గజ్వేల్: ఎర్రవల్లిలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఏయే అంశాలపై ప్రశ్నించాలన్న అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హామీలు, పెండింగ్ పథకాలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అసెంబ్లీలో నిలదీసే అవకాశం ఉంది.


