సీబీఐకి చిక్కిన NHAI ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ దుర్గా ప్రసాద్‌ | CBI Arrests NHAI Project Director Golla Durga Prasad In Telangana Bribery Case, More Details Inside | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ.. సీబీఐకి చిక్కిన NHAI ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ దుర్గా ప్రసాద్‌

Aug 20 2025 3:15 PM | Updated on Aug 20 2025 3:35 PM

CBI Arrests NHAI Project Director Golla Durga Prasad in Telangana Bribery Case

సాక్షి,హైదరాబాద్‌: హైదరాబాద్‌ నేషనల్‌ హైవే అథారిటీస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ గొల్ల దుర్గాప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఓ హోటల్‌ యజమాని నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. 

బీబీనగర్ టోల్ ప్లాజా పక్కన ఉన్న ఓ వ్యక్తి రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. అయితే హైవే పక్కన రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నందుకు యజమాని నుంచి దుర్గాప్రసాద్‌ రూ.లక్ష వరకు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం హోటల్‌ యజమాని నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా గొల్ల దుర్గాప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. అనంతరం,హైదరాబాద్, వరంగల్, సదాశివపేటలో దుర్గా ప్రసాద్‌ ఇళ్లు, కార్యాలయాల్లో  సోదాలు చేపట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement