మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై రాళ్ల దాడి | TDP, Janasena Activists Attack On Jogi Ramesh's House | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై రాళ్ల దాడి

Jun 16 2024 4:54 PM | Updated on Jun 16 2024 6:49 PM

Tdp,janasena Activists Attack On Jogi Ramesh House

సాక్షి,ఎన్టీఆర్‌ జిల్లా: ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.

తాజాగా, మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై జనసేన,టీడీపీ సానుభూతి పరులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement