ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అఫ్గాన్తో వన్డేలకు గాయం కారణంగా దూరమైన స్టార్ విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు స్టార్ సేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేశాడు. విరాట్ను ఎంపిక చేసినప్పటికి సిరీస్ ఆరంభానికి ముందు తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది.
ఇక అఫ్గాన్తో ఆఖరి వన్డేలో సెంచరీతో సత్తాచాటిన యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్కు మాత్రం చోటు దక్కలేదు. తన చివరి మూడు వన్డేలలో రెండు శతకాలు సాధించినప్పటికీ జైస్వాల్ను సెలక్టర్లు పక్కన పెట్టారు. జూలై 14 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్తో వన్డేల కోసం భారత జట్టు
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వన్డే షెడ్యూల్
1వ వన్డే జూలై 14, 2026 (మంగళవారం) ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్ మధ్యాహ్నం 3:30
2వ వన్డే జూలై 16, 2026 (గురువారం) సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ సాయంత్రం 5:30
3వ వన్డే జూలై 19, 2026 (ఆదివారం) లార్డ్స్, లండన్ మధ్యాహ్నం 3:30
చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు


