స్కూటీ అదుపుతప్పి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

స్కూటీ అదుపుతప్పి మహిళ మృతి

Jul 3 2023 12:14 PM | Updated on Jul 3 2023 12:43 PM

- - Sakshi

మొయినాబాద్‌: స్కూటీ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో ఓ మహిళ ఘటనాస్థలిలోనే మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ డీకే లక్ష్మీరెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కనకమామిడి గ్రామానికి చెందిన పట్లోళ్ల సుధాకర్‌రెడ్డి, అతని భార్య శోభారాణి(55) ఆదివారం ఉదయం చేవెళ్ల మండలం మల్కాపూర్‌లోని తమ కూతురు వద్దకు స్కూటీపై వెళ్లారు.

మధ్యాహ్నం 3గంటల సమయంలో తిరి గి ఇంటికి వెళ్తున్నారు. హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారిపై కేతిరెడ్డిపల్లి గేటు సమీపంలోని గ్రీన్‌ ఫీల్డ్‌ రిసార్ట్స్‌ వద్దకు రాగానే ఎదురుగా ఏదో వాహనం వచ్చినట్లు అనిపించడంతో స్కూటీ అదుపుతప్పింది. దీంతో స్కూటీపై వెనకాల కూర్చున్న శోభారాణి ఎగిరి రోడ్డుపై పడడంతో ఆమె తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.

స్కూటీ నడుపుతున్న సుధాకర్‌రెడ్డికి ఎలాంటి గా యాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతు రాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement