‘బీజేపీకి విడాకులు ఇస్తారు.. చంద్రబాబు పార్టీని పెళ్లి చేసుకుంటారు’

Ap Minister Ambati Rambabu Comments On Pawan And Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తుశుద్దితో పాలన అందిస్తున్నారని, 2 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకు అందించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 175 సీట్లులో పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ సవాల్‌ విసిరారు.

‘‘సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం తనకు లేదని చంద్రబాబు ఒప్పుకున్నారు. చంద్రబాబు నిర్దేశం మేరకే పవన్‌ ఢిల్లీ టూరు. చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్‌ పార్టీ పెట్టారా? జనసేన పార్టీ గ్రాఫ్‌ రోజురోజుకు పడిపోతుంది. పోలవరంపై నాదెండ్ల అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. అవాకులు, చవాకులు పేలుతున్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు అస్తవ్యస్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని సీఎం జగన్‌ ఇప్పటికే అసెంబ్లీలో స్పష్టం చేశారు. దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్‌వాల్‌ను రిపేర్‌ చేస్తున్నాం. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడం వల్లే పనులు ఆలస్యం. వీలైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేస్తాం’’ అని మంత్రి పేర్కొన్నారు.

‘‘చంద్రబాబు చేసిన మోసాలు, కుట్రలను వెలుగులోకి తెస్తున్నాం. ఏం చేసినా అధికారంలోకి రాలేరని చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే రంకెలేస్తూ మాట్లాడుతున్నారు. 175 సీట్లలో పోటీ చేసే ధైర్యం లేని వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు వెళ్లమంటేనే వారాహి బ్యాచ్ ఢిల్లీ వెళ్లింది. బీజేపీతో విడాకులు తీసుకోమని చంద్రబాబు చెప్పి పంపారు. కానీ వారాహి బ్యాచ్ కి పనికాలేదు. కాపుల ఓట్లు చీల్చితే కొంత మెరుగు పడవచ్చని చంద్రబాబు ఆశ. పోలవరం ఎత్తు తగ్గించినట్టు నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఆయన అజ్ఞానానికి ఇంతకంటే నిదర్శనం ఏముందీ?. అసలు పోలవరం గురించి నాదెండ్ల మనోహర్, పవన్ కల్యాణ్‌కు ఏం తెలుసు?. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు’’ అంటూ మంత్రి రాంబాబు దుయ్యబట్టారు.
చదవండి: పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన సీక్రెట్ ఇదే.. అక్కడ ఏం జరిగింది?

‘‘చంద్రబాబు హయాంలో నిర్వీర్యం చేయాలని చూశారు. దాన్ని శాస్త్రీయంగా నిరూపించాం. నాదెండ్ల మనోహర్‌కి బ్రోకరిజం చేయటం తప్ప మరేం తెలియదు. పవన్, చంద్రబాబుకు మధ్య ప్యాకేజీలు కుదర్చాం తప్ప నాదెండ్లకు మరేం తెలీదు. అంతేతప్ప పోలవరంపై ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు. ఏమైనా వివరాలు కావాలంటే నన్ను అడిగితే వివరిస్తే చెప్తాను. పవన్ త్వరలోనే బీజేపీకి విడాకులు ఇస్తారు. చంద్రబాబు పార్టీని పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా వారిని చిత్తు చిత్తుగా ఓడిస్తాం. పోలవరాన్ని నిర్మిస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకోవటమే పెద్దతప్పు’’ అంబటి రాంబాబు మండిపడ్డారు.

‘‘కాపర్ డ్యాం కట్టకుండా డయాఫ్రంవాల్ ఎవరైనా కడతారా?. రెండు వేల కోట్లను చంద్రబాబు ప్రభుత్వం గంగలో కలిపారు. పోలవరం, నిర్వాసితులు, భూసేకరణకు మొత్తం కేంద్రమే చెల్లించాలి. నాదెండ్ల మనోహర్‌కి చంద్రబాబు నుంచి పవన్‌కి డబ్బులు ఎలా ఇప్పించాలో మాత్రమే తెలుసు. అంతకుమించి మరింకేం తెలియదు. చంద్రబాబుకు డబ్బులు కాజేయాలనే చిత్తశుద్ది. పవన్‌కి ప్యాకేజీ కొట్టేయాలనే చిత్తశుద్ధి. కేవలం మాకు మాత్రమే పోలవరాన్ని పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ఉంది’’ అని మంత్రి అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top