
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు.
ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ డిప్యూటీ కోఆర్డినేటర్గా సుధాకర్బాబు
సాక్షి, అమరావతి: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు.
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రి పెద్దిరెడ్డిని అనంతపురం, హిందూపురం చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు అదనంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్గా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది.
అదే విధంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ డిప్యూటీ రీజినల్ కో–ఆర్డినేటర్గా టీజేఆర్ సుధాకర్ బాబును నియమించినట్లు కేంద్ర కార్యాలయం పేర్కొంది.
ఇదీ చదవండి: స్నేహం కాదు, దాసోహం!