
వివాహ బంధంతో ఒక్కటైన జంట
మోత్కూర్, నల్గొండ జిల్లా: అమెరికాకు చెందిన యువతితో మోత్కూర్ మండలం దాచారం గ్రామానికి చెందిన యువకుడికి వివాహం(Marriage) జరిగింది. దాచారం గ్రామానికి చెందిన జినుకల లలిత, ధర్మయ్య దంపతుల ప్రథమ కుమారుడు సందీప్కుమార్(Sandeep Kumar) ఉన్నత చదువుల కోసం పదేళ్ల క్రితం అమెరికాకు(America) వెళ్లాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తిచేసి టెక్సాస్ రాష్ట్రంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా(Software Engineer) పనిచేస్తున్నాడు.
అమెరికా దేశానికి చెందిన మరీయా డిలారోసా, అర్మాండో హెర్నాండేజ్ దంపతుల కుమార్తె అవని ఏలేనా ఎంబీఏ పూర్తిచేసి సందీప్కుమార్ పనిచేసే కంపెనీలోనే మేనేజర్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో సందీప్కుమార్, ఏలేనా మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాల అంగీకారంతో హిందూ సాంప్రదాయం ప్రకారం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని రాక్ ఎన్క్లేవ్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం వివాహ బంధంతో వారిద్దరు ఒక్కటయ్యారు.