమార్లు ఆ యాప్లో రూ.53 లక్షలు డిపాజిట్ చేశారు. రోజులు గడుస్తున్నా ఆదాయం రాకపోవడంతో వేణుగోపాల్ను బాధితుడు సంప్రదించగా కాలయాపన చేయడంతోపాటు ఇటీవల బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ కె.సాంబశివరావు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గురువారం రాత్రి బుచ్చిరెడ్డిపాళెంలోని ఇంటిపై దాడి చేసి వేణుతోపాటు అక్కడే ఉన్న బి.వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా క్రికెట్ బెట్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వేణుగోపాల్ అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు కలిసి రాధే ఎక్స్చేంజ్ యాప్ (ఆర్777) ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు, వెంకటరమణ బెట్టింగ్ తాలుకు నగదును తీసుకుని జూదరులకు ఇస్తున్నట్లు వెల్లడైంది. ఎవరైనా బెట్టింగ్ విషయంలో గొడవ చేస్తే కత్తులతో చంపుతామని నిందితులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. వ్యాపారికి చెందిన నగదును సైతం నిందితులు బెట్టింగ్లో పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. క్స్చేందీంతో పోలీసులు వేణుగోపాల్, వెంకటరమణను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.34,65,800 నగదు, ల్యాప్టాప్, టీవీ, 13 మొబైల్స్, రెండు కత్తులను స్వా«దీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ.1,64,74,600.60 నగదును సీజ్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష పాల్గొన్నారు. -
బొగ్గుల శ్రీనివాస్ కేసు.. కీలక ఆధారాలు లభ్యం..!
కూసుమంచి: ఈనెల 14న ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లి ఏపీకి చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంచేశారు. రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లాక డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణ నిర్వహించారు.ఆయన సోదరుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ప్రయాణించిన కారు ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మేకల వేణుమాధవ రెడ్డిదిగా గుర్తించడం, ఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఆచూకీ లేకపోవడంతో ఆ దిశగా ఆరా తీసినట్లు సమాచారం. వేణుమాధవరెడ్డి, శ్రీనివాస్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని బయటపడినట్లు తెలుస్తోంది.శ్రీనివాస్ మిత్రుడైన ఆయన తన వ్యాపార లావాదేవీల కోసం శ్రీనివాస్ జీఎస్టీ నంబర్ను దుర్వినియోగం చేస్తుండటంతో నిలదీయగా కక్ష పెంచుకుని అతనిని హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో శ్రీనివాస్ మృతి కేసు మిస్టరీ వీడనున్నట్లు తెలుస్తోంది. -
మాయమాటలు చెప్పి బాలికపై లైంగిక దాడి
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై విజయవాడ కొత్తపేట పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ లంబాడీపేట ప్రాంతానికి చెందిన బాలిక తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందాడు. తల్లి ఓ హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. స్థానికంగా కారు నడుపుతూ జీవనం సాగించే హేమంత్ నాగసాయి (23) ఆ బాలికకు పరిచయమై ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. బాలిక తల్లి ఇంట్లోలేని సమయంలో బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. కొద్దిరోజులుగా బాలికకు ఒంట్లో బాగోకపోవడంతో తల్లి ప్రశ్నించగా.. బాలిక జరిగిన విషయం చెప్పింది. అనంతరం బాలిక కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హేమంత్ నాగసాయిపై పోక్సో కేసు నమోదు చేశారు. మూడేళ్ల బాలికపై లైంగిక దాడి పెదగంట్యాడ: మూడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన విశాఖలోని గంగవరం పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గంగవరంలోని ఓ కుటుంబానికి పరిచయం ఉన్న 17 ఏళ్ల బాలుడు.. బుధవారం బాలిక ఇంటికి వచ్చాడు. బిస్కెట్లు కొనిస్తానంటూ బాలికను తన వెంట తీసుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తిరిగి ఇంటి వద్ద వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక ఏడుస్తూ, మానసిక ఆందోళనలో ఉన్నట్లు గమనించిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా, బాలిక జరిగిన ఘటనను చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకుని జువైనల్ మెజి్రస్టేట్ ముందు హాజరుపరిచి, బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. -
ఫార్మసీ విద్యార్థినులపై పచ్చమూకల లైంగిక వేధింపులు
బొబ్బిలి రూరల్: అధికార మదంతో టీడీపీ మూకలు బరితెగిస్తున్నాయి. కాలేజీకి వెళ్తున్న విద్యార్థినులను రోడ్లపై అడ్డగించి లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా.. గంజాయి మత్తులో అర్ధరాత్రిళ్లు విద్యార్థినుల ఇళ్ల తలుపులు తడుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులేమో.. అధికార నాయకుడి జోక్యంతో వారిని బయటకు వదిలేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. బొబ్బిలి మండలం కోమటిపల్లిలోని ఓ ఇంట్లో కొందరు ఫార్మసీ విద్యార్థినులు అద్దెకు ఉంటూ కాలేజీకి వెళ్లివస్తున్నారు. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పాపారావు కుమారుడు ఆవాల మణికంఠ,అతని అన్న గురువులు కుమారుడు మోహన్కుమార్, కర్రిగణేష్, పెంట వినాయక ఆ విద్యార్థినులపై కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నారు. రాత్రి వేళ గంజాయి మత్తులో విద్యార్థినులు నివసిస్తున్న ఇళ్ల వద్దకు వెళ్లి.. తలుపులుతడుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చదువుకు ఆటంకం కలుగుతుందేమోనని విద్యార్థినులు భయపడుతుండడంతో వేధింపులు మరింత అధికమయ్యాయి. బుధవారం కాలేజీకి వెళ్లే దారిలో బైక్లపై వచి్చన కామాంధులు.. విద్యార్థినులను అడ్డుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధించారు. బాధిత విద్యార్థినులు వెంటనే ఈ విషయాన్ని సహచర విద్యార్థులు, అధ్యాపకులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వారు అక్కడకు చేరుకోవడంతో.. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ గ్రామం నుంచి ఎలా బయటకు వెళ్తారో చూస్తామంటూ నిందితులు బెదిరించారు. అదే సమయంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పాపారావు అక్కడకు చేరుకుని.. ‘ఏం చేసుకుంటారో చేసుకోండి.. నేను చేయాల్సింది నేను చేస్తా. అంతు తేలుస్తా’ అంటూ బెదిరించాడు. దీంతో కాలేజీ ప్రిన్సిపాల్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు.. బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే బేబినాయనకు తెలియజేశారు. కేసుల నుంచి తమను తప్పించాలని కోరారు. ఆయన ఆదేశాలతో సీఐ నారాయణరావు.. నిందితులను బైండోవర్తో సరిపెట్టి బయటకు వదిలేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. తమకు ఫిర్యాదే అందలేదని సీఐ చెబుతున్నారు. దీంతో విద్యార్థినులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇలాగైతే తాము చదువుకునేదెలా? అని వాపోతున్నారు. విద్యార్థినులపై వేధింపుల మీద ఫిర్యాదు చేశా.. మా కాలేజీ విద్యార్థినులతో బుధవారం ఉదయం కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన అధ్యాపకులు, విద్యార్థులను బెదిరించారు. తమ గ్రామంలో ఎలా ఉంటారో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాను. – కె.రాజేష్, ప్రిన్సిపాల్, ఫార్మా కాలేజీ -
అమానుష ఘటన.. 4 ఏళ్ల చిన్నారిపై మైనర్ బాలుడి లైంగిక దాడి
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని డిగ్రీ కాలేజ్ సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 4 ఏళ్ల చిన్నారిపై ఒక మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురైయ్యారు. వెంటనే నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి గురించి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. స్థానికులు చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. -
కడతేర్చి.. కపట నాటకం
మదనపల్లె: ముక్కుపచ్చలారని ఏడేళ్ల బాలికను పొట్టన పెట్టుకున్న కులవర్ధన్ ఇంటికి పోలీసులు వెళ్లిన సమయంలోనూ.., అంతకుముందు స్థానికులతో మాట్లాడినప్పుడు నాటకీయంగా వ్యవహరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటిలోకి పోలీసులు రావడంతోనే.. ‘నా పనైపోయింది సార్’ అని చెప్పి తర్వాత బెదిరింపు ధోరణితో మాట్లాడటం.. అంతకుముందు సోమవారం రాత్రి చిన్నారిని వెతుకుతున్నారా..?, కనిపించిందా..? అంటూ ఏమీ తెలియనట్లు చుట్టుపక్కల వారిని ఆరా తీసినట్టు తెలిసింది. అతడు వ్యవహరించిన తీరు చూస్తుంటే చిన్నారి మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు తరలించాలన్న ఆలోచనతో ఉండి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. బాలిక మృతదేహం తరలించడం సాధ్యం కాకపోవడం వల్లే రాత్రంతా మృతదేహాన్ని ఇంటిలోనే ఉంచుకున్నట్టు తెలుస్తోంది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు బాలిక అదృశ్యం తర్వాత కులవర్ధన్ తీరుపై ఆసక్తికర విషయాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. పోలీసులను చూడగానే.. బెదిరింపు ధోరణితో మాట్లాడి..మంగళవారం ఉదయం పోలీసులు అనుమానితుడు కులవర్ధన్ ఇంటికి వెళ్లారు. తలుపు తట్టినా తీయలేదు. పై కప్పు కిటికీ నుంచి లోపలికి తొంగిచూడగా పడుకొని ఉన్నాడు. మళ్లీ తలుపు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లిన పోలీసులను చూడగానే.. నా పని అయిపోయింది సార్.. అని అన్నాడు. బాలిక హత్య విషయం ఇక దాగదనుకుని.. అలా మాట్లాడి ఉంటాడని తెలుస్తోంది. తర్వాత పోలీసులు ఇల్లంతా గాలించి చివరకు నీటి డ్రమ్ము మూత తీసి చూడగా బాలిక అందులో మృతదేహం ఉండటంతో వెంటనే సీఐ మొహమ్మద్ రఫీకి ఫోన్ చేశారు. ఓ పోలీసు అధికారితో కులవర్ధన్.. మూడు నెలలు జైల్లో ఉండి మళ్లీ తిరిగి వస్తాను సార్, అప్పుడు చూస్తాను అంటూ హెచ్చరిక ధోరణితో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి బంధువు కూడా అతని బెదిరింపు ధోరణిని బహిరంగంగా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే కులవర్ధన్ ప్రవర్తన ఎలాంటిదో అర్థమవుతుందని స్థానికులు అంటున్నారు. బాలిక బంధువులకు సలహాలిస్తూ... సోమవారం సాయంత్రం చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లిన కులవర్ధన్ ఆ రాత్రి 11 గంటలలోపే హత్య చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు వర్గాలు చెబుతున్న దాన్నిబట్టి పరిశీలిస్తే.. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో ఇంటిలో నుంచి బయటకు వచ్చిన కులవర్ధన్.. చిన్నారి బంధువులతో మాట్లాడాడు. పాప దొరికిందా? వెతుకుతున్నారా..? అంటూ వారినే ప్రశ్నించాడు. రోడ్లపై దుకాణాల సీసీ కెమెరాలు ఉన్నాయని, పరిశీలించాలంటూ సలహాలు కూడా ఇచ్చాడు. అంటే ఆ సమయంలో చిన్నారి అతని ఇంటిలోనే ఉన్నట్టు, అప్పటికే నీటి డ్రమ్ములో ముంచి చంపేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హత్యాచారం తర్వాత.. రాత్రంతా మద్యం సేవిస్తూనే.. సోమవారం రాత్రి తన ఇంటిలో బాలికను హతమార్చిన తర్వాత కులవర్ధన్ అక్కడే నిద్రించాడు. పోలీసులు ఇంటిలోకి వెళ్లినప్పుడు ఆరేడు ఖాళీ మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. అంటే ఈ ఘటనకు పాల్పడిన తర్వాత విపరీతంగా మద్యం సేవించి ఉంటాడని తెలుస్తోంది. ఆ మద్యం మత్తు వల్లే తలుపు తట్టినా లేవలేదని తెలుస్తోంది. పోలీసులకు దొరికిపోతానన్న ఆందోళనతో ఇలా అతిగా మద్యం సేవించి ఉండొచ్చని భావిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని తరలించాలనుకున్నాడా? కులవర్ధన్ చిన్నారిని చంపేసిన తర్వాత ఇంటి నుంచి బయటకు తరలించాలన్న యత్నం జరిగిందా అన్న అనుమానాలు అతని ప్రవర్తనను బట్టి వ్యక్తమైనట్టు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి ఘటన జరిగిన ప్రాంతంలోనే ఓ అగ్నిప్రమాదం జరగడంతో పోలీసులు అక్కడే ఉన్నారు. దాంతో ఇతను అనుకున్నది చేయలేకపోవడంతోనే.. ఇంటిలోకి పోలీసులు వచ్చినప్పుడు నా పనైపోయింది సార్ అని చెప్పి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహం దొరక్కపోయి ఉంటే తప్పించుకునే అవకాశం ఉండేదన్న భావన అతడిలో కలిగిందని చెబుతున్నారు. ఎదురింటిలోనే మృగాడున్నా.. కులవర్ధన్, అతడి చేతిలో హతమైన బాలిక నివాస గృహాలు ఎదురెదురుగానే ఉంటాయి. మధ్యలో వీధి రోడ్డు ఉంటుంది. పడమర దిశలో బాధిత చిన్నారి కుటుంబం, తూర్పుదిశలో నిందితుడు ఉంటున్న ఇల్లు ఉంది. అతడు దుర్బుద్ధి కలవాడని తెలిసినా, అనుమానం ఆ వైపు వెళ్లేసరికే ఆలస్యమైపోయింది. ఈలోపే కులవర్ధన్ బాలిక ప్రాణాలు తీసేసి తాపీగా మద్యం సేవించి నిద్రించాడు.మృగాడు ఆత్మహత్యచెరువులో శవమై కనిపించిన బాలిక హత్యాచార కేసు నిందితుడు అదుపులోకి తీసుకున్నాక రక్షక్ వాహనం నుంచి తప్పించుకున్నాడన్న ఎస్పీ రెండు బృందాలు గాలిస్తుండగా చెరువులో మృతదేహం గుర్తించామని వెల్లడిమదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై హత్యాచారం చేసిన నిందితుడు కులవర్ధన్(27) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం కనసానివారిపల్లె వద్ద హైవే సర్వీసు రోడ్డు పక్కనున్న తిరుగంగులప్ప చెరువులో అతడి మృతదేహాన్ని బుధవారం ఉదయం గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి మదనపల్లెలో మీడియా సమావేశంలో కేసు వివరాలు ప్రకటించారు. ఆయన కథనం ప్రకారం... ‘‘సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యంపై ఫిర్యాదు అందగానే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మంగళవారం ఉదయం బాలిక ఇంటికి ఎదురింట్లో నివసిస్తున్న కులవర్ధన్పై అనుమానంతో పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. తలుపులు వేసుకుని లోపలే ఉండడంతో గడియ పగులగొట్టి లోపలికి వెళ్లారు. బాలిక మృతదేహాన్ని నీటి డ్రమ్ములో పోలీసులు గుర్తించి నిందితుడైన కులవర్ధన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆగ్రహంతో ఉన్న 50 మంది గ్రామస్తులు గుమిగూడి అతడిపై దాడికి యత్నించారు. పోలీసులు రక్షక్ వాహనంలో తరలిస్తుండగా, ప్రజలు ఆందోళన చేస్తూ రహదారిని స్తంభింపజేశారు. ఈ క్రమంలో రక్షక్ వాహనం ఆగినప్పుడు కులవర్ధన్ పరారయ్యాడు. ఆ సమయంలో రక్షక్ వాహనం డ్రైవర్ ఒక్కడే ఉండడంతో కులవర్ధన్ను పట్టుకోలేకపోయాడు. నిందితుడి ఆచూకీ కోసం రెండు బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. బుధవారం ఉదయం కనసానివారిపల్లె వద్ద చెరువులో గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని సమాచారం వచ్చింది. వెళ్లి చూడగా కులవర్ధన్దిగా నిర్ధారణ అయింది. అతడు భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కులవర్ధన్పై గతంలో ఒక కేసు ఉంది. ఫిర్యాదితో లోక్ అదాలత్లో కేసు రాజీ చేసుకున్నాడు. కురబలకోట మండలం కనసానివారిపల్లె వీఆర్వో సుస్మిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు’’ అని ఎస్పీ వెల్లడించారు. బాలికకు అంత్యక్రియలు వీరబల్లి: హత్యాచారానికి గురైన బాలిక అంత్యక్రియలు బుధవారం జరిగాయి. వైఎస్సార్సీపీ ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు స్థానిక నాయకులు హాజరై బాలికకు కన్నీటి నివాళులు అర్పించారు. -
అత్తపై పెట్రోలు పోసి నిప్పంటించిన అల్లుడు
పల్నాడు జిల్లా: అత్తపై అల్లుడు పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. దాచేపల్లికి చెందిన వాసం లక్ష్మిపై ఆమె అల్లుడు శ్రీనివాసపురానికి చెందిన జక్కా రవి పెట్రోలు పోసి నిప్పంటించడంతో శరీరం కొంత మేర కాలింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... తన కుమార్తె లావణ్యకు జక్కా రవితో వివాహం చేశారు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతుంది. భర్త వేధింపులు భరించలేని లావణ్య పుట్టింటికి వచ్చింది. మంగళవారం రాత్రి దాచేపల్లిలోని అత్త ఇంటికి వచ్చిన రవి అత్త, భార్యతో గొడవ పడ్డాడు. రవి తనతోపాటు తెచ్చుకున్న పెట్రోలు అత్తపై పోసి నిప్పంటించాడు. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి రక్షించారు. దాడిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు పట్టించుకోలేదు.దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి అద్దంకి –నార్కెట్పల్లి హైవేపై బైఠాయించి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. రవి కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కూటమి నేతలు తీవ్ర ఒత్తిడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయలేకపోయారు. దీంతో బాధితురాలు ఆందోళన చేయాల్సి వచ్చింది. -
మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతి
సాక్షి, అన్నమయ్య జిల్లా: మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతిచెందాడు. కురబలకోట మండలం కరసానివారిపల్లి చెరువులో మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి ముదివేలు పోలీసులు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఆమెపై నిందితుడు లైంగికదాడి చేసి, ఆపై హత్య చేశాడు. మదనపల్లె పట్టణంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత గాలించినా జాడ కానరాలేదు. దీంతో ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.రాత్రంతా ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబీకులు అనుమానంతో బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే కులవర్ధన్ అనే వ్యక్తిపై మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కులవర్ధన్ ఇంటికి చేరుకున్నారు. లోపల తలుపులు వేసుకుని కులవర్ధన్ ఎంతకీ తీయకపోవడంతో పోలీసులు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం కనిపించింది. -
AP: బ్యూటీ పార్లర్ మహిళతో ఎస్ఐ సహజీవనం..!
విజయనగరం క్రైమ్: జిల్లాలో ఓ పోలీసు అధికారి అనుసరించిన వ్యవహారం సర్వత్రా చర్చకు దారితీసింది. ఖాకీ దుస్తులు వేసుకున్న ఓ ఇన్స్పెక్టర్ స్థాయి యవ్వారం ఇప్పుడు హాట్ టాఫిక్ అయ్యింది. న్యాయం చేయాల్సిన ఓ పోలీస్ అధికారే మహిళను మోసం చేస్తున్నారన్న గుసగుసలు ఆ శాఖలోనే వినిపిస్తున్నాయి. విజయనగరం వన్ టౌన్ పోలీస్స్టేషన్లో ఆ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారి ఆ శాఖే ఖంగుతింది. విజయనగరంలో పార్లర్.. గంట్యాడకు చెందిన ఓ మహిళ విజయనగరంలో బ్యూటీ పార్లర్ నడుపుతోంది. గతంలో విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఓ పోలీస్ అధికారి ఆమెకు గాలం వేసినట్టు తెలిసింది. అయితే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో వదిలించుకునే చర్యలు చేపట్టారట. అతడికి భార్య, పిల్లలు ఉన్న విషయాన్ని తెలుసుకున్న పార్లర్ నడుపుతున్న మహిళ తనను ఎక్కడ వదిలించుకుంటాడేమోనని.. తనకు దక్కించుకునే చర్యలు చేపట్టింది. కొన్నాళ్లు ఇద్దరి మధ్య ఆ యవ్వారం నడిచిందట. బదిలీతో దూరం.. ఆ ఎస్ఐకి వేరొక ప్రాంతానికి బదిలీ అయ్యింది. దీంతో ఇద్దరి మధ్య సంబంధం చెడింది. సదరు పోలీస్ అధికారి దూరం వెళ్లడం, ఆమెను కలవడం మానేశారు. దీనిపై ఆమె పోలీస్ అధికారిని నిలదీసి, తనకు, బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇక లాభం లేదనుకుని ఆమె ఏకంగా ఐజీ వద్దే పంచాయితీ పెట్టింది. ఈ వ్యవహారాన్ని సద్దుమణిగించేందుకు సదరు పోలీస్ అధికారి బాధిత మహిళకు డబ్బులు ఆశ చూపినట్లు సమా చారం. ఒకటి, రెండు కాదు నాలుగు లక్షలు.. అయితే ఆమె మాత్రం నన్ను, నా బిడ్డను సాకాలని, ఆపై నన్ను ఏలుకోవాలని నాకు డబ్బులు వద్దంటూ తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే ఈ ఖాకీ పంచాయితీ ఎస్పీ వరకు వెళ్లడం, ఐజీ దృష్టిలో పడడంతో పోలీసు శాఖ మొత్తం విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు సమాచారం. ఫిర్యాదు వచ్చింది తనకు రక్షణ కావాలంటూ ఓ మహిళ విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తాను సీఐగా చార్జ్ తీసుకోక ముందు అప్పటి ఇన్చార్జ్ సీఐగా ఉన్నప్పుడు ఫిర్యాదు వచ్చింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ ఆరీ్వ.కె.చౌదరి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం
సాక్షి,పాడేరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గిరిజన యువకులు మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. పాడేరు మండలం వంతరపాడు గ్రామానికి చెందిన గెమ్మెలి రమేష్(25), హుకుంపేట మండలం గొందిరాపకు చెందిన రేగం సూర్యప్రకాష్(28), తడిగిరి పంచాయతీ ముల్లుమెట్ట గ్రామానికి చెందిన సీదరి పౌలు(18) సోమవారం మత్స్యగుండం జాతరకు వెళ్లారు. తిరిగి ముగ్గురు బైక్పై బయలుదేరారు. రమేష్ వాహనాన్ని నడుపుతుండగా మిగిలిన ఇద్దరు వెనుక కూర్చున్నారు. గుత్తులపుట్టు సంతబయలు దగ్గరలోని మలుపు వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పి దూసుకుపోయి విద్యుత్ స్తంభాల ప్రాంతంలో ప్రహరీని ఢీకొట్టింది. ఈ ఘటనలో రేగం సూర్యప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ఇద్దరూ తీవ్రగాయాలతో రోడ్డుపై పడి ఉన్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన యువకులు 108కు సమాచారం ఇవ్వగా క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా..గెమ్మెలి రమేష్ మృతి చెందాడు. సీదరి పౌలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పాపినాయుడు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. -
కంటి‘పాప’ను చిదిమేశాడు
సర్కారు నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలారని మరో పసిపాప బలైపోయింది. మత్తెక్కిన నర రూప రాక్షసుడి కబంధ హస్తాల్లో విలవిల్లాడి విగతజీవిలా మారిపోయింది. కామాంధుడి పైశాచికత్వానికి డ్రమ్ములో నిర్జీవంగా దర్శనమిచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన మాతృహృదయాలు తల్లడిల్లిపోయాయి. ఇన్నాళ్లూ అల్లారుముద్దుగా, కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ హృదయవిదారక ఘటనపై అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె కదిలిపోయింది. చలనం లేని మొద్దు సర్కారుపై కన్నెర్రజేసింది. తక్షణం న్యాయం చేయాలని నినదించింది. మదనపల్లె / మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైంది. ఆమెపై నిందితుడు లైంగికదాడి చేసి, ఆపై హత్య చేసినట్టు కర్నూలు రేంజ్ డీఐజీ కోయప్రవీణ్ మంగళవారం రాత్రి ప్రకటించారు. మదనపల్లె పట్టణంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత గాలించినా జాడ కానరాలేదు. దీంతో ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రాత్రంతా ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబీకులు అనుమానంతో బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే కులవర్ధన్ అనే వ్యక్తిపై మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కులవర్ధన్ ఇంటికి చేరుకున్నారు. లోపల తలుపులు వేసుకుని కులవర్ధన్ ఎంతకీ తీయకపోవడంతో పోలీసులు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం కనిపించింది. నిందితుడే చిన్నారిపై లైంగిక దాడి చేసి డ్రమ్ములో పెట్టాడని తెలియడంతో బాలిక తల్లిదండ్రులు, బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రజలూ ఈ ఘటనపై రగిలిపోయారు. దీంతో పట్టణంలో ఒక్కసారిగా ఆందోళనలు మిన్నంటాయి. సర్కారు, పోలీసుల తాత్సారం, నిర్లక్ష్యంపైనా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితుడిని తమకు అప్పగించాలని తల్లిదండ్రులు, బంధువులు పట్టుబట్టారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించడాన్ని అడ్డుకున్నారు. ఎట్టకేలకు కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించడానికి అంగీకరించారు. లైంగిక దాడి చేసి, హత్య చేశాడు: డీఐజీ కులవర్ధన్ బాలికపై లైంగిక దాడి చేసి.. ఆపై నీటి డ్రమ్ములో ముంచి హత్య చేశాడని డీఐజీ కోయ ప్రవీణ్ మంగళవారం రాత్రి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము ఇంటి తలుపులు పగలగొట్టి బాలిక మృతదేహాన్ని గుర్తించామని, అయితే నిందితుడు పరారయ్యాడని, అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని వివరించారు. నిందితుడి ఇంటిపై నిఘా పెట్టామని వెల్లడించారు. ఎస్పీ, సబ్ కలెక్టర్ ప్రయత్నం విఫలం బాలిక హత్యాచారాన్ని నిరసిస్తూ మదనపల్లె అన్నమయ్య సర్కిల్ జాతీయ రహదారిపై ప్రజలు మంగళవారం ఉదయం నుంచే ఆందోళన చేపట్టారు. బాలిక తల్లి ప్రజలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించింది. గంటలు తరబడి ఆందోళన కొనసాగించారు. ఎస్పీ, మదనపల్లె డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, రాయచోటి డీఎస్పీ కృష్ణ్ణమోహన్ మదనపల్లె చేరుకున్నారు. బాలిక తల్లితో చర్చించారు. నిరసన విరమించాలని కోరారు. అయినా తల్లి అంగీకరించలేదు. న్యాయం చేయాలని ఎస్పీ, సబ్ కలెక్టర్ను వేడుకుంది. పోలీస్ గోబ్యాక్ అని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కులవర్ధన్ సైకో: బాలిక తండ్రి తన బిడ్డను పొట్టన పెట్టుకున్న కులవర్ధన్ సైకో అని బాలిక తండ్రి హోం మంత్రి అనితతో తన ఆవేదన వెలిబుచ్చాడు. బాలిక మరణంపై అనిత ఫోన్లో తల్లిదండ్రులతో మాట్లాడారు. తన బిడ్డను చంపిన వ్యక్తిపై తక్షణం చర్యలు తీసుకోవాలని తండ్రి డిమాండ్ చేశాడు. బాలిక మరణంపై ఆధారాలు సేకరించాలంటే పోలీసులకు సహకరించాలని మంత్రి కోరారు. నిందితుడికి బెయిల్ రాకుండా జైలులోనే ఉంచి, ఆపై శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత మంత్రి బాలిక తల్లితో మాట్లాడారు. కాగా, నిందితుడు పారిపోయాడని పోలీసులు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. తలుపులు వేసుకుని లోపలే ఉన్న అతను ఎలా పారిపోయాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నిందితుని ఇల్లు ముట్టడి, ఉద్రిక్తత నిందితుడు కులవర్ధన్ ఇంటిని మంగళవారం ఉదయం స్థానిక ప్రజలు ముట్టడించారు. చిన్నారిని చిదిమేసిన ఉన్మాదిని తక్షణమే శిక్షించాలని పట్టుబట్టారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు బిడ్డకు న్యాయం జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు, అధికారులు వచ్చి చెప్పినా వినలేదు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, డీఎస్పీ మహేంద్ర విజయవాడ వెళ్లడంతో సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు జాప్యం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రజలు నిందితుడి ఇంటివద్దే సాయంత్రం వరకు ఉన్నారు. రాక్షసుడిని తమకు అప్పగించాలని పట్టుబట్టారు. దీంతో రాకపోకలు స్తంభించాయి. గంజాయికి బానిస నిందితుడు కులవర్ధన్ గంజాయికి బానిసని స్థానికులు చెబుతున్నారు. అతడికి నేరచరిత్ర కూడా ఉన్నట్టు సమాచారం. స్థానికులు చాలాసార్లు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెబు తున్నారు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా గంజాయి మత్తులోనే ఉన్నాడని, అందువల్లే తలుపులు తట్టినా తీయలేదని పోలీసులే చెబుతున్నారు. -
సిద్ధార్థ్రెడ్డికి జైలు
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన వర్ధమాన సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం, దశాబ్దాల నిరీక్షణ అనంతరం సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిని దోషిగా తేలుస్తూ, అతనికి విధించిన శిక్షను అనుభవించేందుకు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి, శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. తుది తీర్పును వెల్లడించింది. మెరిట్స్ లేవంటూ సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ను కొట్టివేసింది. గత నవంబర్లో వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు–12 కీలక పాయింట్లు జస్టిస్ మనోజ్ మిశ్రా తీర్పును చదువుతూ 12 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు వెల్లడించారు. హత్య అనే వాదన చెల్లదు: ప్రత్యూషను గొంతు నులిమి చంపారన్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేవు. హత్య కోణాన్ని కోర్టు తోసిపుచ్చింది. విషమే ప్రాణం తీసింది: అందుబాటులో ఉన్న మెడికల్ రిపోర్టులు, ప్రత్యక్ష సాక్ష్యాల ప్రకారం.. ఆమె మరణం కచ్చితంగా విషం తీసుకోవడం వల్లనే సంభవించినట్లు రూఢీ అయ్యింది. అత్యాచారం జరగలేదు: సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూ షపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాలేదు. ఆలస్యపు ఆరోపణలు: కేసు విచారణ చాలా కాలం జరిగా క, ఆలస్యంగా అత్యాచారం, హత్య జరిగిందంటూ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవడం కష్టసాధ్యం. డాక్టర్ మునిస్వామిపై ఆగ్రహం: ఈ కేసులో అత్యంత కీలకమైన పోస్టుమార్టం నివేదికను అందించిన డాక్టర్ బి.మునిస్వామి తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆయన సమర్పించిన నివేదిక ’అన్ప్రొఫెషనల్’గా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముందస్తు లీకులు: నివేదికను అధికారికంగా సమర్పించకముందే, అసంపూర్తి సమాచారాన్ని బయటపెట్టడం వల్ల కేసు దారి మళ్లిందని, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. సాక్షి నం. 34 కీలకం: సాక్షి నంబర్ 34 వాంగ్మూలం విశ్వసనీయంగా ఉందని, అది తీర్పులో కీలకపాత్ర పోషించిందని ధర్మాసనం తెలిపింది. నిందితుడికి వ్యతిరేకంగా: పరిస్థితుల ప్రభావం, సాక్ష్యాలు స్పష్టంగా నిందితుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రమాదవశాత్తు కాదు: కూల్డ్రింక్లో ఏదో కలిపామని, అది ప్రమాదవశాత్తు జరిగిందన్న డిఫెన్స్ వాదనను కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. విషం కొన్నది అతడే: ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించిన ’నొవాక్రాన్’అనే పురుగుల మందును సిద్ధార్థ్ రెడ్డే కొనుగోలు చేశాడన్న విషయం రుజువైంది. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడమే. ఆ తీర్పు వర్తించదు: వెల్లూరు కేసులో ఇచ్చిన తీర్పును ఈ కేసులో అన్వయించుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. సర్వైవింగ్ పార్ట్నర్దే బాధ్యత: ఇది అత్యంత కీలకమైన అంశం. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. అందులో ఒకరు చనిపోయి, మరొకరు బతికితే.. చట్టప్రకారం బతికున్న వ్యక్తి ఆ మరణానికి బాధ్యుడవుతాడు. ఈ చట్టపరమైన అంశం ఆధారంగానే సిద్ధార్థ్రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది.ఆ రోజు ఏం జరిగింది? 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం.. సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. అప్పుడప్పుడే వెండితెరపై తళుక్కుమంటున్న యువనటి ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిలు పెద్దలు పెళ్లికి అంగీకరించలేదన్న కారణంతో ఆత్మహత్యకు యత్నించారు. కూల్డ్రింక్లో విషం (పురుగుల మందు) కలుపుకొని తాగారు. వెంటనే ఇద్దరినీ హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష కన్నుమూసింది. సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రత్యూష మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది ఆత్మహత్య కాదని, సిద్ధార్థ్ రెడ్డే ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఆరోపించారు. సిద్ధార్థ్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉండటంతో కేసును నీరుగారుస్తున్నారని అప్పట్లో ఆందోళనలు జరిగాయి. తొలుత ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు.. సిద్ధార్థ్ రెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించిన దోషిగా తేల్చుతూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. దీనిపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టుకు వెళ్లగా, శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. -
రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి దుర్మరణం
వల్లూరు (చెన్నూరు): కడప పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి రిషిక(23) దుర్మరణం చెందింది. వివరాల్లోకెళ్తే.. కేరళకు చెందిన రిషిక, ఎమీ సుశాన్, అభి, అనుగ్రహ, భావ్యతో పాటు విశాఖ పట్టణానికి చెందిన ఠాగూర్ రెడ్డి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) కళాశాలలో బీఎస్ఎమ్ఎస్ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్నారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో వీరు రెండు ద్విచక్ర వాహనాల్లో శనివారం ఉదయం వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటకు విహారయాత్రకు బయలుదేరారు. కడప పట్టణం సమీపంలోని ఆలంఖాన్ పల్లె వద్ద ఉన్న ఇర్కాన్ సర్కిల్ వద్ద ఠాగూర్రెడ్డి నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. వెనుక కూర్చొన్న రిషిక రోడ్డుపై పడిపోగా ట్యాంకర్ ఆమెపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నూరు పోలీసులు తెలిపారు. -
ఊయలే ఉరి తాడైంది
వెల్దుర్తి: ఊయలే ఆ బాలుడికి ఉరి తాడైంది. ఏడేళ్లకే అందని లోకాలకు చేర్చింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కలుగొట్లలో గురువారం చోటు చేసుకుంది. వివరాలివీ.. గ్రామానికి చెందిన అహ్మద్బాషా, హసీనాబీలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. చిన్న కుమారుడు అఫ్రోజ్(7) రెండో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా తట్టు వ్యాధితో బాధపడుతూ ఇంట్లో ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన అఫ్రోజ్ ఇంటి ఆవరణలోని రేకుల షెడ్కు కట్టిన చీర ఊయలలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ చీర మెడకు బిగుసుకుంది. భోజనం ముగించుకుని బయటకు వచ్చిన తల్లిదండ్రులు కుమారుడి మెడకు ఊయల బిగుసుకుని కనిపించడంతో ఆందోళన చెందారు. చీరను తప్పించి చూడగా మృతి చెందినట్లు గుర్తించారు. కళ్ల ముందు విగతజీవిగా మారిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
చిత్తూరులో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
సాక్షి, చిత్తూరు: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కంటైనర్ వాహనం కారును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. చిత్తూరు జిల్లాలోని ఇరువారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
హాల్ టికెట్ తీసుకొస్తూ.. అనంత లోకాలకు..
తూర్పు గోదావరి జిల్లా: పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్ తీసుకుని తిరిగి వస్తుండగా, జాతీయ రహదారి 216లోని పోలేకుర్రు చెక్పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం పాలైంది. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ, స్థానికుల కథనం ప్రకారం.. యానాం పెదపూడి వీధికి చెందిన మహ్మద్ మోమినా తన్వీర్ (21), సయ్యద్ అఫ్రీన్ సుల్తానాలు పటవల పైడా విద్యా సంస్థలో ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్నారు. శుక్రవారం నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరూ ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళ్లి హాల్ టికెట్లు తీసుకున్నారు. తిరిగి వస్తుండగా పోలేకుర్రు చెక్పోస్టు వద్ద టిప్పర్ ఢీకొనడంతో తన్వీర్ కింద పడిపోయింది. ఆమె తలపై నుంచి టిప్పర్ వెళ్లిపోవడంతో నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా సుల్తానా రెండో వైపునకు పడడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతురాలి తండ్రి జిలానీ యానాం మార్కెట్లో చికెన్ షాపు నిర్వహిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె అర్ధాంతరంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తనీ్వర్ సోదరుడికి రెండు నెలల క్రితం వివాహమైందని, ఇంతలోనే ఇంతటి విషాదం జరగడం దారుణమని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చెక్పోస్టు నిర్వహణ వల్లే.. జాతీయ రహదారిలోని మలుపులో చెక్పోస్టు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు. అటు అమలాపురం నుంచి, ఇటు యానాం నుంచి వాహనాలు వేగంగా వచ్చే ప్రాంతం, చెక్పోస్టు వద్ద అనేక బారికేడ్లు ఏర్పాటు చేయడం, నిర్వహణ సక్రమంగా చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, ప్రజాప్రతినిధులు స్పందించి చెక్పోస్టును సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. -
బీభత్సం సృష్టించిన అంబులెన్స్.. మహిళ మృతి
పశ్చిమగోదావరి: అత్యవసర స్థితిలో ఉన్న వా రిని ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు నిలబెట్టే అంబులెన్స్ మృత్యు శకటంగా మారింది. వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. బైక్, ఆటోను అంబులెన్స్ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం మండలంలోని సీతారామపురం టోల్ప్లాజా సమీపంలో మొగల్తూరు వైపు నుంచి నరసాపురం వస్తున్న ఓ ప్రైవేట్ అంబులెన్స్ ముందు వెళుతున్న బైక్ను బలంగా ఢీకొట్టింది. అలాగే అదుపు తప్పి పక్కన వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. మొగల్తూరు బండి ముత్యాలమ్మ ఆల యానికి వెళ్లి తిరిగి స్వగ్రామం యలమంచిలిలంకలోని వైవిలంకకు బైక్పై వెళుతున్న పిప్పళ్ల శ్రీవెంకట మోహన కృష్ణ, అతడి తల్లి, చినమ్మ సత్యలక్ష్మీ పద్మశ్రీ (40)కి తీవ్రగాయాలయ్యాయి. అలాగే ఆటోలోని డ్రైవర్తో పాటు ఇద్దరికీ గాయాల య్యాయి. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. తీవ్రగాయాలైన పద్మశ్రీని పాలకొల్లు తరలిస్తుండగా ఆమె మరణించింది. మృతురాలి భర్త నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నరసాపురం రూరల్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
సీతారామపురం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆదివారం నిద్రమాత్రలు మింగి స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన సహచర సిబ్బంది ఆమెను వింజమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందారు. అనంతరం స్వగ్రామం ఉదయగిరి వెళ్లిన ఆమె అక్కడ పాత్రికేయులతో మాట్లాడారు. ఉదయగిరి సీఐ వెంకట్రావు.. ఇటీవల సస్పెన్షన్కు గురైన సీతారామపురం ఎస్ఐ శివకృష్ణారెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో తనకు ఎస్ఐతో వివాహేతర సంబంధాన్ని అంటగట్టి సీఐ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారాన్ని అందించారని ఆరోపించారు.అందువల్లే ఎస్ఐ శివకృష్ణారెడ్డి సస్పెన్షన్కు గురయ్యారని చెప్పారు. తిరిగి ఎస్ఐపై ఉన్నతాధికారులకు తప్పుడు ఆరోపణలు చేసి అతని సస్పెన్షన్కు కారణమయ్యానని తనపైనే సీఐ నిందలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత కుటుంబానికి చెందిన తనతో సీఐ ఐదు నెలలుగా అవమానకరంగా మాట్లాడుతున్నారని, వీటిపై ప్రశ్నించినందుకు తనపై కక్షగట్టి నిందారోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వంపై ప్రతి ఒక్కరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని వివరించారు.


