‘తెలంగాణలో పాగా వేయబోతున్న బీజేపీ’ | BJP MP K laxman Slams On Congress And BRS | Sakshi
Sakshi News home page

‘తెలంగాణలో పాగా వేయబోతున్న బీజేపీ’

Mar 10 2024 8:05 PM | Updated on Mar 10 2024 8:06 PM

BJP MP K laxman Slams On Congress And BRS - Sakshi

ఢిల్లీ:  బీఆర్ఎస్ నుంచి ప్రముఖ నాయకులు బీజేపీలో చేరుతున్నారని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పట్ల ప్రజలకు విశ్వాసం సడలి పోయిందని  బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు.  ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

‘అన్ని పార్టీల నుంచి వలసలు ప్రధాన మంత్రి నరేం​ద్రమోదీ నాయకత్వం కోసం జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ పాగా వెయ్యబోతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్‌కు దారి ఏర్పడుతుంది. దక్షిణాదిన బీజేపీ పెద్ద ఎత్తున గెలువబోతోంది. ప్రాంతీయ పార్టీలు వాళ్ళ బిడ్డల కోసం ప్లాన్ చేస్తున్నారు. మోదీ మాత్రమే దేశం కోసం ఆలోచిస్తున్నారు’ అని కె.లక్ష్మణ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement