శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆదివారం భక్తు లు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆదిదంపతులను సుమారు 33వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు అలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం 547, రూ.200 శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా 3,153 మంది, రూ.50 ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా 2,351 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహుకేతు టికెట్ల ద్వారా 3,051మంది, రూ.750 టికెట్ల ద్వారా 1,220, రూ.1,500 టికెట్ల ద్వారా 433 మంది. రూ.2,500 టికెట్ల ద్వారా 308 మంది, రూ.5 వేల టికెట్ల ద్వారా 107మంది భక్తులు పూజలు చేయించుకు న్నారు. ఐదురకాల ప్రసాదాలు కలిపి మొత్తం 26,531 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు వివరించారు.


