యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచి్చన ఓ మహిళ కాలుపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. నార్సింగికి చెందిన అనిత కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి యాదగిరిగుట్టకు వచ్చారు. శనివారం దర్శనం అనంతరం మధ్యాహ్నం కొండపై ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్నారు ఆర్టీసీ బస్సు రావడంతో అది ఎక్కేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బస్సు ముందుకు వెళ్లగా అనిత కిందపడిపోయింది. దీంతో బస్సు వెనుక టైరు ఆమె కాలుపై వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయ్యింది.


