క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయింపు | Telangana Government Allocated 600 Yards Site To Cricketer Mohammed Siraj | Sakshi
Sakshi News home page

క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయింపు

Aug 9 2024 6:27 PM | Updated on Aug 9 2024 6:56 PM

Telangana Government Allocated 600 Yards Site To Cricketer Mohammed Siraj

టీ20 వరల్డ్‌కప్‌ 2024 గెలిచిన భారత జట్టులోని సభ్యుడు మహ్మద్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. సిరాజ్‌కు జూబ్లీ హిల్స్ లో 600 చదరపు గ‌జాల ఇంటి స్థ‌లం కేటాయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. సిరాజ్‌తో పాటు బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఈషా సింగ్‌లకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. ఈ ముగ్గురికి ఇంటి స్థలంతో పాటు గ్రూప్‌-1 స్థాయి (డీఎస్పీ) ఉద్యోగం కూడా ఆఫర్‌ చేసింది. సిరాజ్‌, నిఖత్‌ జరీన్‌, ఈషా సింగ్‌ వేర్వేరు క్రీడల్లో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను పెంచారు. 

Advertisement
 
Advertisement
Advertisement