చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా | Virat Kohli Creates History, Becomes First Player In The World To Score 3500 Runs In Chinnaswamy Stadium | Sakshi
Sakshi News home page

IPL 2025: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా

Apr 24 2025 9:40 PM | Updated on Apr 25 2025 11:32 AM

Virat Kohli Creates HISTORY, Becomes First Player In The World

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో టీమిండియా స్టార్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఓపెన‌ర్ విరాట్ కోహ్లి త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో కింగ్ కోహ్లి హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌ను విరాట్‌ ఊతికారేశాడు. 

ఫిల్ సాల్ట్‌, ప‌డిక్క‌ల్‌తో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యాల‌ను నెలకొల్పాడు. విరాట్‌ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగిన విరాట్ కోహ్లి ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..

👉టీ20 క్రికెట్‌లో ఒకే వేదిక‌పై 3500 పరుగులు చేసిన తొలి ఆట‌గాడిగా విరాట్ చ‌రిత్ర సృష్టించాడు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో 105 టీ20 ఇన్నింగ్స్‌లలో కోహ్లి 3500 పరుగులు చేశాడు.

టీ20ల్లో ఒకే స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
3500 - బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ(భారత్‌)
3373 - షేర్-ఎ-బంగ్లా స్టేడియం, మీర్పూర్‌లో ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్‌)
3253 - రోజ్ బౌల్, సౌతాంప్టన్‌లో జేమ్స్ విన్స్ (ఇంగ్లండ్‌)
3241 - ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్‌లో అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్‌)
3238 - షేర్-ఎ-బంగ్లా స్టేడియం, మీర్పూర్‌లో తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్‌)

👉అదేవిధంగా టీ20 క్రికెట్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సందర్బాల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా విరాట్ రి​కార్డులకెక్కాడు. ఇప్పటివరకు కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు 62 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్‌​ బాబర్‌(61) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బాబర్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు.

👉ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 392 ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొన‌సాగుతున్నాడు.

టీ20ల్లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్లు వీరే..
62 - విరాట్ కోహ్లీ*
61 - బాబర్ అజామ్
57 - క్రిస్ గేల్
55 - డేవిడ్ వార్నర్
52 - జోస్ బట్లర్
52 - ఫాఫ్ డు ప్లెసిస్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement