కాళేశ్వరం బయలుదేరిన బీఆర్‌ఎస్‌ బృందం.. | BRS Leaders Visit Kaleshwaram Project Live Updates And Top Headlines In Telugu | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం బయలుదేరిన బీఆర్‌ఎస్‌ బృందం..

Jul 26 2024 9:10 AM | Updated on Jul 26 2024 11:54 AM

BRS Leaders Visit Kaleshwaram Project Live Updates

సాక్షి, రామగుండం: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం పర్యటనకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం రామగుండం నుంచి కన్నెపల్లి పంప్‌ హౌస్‌కు బీఆర్‌ఎస్‌ టీమ్‌ పయనమైంది. ఈ తర్వాత వీరంతా మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు.

అయితే, కాళేశ్వరం పర్యటనకు బీఆర్‌ఎస్‌ నేతలు గురువారం సాయంత్రం బయలుదేరారు. ఈ క్రమంలో నిన్న రాత్రి రామగుండంలో వారంతా బస చేశారు. బీఆర్ఎస్ టీమ్ ముందుగా ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్‌ను పరిశీలిస్తారు. అనంతరం 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించనున్నారు. కాగా, కన్నెపల్లి పంప్‌ హౌజ్‌ వద్ద బీఆర్‌ఎస్‌ బృందం మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం పర్యటన అనంతరం వీరంతా తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఇక, కేటీఆర్‌ నేతృత్వంలో టీమ్‌ పర్యటనకు వెళ్లడంతో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది.

 

మరోవైపు.. రామగుండంలో సింగరేణి క్వార్టర్స్‌ కోల్పోతున్న బాధితులు శుక్రవారం ఉదయం కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్లకార్డ్స్‌ ప్రదర్శనలతో తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ వేదికగా తమ గోడును వినిపించాలని కోరారు.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement