Yuki Bhambri Pair Enters Quarter Finals In Hall of Fame Open ATP Tennis - Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌ జోడీ 

Published Thu, Jul 20 2023 12:58 PM

Yuki Bhambri Pair Enters-Quarter-Finals Hall-Of-Fame Open ATP Tennis - Sakshi

‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జోడీ శుభారంభం చేసింది. అమెరికాలోని న్యూపోర్ట్‌లో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాకేత్‌–యూకీ ద్వయం 3–6, 6–1, 10–8తో టామీ పాల్‌–స్పిజిరి (అమెరికా) జంటను ఓడించింది. హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్‌ చంద్రశేఖర్‌–విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ (భారత్‌) జంట కూడా క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. అనిరుధ్‌–ప్రశాంత్‌ 6–4, 6–3తో జూలియన్‌ క్యాష్‌ (బ్రిటన్‌)–మాక్సిమి క్రెసీ (అమెరికా)లపై గెలిచారు.    


 

Advertisement
Advertisement