కోల్‌కతా కేసు.. సందీప్‌ ఘోష్ మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు | West Bengal Medical Council Cancels Registration Of Rg Kar Ex Principal Sandip Ghosh | Sakshi
Sakshi News home page

కోల్‌కతా కేసు.. సందీప్‌ ఘోష్ మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు

Sep 19 2024 6:53 PM | Updated on Sep 19 2024 7:04 PM

West Bengal Medical Council Cancels Registration Of Rg Kar Ex Principal Sandip Ghosh

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా మహిళా డాక్టర్‌ హత్యాచార ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది.

కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా మహిళా డాక్టర్‌ హత్యాచార ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఆర్‌జీ కర్ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ ఘోష్‌ మెడికల్ రిజిస్ట్రేషన్‌ను పశ్చిమ బెంగాల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ రద్దుచేసింది. ఘోష్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌ బెంగాల్ విభాగం ఇటీవల డబ్ల్యూబీఎంసీకి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 7న మెడికల్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు కూడా  జారీ చేసింది.

కాగా, ఈ కేసులో సీబీఐ అధికారులు నిన్న(బుధవారం) కీలక విషయాలు వెల్లడించారు. హత్యాచారం సమయంలో కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌ ధరించిన దుస్తులను కోల్‌కతా పోలీసులు ఆలస్యంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. హత్య జరిగిన రోజు ఆర్జీకర్‌ మెడికల్‌ కాలేజీ సెమినార్‌హాల్‌లోకి నిందితుడు సంజయ్‌రాయ్‌ వస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా  కేసులో సంజయ్‌రాయ్‌ ప్రధాన నిందితుడని హత్య జరిగిన మరుసటి రోజే స్పష్టమైంది. అయినా హత్య సమయంలో రాయ్‌ ధరించిన దుస్తులను సీజ్‌ చేసేందుకు కోల్‌కతాలోని తాలా పోలీస్‌స్టేషన్‌ పోలీసులకు రెండు రోజులు పట్టింది.

ఇదీ చదవండి: నిందితుడు సంజయ్‌ది పశు ప్రవృత్తి

ఒకవేళ హత్యాచారం జరిగిన మరుటిరోజే రాయ్‌ దుస్తులను సీజ్‌ చేసి  ఉంటే మరిన్ని కీలక ఆధారాలు లభించి ఉండేవని సీబీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. మహిళా డాక్టర్‌ హత్యాచారం కేసులో సంజయ్‌రాయ్‌తో పాటు ఆర్జీకర్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ఘోష్‌, తాలా మాజీ సీఐ అభిజిత్‌ మండల్‌ను సీబీఐ ఇప్పటివరకు అరెస్టు  చేసింది. అయితే వీరు విచారణలో సహకరించడం లేదని, అడిగిన  ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తెలిపింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement