రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు  | Increased temperatures in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు 

Feb 29 2024 1:27 AM | Updated on Feb 29 2024 9:52 AM

Increased temperatures in the state - Sakshi

ఖమ్మంలో అధికంగా 36.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు 

వాతావరణ శాఖ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు 2 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదవుతున్నాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత హకీంపేట్‌లో 18.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. చాలాచోట్ల గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి.

ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సీయస్‌ అధికంగా నమోదు కాగా...ఆదిలాబాద్‌లో 2 డిగ్రీల సెల్సియస్, మిగతాచోట్ల ఒక డిగ్రీల సెల్సియస్‌  మేర అధికంగా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఉంటుందని, తేమశాతం తగ్గడంతో ఉక్కపోత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement