చోరీ చేశాడని.. కారం దట్టించారు! | Theft Suspect Tied Up In Bihar, Chilli Powder Poured Into Private Parts, See More Details Inside | Sakshi
Sakshi News home page

చోరీ చేశాడని.. కారం దట్టించారు!

Aug 28 2024 1:23 PM | Updated on Aug 28 2024 1:41 PM

Theft Suspect Tied Up In Bihar, Chilli Powder Poured Into Private Parts

అరారియా(బిహార్‌): దొంగతనం చేశాడని ఓ వ్యక్తిని తాళ్లతో బంధించి..అతడి మలద్వారంలోకి మిరప కారం జొప్పించారు. బిహార్‌లోని అరారియాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. పోలీసులు నిందితుల్లో ఒకరిని గుర్తించి, అరెస్ట్‌ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇస్లామియానగర్‌కు చెందిన కొందరు దొంగతనం చేశాడంటూ ఓ వ్యక్తిని తాళ్లతో నిర్బంధించారు. 

అతడి ప్యాంటు విప్పి, బలవంతంగా ముందుకు వంచారు. ఒక వ్యక్తి అతడి మల ద్వారంలో మిరప కారం పోసి, పెన్సిల్‌తో లోపలికి కూరాడు. అక్కడే ఉన్న కొందరు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇది పోలీసుల కంటబడింది. దర్యాప్తు చేపట్టి మహ్మద్‌ సిఫత్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఇతడే బాధితుడి ప్యాంటు బటన్లను విప్పి, మోకాళ్ల వరకు కిందికి లాగాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. ఘటనపై ఆర్‌జేడీ నేత తేజస్వీయాదవ్‌ స్పందించారు. రాష్ట్రంలో తాలిబన్‌ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement