నల్లగొండ: విమాన డ్రోన్ కలకలం.. ఎయిర్‌టెల్‌ సిమ్, సీసీ కెమెరాలు..

Drone Disturbance In Shaligowraram Of Nalgonda District - Sakshi

శాలిగౌరారం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ఆకారం గ్రామంలోని పంటపొలాల్లో ఆదివారం విమానం ఆకారంలో ఉన్న డ్రోన్‌ పడిపోయింది. అదే సమయంలో ఆప్రాంతంలో మేకలు మేపుతున్న ఓ మేకల కాపరి కొంత భయాందోళనకు గురయ్యాడు.

కాసేపటి తర్వాత దగ్గరకు వెళ్లి చూసి ఆ విషయాన్ని తన కుమారుడికి ఫోన్‌చేసి చెప్పాడు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన కొంతమంది యువకులు డయల్‌ 100కు ఫోన్‌ చేసి విషయం చెప్పగా, ఎస్‌ఐ సతీష్‌ అక్కడికి వచ్చి డ్రోన్‌ను పరిశీలించారు. ఈ డ్రోన్‌లో ఎయిర్‌టెల్‌ సిమ్, సీసీ కెమెరాలు, జీపీఎస్, బ్యాటరీ ఉన్నట్లు గుర్తించారు. 76 నంబర్‌తో ఉన్న ఈ డ్రోన్‌ రెక్కలపై ఎఫ్‌ఎల్‌216020220415099 నంబర్‌ ఉన్నట్లు ఎస్‌ఐ చెప్పారు. ఐదడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పుతో ఉన్న ఈ డ్రోన్‌ 15 కిలోల బరువు ఉందన్నారు.

పంటపొలాల్లో పడిపోయిన ఈ డ్రోన్‌పై అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తర్వా­త బాంబ్‌ స్క్వాడ్‌ ఘటనాస్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో ఎలాంటి బాంబుల ఆనవాళ్లు లేవని నిర్ధారించింది. డ్రోన్‌లోని సిమ్‌కార్డును తీసి కనెక్ట్‌ చేసేందుకు యత్నించగా, సిమ్‌కార్డు కనెక్ట్‌కాలేదు. అనంతరం డ్రోన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఇది కూడా చదవండి: మరో రెండ్రోజులు ఉక్కపోతే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top