
ముంబై అండర్ 23 జట్టు ఈ ఏడాది జూన్ ఆఖరిలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ముంబై జట్టు నాటింగ్హామ్షైర్, వోర్సెస్టర్షైర్, గ్లౌసెస్టర్షైర్ వంటి కౌంటీ టీమ్స్తో ఐదు రెండు రోజుల మ్యాచ్లు, నాలుగు వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ పర్యటన కోసం తమ జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.
ఈ జట్టుకు స్టార్ ఆల్రౌండర్ సూర్యాంష్ షెగ్దే కెప్టెన్గా ఎంపికయ్యాడు. సూర్యాంష్ డిప్యూటీగా వేదాంత్ ముర్కర్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఈ జట్టులో బ్యాటింగ్ ఆల్ రౌండర్ ముషీర్ ఖాన్, కేకేఆర్ స్టార్ ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీ, యువ స్పిన్నర్ హిమాన్షు సింగ్ కూడా ఉన్నారు.
ముంబై జట్టు దాదాపు నెల రోజుల పాటు ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ టూర్లో ముంబై జట్టుకు కిరణ్ పొవార్ ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు. అంతేకాకుండా ఎంసీఎ జాయింట్ సెక్రటరీ దీపక్ పాటిల్,ట్రెజరర్ అర్మాన్ మాలిక్ జట్టు సమన్వయకర్తలుగా పనిచేయనున్నారు.
ఇంగ్లండ్ టూర్కు ముంబై అండర్ 23 జట్టు ఇదే..
సూర్యాంశ్ షెడ్గే (కెప్టెన్), వేదాంత్ ముర్కర్ (వైస్ కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, ఆయుష్ వర్తక్, ఆయుష్ జిమారే, హిమాన్షు సింగ్, మనన్ భట్, ముషీర్ ఖాన్, నిఖిల్ గిరి, ప్రజ్ఞేష్ కాన్పిల్లెవార్, ప్రతీక్కుమార్ యాదవ్, ప్రేమ్ దేవ్కర్, ప్రిన్స్ బదియాని, జైద్ హరీష్హల్ పటాన్కర్, హెచ్ హరీష్హల్ పటాన్కర్.