సాక్షి, హైదరాబాద్:ఎస్ఐఆర్పై నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ఈ రోజు ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్ గడువు ముగిసే ఆగస్టు 3వ తేదీ వరకూ నేతలెవరూ గాంధీభవన్ రాకూడదని వారి వారి నియోజకవర్గాల్లోనే ఉండి ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. బీఎల్ఓల నివేదికలపైనే ఆధారపడతామంటే ఎట్టిపరిస్థితుల్లో కుదరదని తెలిపారు. పనిచేయని ఇంఛార్జ్లపై కఠినచర్యలు ఉంటాయని సీఎం ఈ సందర్భంగా పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.


