‘సిరీస్‌ను చిరస్మరణీయం చేసుకోండి’ | Test series with England is a great opportunity for Indian players says gambhir | Sakshi
Sakshi News home page

‘సిరీస్‌ను చిరస్మరణీయం చేసుకోండి’

Jun 13 2025 3:01 AM | Updated on Jun 13 2025 3:01 AM

Test series with England is a great opportunity for Indian players says gambhir

జట్టు సభ్యులకు గంభీర్‌ ఉద్బోధ  

బెకెన్‌హామ్‌: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ భారత ఆటగాళ్లకు గొప్ప అవకాశమని... అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి దీనిని చిరస్మరణీయం చేసుకోవాలని జట్టు హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ సూచించాడు. ఇందు కోసం తమ సహజశైలిని దాటి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాలని అతను అన్నాడు. కోహ్లి, రోహిత్, అశ్విన్‌ లేకుండా టీమిండియా టెస్టు సిరీస్‌ ఆడుతున్న నేపథ్యంలో జట్టులోని యువ ఆటగాళ్లు సత్తా చూపించాలని కోచ్‌ ఆకాంక్షించాడు. ‘ఈ సిరీస్‌ను రెండు విధాలుగా చూడవచ్చు. 

ముగ్గురు సీనియర్లు లేకుండా ఆడుతున్నామనే కోణంలో ఒకటి... వారు లేరు కాబట్టి దేశం తరఫున గొప్ప ఆటతీరు కనబర్చేందుకు దక్కిన సరైన అవకాశంగా చూడటం మరొకటి. ఏదైనా ప్రత్యేకంగా సాధించి చూపించాలనే కసి, పట్టుదల నాకు  ప్రస్తుత జట్టులో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక గిరి గీసుకొని ఆడినవారు కూడా దానిని దాటి రావాలి. ప్రతీ రోజు, ప్రతీ సెషన్, ప్రతీ బంతి కోసం పోరాడితే ఈ సిరీస్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. 

ఈ సిరీస్‌తో తొలిసారి టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్, అర్‌‡్షదీప్‌ సింగ్‌లను కోచ్‌ టీమ్‌లోకి ఆహ్వానించాడు. ‘తొలిసారి టెస్టు పిలుపు రావడం ఎప్పుడైనా గొప్పగా చెప్పుకోగలిగే ప్రత్యేక సందర్భం. సాయి గత మూడు నెలలుగా అద్భుతంగా ఆడుతున్నాడు. టెస్టుల్లోనూ మంచి కెరీర్‌ ఉండాలని కోరుకుంటున్నా. అర్ష్ దీప్‌ కూడా భారత్‌ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎంతో బాగా ఆడాడు. ఇప్పుడు టెస్టుల్లో రాణించాల్సిన సమయం వచ్చింది’ అన్న గంభీర్‌... తొలిసారి టెస్టు కెపె్టన్‌గా వ్యవహరించబోతున్న గిల్‌ను ప్రత్యేకంగా అభినందించాడు.  

భారత్‌ గురించి బాగా తెలుసు: మెకల్లమ్‌ 
టెస్టు సిరీస్‌ కోసం భారత జట్టు బాగా సన్నద్ధమై వచ్చిందని, అయితే తాము ఏం చేయాలనేదానిపై పూర్తి స్పష్టత ఉందని ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ అన్నాడు. తమ టీమ్‌ సభ్యులంతా సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అతను చెప్పాడు. ‘భారత్‌ చాలా బలమైన జట్టు. ఎన్నో అంచనాలతో ఇక్కడికి వచ్చింది. అయితే ఒక టెస్టు జట్టుగా మా లక్ష్యాలేమిటో మాకు బాగా తెలుసు. పోరు కోసం సిద్ధంగా ఉన్నాం. 

కొందరు కీలక బౌలర్లు అందుబాటులో లేకపోయినా ప్రస్తుత పేస్‌ బృందంలో వైవిధ్యం ఉంది. స్పిన్నర్‌ బషీర్‌ ప్రతీ మ్యాచ్‌కు రాటుదేలుతున్నాడు. బ్యాటర్లలో జేమీ స్మిత్, బెథెల్‌లాంటి వాళ్లు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో కనిపించే దూకుడుకు ఆట జత కలిస్తే మంచి ఫలితాలు ఖాయం’ అని మెకల్లమ్‌ తన సహచరుల గురించి విశ్లేషించాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement