gummadi narasaiah
-
ఇల్లెందుకు ‘సీతారామ’ నీళ్లివ్వండి
సాక్షి, హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టు నీటిని ఇల్లెందు నియోజకవర్గానికి తరలించాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, బోడు, కొమరారం మండలాల ఏర్పాటు, ఇల్లెందు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య.. సీఎం రేవంత్రెడ్డిని కోరారు. మంగళవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్లో ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు, అఖిలపక్షాలతో భేటీ ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్కు సీఎం సూచించారు. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు ఊకె అబ్బయ్య, రాంచంద్రునాయక్, మురళీ నాయక్, రాందాసు నాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులున్నారు. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల కృతజ్ఞతలు ఎస్సీల వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించినందుకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్లో సీఎంను కలిసిన వారిలో ఎస్సీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతరావు, కాలె యాదయ్య, మందుల శామ్యేల్ ఉన్నారు.నల్లగొండ జిల్లాకు చెందిన గిరిజన నేత కె.శంకర్నాయక్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు పలువురు గిరిజన ఎమ్మెల్యేలు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఆమోదించినందుకు మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా సీఎం రేవంత్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
ఇల్లెందులో.. స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడి అనురాధ!
సాక్షి, భద్రాద్రి/ఇల్లెందు: ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు గుమ్మడి అనురాధ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. స్వతంత్రంగా పోటీ చేసే అనురాధకు తమ పార్టీ మద్దతు ఉంటుందని శనివారం సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ప్రకటించారు. దీంతో ఐదుసార్లు ఇల్లెందు ఎమ్మెల్యేగా ఎన్నికై న గుమ్మడి నర్సయ్య ఈసారి పోటీ చేయటం లేదని తేలిపోయింది. కారేపల్లి మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి నర్సయ్య– అమ్మక్కల కుమార్తె ఉస్మానియా లా కళాశాల అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, పీహెచ్డీ పూర్తి చేశారు. ఇవి చదవండి: సరిహద్దుల్లో పటిష్ట నిఘా! కలెక్టర్తో వ్యయ పరిశీలకుల భేటీ.. -
‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్: బెదిరింపులు కూడా వస్తున్నాయి!
సాక్షి, ఇల్లెందు: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్రపై తీస్తున్న సినిమా షూటింగ్ను వచ్చే నెలలో ప్రారంభిస్తామని దర్శకుడు పరమేశ్వర్ వెల్లడించారు. ఇటీవల కారు బోల్తా పడగా ప్రమాదం నుంచి బయటపడిన గుమ్మడి నర్సయ్యను ఆయన శుక్రవారం ఇల్లెందులో పరామర్శించారు. ఆ తర్వాత యూనిట్ సభ్యుడు కృష్ణతో కలిసి పరమేశ్వర్ విలేకరులతో మాట్లాడారు. గుమ్మడి నర్సయ్య చిత్రం పోస్టర్ విడుదల చేసినప్పటి నుంచి వివిధ వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. అంతేకాదు బెదిరింపులు కూడా వస్తున్నాయని వెల్లడించారు. అయితే, ఎవరికీ భయపడకుండా ఉన్నది ఉన్నట్లుగా ఓ ప్రజానేత జీవితాన్ని వెలుగులోకి తీసుకువస్తామని తెలిపారు. తమ సినిమా విడుదలయ్యాకైనా నేతల్లో కొంత మార్పు వస్తుందనే ఆశ ఉందని చెప్పారు. చదవండి: మాట్లాడుతున్న గుమ్మడి నర్సయ్య చిత్ర దర్శకుడు పరమేశ్వర్ (ఎడమ) -
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు తప్పిన ప్రమాదం
టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు పెను ప్రమాదం తప్పింది. కొత్తగూడెంలో మంగళవారం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న నర్సయ్య, కారులో ఇల్లెందు బయలుదేరారు. ఆయనతో పాటు సోదరుడి కుమారుడు వర్మ ఉన్నారు. టేకులపల్లి మండలం తొమ్మిదో మైలుతండా దాటాక రోళ్లపాడు క్రాస్ రోడ్డు సమీపంలో.. ఇల్లెందు నుంచి ఎదురుగా దూసుకొచ్చిన లారీ డ్రైవర్ ఒక్కసారి బ్రేక్ వేశాడు. దీంతో లారీని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు నాలుగు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో నర్సయ్య కాలు, చేతికి స్వల్ప గాయాలు కాగా, కొత్తగూడెం వైపు వెళ్తున్న కాంగ్రెస్ నాయకుడు చీమల వెంకటేశ్వర్లు తన వాహనంలో గుమ్మడి నర్సయ్యను తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఆయన స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
గుమ్మడి నర్సయ్య’బయోపిక్: టైటిల్ లోగో వచ్చేసింది
ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా నిజాతీయికి నిలువుటద్దంలా రాజకీయ ప్రస్థానం సాగించారు సీపీఐ (ఎంఎల్) నేత గుమ్మడి నర్సయ్య. శాసనసభకు బస్సులో వచ్చే ఏకైక ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితం ఆదర్శనీయంగా మీడియా ప్రశంసించింది. ప్రజా జీవితంలోనే తన జీవితాన్ని చూసుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథతో సినిమా రూపొందుతోంది. పరమేశ్వర్ అనే కొత్త దర్శకుడు ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా గుమ్మడి నర్సయ్య బయోపిక్ టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. టైటిల్ లోగో విడుదల చేసిన అనంతరం దర్శకుడు సుకుమార్ చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు. ఒక ఆదర్శవంతమైన నాయకుడి గురించి ఈతరంతో పాటు రాబోయే తరాల ప్రజలకు, రాజకీయ నాయకులకు తెలిసేలా గుమ్మడి నర్సయ్య బయోపిక్ ఉండబోతోంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. -
5 సార్లు ఎమ్మెల్యే అయినా.. రూ.5 భోజనమే
ముషీరాబాద్: ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే అతని జీవన విధానం మారిపోతుంది. షడ్రసోపేతమైన భోజనం..స్టార్ హోటల్కు తగ్గకుండా విలాసవంతమైన జీవనం వారి సొంతం అవుతుంది. అలాంటిది ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యే అయితే..? ఆయన జీవన విధానం ఎలా ఉంటుందో ఉహించుకోవచ్చు. కానీ నీతి, నిజాయితీకి, సాదాసీదా జీవితానికి నిలువెత్తు నిదర్శమైన గుమ్మడి నర్సయ్య మంగళవారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వద్ద పేదల కోసం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 5 రూపాయల భోజనాన్ని ఆరగించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. నర్సయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989, 1999, 2004లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన సైకిల్పై తిరగడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన రూ.5 భోజనం తినడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం అని చెప్పొచ్చు. -
నేను మీలో ఒకడిని..
ఖమ్మం,ఇల్లెందు అర్బన్: గతంలో ఎమ్మెల్యేననో లేక పార్టీ నాయకుడిననో తానెప్పుడూ జనానికి దూరం కాలేదని, మరింత చొరవతో ప్రజలతో మమేకమయ్యానని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ సీనియర్ నేత గుమ్మడి నర్సయ్య తెలిపారు. మన్యం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి..బొగ్గుట్ట (ఇల్లెందు) అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ ఆయన్ను పలుకరించగా పలు విషయాలను వివరించారు. సాక్షి: ఎమ్మెల్యేగా ప్రస్థానం చెబుతారా ? గుమ్మడి: నేను 1983 నుంచి 2014 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఐదుసార్లు గెలిచాను. 1985, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచా. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడిన. ఎన్డీ నిర్వహించిన ప్రజా ఉద్యమాలే..నాకు విజయాన్ని అందించాయి. ఎన్డీని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ నేతలు పునర్విభజన చేసి, గుండాల, కారేపల్లి మండలాలు వేరుచేశారు. సాక్షి: ఈసారి మీ ప్రచారం ఎలా ఉంది ? గుమ్మడి: గ్రామస్థాయిలో ప్రచారం ప్రారంభించలేదు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేశాం. త్వరలో ప్రతి గ్రామంలో పర్యటించి ఇంటింటి ప్రచారం చేస్తాం. చేసిన ప్రజా ఉద్యమాలు, సాధించిన విజయాలతోనే ప్రజల్లోకి వెళ్తాం. అందుకే పార్టీకి మంచి ఆదరణ ఉంది. ఈ దఫా ఎన్నికల్లో ఎన్డీ గెలుపు ఖాయం. ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. సాక్షి: మీరు గెలిచినప్పుడు చేసిన అభివృద్ధి గురించి.. గుమ్మడి: ఐదుసార్లు గెలిచిన హయాంలో ప్రధానంగా ఇల్లెందు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశాం. 132 కేవీ సబ్స్టేషన్ను నిర్మించాం. సింగరేణి షేప్ నిధులు రూ.8 కోట్ల వ్యయంతో పట్టణంలో రోడ్ల వెడల్పు చేశాం. చాలాచోట్ల సీసీ రోడ్లు నిర్మించినం. వాటర్ట్యాంకులు పూర్తి చేశాం. ప్రభుత్వ వైద్యశాల భవనం కట్టించేందుకు కృషి చేశాం. తాగునీటి వసతి, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాం. పార్టీలు మారే వ్యక్తులను నమ్మొద్దు.. ఒక పార్టీలో పోటీ చేసి గెలిచిన తర్వాత ధనార్జానే లక్ష్యంగా పెట్టుకొని వేరే పార్టీల్లోకి మారే వ్యక్తులను నమ్మొద్దు. ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడే వారికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. నోట్ల ప్రలోభాలకు గురై నియోజకవర్గ అభివృద్ధి వెనుకబాటుకు కారకులుగా మారకూడదు. కొన్ని పార్టీలు ప్రచారంలో ఇష్టమొచ్చినట్లు డబ్బు పంచుతుండడం బాధాకరం. -గుమ్మడి నర్సయ్య -
నిశీధి నీడలు ఆదర్శాల జాడలు
గిరిజన శాసనసభ్యుడు మనోరంజన్ దేబ్ వర్మ కృషి, పట్టుదల, ప్రజాసేవ పట్ల నిబద్ధతల వల్ల మాండ్వి దేశానికే ఆదర్శంగా మారింది. ఖతీరాం బాడి గిరిజన గ్రామాన్ని చూస్తుంటే, దేశంలోని గ్రామాలన్నీ ఇలా మారిపోతే, మన నేతలంతా ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. పార్టీలు మారుతున్న మన ప్రతిపక్ష నేతలు చెబుతున్నట్టు అధికారంలో లేకపోతే ప్రజా సేవ చెయ్యలేకపోవడం అన్నది ఉత్తిమాట. మనోరంజనే కాదు, ఒకప్పటి మన పుచ్చలపల్లి, వావిలాల, నేటి గుమ్మడి నర్సయ్య వంటి నేతలే అందుకు నిదర్శనం. ఈశాన్య భారతంలో త్రిపుర చాలా చిన్న రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలుంటే, త్రిపురలో ఉన్నవి ఎనిమిది జిల్లాలే. జనాభా దాదాపు నలభై లక్షలు. ఈ రాష్ట్రం నుంచి లోక్సభలో ఇద్దరికే ప్రాతినిధ్యం ఉంది. దశాబ్దాల తరబడి మార్క్సిస్ట్ల ఏలుబడిలో ఉండటం వల్ల, లోక్సభలో చెప్పుకోదగినంత సంఖ్యా బలం లేదు కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా త్రిపుర రాష్ట్రాన్ని పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవు. ఈ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలు ఎక్కువ. పశ్చిమ త్రిపుర జిల్లాలోని మాండ్వి శాసనసభ నియోజకవర్గం(ఎస్టీ)లో ఉన్నవి 12,910 కుటుంబాలు. మొత్తం జనాభా 55,050 మంది. ఇందులో 95 శాతం గిరిజనులే. 1972 మొదలు ఇక్కడి నుంచి ఒకే గిరిజన కుటుంబానికి చెందిన వారు శాసనసభ్యులుగా ఎన్నికవుతున్నారు. మొదట నాలుగుసార్లు తండ్రి, ఆ తరువాత కొడుకు ఇప్పటి వరకు శాసనసభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు. వీరెప్పుడూ పార్టీ మారే ఆలోచనలు చెయ్యలేదు. అధికారంలో ఎవరున్నారో చూడలేదు. అయినా ఇవ్వాళ దేశం చెప్పుకోదగ్గ నియోజక వర్గాల జాబితాలో చేరిపోయింది మాండ్వి. అందుకు అక్కడి శాసనసభ్యుడితో పాటూ అధికార యంత్రాంగం నిబద్ధత, కృషి, పట్టుదల తోడయ్యాయి. ఆదర్శ నేత.. ఆదర్శ గ్రామాలు నేడు మాండ్వి ఒక ఆదర్శ శాసనసభా నియోజకవర్గం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కేంద్రం గుర్తింపు పొందిన నియోజకవర్గం. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి జాతీయ గ్రామీణ ఆర్థిక కార్యక్రమం (ఎన్ఆర్ఎఫ్ఐపీ) వరకు గ్రామీణ ప్రాంతాలకు, ముఖ్యంగా గిరిజన ప్రాంతా లకు కేంద్ర నిధులు లభించే ఏ పథకాన్నీ వదలకుండా తమ నియోజకవ ర్గానికి తెచ్చుకుంటున్న మాండ్విలో పర్యటించడం ముచ్చట గొలిపే అను భవం. ఆ నియోజకవర్గంలోని సామాన్య ప్రజలందరి వివరాల ‘‘ఈ రికార్డింగ్’’ జరిగిపోయింది. అత్యధిక శాతం ప్రజల వివరాలు ఆధార్ పథకం కింద నమోదయ్యాయి. త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ ఆధ్వ ర్యంలో మాండ్వి నియోజకవర్గంలోని ఖతీరాం బాడి గ్రామంలో గిరిజన కుటుంబాల కోసం రూ. 75,000 వ్యయంతో నిర్మించిన ఇళ్లను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి ఇంటికి ఒక విశాలమైన గది, వెనక ప్రత్యేకంగా ఒక వంట గది, ప్రతి ఇంటి ఆవరణలోనూ మరుగుదొడ్డి ఆకట్టుకుంటాయి. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి పంపు, అవాంతరాలే లేని నిరంతర విద్యుత్ సరఫరా ఉంది. ఈ సదుపాయాలే కాదు, వారికి అదనపు రాబడినిచ్చేలా వెదురు బొంగుల సేద్యానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. పది గిరిజన కుటుం బాలు ఒక యూనిట్గా జరిగే ఈ సేద్యం వల్ల ఒక్కొక్క కుటుంబానికి సంవ త్సరానికి కనీసం ఐదు లక్షల రూపాయల ఆదాయం లభిస్తుంది. పిల్లలు చదువుకోవడానికి బడి, అనారోగ్యం పాలైతే వైద్యం ఇటువంటి అద్భుతాలన్నీ ఆ నియోజకవర్గంలో సోమవారం జరిపిన పర్యటనలో కనిపించాయి. ఇవన్నీ ఆ నియోజకవర్గం నుంచి దీర్ఘకాలం శాసనసభ్యుడిగా ఎన్నిక వుతూ ఉన్న మనోరంజన్ దేబ్ వర్మ కృషి, పట్టుదల, ప్రజాసేవ పట్ల ఆయనకు గల నిబద్ధతల ఫలితం. ఆయన తండ్రి రశీరాం దేబ్ వర్మ కొంత కాలం వామపక్ష సంఘటన ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఈయనకు అవేమీ పెద్ద విషయాలు కావు. మంత్రి కావాలనో, పదవిని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించి సంపన్న వర్గాల జాబితాలో చేరిపోవాలనో ఆయనలో దుగ్ధ కనిపించదు. త్రిపుర రాష్ట్ర గ్రామీణ జీవితం ఎట్లా ఉంటుందో చూడాలని సోమవారం మేం పశ్చిమ త్రిపుర జిల్లాలోని మాండ్వి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మా వెంట ఉన్న సీనియర్ శాసనసభ్యుడు మనోరంజన్ దేబ్ వర్మను చూస్తుంటే దేశంలోని రాజకీయ నాయకులంతా ఇట్లా ఉంటే బాగుండేదనిపించింది. గ్రామీణ ప్రాంతాలన్నీ బాగుపడి ఖతీరాం బాడి గ్రామంలా మారిపోతాయి. చెరిగిపోతున్న ఆదర్శ నేతల అడుగుజాడలు... నిజాయితీగా ప్రజా సేవకే అంకితమైన నాయకులు, అందునా దళిత గిరిజన వర్గాల నుంచి వచ్చే నాయకులు మన తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా కసిపిస్తూ ఉంటారు. పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్లే వారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్కాగజ్నగర్ నియోజకవర్గానికి పాల్వాయి పురుషోత్తంరావు అనే శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తుండేవారు. ఒక రోజు ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగి ఆస్పత్రిలో చేరారని తెలిసి పరా మర్శకు వెళ్లాం. అప్పుడు తెలిసింది... ఆయనకు ఎటువంటి వాహనమూ లేదని. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి శాసనసభకు నడిచే వెళుతుంటే వెనక నుంచి వచ్చిన వాహనం ఢీకొని ప్రమాదం జరిగిందట. సీపీఐ ఎంఎల్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లా ఇల్లెందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మడి నర్సయ్య కుటుంబానికి ఇప్పటికీ పొలంలో వ్యవసాయమే జీవనాధారం. ఎమ్మెల్యేగా ఉండగా కూడా, సమావేశాలు లేని రోజుల్లో ఆయన తన గ్రామంలో అరక దున్నేవారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అతి సన్నిహితుడైన జువ్వాది చొక్కారావు పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా పని చేశారు. ఆయనకు సొంత ఇల్లు లేదన్న విషయం చాలా మందికి తెలియదు. ఇక వావిలాల గోపాలకృష్ణయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి నాయకుల నిరాడంబర జీవితం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇట్లాంటి వాళ్లు ఇంకా ఉంటారు. గోడ దూకే నేతల తీరే వేరు మనోరంజన్తో కలిసి తిరిగి, మళ్లీ హైదరాబాద్కు చేరేసరికి... ఆంధ్రప్రదేశ్లో మరో ప్రతిపక్ష శాసనసభ్యుడు వలస పక్షుల జాబితాలో చేరిపోయారనీ, అధికార పక్షంలో చేరుతున్నారని వార్త వచ్చింది. దీంతో వావిలాల గోపాల కృష్ణయ్య దగ్గరి నుంచి మనోరంజన్ దేబ్ వర్మ దాక ప్రతిఫలాపేక్ష లేని నాయ కులందరూ జ్ఞాపకం వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ నేత, ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకుడు, ఆ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్య క్షుడు జ్యోతుల నెహ్రూ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అధికారికంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి రాజీనామా లేఖను పంపారు. ఇక ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయం. ఇటీవల ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి గోడ దూకిన శాసనసభ్యుల్లో నెహ్రూ తొమ్మిదో వారవు తారు. ముగింపుకొస్తున్న ఆ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఇక నెహ్రూ కూడా, మిగిలిన ఎనిమిది మంది లాగానే కనిపించరు, మాయం అయిపో తారు! శాసనసభలో దర్జాగా కూర్చోవాల్సిన ఎమ్మెల్యేలు ముఖం చాటే య్యాల్సి రావడమేమిటి? రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సర్వసాధా రణం. అందుకోసం పార్టీని వీడొచ్చు. పార్టీ సభ్యత్వంతో పాటూ, పార్టీ బీ ఫాం మీద ఎన్నికైన శాసన సభ్వత్వానికి కూడా రాజీనామాచేసి, మళ్లీ జనం మధ్యకు వెళ్లి గెలిచి వస్తే, జనం శభాష్ అంటారు కదా! ప్రజలకు సంబంధంలేని పార్టీ మార్పిడులు పార్టీ పదవులకు రాజీనామా చేసిన జ్యోతుల నెహ్రూ ఆ పార్టీ ద్వారా వచ్చిన శాసన సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేయలేదు? ప్రతిపక్షం నుంచి రాజీ నామా చేసి, అధికార పక్షానికి వలస పోయిన, పోతున్న శాసనసభ్యులు ఒక్కరయినా సరైన కారణం చెప్పగలరా? నియోజకవర్గం అభివృద్ధి కోసం పోతున్నాం, ప్రజల బాగుకోసం పోతున్నాం అంటారా? ఈ పార్టీ మార్పిడు లకూ, ప్రజలకూ ఏమైనా సంబంధం ఉందా? శాసనసభ మీడియా పాయింట్ దగ్గర మంగళవారం ఇద్దరు ప్రతిపక్ష మహిళా శాసనసభ్యులు ... మాకు రూ. 20 కోట్లు ఇవ్వజూపారు అని చెప్పారు. కచ్చితంగా ఇటువంటి ఏవో ప్రలోభాల కారణంగానే ఈ పార్టీ మార్పిడులు జరుగుతున్నాయనే బలమైన అభిప్రాయం ప్రజలలో ఉంది. అదే నిజమైతే ఇలా చేతులు మారే డబ్బును వారు ప్రజల బాగు కోసం ఏమన్నా ఖర్చు చేస్తారా? లేదు కదా. కాబట్టి ఈ పార్టీ మార్పిడులతో ప్రజలకు ఏ సంబంధమూలేదు. లేదూ ప్రజలే పార్టీ మారమని కోరుతుంటే... శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసి మళ్లీ ప్రజల చేత అవునూ అనిపించుకుని శాసనసభకు వస్తే ఎవరికీ ఆక్షేపణ ఉండదు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సేవ చెయ్యలేకపోవడం అన్నది ఉత్తి మాట. పైన ఉదహరించిన పెద్దలంతా ప్రతిపక్షంలో ఉండే ప్రజా సేవ సమర్థ వంతంగా చేశారు. ఎక్కడ ఎవరు గీత దాటుతున్నా వారిని ప్రజలు చూస్తు న్నారు. సమయం వచ్చినప్పుడు తమ తీర్పును కచ్చితంగానే చెప్తారు. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com