హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు స్వల్పగాయమైంది. హిమాన్షుకు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. కొన్ని రోజుల్లో కోలుకుంటారని కేటీఆర్ ఎక్స్లో చెప్పారు. తన కుమారుడి గురించి కాల్స్, మెసేజ్లు చేస్తున్న వారికి థ్యాంక్యూ చెప్పారు.
తన మనవడు హిమాన్షును చూడడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. హిమాన్షుతో కాసేపు మాట్లాడి పరామర్శించారు. కాగా, హిమాన్షు జిమ్ చేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన ముక్కుకు గాయమైనట్లు సమాచారం.
My son Himanshu suffered a minor sports injury yesterday evening and is undergoing treatment
He should be back to being normal in a few days. Thank you to all who’ve been calling and texting with concern— KTR (@KTRBRS) July 7, 2026


