విధివంచితులు | - | Sakshi
Sakshi News home page

విధివంచితులు

Aug 5 2023 12:04 AM | Updated on Aug 5 2023 11:29 AM

మృతి చెందిన దంపతులు మంజుల, నాగార్జున (ఫైల్‌) - Sakshi

మృతి చెందిన దంపతులు మంజుల, నాగార్జున (ఫైల్‌)

అనంతపురం: రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అన్యం పుణ్యం తెలీని చిన్నారులను అనాథలుగా మార్చేసింది. అనంతపురం పట్టణంలోని ఎన్టీఆర్‌ కాలనీలో నాగార్జున, మంజుల దంపతులు నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు (విష్ణుప్రియ (7), హరిప్రియ (5), మధుప్రియ (3)) సంతానం. దంపతులిద్దరూ బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత శనివారం మంజుల మేనత్త మృతి చెందినట్లు సమాచారం అందడంతో తనకల్లు మండలం సీఆర్‌ పల్లికి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు.

గుమ్మల్లకుంట వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన మంజుల (30), నాగార్జున (34)లను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంజుల మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే చికిత్స పొందుతూ నాగార్జున కూడా శుక్రవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. దీంతో వారి ముగ్గురు బిడ్డలు అనాథలయ్యారు. జరిగింది అర్థం కాక అమ్మానాన్న ఎక్కడున్నారు? ఎప్పుడొస్తారు? అని అడుగుతున్నారని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement