టీమిండియాకు ఘోర పరాభవం .. జింబాబ్వే చేతిలో ఓటమి | Zimbabwe stun World Champions India with 13 run win in Harare | Sakshi
Sakshi News home page

IND vs ZIM 1st T20: టీమిండియాకు ఘోర పరాభవం .. జింబాబ్వే చేతిలో ఓటమి

Jul 6 2024 8:18 PM | Updated on Jul 6 2024 8:45 PM

 Zimbabwe stun World Champions India with 13 run win in Harare

అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో13 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 

116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య చేధనలో భారత్‌.. జింబాబ్వే బౌలర్ల దాటికి కేవలం 102 పరుగులకే కుప్పకూలింది. 

జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్‌ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా..  బెన్నట్‌, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

అతడితో పాటు వాషింగ్టన్ సుందర్‌(27) పోరాడనప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్లంతా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 115 పరుగులకే జింబాబ్వే పరిమితమైంది. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. 

బిష్ణోయ్‌తో పాటు మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, అవేష్‌ ఖాన్‌,ముఖేష్‌ కుమార్‌ చెరో వికెట్‌ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో మ‌దండే(29), మైర్స్‌(23), బెన్నట్‌(23),  పరుగులు చేశారు. కాగా టీ20ల్లో జింబాబ్వే చేతిలో భారత్‌ ఓటమి పాలవ్వడం 2016 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement