సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భూదాన్ పోచంపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో పెద్ద రావులపల్లిలో తల్లిని కుమారుడు హత్య చేశాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.