సాక్షి, హైదరాబాద్: ఇటీవల పెరిగిన గుండెపోటు మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. నగరంలోని హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. బ్యాంకులో నగదు డిపాజిట్ కోసం వచ్చిన రిటైర్డ్ ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి.
హబ్సిగూడ బ్యాంక్కు వచ్చిన నాచారానికి చెందిన లక్ష్మినారాయణ.. పీన్ఎన్బీ బ్యాంక్లో డిపాజిట్ ఫారం నింపుతుండగా గుండెపోటుకు గురయ్యారు. బ్యాంక్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు.



