మీ సేవ ద్వారా టెట్‌ మెమోలు | Telangana TET Memos Available Through MeeSeva | Sakshi
Sakshi News home page

మీ సేవ ద్వారా టెట్‌ మెమోలు

Aug 18 2026 3:00 AM | Updated on Aug 18 2026 3:00 AM

Telangana TET Memos Available Through MeeSeva

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో ఉత్తీర్ణులైన వారికి మీ సేవ కేంద్రాల ద్వారా మెమోలను జారీ చేయనున్నారు. సర్టిఫి­కెట్‌పై ప్రత్యేకంగా ఒక బార్‌కోడ్, సర్టిఫికెట్‌కు నంబర్‌ కూడా ఉంటాయి. 2011 నుంచి ఇప్ప­టివరకు టెట్‌ పరీక్ష పాసైన వారందరికీ ము­ద్రిత మెమోలను జారీచేస్తామని పాఠశాల వి­ద్యా శాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ఈ మెమోను పొందేందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ మెమోపై అభ్యర్థి పేరు, ఫొటో, వేలిముద్ర/సంతకం, అభ్యర్థి పొందిన మార్కుల వివరాలుంటాయి. గతంలో టెట్‌ పరీక్ష పాసైన వారికి రెండు సార్లు ముద్రిత మోమోలు జారీచేశారు. 

ఆ తర్వాత ఆన్‌లైన్‌ మెమోలను మాత్రమే జారీచేస్తున్నారు. దీంతో కొందరు నకిలీ మెమోలను తయారు చేస్తు­న్న­ట్లు విద్యాశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే క్వాలిఫై అయిన వారందరికీ మీ సేవ ద్వారా ముద్రిత మెమోలను జారీచేయాలని నిర్ణయించారు. వారం పదిరోజుల్లో ఈ మెమోలు అందు­బాటులోకి వస్తాయని నవీన్‌ నికోలస్‌ తెలి­పా­రు. కాగా, రాష్ట్రంలోని మరో వెయ్యి సర్కారు బడు­ల్లో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 

కొంపల్లి­లోని శిక్షణకేంద్రంలో అధునాతన వసతులు క­ల్పి­స్తున్నట్లు చెప్పారు. స్పోర్ట్‌ ట్రాక్‌ సహా మరి­కొన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. పనులు పూర్తైన తర్వాత విద్యార్థులకు శిక్షణ ఇస్తామని, అత్యుత్తుమ సేవలందించిన వారిని త్వరలోనే సన్మానించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement