గాలే వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచ్లో ఇండియా-ఏ రెండో ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 189 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో లంక-ఏ ముందు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత బ్యాటర్లలో దేవదత్ పడిక్కల్ (67) అర్ధసెంచరీ చేయగా, ఓపెనర్ ఆయుశ్ పాండే (38) పర్వాలేదనిపించాడు.
లోయర్ ఆర్డర్లో షేక్ రషీద్ (20), హర్ష్ దూబే (29) పరుగులు చేయడంతో ఇండియా-ఏ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్ 172 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఇండియా-ఏ 311 పరుగులు సాధించింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక వర్షం అంతరాయం కలిగించే సమయానికి 6.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.
నువానిదు ఫెర్నాండో (2), ఆషెన్ బండారా (1) క్రీజులో ఉన్నారు. ఇండియా-ఏ విజయానికి 8 వికెట్లు అవసరం కాగా.. లంక విజయానికి 275 పరుగులు చేయాల్సి ఉంది. అంతకముందు శ్రీలంక-ఏ తమ తొలి ఇన్నింగ్స్లో 330 పరుగులకు ఆలౌటైంది. నువానిదు ఫెర్నాండో (84), ఆషెన్ బండారా (70), కెప్టెన్ సహన్ అరాచిగె (72) అర్ధశతకాలతో రాణించారు.
ఇండియా-ఏ బౌలర్లలో అకిబ్ నబీ 4 వికెట్లతో చెలరేగగా, యష్ ఠాకూర్, హర్ష్ దూబే చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో ఇండియా-ఏ జట్టు 452 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ధ్రువ్ జురేల్తో పాటు ఓపెనర్ సాయి సుదర్శన్ భారీ శతకాలతో మెరిశారు.


