‘మేడిగడ్డలో రెండు పిల్లర్స్‌ కూలితే.. కాళేశ్వరమే కూలిపోయిందా?’ | BRS harish Rao Serious Comments On Congress | Sakshi
Sakshi News home page

‘మేడిగడ్డలో రెండు పిల్లర్స్‌ కూలితే.. కాళేశ్వరమే కూలిపోయిందా?’

Jun 7 2025 11:30 AM | Updated on Jun 7 2025 12:09 PM

BRS harish Rao Serious Comments On Congress

సాక్షి, తెలంగాణభవన్‌: రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరంపై కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ప్రచారం​ చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. మేడిగడ్డలో రెండు పిల్లర్స్‌ కూలితే కాళేశ్వరమే కూలిపోయిందని దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బనకచర్లపై కాంగ్రెస్‌ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లపై మాజీ మంత్రి హరీష్‌ రావు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే హరీష్‌ రావు మాట్లాడుతూ.. ‘నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క పిల్లర్‌ కుంగితే మేడిగడ్డ కొట్టుకుపోయినట్టుగా కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మేము చెప్పే విషయాలు నూటికి నూరుపాళ్లు నిజం. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం​ చేస్తున్నారు.

కాళేశ్వరం కూలిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కామన్‌ డైలాగ్‌ చెబుతున్నారు.  మేడిగడ్డలో 85 పిల్లర్స్‌ ఉంటే రెండు పిల్లర్సే కూలాయి. మేడిగడ్డలో రెండు పిల్లర్స్‌ కూలితే కాళేశ్వరమే కూలిపోయిందని దుష్ప్రచారం చేశారు. ​కానీ, బనకచర్లపై కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటం లేదు. తెలంగాణలో కమీషన్ల పాలన సాగుతోంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అంతకుముందు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘దేశంలో ఏ మంత్రి పని చేయని విధంగా హరీష్ రావు అద్భుతంగా పనిచేశారు. తక్కువ కాలంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత హరీష్ రావు గారిది. తెలంగాణ తెచ్చుకున్న నీళ్ళు నిధులు నియామకాలు టాగ్ లైన్ ఎప్పుడో పోయింది. నిందలు, దందాలు, చందాలు ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ పాలన. సుంకిశాల, slbc టన్నెల్ కూలినా.. కేంద్ర బృందం ఇప్పటివరకు రాలేదు. టన్నెల్ కూలిపోయి కూలీలు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

చిన్న పిల్లర్ మెడిగడ్డలో కూలితే దాన్ని రాద్దాంతం చేస్తోంది. గుజరాత్‌లో బ్రిడ్జ్ కూలి 140 మంది చనిపోతే.. ఏ రిపోర్ట్ ఉండదు.. బాధ్యులపై చర్యలు ఉండవు. బీహార్‌లో రోజుకో బ్రిడ్జి కూలిపోతే ఏ రిపోర్ట్ ఉండదు. కూలిన రెండు రోజుల్లోనే ndsa వచ్చింది.. పనికిమాలిన రిపోర్ట్ ఇచ్చింది. Ndsa రిపోర్ట్ బీజేపీ ఆఫీసులో తయారైంది. కాంగ్రెస్, బీజేపీ కుమక్కు రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ కమీషన్‌తో  కాంగ్రెస్ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్మించారు. L and T సంస్థ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించింది. అదే సంస్థ మేడిగడ్డ బ్యారేజినీ నిర్మించింది. బనకచర్లతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు మాట్లాడటం లేదు అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement