Fire Accident At Jolly Kids Preschool In Hyderabad Manikonda - Sakshi
Sakshi News home page

మణికొండ: ప్లే స్కూల్‌లో మంటలు.. పరుగు తీసిన చిన్నారులు

Jun 20 2023 1:01 PM | Updated on Jun 20 2023 1:25 PM

Fire Accident At Jolly Kids Preschool In Manikonda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మణికొండలోని జోల్లి కిడ్స్‌ ప్లేస్కూల్‌ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం షార్ట్‌ సర్క్యూట్‌తో మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. 

కాగా, మంటలు ఎగసిపడటం, పొగ బయటకు రావడంతో భయంతో చిన్నారులు పరుగు తీశారు. ఇక, అగ్ని ప్రమాదం సంభవించడంతో చిన్నారుల పేరెంట్స్‌ భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్కూల్‌ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్‌ టెండర్స్‌ అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: ఆరు లేన్లుగా ఎన్‌హెచ్‌-65.. నితిన్‌ గడ్కరీ హామీ! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement