సీబీఐకి చిక్కిన NHAI ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ దుర్గా ప్రసాద్‌ | CBI Arrests NHAI Project Director Golla Durga Prasad In Telangana Bribery Case, More Details Inside | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ.. సీబీఐకి చిక్కిన NHAI ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ దుర్గా ప్రసాద్‌

Aug 20 2025 3:15 PM | Updated on Aug 20 2025 3:35 PM

CBI Arrests NHAI Project Director Golla Durga Prasad in Telangana Bribery Case

సాక్షి,హైదరాబాద్‌: హైదరాబాద్‌ నేషనల్‌ హైవే అథారిటీస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ గొల్ల దుర్గాప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఓ హోటల్‌ యజమాని నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. 

బీబీనగర్ టోల్ ప్లాజా పక్కన ఉన్న ఓ వ్యక్తి రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. అయితే హైవే పక్కన రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నందుకు యజమాని నుంచి దుర్గాప్రసాద్‌ రూ.లక్ష వరకు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం హోటల్‌ యజమాని నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా గొల్ల దుర్గాప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. అనంతరం,హైదరాబాద్, వరంగల్, సదాశివపేటలో దుర్గా ప్రసాద్‌ ఇళ్లు, కార్యాలయాల్లో  సోదాలు చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement