Minister Thalasani Srinivas Criticized Bjp Leaders Double Bedroom Houses - Sakshi
Sakshi News home page

‘డబుల్‌’పై బీజేపీ డ్రామాలు

Jul 21 2023 2:17 AM | Updated on Jul 26 2023 4:47 PM

Minister Thalasani Srinivas criticized BJP leaders double bedroom houses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల విషయంలో బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ విమర్శించారు. దేశంలో పేద ప్రజలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర మేనని అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌ లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

కేంద్రమంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కిషన్‌ రెడ్డికి అధికారికంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను  సందర్శించి పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ అలా కాదని రోడ్డుపై బైఠాయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏం ఆశించి, ఎందుకోసం ఈ రాద్ధాంతం చేస్తున్నారో చెప్పాలని అన్నారు. ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఆందోళన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని, పేద ప్రజల సంక్షేమం కోసం మీరేం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిజంగా పేదలకు మేలు చేయాలనే ఆలోచన మీకు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు నిధులు తేలేకపోతున్నారని ప్రశ్నించారు. 

పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే..
పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌ అన్ని మౌలిక సౌకర్యాలు, వసతులతో కూడిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తలసాని చెప్పా రు. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకు న్నట్లు తెలిపారు. కొల్లూరులో రూ. 6,700 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల  కాలనీని ఇటీవలే సీఎం ప్రారంభించారన్నారు. గతంలో డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల  ప్రారంభ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొని ప్రశంసించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement