-
ఐపీఎల్లో నా పేరు లేకపోవటమే మంచిదైంది: సర్ఫరాజ్ తమ్ముడు
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడాలని ఎవరు మాత్రం కోరుకోరు?!.. అయితే, అందుకు కెరీర్ను మూల్యంగా చెల్లించే పరిస్థితి రాకూడదనే జాగ్రత్తపడుతున్నానంటున్నాడు భారత యువ సంచలనం ముషీర్ ఖాన్! కాగా క్యాష్ రిచ్ లీగ్ ద్వారానే ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చి.. టీమిండియాలో పాతుకుపోయిన విషయం తెలిసిందే. టీనేజ్లోనే కోట్లు కొల్లగొట్టి స్టార్లుగా మారిపోయిన వాళ్లూ ఉన్నారు. అందుకే.. ప్రతి యువ క్రికెటర్ ఐపీఎల్లో ఆడే ఛాన్స్ కోసం తహతహలాడుతుంటారు. ముషీర్ ఖాన్ కూడా ఆ కోవకు చెందినవాడే! అయితే, అనుకున్న వెంటనే అతడికి ఛాన్స్ రాలేదు. గతేడాది వేలంలో పేరు నమోదు చేసుకున్న 19 ఏళ్ల ముషీర్పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవడంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. దీంతో నిరాశలో కూరుకుపోయాడు. అయితే, ఆ సమయంలో తండ్రి నౌషద్ ఖాన్ చెప్పిన మాటలు తనలో స్ఫూర్తి నింపాయని.. టీ20 ఫార్మాట్ గురించి పూర్తిగా అర్థం చేసుకునేందుకు తనకు మరింత సమయం దొరికిందని సంతోషంగా చెప్తున్నాడు ఈ ఏడాది ‘రంజీ’ ఫైనల్ హీరో ముషీర్ ఖాన్. నాన్న చెప్పాడు ‘‘ఐపీఎల్లో నా పేరు లేదు. అయినా.. మరేం పర్లేదు.. టెస్టు క్రికెట్పై దృష్టి పెట్టి.. టీమిండియాలో చోటే లక్ష్యంగా అడుగులు వేయాలని మా నాన్న చెప్పారు. ఆ క్రమంలో సరైన సమయంలో ఐపీఎల్లో చోటు కూడా దక్కుతుందన్నారు. ఈరోజు కాకపోతే.. రేపైనా ఐపీఎల్లో నేను తప్పక అవకాశం దక్కించుకుంటానని బలంగా చెప్పారు. నిజానికి ఈసారి నేను ఎంపిక కాకపోవడమే మంచిదైంది. టీ20 క్రికెట్ను నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి. అన్ని రకాలుగా పొట్టి ఫార్మాట్ కోసం సిద్ధం కావాలి’’ అని ముషీర్ ఖాన్ పీటీఐతో చెప్పుకొచ్చాడు. మా అన్నయ్యే నాకు స్ఫూర్తి ఇక తన అన్న సర్ఫరాజ్ ఖాన్ గురించి మాట్లాడుతూ..‘‘ ఆట పట్ల మా అన్నయ్యకు ఉన్న అంకిత భావం, అతడి బ్యాటింగ్ శైలి నాకెంతో నచ్చుతాయి. మా ఇద్దరి బ్యాటింగ్ శైలి దాదాపుగా ఒకేలా ఉంటుంది. రంజీ ఫైనల్ మ్యాచ్కు వెళ్లే ముందు అతడే నాలో ధైర్యం నింపాడు. ఫైనల్ అని ఒత్తిడిలో కూరుకుపోతే మొదటికే మోసం వస్తుందని.. సాధారణ మ్యాచ్లలాగే అక్కడా ఆడాలని చెప్పాడు’’ అని ముషీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ 2023-24 ఫైనల్లో ముషీర్ ఖాన్ 136 పరుగుల(సెకండ్ ఇన్నింగ్స్)తో చెలరేగి జట్టును విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ముంబై రికార్డు స్థాయిలో 42వ సారి టైటిల్ గెలవడంలో భాగమై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అనంతరం ముషీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సర్ఫరాజ్కూ నో ఛాన్స్ కాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా రాజ్కోట్ మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్. అండర్-19 వరల్డ్కప్లో సత్తా చాటి.. రంజీలోనూ అదరగొట్టాడు. ఇప్పటి వరకు అతడు కేవలం ఐదు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్ను సైతం ఐపీఎల్-2024 వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. అంతకు ముందు అతడు ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. ఇకపై -
మా జట్టులో తక్కువ పరుగులు చేసింది నేనే: రహానే
Ajinkya Rahane Comments After Guiding Mumbai to Ranji Trophy Title Win: ‘‘మా జట్టులో తక్కువ పరుగులు స్కోరు చేసిన బ్యాటర్ను నేనే.. అయినప్పటికీ అందరికంటే అత్యంత సంతోషడే వ్యక్తిని కూడా నేనే.. ట్రోఫీ గెలవడం ఆనందంగా ఉంది. ప్రతి ఆటగాడి కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉంటాయి. ఏదేమైనా డ్రెసింగ్ రూంలో అందరూ పరస్పరం ఒకరి విజయాలు మరొకరు సెలబ్రేట్ చేసుకునే వాతావరణం కల్పించడమే అత్యంత ముఖ్యమైనది. నా జీవితంలో ఈరోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గతేడాది ఒక్క పరుగు తేడాతో ఓడి.. నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయాం. అయితే, ఇప్పుడు జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి పట్ల మరింత బాధ్యత తీసుకుని.. వారి ఆటిట్యూడ్, ఫిట్నెస్, సహచర సభ్యులతో మెలిగే విధానం.. ఇలా ప్రతి అంశంలోనూ మరింత శ్రద్ధ వహించాం. ముంబై క్రికెట్ అసోసియేషన్ అన్ని వేళలా మాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు’’ అని రంజీ ట్రోఫీ 2023-24 టైటిల్ విన్నింగ్ కెప్టెన్ అజింక్య రహానే హర్షం చేశాడు. అదే విధంగా.. విదర్భ సైతం ఆఖరి వరకు విజయం కోసం అద్భుతంగా పోరాడిందని కొనియాడాడు. కాగా వాంఖడే స్టేడియంలో గురువారం ముగిసిన రంజీ ట్రోఫీ 2023- 24 ఫైనల్ మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విదర్భను 169 పరుగుల తేడాతో చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఏకంగా 42వ సారి ట్రోఫీ గెలుచుకుంది. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్(136) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక రహానే 73 విలువైన పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ 95 పరుగులతో అదరగొట్టాడు. షమ్స్ ములానీ సైతం అజేయ అర్ధ శతకంతో రాణించాడు. కాగా రంజీ తాజా ఎడిషన్లో అదరగొట్టి టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలనుకున్న రహానే.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మొత్తంగా పదమూడు ఇన్నింగ్స్ ఆడి కేవలం 214 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 are WINNERS of the #RanjiTrophy 2023-24! 🙌 Mumbai Captain Ajinkya Rahane receives the coveted Trophy 🏆 from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#Final | #MUMvVID | @ShelarAshish | @ajinkyarahane88 | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/LPZTZW3IV4 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 For his superb hundred in the #RanjiTrophy #Final, Musheer Khan is named the Player of the Match. 👍 👍 He receives the award from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#MUMvVID | @ShelarAshish | @IDFCFIRSTBank pic.twitter.com/T3l6mLW6kP — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 Tanush Kotian bagged the Player of the Tournament award for brilliant all-round display 🙌 🙌 He receives the award from Mr Ajinkya Naik, Honorary Secretary, Mumbai Cricket Association. 👏 👏#RanjiTrophy | #Final | #MUMvVID | @ajinkyasnaik | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/eMbRcr4s24 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 -
చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ తమ్ముడు.. సచిన్ రికార్డు బద్దలు
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభం నుంచి అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న ముంబై యువ ఆటగాడు ముషీర్ ఖాన్.. ఇప్పుడు ఫైనల్లో కూడా అదరగొట్టాడు. వాంఖడే వేదికగా విదర్భతో జరుగుతున్న తుది పోరులో ముషీర్ ఖాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 6 పరుగులు చేసి నిరాశపరిచిన ముషీర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం శతకంతో మెరిశాడు. 326 బంతుల్లో 10 ఫోర్లతో ముషీర్ 136 పరుగులు చేశాడు. ముషీర్ 326 బంతుల్లో 10 ఫోర్లతో 136 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రంజీ ట్రోఫీ ఫైనల్స్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ముంబై ఆటగాడిగా ముషీర్ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల 14 రోజుల వయస్సులో ముషీర్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1994-95 రంజీ సీజన్ ఫైనల్లో 21 ఏళ్ల 11 నెలల వయసులో సచిన్ సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్తో 29 ఏళ్ల సచిన్ రికార్డును ముషీర్ బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ను సచిన్ ప్రత్యక్షంగా స్టాండ్స్ లో నుంచి వీక్షిస్తున్న సమయంలోనే ముషీర్ ఈ ఘనత సాధించడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్ను వీక్షించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు వాంఖడేకు వెళ్లారు. ఇక ఈ ఏడాది సీజన్లో కేవలం మూడు మ్యాచ్లు ఆడిన ముషీర్.. 108.25 సగటుతో 433 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇక ఫైనల్లో ముంబై విజయం ముంగిట నిలిచింది. వాంఖడేలో జరుగుతున్న తుది పోరులో ముంబై విదర్భ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్బ.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. -
సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్.. విజయం ముంగిట ముంబై
రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా విధర్బతో జరుగుతున్న ఫైనల్లో ముంబై విజయం ముంగిట నిలిచింది. వాంఖడేలో జరుగుతున్న తుది పోరులో ముంబై విదర్భ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 141/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ముంబై.. 418 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో ముషీర్ ఖాన్ మరో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 326 బంతుల్లో 10 ఫోర్లతో ముషీర్ 136 పరుగులు చేశాడు. మరోవైపు భారత ఆటగాడు, ముంబై మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో 111 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 10 ఫోర్లు, 3 సిక్స్లతో 95 పరుగులు చేశాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 14 నెలల తర్వాత అతడికిది తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. వీరిద్దరితో పాటు కెప్టెన్ అజింక్య రహానే(73), శామ్స్ ములాని(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబె ఐదు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్ 3, ఆదిత్య థాక్రే, అమన్ తలో వికెట్ పడగొట్టారు. మూడో రోజు ఆట ముగిసేసరికి విదర్భ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ధ్రువ్ షోరె (7), అథర్వ తైడే (3) నాటౌట్గా క్రీజులో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటైంది. అనంతరం విదర్భ.. ముంబై బౌలర్ల దాటికి 105 పరుగులకే కుప్పకూలింది. తద్వారా ముంబై జట్టుకు 109 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించడంతో ముంబై.. విధర్భకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. -
రాణించిన రహానే, ముషీర్ ఖాన్.. టైటిల్ దిశగా ముంబై
రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో ముంబై టీమ్ గెలుపు దిశగా సాగుతుంది. విదర్భతో జరుగుతున్న తుది సమరంలో ఆ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి, 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ముషీర్ ఖాన్ (51), కెప్టెన్ అజింక్య రహానే (58) అర్దసెంచరీలతో అజేయంగా క్రీజ్లో ఉన్నారు. 119 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. 34 పరుగులకే ఓపెనర్లు పృథ్వీ షా (11), భూపేన్ లాల్వాని (18) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే ముషీర్ ఖాన్, రహానే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తమ జట్టును సేఫ్ జోన్లోకి చేర్చారు. వీరు మూడో వికెట్కు అజేయమైన 107 పరుగులు జోడించి ముంబైను గెలుపు దిశగా నడిపిస్తున్నారు. చాలాకాలం తర్వాత ముంబై కెప్టెన్ రహానే ఫామ్లోకి వచ్చాడు. కీలకమైన ఫైనల్లో రహానే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో మెరిశాడు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ అద్భుతమైన బంతితో పృథ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేశాడు. లాల్వాని వికెట్ హర్ష్ దూబేకు దక్కింది. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్లో 105 పరుగులకే కుప్పకూలింది. దవళ్ కులకర్ణి (3/15), షమ్స్ ములానీ (3/32), తనుశ్ కోటియన్ (3/7) విదర్భను దారుణంగా దెబ్బకొట్టారు. విదర్భ ఇన్నింగ్స్లో అథర్వ తైడే (23), యశ్ రాథోడ్ (27), ఆదిత్య థాకరే (19), యశ్ ఠాకూర్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై కూడా తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే పరిమితమైంది. విదర్భ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఆ జట్టు 224 పరుగులకే పరిమితమైంది. యశ్ ఠాకూర్ 3, హర్ష్ దూబే 3, ఉమేశ్ యాదవ్ 2, ఆదిత్య థాకరే ఓ వికెట్ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్లో శార్దూల్ ఠాకూర్ (75) టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబైకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో పాటు ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్లోనూ పటిష్టంగా ఉండటంతో ఆ జట్టునే విజయం వరించవచ్చు. ముంబై ఇప్పటికే ఏ జట్టుకు సాధ్యపడని రీతిలో 41 రంజీ టైటిళ్లు సాధించింది. -
వారిని డబ్బు అడుగుతున్న సర్ఫరాజ్ తండ్రి?! నిజం ఇదీ..
తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ స్పందించాడు. తన పేరిట నకిలీ ఖాతాలు తెరిచి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు. యువ క్రికెటర్లు ఎవరూ కూడా ఈ మోసగాళ్ల వలలో చిక్కవద్దని.. తాను ఏ జట్టుకు కూడా కోచ్గా వ్యవహరించడం లేదని నౌషద్ ఖాన్ స్పష్టం చేశాడు. కాగా తన ఇద్దరు కుమారులు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్లను టీమిండియాకు ఆడించాలన్నది నౌషద్ కల. ఇందుకోసం వారిద్దరిని చిన్ననాటి నుంచే ఆ దిశగా ప్రోత్సహించి.. అనేక కష్టనష్టాలకోర్చి కోచ్గా శిక్షణనిచ్చి మెంటార్గా మార్గదర్శనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్, ముషీర్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి తండ్రి పేరును నిలబెడుతున్నారు. అంచెలంచెలుగా ఎదిగి.. ముషీర్ ఖాన్ ఇటీవల అండర్-19 వరల్డ్కప్లో అదరగొట్టగా.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా రాజ్కోట్లో టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఆ సమయంలో నౌషద్ ఖాన్ కూడా కొడుకు పక్కనే ఉండి కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు అభిమానుల మనసును మెలిపెట్టాయి. ఈ క్రమంలో సర్ఫరాజ్తో పాటు నౌషద్ ఖాన్ పేరు కూడా నెట్టింట మారుమ్రోగింది. ఈ నేపథ్యంలో.. ‘‘డబ్బులు కడితే ఐపీఎల్లో నెట్ బౌలర్లుగా లేదంటే దేశవాళీ క్రికెట్లో ఆడే ఛాన్సులు ఇప్పిస్తాం’’ అని నౌషద్ ఖాన్ పేరిట ప్రకటనలు రాగా.. అతడు తాజాగా స్పందించాడు. ఈ మేరకు.. ‘‘నా పేరు మీద ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అనేక మంది నకిలీ ఖాతాలు సృష్టించి.. ఐపీఎల్ నెట్బౌలర్లుగా, రాష్ట్రస్థాయి క్రికెటర్లుగా, అకాడమీ సెలక్షన్ విషయంలో సాయం చేస్తామంటూ డబ్బు అడుగుతున్నారు. దయచేసి వీటిని ఎవరూ నమ్మకండి. మీ ప్రతిభ, హార్డ్వర్క్పైనే నమ్మకం ఉంచండి. నాకు ఏ ఐపీఎల్ జట్టుతోనూ సంబంధం లేదు. అదే విధంగా నేను ఏ జట్టుకు కూడా కోచింగ్ ఇవ్వడం లేదు. నకిలీ ప్రచారాలను నమ్మకండి. థాంక్యూ’’ అని నౌషద్ ఖాన్ ఓ వీడియో విడుదల చేశాడు. ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం ధర్మశాలలో ఇంగ్లండ్తో జరుగనున్న ఆఖరిదైన నామమాత్రపు ఆఖరి టెస్టుకు సిద్ధమవుతున్నాడు. ఇక రోహిత్ సేన ఇప్పటికే ఈ సిరీస్ను 3-1తో గెలిచిన విషయం తెలిసిందే. -
డబుల్ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ తమ్ముడు..
భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు, ముంబై ఆటగాడు ముషీర్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో సైతం దుమ్ము లేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా బరోడాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో ముషీర్ ఖాన్ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ముంబై 99 పరుగులకే 4 వికెట్లు పడిన క్రమంలో క్రీజులోకి వచ్చిన ముషీర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ముషీర్ ఖాన్కు ఇదే తొలి ఫస్ట్క్లాస్ డబుల్ సెంచరీ. కాగా ముషీర్ ఖాన్ తన తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలుచుకోవడం విశేషం. ఓవరాల్గా 357 బంతులు ఎదుర్కొన్న ముషీర్.. 18 ఫోర్లతో 203 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ముషీర్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో ముంబై తొలి ఇన్నింగ్స్లో 384 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో ముషీర్తో పాటు హార్దిక్ తామోర్(57) పరుగులతో రాణించాడు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ 7 వికెట్లతో సత్తా చాటాడు. చదవండి: IND vs ENG: అయ్యో.. ట్రాప్లో చిక్కుకున్న రోహిత్ శర్మ! వీడియో వైరల్ -
రంజీ క్వార్టర్ ఫైనల్స్.. రెచ్చిపోయిన ఆంధ్ర బౌలర్లు
రంజీ ట్రోఫీ 2024 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఇవాళ (ఫిబ్రవరి 23) మొదలయ్యాయి. తొలి క్వార్టర్ ఫైనల్లో విదర్భ-కర్ణాటక.. రెండో క్వార్టర్ ఫైనల్లో ముంబై-బరోడా.. మూడో క్వార్టర్స్లో సౌరాష్ట్ర-తమిళనాడు.. నాలుగో క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్-ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. చెలరేగిన ఆంధ్ర బౌలర్లు.. మధ్యప్రదేశ్తో జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో తొలి రోజు ఆంధ్ర బౌలర్ల హవా కొనసాగింది. ఆంధ్ర పేసర్లు ఎంపీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. శశికాంత్ (4/37), నితీశ్ రెడ్డి (3/50), గిరినాథ్ రెడ్డి (1/40) ధాటికి ఎంపీ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఎంపీ బ్యాటర్లలో యశ్ దూబే (64) అర్దసెంచరీతో రాణించగా.. హిమాన్షు మంత్రి (49), సరాన్ష్ జైన్ (41 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సరాన్ష్ జైన్కు జతగా కుల్వంత్ కేజ్రోలియా (1) క్రీజ్లో ఉన్నాడు. సెంచరీతో కదంతొక్కిన అథర్వ తైడే.. కర్ణాటకతో జరుగుతున్న తొలి క్వార్టర్స్లో విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. అథర్వ తైడే (109) సెంచరీతో కదంతొక్కగా.. యశ్ రాథోడ్ (93) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కరుణ్ నాయర్ (30), అక్షయ్ వాద్కర్ (2) క్రీజ్లో ఉన్నారు. కర్ణాటక బౌలర్లలో కావేరప్ప, కౌశిక్, హార్దిక్ రాజ్ తలో వికెట్ పడగొట్టారు. ముషీర్ ఖాన్ అద్భుత శతకం.. బరోడాతో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (128 నాటౌట్) అద్భుత శతకంతో మెరిశాడు. అతనికి జతగా హార్దిక్ తామోర్ (30) క్రీజ్లో ఉన్నాడు. పృథ్వీ షా 33, ఆజింక్య రహానే 3 పరుగులు చేసి ఔటయ్యారు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ 4, నినాద్ రత్వ ఓ వికెట్ పడగొట్టారు. ఐదేసిన సాయికిషోర్.. తమిళనాడుతో జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 183 పరుగులకే ఆలౌటైంది. సాయికిషోర్ (5/33) తన స్పిన్ మాయాజాలంతో సౌరాష్ట్ర పతనాన్ని శాశించాడు. అజిత్ రామ్ 3, సందీప్ వారియర్ 2 వికెట్లు పడగొట్టారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్లో హార్వక్ దేశాయ్ (83) ఒక్కడే రాణించాడు. సీనియర్ బ్యాటర్ పుజారా (2) విఫలమయ్యాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. విమల్ కుమార్ (5) ఔట్ కాగా.. జగదీశన్ (12), సాయికిషోర్ (6) క్రీజ్లో ఉన్నారు. -
ఓ పక్క అన్న.. మరో పక్క తమ్ముడు.. రఫ్ఫాడిస్తున్న ఖాన్ బ్రదర్స్
ప్రస్తుతం భారత క్రికెట్లో రెండు పేర్లు మార్మోగిపోతున్నాయి. ఏ ఇద్దరు కలిసినా ముంబై ఆటగాళ్లు, అన్నదమ్ములు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ ఖాన్ బ్రదర్స్ ప్రపంచ క్రికెట్లోనూ హాట్ టాపిక్గా మారారు. వచ్చీ రాగానే ఇరగదీసిన సర్ఫరాజ్.. దేశవాలీ క్రికెట్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగి అభినవ బ్రాడ్మన్గా కీర్తించబడిన సర్ఫరాజ్ ఖాన్.. అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చీ రాగానే తనదైన మార్కును చూపించాడు. ఇంగ్లండ్తో జరిగిన రాజ్కోట్ టెస్ట్తో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తొలి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీలు చేసి టీమిండియా భవిష్యత్తు సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. సంచలనాల ముషీర్.. సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ విషయానికొస్తే.. 18 ఏళ్ల ఈ కుడి చేతి వాటం బ్యాటర్ అన్న అడుగుజాడల్లోనే నడుస్తూ అద్భుతాలు చేస్తున్నాడు. ఇటీవల ముగిసిన అండర్ 19 వరల్డ్కప్లో సెంచరీల మోత మోగించి, పరుగుల వరద (7 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 360 పరుగులు) పారించిన ముషీర్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ క్వార్టర్ ఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగి అద్భుతమైన సెంచరీతో ఇరగదీశాడు. శివమ్ దూబే, శ్రేయస్ అయ్యర్ తప్పుకోవడంతో చివరి నిమిషంలో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ముషీర్.. బరోడాతో జరుగుతున్న మ్యాచ్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి సెంచరీతో మెరిశాడు. ఈ సెంచరీని ముషీర్ 179 బంతుల్లో పూర్తి చేశాడు. ముషీర్ సెంచరీతో కదంతొక్కడంతో ముంబై సేఫ్ జోన్లోకి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి, ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఎందుకంత హైప్.. క్రికెట్లో అన్నదమ్ములు కలిసి ఆడటం, ఇద్దరూ అద్భుతంగా రాణించడం వంటి ఘటనలు గతంలో చాలా సందర్భాల్లో చూశాం. అయితే ఈ ఖాన్ బ్రదర్స్ పరిస్థితి ఇందుకు భిన్నం. ఎందుకంటే సర్ఫరాజ్, ముషీర్లకు ఈ స్థాయి గుర్తింపు రావడానికి వెనుక చాలా కష్టం దాగి ఉంది. సర్ఫరాజ్, ముషీర్ల తండ్రి నౌషద్ ఖాన్ పేదరికంతో పోరాడి ఈ ఇద్దరి కెరీర్ల కోసం జీవితాన్నే త్యాగం చేశాడు. సర్ఫరాజ్ టీమిండియా తరఫున అరంగ్రేటం చేశాక నౌషద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. -
శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్.. ముషీర్ ఖాన్ ఎంట్రీ
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ నాకౌట్ మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించింది. క్వార్టర్ ఫైనల్స్లో అయ్యర్ ఆడటం లేదని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను రంజీల్లో ఆడమని బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై తరఫున బరిలోకి దిగిన అయ్యర్ ఆంధ్రతో మ్యాచ్ ఆడి.. 48 పరుగులు చేశాడు. అనంతరం భారత జట్టుతో చేరి తొలి రెండు టెస్టుల్లో భాగమయ్యాడు. అయితే, రెండు సందర్భాల్లోనూ ఆశించిన మేర రాణించలేకపోయాడు. రెండు మ్యాచ్లలో కలిపి 104 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో మిగిలిన మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులో బీసీసీఐ ఈ ముంబై బ్యాటర్కు స్థానం కల్పించలేదు. ఈ క్రమంలో వెన్నునొప్పి కారణంగా అయ్యర్ జట్టుకు దూరమయ్యాడనే వార్తలు వినిపించాయి. అయితే, బీసీసీఐ మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే.. జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి టీమిండియాకు ఆడాలనుకుంటే కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ టోర్నీలో తిరిగి అడుగుపెడతాడని భావించగా.. గాయం కారణంగా తాను అందుబాటులో ఉండటం లేదని ముంబై మేనేజ్మెంట్కు చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆల్రౌండర్, ముంబైని క్వార్టర్ ఫైనల్స్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన శివం దూబే కూడా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు, భారత యువ సంచలనం ముషీర్ ఖాన్ ముంబై జట్టులోకి వచ్చాడు. కాగా ఫిబ్రవరి 23 నుంచి బరోడాతో క్వార్టర్ ఫైనల్లో ముంబై తలపడనుంది. రంజీ క్వార్టర్ ఫైనల్స్-2024కు ముంబై జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), పృథ్వీ షా, అమోగ్ భత్కల్, భూపేన్ లల్వానీ, ముషీర్ ఖాన్, సూర్యాన్ష్ షెడ్గే, ప్రసాద్ పవార్ (వికెట్ కీపర్), హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తనూష్ కొటియాన్, షామ్స్ ములానీ, ఆదిత్య ధుమాల్, మోహిత్ అవస్థి, తుషార్ దేశ్పాండే, ధవళ్ కులకర్ణి, రాయ్స్టాన్ డయాస్. Mumbai squad for Ranji Trophy 2023-2024 Quarter Final match against Baroda to be played from 23rd to 26th February 2024 at MCA Sharad Pawar Cricket Academy, Bandra Kurla Complex, Mumbai. No Shivam Dube & Shreyas Iyer For Mumbai Musheer Khan returns to Mumbai squad… pic.twitter.com/YERqPzA248 — Rajesh Khilare (@Cricrajeshpk) February 20, 2024 -
సెంచరీ వీరుడికి గాయం.. సర్ఫరాజ్ తమ్ముడికి లక్కీ ఛాన్స్!
రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్ క్వార్టర్ ఫైనల్కు ముందు ముంబై జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, టీమిండియా ఆల్రౌండర్ శివం దూబే గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పి తీవ్రమైతరమైన నేపథ్యంలో రంజీ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు అతడు దూరం కానున్నట్లు సమాచారం. కాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్లో టీమిండియా తరఫున అదరగొట్టిన శివం దూబే.. వెంటనే రంజీ బరిలో దిగాడు. ముంబై తరఫున ఆల్రౌండ్ ప్రతిభ కనబరుస్తూ జట్టు క్వార్టర్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా బ్యాట్తో మ్యాజిక్ చేస్తూ రెండు సెంచరీలతో పాటు రెండు అర్ధ శతకాలు బాదాడు. చివరగా అసోంతో మ్యాచ్లో 140 బంతుల్లో 121 పరుగులు చేసిన దూబే నాటౌట్గా నిలిచి సత్తా చాటాడు. ఈ మ్యాచ్కు ముందు విశ్రాంతి తీసుకున్న ఈ ఆల్రౌండర్.. మ్యాచ్ అనంతరం మళ్లీ పక్కటెముల నొప్పితో ఇబ్బంది పడినట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై క్రికెట్ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘దూబే గాయపడిన కారణంగా రంజీ ట్రోఫీ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నాడు. అసోంతో మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే పక్కటెముకలు పట్టేశాయి. అందుకే రెండో ఇన్నింగ్స్లో అతడు మళ్లీ మైదానంలో దిగలేదు’’ అని పేర్కొన్నాయి. కాగా ముంబై తదుపరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బరోడాతో తలపడనుంది. ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానున్న ఈ మ్యాచ్కు శివం దూబే దూరం కానుండగా.. భారత యువ సంచలనం ముషీర్ ఖాన్ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. రంజీల్లో పరుగుల వరద పారించి ఇంగ్లండ్తో మూడో టెస్టు సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్ ఖాన్. ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో భారత్ తరఫున 338 పరుగులు చేశాడీ ఆల్రౌండర్. అదే విధంగా ముంబై తరఫున ఇప్పటి వరకు మూడు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 96 రన్స్ సాధించాడు. చదవండి: రోహిత్, కోహ్లిలా హీరో అయ్యే వాడిని.. కానీ ఆరోజు ధోని ఎందుకలా చేశాడో? -
Viral Video: ఆ ముగ్గురి షాట్లను ఎంత చక్కగా ఆడాడో చూడండి..!
గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ సర్కిల్స్లో వినిపిస్తున్న పేరు ముషీర్ ఖాన్. ఈ 18 ఏళ్ల ముంబై కుర్రాడు అండర్-19 ప్రపంచకప్లో వరుస సెంచరీలతో విరుచుకుపడుతూ టాక్ ఆఫ్ ద కంట్రీగా మారాడు. క్రికెట్కు సంబంధించి ఏ ఇద్దరు ముగ్గురి మధ్య డిస్కషన్ జరిగినా ముషీర్ ఖాన్ పేరు వినిపిస్తుంది. అంతలా ముషీర్ ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. అయితే, ముషీర్ ఇంత హైప్ ఊరికే రాలేదు. వరల్డ్కప్ అతను పారించిన పరుగుల వరద, అతను ఆడిన షాట్లు, దూకుడు, టెక్నిక్.. ఇలా ఎన్నో కారణాల వల్ల అతనికి ఈ స్థాయి క్రేజ్ వచ్చింది. తాజాగా ఓ అభిమాని వరల్డ్కప్లో ముషీర్ ఆడిన కొన్ని షాట్లను ఎడిట్ చేసి సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. అంతలా ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా..? అయితే ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. Musheer khan channels his inner Ms Dhoni, Sachin Tendulkar, Suryakumar yadav #U19WorldCup2024 #IndianCricket pic.twitter.com/WJJLoyy4RU — Sahil (@Vijayfans45) January 31, 2024 నిలకడ, దూకుడు, వైవిధ్యంతో పాటు బలమైన టెక్నిక్ కలిగిన ముషీర్.. తనలో భారత క్రికెట్ దిగ్గజాల టాలెంట్ అంతా కలగలుపుకుని ఉన్నాడు. కెరీర్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్నట్లు కనిపిస్తున్న ముషీర్ ప్రస్తుత వరల్డ్కప్లో తాను ఆడిన ప్రతి షాట్ను ఎంతో కాన్ఫిడెంట్గా ఆడాడు. ముషీర్ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే.. అతను అచ్చుగుద్దినట్లు సచిన్, ధోని, సూర్యకుమార్ యాదవ్ ట్రేడ్మార్క్ షాట్లను ఆడాడు. ముషీర్ ఈ షాట్లు ఆడిన విధానం చూసి అంతా నివ్వెరపోతున్నారు. ఇంత చిన్న వయసులో ఈ కుర్రాడు దిగ్గజాలు ఆడిన షాట్లను ఎంత చక్కగా ఇమిటేట్ చేస్తున్నాడంటే ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్లో ముషీర్తో పాటు అతని అన్న సర్ఫరాజ్ ఖాన్ పేరు కూడా వినిపిస్తుంది. దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి, అభినవ బ్రాడ్మన్గా కీర్తించబడిన సర్ఫరాజ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా చోటు దక్కించుకున్నాడు. సర్ఫరాజ్ ఇంగ్లండ్తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్లో అరంగేట్రం చేయడం ఖాయమని తెలుస్తుంది. సర్ఫరాజ్, ముషీర్ల పేర్లు ఒకేసారి దేశం మొత్తం మార్మోగుతుండటంతో వీరి తండ్రి ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోతున్నాడు. ముషీర్.. ప్రస్తుత వరల్డ్కప్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు (ఐర్లాండ్పై 106 బంతుల్లో 118 పరుగులు, యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు), ఓ హాఫ్ సెంచరీ (యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు) సాయంతో 325 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ముషీర్ అన్న సర్ఫరాజ్ సైతం 2016 అండర్-19 వరల్డ్కప్లో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ప్రస్తుత అండర్-19 వరల్డ్కప్ ఎడిషన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ భారత్.. అనధికారికంగా సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. యంగ్ ఇండియా తమ తదుపరి సూపర్ సిక్స్ మ్యాచ్లో (ఫిబ్రవరి 2) నేపాల్ను ఢీకొంటుంది. -
అత్యంత అరుదైన ఘనత సాధించిన టీమిండియా బ్యాటర్
అండర్-19 వరల్డ్కప్లో సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తూ, పరుగుల వరద పారిస్తున్న యంగ్ ఇండియా బ్యాటర్ ముషీర్ ఖాన్.. న్యూజిలాండ్తో నిన్న జరిగిన మ్యాచ్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్కప్లో ఇప్పటికే ఓ సెంచరీతో (ఐర్లాండ్పై 106 బంతుల్లో 118 పరుగులు) చెలరేగిన ముషీర్.. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మరో సెంచరీతో (126 బంతుల్లో 131 పరుగులు) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో ముషీర్ సింగిల్ వరల్డ్కప్ ఎడిషన్లో ఒకటికంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ముషీర్కు ముందు టీమిండియా తరఫున సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ మాత్రమే సింగిల్ వరల్డ్కప్ ఎడిషన్లో రెండు సెంచరీలు చేశాడు. తాజా ప్రదర్శనతో ముషీర్.. శిఖర్ సరసన నిలిచాడు. న్యూజిలాండ్పై సెంచరీతో ముషీర్ మరో ఘనతను కూడా సాధించాడు. ముషీర్.. ప్రస్తుత వరల్డ్కప్లో లీడింగ్ రన్ స్కోరర్గా అవతరించాడు. ముషీర్ ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ (యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు) సాయంతో 325 పరుగులు చేశాడు. అన్న అడుగుజాడల్లో.. ఇటీవలే టీమిండియాకు ఎంపికైన ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్కు సొంత తమ్ముడైన ముషీర్ అన్న అడుగుజాడల్లో నడుస్తున్నాడు. 2016 అండర్-19 వరల్డ్కప్లో సర్ఫరాజ్ కూడా లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్న ముషీర్.. తర్వలో టీమిండియా తలుపులు కూడా తట్టే అవకాశం ఉంది. తాజా ప్రదర్శనలతో ముషీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని సైతం ఆకర్శించాడు. 2024 సీజన్ వేలంలో అన్ సోల్డ్గా మిగిలిపోయిన ముషీర్ను అవకాశం ఉంటే పంచన చేర్చుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన 18 ఏళ్ల ముషీర్.. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేసిన ముషీర్.. ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడి కేవలం 96 పరుగలు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో నిన్న జరిగిన గ్రూప్-1 సూపర్ సిక్స్ మ్యాచ్లో యువ భారత్ 214 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఫిబ్రవరి 2న ఆడనుంది. ఆ మ్యాచ్లో భారత్.. నేపాల్తో తలపడుతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న భారత్.. సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. -
న్యూజిలాండ్ను చిత్తు చేసిన భారత్.. 214 పరుగుల తేడాతో ఘన విజయం
అండర్ 19 వరల్డ్ కప్-2024లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీ సూపర్ సిక్స్ దశను విజయంతో ఆరంభించింది. సూపర్ సిక్స్లో భాగంగా బ్లూమ్ఫోంటైన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 214 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. భారత విజయంలో ముషీర్ ఖాన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్లో సెంచరీతో చెలరేగిన ముషీర్.. అనంతరం బౌలింగ్లో రెండు వికెట్లు పడగొట్టాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 131 ముషీర్ పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ముషీర్తో పాటు ఓపెనర్ ఆదర్శ్ సింగ్(52), కెప్టెన్ ఉదయ్ సహారన్(34) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాసేన్ క్లార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. ఒలీవర్ తెవాటియా, కమ్మింగ్, రెయాన్ తలా వికెట్ సాధించారు. 4 వికెట్లతో చెలరేగిన సౌమ్య పాండే.. 296 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. భారత బౌలర్ల దాటికి కేవలం 81 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్ సౌమ్య పాండే 4 వికెట్లతో బ్లాక్క్యాప్స్ పతనాన్ని శాసించగా.. రాజ్ లింబానీ, ముషీర్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జాక్సన్(19) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. -
నిన్న టీమిండియాలోకి అన్న.. ఇప్పుడేమో తమ్ముడి విధ్వంసకర సెంచరీ
అండర్ 19 వరల్డ్కప్-2024లో టీమిండియా ఆటగాడు ముషీర్ ఖాన్ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బ్లూమ్ఫోంటైన్ వేదికగా న్యూజిలాండ్తో మ్యాచ్లో ముషీర్ ఖాన్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 131 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ముషీర్కు ఇది రెండో సెంచరీ. అంతకముందు ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లోనూ ముషీర్ ఖాన్(118)సెంచరీతో సత్తాచాటాడు. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన ముషీర్.. 325 పరుగులు చేశాడు. కాగా ఈ ముషీర్ ఖాన్ ఎవరో కాదు స్వయానా ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడే. నిన్న ఇంగ్లండ్తో రెండో టెస్టుకు సర్ఫరాజ్కు భారత సెలక్టర్ల నుంచి పిలుపు రావడం.. ఈ రోజు తన తమ్ముడు సెంచరీతో చెలరేగడం ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ముషీర్తో పాటు ఆదర్శ్ సింగ్(52), కెప్టెన్ ఉదయ్ సహారన్(34) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాసేన్ క్లార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. ఒలీవర్ తెవాటియా, కమ్మింగ్, రెయాన్ తలా వికెట్ సాధించారు. చదవండి: Ind vs Eng: రోహిత్ కూడా చెప్పాడు..! తుదిజట్టులో సిరాజ్ అవసరమా? -
అన్నాదమ్ముళ్ల బ్యాటింగ్పై ఐసీసీ ప్రత్యేక వీడియో.. తప్పని ట్రోలింగ్
భారత యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. భారత్ తరఫున ఒకేరోజు వేర్వేరు ఫార్మాట్లలో శతకాలు బాదిన ఈ అన్నాదమ్ముళ్లు.. ఎప్పటికప్పుడు తమ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నారంటూ అభిమానులు మురిసిపోతున్నారు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సర్ఫరాజ్, ముషీర్ల అర్హతకు తగినట్లుగా బీసీసీఐ అవకాశాలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముంబై ఆటగాళ్ల బ్యాటింగ్ శైలిని పోలుస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి వీడియో షేర్ చేయడం విశేషం. ‘‘మా అన్నయ్య.. నేనూ ఒకే తరహాలో బ్యాటింగ్ చేస్తాం’’ అంటూ ముషీర్ ఖాన్ మాట్లాడుతున్న దృశ్యాలను తమ అధికారిక ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఐసీసీ.. నీలం రంగు జెర్సీలో అన్నాదమ్ముళ్లు బ్యాట్ ఝలిపించిన తీరును కొనియాడింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ నేపథ్యంలో భారత క్రికెటర్ల ప్రతిభను గుర్తించడంలో బీసీసీఐ కంటే ఐసీసీ బెటర్గా ఉందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం.. ముషీర్ కచ్చితంగా టీమిండియా ఆల్రౌండర్గా ఎదుగుతాడని అభిప్రాయపడుతున్నారు. ఇంకొంత మందేమో.. మీ అన్నలా ఇగో చూపించకుండా హుందాగా ఉంటూ అవకాశాలు అందిపుచ్చుకోవాలని ముషీర్కు సూచనలు ఇస్తున్నారు. కాగా గురువారం ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక టెస్టులో భారత్-ఏ జట్టు తరఫున సర్ఫరాజ్ ఖాన్ అద్భుత శతకం(161)తో మెరిశాడు. మరోవైపు.. ఇదే రోజు అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో ముషీర్ ఖాన్ 118 పరుగులు సాధించి.. ఐర్లాండ్పై యువ భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈ మేరకు వీడియో షేర్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక డిసెంబరు 2022లో ముంబై తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన ముషీర్ ఖాన్.. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లాడి 96 రన్స్ చేశాడు. అదే విధంగా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రైట్హ్యాంట్ బ్యాటర్.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. ఇక ముషీర్ ఖాన్ అన్న సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే ఫస్ట్క్లాస్ క్రికెట్లో అదరగొట్టాడు. భారత్-ఏ జట్టు తరఫున ఆడుతూ తనను తాను నిరూపించుకుంటున్నాడు. కాగా సర్ఫరాజ్ ప్రస్తుతం స్వదేశంలో అనధికారిక టెస్టు సిరీస్తో బిజీగా ఉండగా.. ముషీర్ సౌతాఫ్రికాలో వరల్డ్కప్ టోర్నీ ఆడుతున్నాడు. సుమారుగా 7625 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరిద్దరూ ఒకేరోజు శతకాలు బాదడం ఫ్యాన్స్ను ఆకర్షిస్తోంది. చదవండి: సెంచరీలు బాదినా నో ఛాన్స్: ‘నువ్వు కూడా అతడి లాగే అమెరికా వెళ్లిపో!’ -
చెలరేగిన భారత బౌలర్లు.. 100 పరుగులకే ఆలౌట్.. ఘన విజయం
ICC Under 19 World Cup 2024- India U19 won by 201 runs: ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్-2024లో యువ టీమిండియా ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ను ఏకంగా 201 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ మేరకు భారీ గెలుపు నమోదు చేసింది. సౌతాఫ్రికాలోని బ్లూమ్ఫౌంటేన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్ 17, అర్షిన్ కులకర్ణి 32 పరుగులు చేయగా.. వన్డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 106 బంతుల్లో 118 పరుగులు సాధించాడు. ఇక ముషీర్తో పాటు కెప్టెన్ ఉదయ్ సహారన్ 75 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ అరవెల్లి అవినాష్ రావు 22, సచిన్ ధ్యాస్ 21(నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. భారీ లక్ష్యం విధించి ముషీర్, ఉదయ్ ఇన్నింగ్స్ కారణంగా యవ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 301 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐరిష్ జట్టును భారత బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లలో జోర్డాన్ నీల్(11)ను స్పిన్నర్ సౌమీ పాండే పెవిలియన్కు పంపి శుభారంభం అందించగా.. పేసర్ నమన్ తివారి ఐరిష్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. నమన్ తివారి దెబ్బకు ఓపెనర్ రియాన్ హంటర్(13)ను అవుట్ చేసిన నమన్.. మిడిలార్డర్ను కకావికలం చేశాడు. అతడి దెబ్బకు ఐర్లాండ్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోగా.. సౌమీ పాండే సైతం మరోసారి విజృంభించాడు. ఈ నేపథ్యంలో 29.4 ఓవర్లలోనే ఐర్లాండ్ కథ ముగిసింది. బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో వంద పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఏకంగా 201 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే భారత బౌలర్లలో నమన్ తివారికి అత్యధికంగా నాలుగు, సౌమీ పాండేకు మూడు వికెట్లు దక్కగా.. ధనుశ్ గౌడ, మురుగన్ అభిషేక్, ఉదయ్ సహారన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన సెంచరీ వీరుడు ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ ఐసీసీ ఈవెంట్ తాజా ఎడిషన్లో భారత్కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను 84 పరుగుల తేడాతో సహారన్ సేన చిత్తు చేసింది. ఇక తాజా విజయంతో గ్రూప్-ఏ టాపర్గా నిలిచింది యువ భారత జట్టు. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! Another huge win, this time by 201 runs, has consolidated India’s position at the top of the Group A table 👏 Match Highlights 🎥 #U19WorldCup pic.twitter.com/U1LucpWNcI — ICC (@ICC) January 25, 2024 -
INDA& U19 WC: టెస్టులో అన్న.. వరల్డ్కప్లో తమ్ముడి సెంచరీలు
What A day for Sarfaraz Khan and Musheer Khan: ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్కప్ 2024లో భారత యువ ఆటగాడు ముషీర్ ఖాన్ అదరగొట్టాడు. ఐర్లాండ్తో మ్యాచ్లో ఆద్యంతం దూకుడుగా ఆడి సెంచరీతో చెలరేగాడు.మొత్తంగా 106 బంతులు ఎదుర్కొన్న 18 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు. ముషీర్ ఖాన్కు తోడు కెప్టెన్ ఉదయ్ సహారన్ 75 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా యువ టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఈ ప్రపంచకప్ ఈవెంట్లో భారత్ గురువారం ఐర్లాండ్తో తలపడుతోంది. ముషీర్ దుమ్ములేపాడు.. సహారన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఇందులో భాగంగా.. టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ త్వరగానే ఓపెనర్లు ఆదర్శ్ సింగ్(17), అర్షిన్ కులకర్ణి(32) వికెట్లు కోల్పోయింది. అయితే, వన్డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ మాత్రం పట్టుదలగా నిలబడి.. కెప్టెన్ ఉదయ్ సహారన్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఐదో నంబర్లో బ్యాటింగ్ చేసిన తెలుగు క్రికెటర్ అరవెల్లి అవినాశ్ రావు 22, సచిన్ దాస్ 21(నాటౌట్) పర్వాలేదనిపించారు. టెయిలెండర్లు ప్రియాన్షు మొలియా(2), మురుగన్ అభిషేక్(0) పూర్తిగా విఫలమయ్యారు. అటు అన్న.. ఇటు తమ్ముడు ఇరగదీశారు ఇదిలా ఉంటే.. ముషీర్ ఖాన్.. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు స్వయానా తమ్ముడు. ఇంగ్లండ్ లయన్స్తో భారత్-ఏ అనధికారిక టెస్టులో భాగంగా గురువారం సర్ఫరాజ్ సెంచరీతో దుమ్ములేపాడు. 160 బంతుల్లోనే 18 ఫోర్లు, 5 సిక్స్లు బాది 161 పరుగులు సాధించాడు. యాధృచ్ఛికంగా ఇదే రోజు ముషీర్ ఖాన్ ఐర్లాండ్తో వన్డేలో శతకంతో చెలరేగడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ అన్నాదముళ్లను క్రికెట్ ప్రేమికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘‘అన్న అలా.. ఇంగ్లండ్ లయన్స్ మీద 161... తమ్ముడేమో ఇలా ఐర్లాండ్ మీద 118.. ఈరోజు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్లదే’’ అంటూ అన్నాదముళ్లను ఆకాశానికెత్తుతున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ టీమిండియాకు ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. చదవండి: సెంచరీలు బాదినా నో ఛాన్స్: ‘నువ్వు కూడా అతడి లాగే అమెరికా వెళ్లిపో!’
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement