మహిళా ఎస్సైతో ప్రేమ..‍ ప్రియురాలితో వీడియో కాల్‌ మాట్లాడుతూనే గదిలోకి వెళ్లి | - | Sakshi
Sakshi News home page

మహిళా ఎస్సైతో ప్రేమ..‍ ప్రియురాలితో వీడియో కాల్‌ మాట్లాడుతూనే గదిలోకి వెళ్లి

Aug 24 2023 2:06 AM | Updated on Aug 24 2023 9:04 AM

- - Sakshi

మహిళా ఎస్‌ఐతో ప్రేమ వ్యవహారంలో మనస్పర్థలు రావడంతో ఎస్‌ఐ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన

తమిళనాడు: మహిళా ఎస్‌ఐతో ప్రేమ వ్యవహారంలో మనస్పర్థలు రావడంతో ఎస్‌ఐ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన తిరుపత్తూరు జిల్లాలో జరిగింది. వివరాలు.. ధర్మపురి జిల్లా ఆరూర్‌కు చెందిన రాజ్‌కుమార్‌(27) 2021లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. ఏడు నెలలుగా తిరుపత్తూరు జిల్లా వానియంబాడి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఈయన తిరుపత్తూరు జిల్లాలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను ప్రేమిస్తున్నాడు.

వీరి ప్రేమకు రాజ్‌కుమార్‌ తల్లిదండ్రులు వ్యతిరేక తెలిపారు. మంగళవారం రాత్రి రాజ్‌కుమార్‌తో పాటు ఇన్‌స్పెక్టర్‌ దురైరాజ్‌, కానిస్టేబుల్‌ విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో రాజ్‌కుమార్‌కు ప్రియురాలికి ఫోన్‌ చేశారు. పోలీస్‌స్టేషన్‌ బయటకు వెళ్లి వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన రాజ్‌కుమార్‌ ఫోన్‌లో మాట్లాడుతూనే స్టేషన్‌లోపలికి వెళ్లి తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.

గమనించిన సహ పోలీసులు తలుపులు తెరిచి ఆయన్ను కిందకు దించారు. డీఎస్పీ విజయకుమార్‌కు సమాచారం అందజేశారు. అతనికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement