YSRTP President YS Sharmila Comments On CM KCR - Sakshi
Sakshi News home page

కోకాపేట భూముల్ని కారుచవకగా కొల్లగొట్టిన కేసీఆర్‌

Published Fri, Aug 18 2023 6:44 AM

YS Sharmila comment on KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ రాయించుకున్న కోకాపేట భూములను వెంటనే ప్రభుత్వపరం చేయాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఎకరం రూ.100 కోట్ల లెక్కన రూ.1100 కోట్లను చెల్లించాలని గురువారం ట్విట్టర్‌ వేదికగా కోరారు.

జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ కార్యాల యాల పేరిట రూ.వెయ్యి కోట్ల విలువైన 33.72 ఎక రాల భూములను రూ.3 కోట్లకే అప్పనంగా కొట్టేశా రని ఆరోపించారు. ఎకరం రూ.100 కోట్లు పలికే కోకాపేటలో బీఆర్‌ఎస్‌ భవనం కోసంరూ.3.41 కోట్లకే 11 ఎకరాలు దోచేశారని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement