ఆసీస్‌తో మూడో టెస్టు: నితీశ్‌ రెడ్డి అద్భుతం.. కానీ తుది జట్టులో వద్దు! | India might be forced to drop their best batter for third Test: Sanjay Manjrekar | Sakshi
Sakshi News home page

IND vs AUS: 'ఆసీస్‌తో మూడో టెస్టు.. తుది జట్టు నుంచి నితీశ్‌ రెడ్డిని త‌ప్పించండి'

Dec 11 2024 2:11 PM | Updated on Dec 11 2024 2:32 PM

India might be forced to drop their best batter for third Test: Sanjay Manjrekar

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా యువ ఆల్‌రౌండ‌ర్‌, ఆంధ్ర స్టార్ క్రికెట‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి దుమ్ములేపుతున్న సంగ‌తి తెలిసిందే. తొలిసారి ఆస్ట్రేలియాలో ఆడుతున్న నితీశ్‌.. మిచెల్ స్టార్క్‌, ప్యాట్ కమ్మిన్స్ వంటి వ‌రల్డ్ క్లాస్ బౌల‌ర్ల‌ను అలోవ‌కగా ఎదుర్కొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు.

ఇటీవ‌ల జ‌రిగిన పింక్‌బాల్ టెస్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ వంటి స్టార్ ప్లేయ‌ర్లు విఫ‌ల‌మైనప్ప‌టికి.. నితీశ్ మాత్రం రెండు ఇన్నింగ్స్‌లోనూ టాప్ స్కోర‌ర్‌గా నిలిచి స‌త్తాచాటాడు. మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 41, 38 (నాటౌట్), 42, 42 పరుగులతో రాణించాడు. అయితే బౌలింగ్‌లో మాత్రం ఈ ఆంధ్ర ఆల్‌రౌండ‌ర్ ఇంకా త‌న మార్క్ చూపించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 2 వికెట్లు మాత్రమే తీసాడు. అతడితో పాటు హర్షిత్ రాణా కూడా పెద్దగా రాణించలేకపోతున్నాడు. దీంతో పేస్‌ బౌలింగ్‌​ భారమంతా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లపైనే పడుతోంది.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్బేన్‌లో జరిగే మూడో టెస్టుకు నితీశ్ రెడ్డిని తప్పించాలని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. 

"నితీష్ కుమార్‌కు అద్బుతమైన బ్యాటింగ్ స్కి‍ల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టుపై కూడా అతడు ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పెద్దగా పరుగులు సాధించకపోయినప్పటకి.. అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుగ్గా రాణించడం నిజంగా శుభసూచికం. 

ఆస్ట్రేలియా వంటి పరిస్థితుల్లో నితీశ్‌లా బ్యాటింగ్ చేసే ప్లేయర్లను అరుదుగా చూస్తూ ఉంటాము. కానీ భారత జట్టు మెనెజ్‌మెంట్ ప్లేయింగ్ ఎలెవన్ కాంబినేషన్‌పై ఆలోచన చేయాలి. బౌలింగ్ యూనిట్‌పై కూడా దృష్టిసారించాలి. 

నితీష్ బ్యాట్‌తో రాణిస్తున్నా..బౌలింగ్‌లో మాత్రం తేలిపోతున్నాడు. కాబట్టి నితీశ్ రెడ్డిని కేవలం బ్యాటర్‌గా కొనసాగించడం రిస్క్‌తో కూడిన వ్యవహరమని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement