ఇల్లెందుకు ‘సీతారామ’ నీళ్లివ్వండి | Gummadi Narsayya met the CM in the chamber and presented a petition | Sakshi
Sakshi News home page

ఇల్లెందుకు ‘సీతారామ’ నీళ్లివ్వండి

Mar 19 2025 4:26 AM | Updated on Mar 19 2025 4:26 AM

Gummadi Narsayya met the CM in the chamber and presented a petition

సీఎంకు విన్నవించిన మాజీ ఎమ్మెల్యే నర్సయ్య 

సాక్షి, హైదరాబాద్‌: సీతారామ ప్రాజెక్టు నీటిని ఇల్లెందు నియోజకవర్గానికి తరలించాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, బోడు, కొమరారం మండలాల ఏర్పాటు, ఇల్లెందు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య.. సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. మంగళవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. 

దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు, అఖిలపక్షాలతో భేటీ ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్‌కు సీఎం సూచించారు. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు ఊకె అబ్బయ్య, రాంచంద్రునాయక్, మురళీ నాయక్, రాందాసు నాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులున్నారు.  

ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల కృతజ్ఞతలు 
ఎస్సీల వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించినందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో సీఎంను కలిసిన వారిలో ఎస్సీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతరావు, కాలె యాదయ్య, మందుల శామ్యేల్‌ ఉన్నారు.

నల్లగొండ జిల్లాకు చెందిన గిరిజన నేత కె.శంకర్‌నాయక్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు పలువురు గిరిజన ఎమ్మెల్యేలు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఆమోదించినందుకు మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement