రిషబ్‌ పంత్‌ కీలక నిర్ణయం | Rishabh Pant Set To Enter Delhi Premier League 2026 Auction Alongside Top IPL Stars, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

రిషబ్‌ పంత్‌ కీలక నిర్ణయం

Jul 1 2026 8:51 AM | Updated on Jul 1 2026 10:22 AM

RISHABH PANT WILL BE PART OF DELHI PREMIER LEAGUE AUCTION 2026

భారత స్టార్ వికెట్‌కీపర్-బ్యాటర్ రిషబ్‌ పంత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ జరుగబోయే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026 వేలంలో పాల్గొనేందుకు రెడీ అయ్యాడు. ఈ వేలంలో పంత్‌ సహా పలువురు ఐపీఎల్‌ స్టార్లు పాల్గొననున్నారు. పంత్‌ వేలంలో మార్కీ జాబితాలో ఉంటాడు.

మార్కీ జాబితాలో స్టార్ ఆటగాళ్లు
రిషబ్‌ పంత్‌, ఇషాంత్ శర్మ, మయాంక్ యాదవ్, నవదీప్ సైనీ, సిమర్‌జీత్ సింగ్, సుయాష్ శర్మ, దిగ్వేష్ రాఠీ, హిమ్మత్ సింగ్, అనుజ్ రావత్, వంశ్ బేడి, కుల్దీప్ యాదవ్, సార్థక్ రంజన్, తేజస్వి

మహిళల విభాగంలో ప్రతికా రావల్, ప్రియా పునియా, ప్రియా మిశ్రా, పరునికా సిసోడియా, సిమ్రన్ దిల్ బహదూర్ మార్కీ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు.

నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లు
వేలంలో పాల్గొనే ఆటగాళ్లను అనుభవం ఆధారంగా నాలుగు విభాగాలుగా విభజించారు.
* మార్కీ కేటగిరీ: భారత జట్టు, ఇండియా-ఏ లేదా గత మూడు సీజన్లలో ఐపీఎల్/డబ్ల్యూపీఎల్ ఆడిన ప్లేయర్లు.
* కేటగిరీ-A: గత మూడు దేశవాళీ సీజన్లలో ఢిల్లీ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారు.
* కేటగిరీ-B: ఢిల్లీ అండర్-23, అండర్-19, జూనియర్ ఆటగాళ్లు.
* కేటగిరీ-C:** డీడీసీఏ లీగ్‌లో రాణించిన, రిజిస్టర్ అయిన క్రికెటర్లు.

బేస్ ప్రైస్ ఎంతంటే..?
పురుషుల వేలంలో మార్కీ ఆటగాళ్ల బేస్ ప్రైస్ రూ.10 లక్షలు, కేటగిరీ-Aకు రూ.5 లక్షలు, కేటగిరీ-Bకు రూ.3 లక్షలు, కేటగిరీ-Cకు రూ.1 లక్షగా నిర్ణయించారు.

మహిళల విభాగంలో వరుసగా రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.1.5 లక్షలు, రూ.75 వేల బేస్ ప్రైస్‌లు నిర్ణయించారు.

600 మంది పోటీ
ఈసారి వేలంలో మొత్తం 600 మంది ఆటగాళ్లు పేర్లు నమోదయ్యాయి. అందులో 400 మంది పురుషులు, 200 మంది మహిళా క్రికెటర్లు ఉన్నారు. ఎనిమిది పురుషుల ఫ్రాంచైజీలు, నాలుగు మహిళా జట్లు వేలంలో పాల్గొంటాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలు 65 మంది పురుషులు, 28 మంది మహిళా ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి.

రూ.1.5 కోట్ల పర్స్‌తో పురుషుల జట్లు
పురుషుల జట్లకు రూ.1.5 కోట్ల పర్స్ కేటాయించగా, మహిళల జట్లకు రూ.75 లక్షల బడ్జెట్ ఇచ్చారు. రిటైన్ చేసిన ఆటగాళ్ల ఖర్చును మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తంతోనే ఫ్రాంచైజీలు వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఆర్‌టీఎం కార్డ్‌తో వ్యూహాత్మక అవకాశం
ఈసారి ప్రతి ఫ్రాంచైజీకి ఒక రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్ వినియోగించే అవకాశం కల్పించారు. ప్రత్యర్థి జట్టు అత్యధిక బిడ్ వేసిన ఆటగాడిని అదే ధరకు తిరిగి తమ జట్టులోకి తీసుకునే అవకాశం ఈ కార్డ్ ద్వారా లభిస్తుంది. దీంతో వేలం మరింత రసవత్తరంగా మారనుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement