TSPSC Case: విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్‌, విప్రో ఉద్యోగి అరెస్ట్‌

Two More Arrested In TSPSC Paper Leak Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే పలువురు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. దీంతో ఈ కేసులో అరెస్ట్‌ అయిన వారి సంఖ్య 46కు చేరుకుంది.  

వివరాల ప్రకారం.. వరంగల్‌ విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ రమేశ్‌, విప్రోలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉన్న నర్సింగరావు అరెస్ట్‌ అయ్యారు. కాగా, నర్సింగరావు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ కుమార్‌కు స్నేహితుడు. ఇక, ఏఈఈ పేపర్‌కు ప్రవీణ్‌.. నర్సింగరావుకు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. రవి కిషోర్‌ నుంచి రమేశ్‌ పేపర్లను కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణల బీజేపీ దుకాణం బందైనట్టే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top