
అందని హమాలీ చార్జీ
హమాలీ డబ్బులు చెల్లించాలి
కాంటాలు వేసిన వడ్లకు హమాలీ ఖర్చు భారంగా మారింది. ఏటేటా హమాలీ కూలి పెంచుతున్నారు. ప్రభుత్వం ఈ డబ్బులను రైతుల అకౌంట్లలో వేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి సీజన్లో రూ.7నుంచి రూ.8వేల వరకు ఈ హమాలీలకే ఇవ్వాల్సి వస్తుంది.
– బండి సత్యనారాయణ,
కొత్తగూడెం, తుంగతుర్తి మండలం
నేరుగా హమాలీలకే ఇవ్వాలి
ప్రభుత్వం మొదట్లో హమాలీ ఖర్చులను రైతుల అకౌంట్లలో జమచేసింది. ఈ డబ్బులు ప్రస్తుతం ఇవ్వడం లేదు. రైతులు కాకుండా నేరుగా హమాలీలకు ఇస్తే బాగుంటుంది. హమాలీ చార్జితో రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు.
– బోళ్ల లక్ష్మయ్య, అనంతారం
సూర్యాపేట : విత్తనం నాటిన నాటినుంచి పంటను అమ్మేదాకా రైతులకు ఖర్చుల భారం తప్పడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలను తట్టుకుని ధాన్యం పండించిన రైతులు దాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామన్నా.. కష్టకాలంగానే మా రింది. ఇలాంటి పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసింది. ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాల్లో రైతులు కాంటాలు వేసిన ధాన్యానికి హమాలీ ఖర్చును మొదట్లో ప్రభుత్వమే భరించింది. కానీ కొన్ని సీజన్లుగా హమాలీ ఖర్చు చెల్లించకపోవడంతో రైతులే హమాలీలకు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొనడంతో వారికి ఖర్చు తడిసిమోపడవుతోంది. ఈ యాసంగి సీజన్లోనైనా ప్రభుత్వం హమాలీ చార్జి చెల్లిస్తుందేమోనని రైతులు ఆశపడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
లక్ష్యం.. 4.07 లక్షల మెట్రిక్ టన్నులు
జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో 286 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 4.07లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే గోనెసంచుల్లో వడ్లను నింపి లారీల్లో ఎత్తే హమాలీ ఖర్చును జిల్లాలో రైతులే భరిస్తున్నారు. ఈ సెంటర్లను నెలకొల్పిన తొలినాళ్లలో 2014, 2015 సీజన్లలో ప్రభుత్వం చెల్లించింది. మొదటగా రైతులు ఇస్తే వడ్ల బిల్లులు పడే సమయంలోనే హమాలీల డబ్బులను క్వింటాకు రూ.32 చొప్పునప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం అధికారులు ఈ లెక్కలు ప్రభుత్వానికి పంపుతున్నా.. డబ్బులు అందడం లేదు.
ఏటేటా రైతులపై భారం
వడ్ల కాంటా సమయంలో రైతులకు హమాలీల ఖర్చు విపరీతంగా ఉంటుంది. మొదట్లో క్వింటాకు రూ.30లకు వేసిన హమాలీలు సీజన్ సీజన్కు పెంచుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొన్నిచోట్ల క్వింటాకు రూ.50ల వరకు వసూలు చేస్తున్నారు. ఇదే కాకుండా ఉల్పాల పేరుతో వడ్లను బట్టి అదనంగా మరో రూ.500 నుంచి రూ.3వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఎకరం సాగు చేసిన వారికి హమాలీ ఖర్చు మొత్తంగా రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు అవుతుందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఈ సీజన్లో 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ఈ లెక్కన హమాలీల ఖర్చు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు రైతులపై భారం పడుతోంది. ఇలా ప్రతి సీజన్లోనూ రూ.20 కోట్ల వరకు హమాలీ చార్జీల రూపంలో రైతులపై ఆర్థిక భారం పడుతోంది.
ఫ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు
భారంగా హమాలీ ఖర్చు
ఫ ఏటా ఒక్కపైసా విడుదల
చేయని ప్రభుత్వం
ఫ ఇప్పటికై నా చెల్లించాలని
అన్నదాతల వేడుకోలు
కొన్న ధాన్యం.. హమాలీ చార్జీల వివరాలు ఇలా..
సీజన్ కొన్నధాన్యం హమాలీ ఖర్చు
(లక్షల మెట్రిక్ టన్నుల్లో) (రూ.కోట్లలో..)
వానాకాలం(2024–25) 2.40 12
వానాకాలం(2023–24) 2.80 14
యాసంగి(2023–24) 3.30 16.5
వానాకాలం(2022–23) 3.10 15.50
యాసంగి(2022–23) 3.80 19

అందని హమాలీ చార్జీ

అందని హమాలీ చార్జీ