దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి.. | Massive Road Accident at Outer Ring Road | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి..

May 5 2025 1:50 PM | Updated on May 5 2025 1:50 PM

Massive Road Accident at Outer Ring Road

    ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం 

    ఇద్దరు యువకుల దుర్మరణం  

    మరో నలుగురికి గాయాలు   

కీసర(హైదరాబాద్): కొద్దిసేపట్లో ఇంటికి చేరుకోవాల్సిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. దైవ దర్శనం చేసుకుని వెళ్లి వస్తుండగా మృత్యువు కబళించింది. కీసరలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆదివారం జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కీసర ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 

మేడ్చల్‌– మల్కాజిగిరి జిల్లా మేడిపల్లికి చెందిన యశ్వంత్‌ (25), పీర్జాదిగూడకు చెందిన చార్లెస్‌ (25), ఎల్‌బీనగర్‌కు చెందిన చెన్నకేశవ గౌడ్‌ (23), వివేక్, సురేష​​, యశ్వంత్‌ నాయక్‌ శనివారం ఉదయం కారులో కర్ణాటక బీదర్‌లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లారు. అనంతరం ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. యశ్వంత్‌ కారు నడుపుతుండగా, చార్లెస్‌ ముందు సీట్లో కూర్చున్నాడు. మిగతవారు వెనక సీటులో ఉన్నారు. ఉదయం 11:15 గంటల సమయంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కీసర ఎగ్జిట్‌ దాటిన తర్వాత ముందున్న గ్యాస్‌ కంటెయినర్‌ లారీని కారు ఢీకొట్టి, డివైడర్‌కు తగిలింది. ఈ ఘటనలో యశ్వంత్‌తో పాటు చార్లెస్‌ అక్కడికక్కడే మృతి చెందారు.

 చెన్నకేశవ గౌడ్‌ తీవ్రంగా గాయపడటంతో వైద్యం కోసం ఎల్‌బీనగర్‌లోని కామినేని హాస్పిటల్‌లో చేర్పించారు. మిగతా ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిని చికిత్స కోసం ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలో చేర్చించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement