
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో టీమిండియా(Teamindia) ఓటమి పాలైంది. 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఆఖరి రోజు ఆటలో బౌలర్లు తేలిపోయారు. దీంతో ఈ భారీ టార్గెట్ను ఇంగ్లండ్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(149) భారీ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఇంగ్లీష్ జట్టు దూసుకెళ్లింది. కాగా భారత్ ఓటమికి ప్రధానం కారణం ఫీల్డింగ్ వైఫల్యమే. మొత్తంగా ఈ మ్యాచ్లో 6 క్యాచ్లను భారత ఫీల్డర్లు జారవిడిచారు.
ఆఖరి రోజు ఆటలో సైతం టీమిండియా ఫీల్డింగ్ ఏ మాత్రం మెరుగుపడలేదు. ఆఖరి రోజు ఆటలో మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ బెన్ డకెట్ క్యాచ్ను 97 పరుగుల వద్ద జైశ్వాల్ విడిచిపెట్టాడు. దీంతో అతడు ఏకంగా 149 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ క్రమంలో పేలవ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన టీమిండియాను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్(Michael Vaughan) ట్రోలు చేశాడు. "ఈ భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్ను నేనే అని ప్రకటిస్తున్నాను. నా ఫీల్డింగ్ ఆకాడమీ ప్రస్తుతం బాగా రాణిస్తోంది" అని అని సెటైరికల్ ట్వీట్ చేశాడు.
అతడికి భారత అభిమానులు గట్టిగా కౌంటిరిస్తున్నారు. గతంలో వాన్ క్యాచ్లు విడిచిపెట్టిన వీడియోలను ఎక్స్లో షేర్ చేస్తున్నారు. గతంలో వాన్ తన సొంత జట్టును కూడా విధంగానే ట్రోలు చేశాడు. ఇక ఇంగ్లండ్-భారత్ మధ్య రెండో టెస్టు వచ్చే బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్
The CV of the fielding coach: pic.twitter.com/1xkurSt9Qr
— 𝐉𝐨𝐟𝐫𝐚 𝐒𝐭𝐨𝐜𝐤 𝐇𝐮𝐧𝐭𝐞𝐫 (@Niteish_14) June 24, 2025