ముగిసిన లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే!
Lok Election 2024 First Phase Polling Updates
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది
లోక్సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది
సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద లైన్లో ఉన్నవారికి ఓటు వేసే చాన్స్
తొలి విడతలో భాగంగా దేశ వ్యాప్తంగా 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది
5 గంటల వరకు అందిన వివరాల ప్రకారం సగటున 60 శాతం పోలింగ్ నమోదైంది
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతాలు
అండమాన్ -నికోబార్ -56.87 శాతం
అరుణాచల్ ప్రదేశ్ -63.27 శాతం
అస్సాం -70.77 శాతం
చత్తీస్ ఘడ్ -63.41శాతం
జమ్మూ- కాశ్మీర్ -65.08 శాతం
లక్షద్వీప్ -59.02 శాతం
మధ్యప్రదేశ్ -63.25 శాతం
మహారాష్ట్ర -54.85శాతం
మణిపూర్ -67.66 శాతం
మేఘాలయ -69.91 శాతం
మిజోరాం -52.73 శాతం
నాగాలాండ్ -55.79 శాతం
పుదుచ్ఛేరి -72.84 శాతం
రాజస్థాన్ -50.27 శాతం
సిక్కిం -68.06శాతం
తమిళనాడు -62.02 శాతం
త్రిపుర -76.10శాతం
ఉత్తరప్రదేశ్ -53.56 శాతం
ఉత్తరాఖండ్ - 57.54 శాతం
పశ్చిమబెంగాల్ -77.57 శాతం
బిహార్ -46.32 శాతం
మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతాలు
అండమాన్ -నికోబార్ -45.48శాతం
అరుణాచల్ ప్రదేశ్ -55.05 శాతం
అస్సాం -60.70 శాతం
చత్తీస్ ఘడ్ -58.14శాతం
జమ్మూ- కాశ్మీర్ -57.07 శాతం
లక్షద్వీప్ -43.98 శాతం
మధ్యప్రదేశ్ -53.40 శాతం
మహారాష్ట్ర -44.12శాతం
మణిపూర్ -63.03 శాతం
మేఘాలయ -61.95 శాతం
మిజోరాం -49.77 శాతం
నాగాలాండ్ -51.73 శాతం
పుదుచ్ఛేరి -58.86 శాతం
రాజస్థాన్ -41.51 శాతం
సిక్కిం -52.72శాతం
తమిళనాడు -51.10 శాతం
త్రిపుర -68.35శాతం
ఉత్తరప్రదేశ్ -47.44 శాతం
ఉత్తరాఖండ్ -45.62 శాతం
పశ్చిమబెంగాల్ -66.34 శాతం
బిహార్ -39.73 శాతం
మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ శాతాలు
అండమాన్ అండ్ నికోబార్ దీవులు- 35. 70 శాతం
అరుణాచల్ ప్రదేశ్- 35.75 శాతం
అస్సాం- 45.12 శాతం
బిహార్- 32.41శాతం
చత్తీస్ఘడ్- 42.41శాతం
జమ్ము అండ్ కశ్మీర్- 43.11 శాతం
లక్ష్యదీప్- 29.91 శాతం
మధ్యప్రదేశ్- 44.43 శాతం
మహారాష్ట్ర - 32.36 శాతం
మణిపూర్- 46.92శాతం
మేఘాలయ- 48.91 శాతం
మిజోరం- 37.43 శాతం
నాగాలాండ్- 39.66 శాతం
పుదుచ్చేరి- 44.95 శాతం
రాజస్థాన్- 33. 73శాతం
సిక్కిం- 36.82 శాతం
తమిళానాడు- 39. 51శాతం
త్రిపుర- 53.04 శాతం
ఉత్తరప్రదేశ్ 36. 96శాతం
ఉత్తరఖండ్- 37. 33 శాతం
తమిళనాడు
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు విజయ్
తమిళనాడులో లోక్సభ తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది
నటుడు, తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ చెన్నైలోని నీలంకరైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు
#WATCH | Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam president Vijay casts his vote at a polling booth in Neelankarai, Chennai#LokSabhaElections2024 pic.twitter.com/rTtu4tGZJy
— ANI (@ANI) April 19, 2024
మణిపూర్లో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు
మణిపూర్లో లోక్సభ ఎన్నికల తొలి విడతలో భాగంగా ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది
మణిపూర్లోని మొయిరాంగ్ సెగ్మెంట్లోని థమన్పోక్పిలోని పోలింగ్ స్టేషన్ సమీపంలో పోలింగ్ కేంద్ర వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు
ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు
ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లలో ఈ కాల్పులు భయాందోళనకు గురి చేశాయి
కాల్పుల శబ్దం మధ్య పోలింగ్ బూత్ నుంచి ప్రజలు బయటకు పరుగులు తీసిన వీడియో వైరల్గా మారింది
ఉదయం 11 గంటల వరకు 24 శాతం పోలింగ్
ఉదయం11 గంటల వరకు 102 సీట్లలో 24 శాతం పోలింగ్ నమోదైనట్లు పోలింగ్ అధికారులు పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది
లోక్సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది
ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతాలు
అండమాన్ అండ్ నికోబార్ దీవులు- 21.82 శాతం
అరుణాచల్ ప్రదేశ్- 18.26 శాతం
అస్సాం- 27. 22 శాతం
బిహార్- 20. 42 శాతం
చత్తీస్ఘడ్- 28. 12 శాతం
జమ్ము అండ్ కశ్మీర్- 22.60 శాతం
లక్ష్యదీప్- 16.33 శాతం
మధ్యప్రదేశ్ 30.46 శాతం
మహారాష్ట్ర 19. 17 శాతం
మణిపూర్- 27. 64 శాతం
మేఘాలయ- 31.65 శాతం
మిజోరం- 26. 23 శాతం
నాగాలాండ్- 22. 50 శాతం
పుదుచ్చేరి- 27. 63 శాతం
రాజస్థాన్- 22. 51 శాతం
సిక్కిం- 21.20 శాతం
తమిళానాడు- 23. 72 శాతం
త్రిపుర- 33.28 శాతం
ఉత్తరప్రదేశ్ 25.20 శాతం
ఉత్తరఖండ్- 24.83 శాతం
#LokSabhaElections2024📷 | Voter turnout till 11 am for phase 1 of polling:
Lakshadweep records the lowest - 16.33%
Tripura records the highest - 33.28% pic.twitter.com/tgkI2p7ATU
— ANI (@ANI) April 19, 2024
ఓటేసిన మేఘాలయ సీఎం
మేఘాలయలో పోలింగ్ కొనసాగుతోంది
ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా పశ్చిమ గారో హిల్స్లోని తురాలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు
#WATCH | Meghalaya CM Conrad Sangma casts his vote at a polling booth in Tura, West Garo Hills#LokSabhaElections2024 pic.twitter.com/qyXK0MVPkb
— ANI (@ANI) April 19, 2024
ఓటు హక్కు వినియోగించుకున్న జ్యోతి అమ్గే
ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు
నాగ్పూర్లో ఓటు వేసిన జ్యోతి అమ్గే
#WATCH | Maharashtra: World's smallest living woman, Jyoti Amge cast her vote at a polling booth in Nagpur today. #LokSabhaElections2024 pic.twitter.com/AIFDXnvuvk
— ANI (@ANI) April 19, 2024
ఓటేసిన సిక్కిం సీఎం
సిక్కింలో లోక్సభ పోలింగ్ కొనసాగుతోంది
గ్యాంగ్టక్ పోలింగ్ కేంద్రంలో సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు
#WATCH | Sikkim CM Prem Singh Tamang casts his vote for #LokSabhaElections2024 and state Assembly Elections 2024 at a polling station in Gangtok pic.twitter.com/XY6agVbGTr
— ANI (@ANI) April 19, 2024
తమిళనాడులో మందకోడిగా సాగుతున్న పోలింగ్
ఉదయం నుంచే ఎండ పెరగటంతో బయటకు రాని జనం
ఉదయం 9 గంటలకు వరకు 12. 55 శాతం పోలింగ్ నమోదు
ఓటు వేసిన త్రిపుర సీఎం
అగర్తలా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన సీఎం మాణిక్ షాహా
కొనసాగుతున్న పోలింగ్
#WATCH | Tripura CM Manik Saha casts his vote at a polling booth in Agartala #LokSabhaElections2024 pic.twitter.com/g7ztewDNxT
— ANI (@ANI) April 19, 2024
తమిళనాడు
ఓటు వేసిన కమల్ హాసన్
నటుడు, ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు
కోయంబేడులో పోలింగ్ కొనసాగుతోంది
#WATCH | Tamil Nadu: Actor and MNM chief Kamal Haasan arrives at a polling booth in Koyambedu, Chennai to cast his vote.
Makkal Needhi Maiam (MNM) is not contesting the #LokSabhaElections2024, the party supported and campaigned for DMK. pic.twitter.com/q1bizg3Wey
— ANI (@ANI) April 19, 2024
ఓటు హక్కు వినియోగించుకున్న బాబారాందేవ్, బాలకృష్ణ
ఉత్తరఖండ్ హరిద్వార్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కొనసాగుతోంది
#WATCH | Uttarakhand: Yog guru Baba Ramdev and Patanjali Ayurved's Managing Director Acharya Balkrishna cast their votes at a polling booth in Haridwar#LokSabhaElections2024 pic.twitter.com/6fho7bk5t9
— ANI (@ANI) April 19, 2024
ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతాలు
తమిళనాడు- 8. 21 శాతం
త్రిపుర- 15, 21 శాతం
ఉత్తర ప్రదేశ్- 12. 66 శాతం
ఉత్తరఖండ్- 10. 54 శాతం
పశ్చిమబెంగాల్- 15. 09 శాతం
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది
#LokSabhaElections2024 | Voter turnout till 9 am for phase 1 of polling:
Lakshadweep records the lowest - 5.59%
Tripura records the highest - 15.21% pic.twitter.com/Y5ekbBDCrU
— ANI (@ANI) April 19, 2024
ఉత్తరఖండ్
ఓటు వేసిన ఉత్తరఖండ్ సీఎం
ఉత్తరఖండ్లో పోలింగ్ కొనసాగుతోంది
ఉత్తరఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హక్కు వినియోగించుకున్నారు
#WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami along with his mother and wife cast his vote for the first phase of #LokSabhaElections2024 at a polling station in Khatima. pic.twitter.com/kd4ZC1uyTJ
— ANI (@ANI) April 19, 2024
మిజోరం
ఓటు వేసిన మిజోరం గవర్నర్
మిజోరం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఐజ్వాల్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కొనసాగుతోంది
#WATCH | Mizoram Governor Dr Hari Babu Kambhampati casts his vote at a polling booth in Aizawl#LokSabhaElections2024 pic.twitter.com/GYkykdPz8n
— ANI (@ANI) April 19, 2024
ఓటు వేసిన అన్నామలై
కోయంబత్తూర్ బీజేపీ అభ్యర్థి అన్నామలై ఓటు హక్కు వినియోగించకున్నారు.
తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది
తమిళనాడు మొత్తం 39 స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరుగుతోంది
"DMK, AIADMK has spent 1000 crores in Coimbatore": BJP's Annamalai alleges after casting his vote
Read @ANI Story | https://t.co/pE64lzIK5U#LokSabhaElection2024 #TamilNadu #KAnnamalai #Votingday #BJP pic.twitter.com/Mie4ulXT79
— ANI Digital (@ani_digital) April 19, 2024
కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్
ఊపందుకున్న పోలింగ్ ప్రక్రియ
ఎండాకాలం కావడంతో ఉదయాన్నే ఓటింగ్ వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లు
ఓటు హక్కు వినియోగించుకున్న తమిళనాడు సీఎం
తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది
చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో సీఎం స్టాలిన్ ఓటు వేశారు
#WATCH | Tamil Nadu CM and DMK chief MK Stalin casts his vote at a polling booth in Chennai.#LokSabhaElections2024 pic.twitter.com/IGyEcGD34I
— ANI (@ANI) April 19, 2024
ఓటు వేసిన రాజస్తాన్ సీఎం
రాజస్తాన్లో పోలింగ్ కొనసాగుతోంది
ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు క్యూ లైన్లలో నిల్చున్నారు
రాజస్తాన్ సీఎం భజనలాల్ శర్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు
#WATCH | Rajasthan CM Bhajanlal Sharma casts his vote for the first phase of #LokSabhaElections2024, in Jaipur, Rajasthan. pic.twitter.com/kTjB47fk2Y
— ANI (@ANI) April 19, 2024
ఓటు వేసిన తమిళ సూపర్స్టార్ రజినీకాంత్
తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది
చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో రజినీకాంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు
Actor Rajnikanth casts his vote at a polling booth in Chennai, Tamil Nadu.#LokSabhaElections2024 pic.twitter.com/kdgb3ewP8p
— ANI (@ANI) April 19, 2024
#WATCH | Actor Rajnikanth casts his vote at a polling booth in Chennai, Tamil Nadu.
#LokSabhaElections2024 pic.twitter.com/6Ukwayi5sv
— ANI (@ANI) April 19, 2024
ఓటు వేసిన మాజీ సీఎం కమల్ నాథ్
మధ్యప్రదేశ్:
మాజీ సీఎం కమల్నాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కమల్ నాథ్ కుమారుడు, కాంగ్రెస్ నేత నకుల్ నాథ్ చింద్వారా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
చింద్వారాలో పోలింగ్ కొనాసాగుతోంది
#WATCH | Chhindwara | Congress leader & former Madhya Pradesh CM Kamal Nath says, "I have full faith in the people of Chhindwara. I have full hope that they will stand by the truth."
His son and Congress leader Nakul Nath is contesting from the Chhindwara Lok Sabha seat… pic.twitter.com/2La3i41ZoI
— ANI (@ANI) April 19, 2024
#WATCH | Chhindwara | Congress leader & former Madhya Pradesh CM Kamal Nath shows his inked finger after casting his vote in the first phase of #LokSabhaElections2024📷
His son and Congress leader Nakul Nath is contesting from the Chhindwara Lok Sabha seat pic.twitter.com/XpDqSqr7oG
— ANI (@ANI) April 19, 2024
మేఘాలయ
వెస్ట్ గారో హిల్స్లోని తురాలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలో నిల్చున్నారు
మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాని వచ్చారు
#WATCH | #LokSabhaElections2024 | People queue up outside a polling station in Tura, West Garo Hills
Meghalaya CM Conrad Sangma is also present here to cast his vote. pic.twitter.com/laVAKteCoe
— ANI (@ANI) April 19, 2024
ఓటు హక్కు వినియోగించుకున్న సినీ హీరో అజిత్
తమిళనాడు:
సినీ హీరో అజిత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు
తిరువాన్మియూర్ పోలింగ్ కొనసాగుతోంది
#WATCH | Tamil Nadu: Ajith Kumar arrives at a polling Booth in Thiruvanmiyur to cast his vote in the first phase of #LokSabhaElections2024 pic.twitter.com/WW3vcvbMEn
— ANI (@ANI) April 19, 2024
లోక్సభ ఎన్నిక తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది
21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలతోపాటు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది.
ఓట్లుర్లు భారీగా ఓటు వేయడానికి తరలివస్తున్నారు.
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది
ఓటు వేసిన తమిళిసై సౌందరరాజన్
తమిళనాడు( చెన్నై):
చెన్నై సౌత్ బీజేపీ అభ్యర్థి తమిళిసై తన ఓటు హక్కు వినియోగించుకున్నారు
చెన్నైలో పోలింగ్ కొనసాగుతోంది
#WATCH | Tamil Nadu: BJP's South Chennai candidate Tamilisai Soundarajan arrives at a polling booth in Saligramam, Chennai to cast her vote.#LokSabhaElections2024 pic.twitter.com/9PGQiaH23d
— ANI (@ANI) April 19, 2024
ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోదీ
2024 లోక్సభ ఎన్నికలు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది.
21 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి
ఈ స్థానాల్లో ఓటు హక్కు ఉన్న ఓటర్లు.. రికార్డు స్థాయిలో తమ వినియోగించుకోవాలని కోరుతున్నాను
PM Narendra Modi says, "The 2024 Lok Sabha elections commence today! As 102 seats across 21 States and UTs go to the polls, I urge all those voting in these seats to exercise their franchise in record numbers..."#LokSabhaElections2024 pic.twitter.com/7rJrJRTvgt
— ANI (@ANI) April 19, 2024
ఓటు వేసిన పళనిస్వామి
మాజీ సీఎం ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి ఓటు వేశారు
సేలంలో పోలింగ్ కొనసాగుతోంది
#WATCH | Former Tamil Nadu CM and AIADMK leader Edappadi K Palaniswami casts his vote at a polling booth in Salem. #LokSabhaElections2024 pic.twitter.com/NT6zdXtFiE
— ANI (@ANI) April 19, 2024
ఓటు వేసిన కాంగ్రెస్ నేత పి. చిదంబరం
తమిళనాడు:
కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం శివగంగ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది
#WATCH | Tamil Nadu: Congress leader P Chidambaram casts his vote at a polling booth in Sivaganga.#LokSabhaElections2024 pic.twitter.com/9Aq8IfY5cT
— ANI (@ANI) April 19, 2024
ఉత్తరఖండ్:
ఉత్తరఖండ్ చీఫ్ ఎన్నికల అధికారి బీవీఆర్సీసీ పురుషోత్తం ఓటు హక్కు వినియోగించుకున్నారు
ఉత్తరఖండ్లో లోక్సభ తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది
Uttarakhand Chief Electoral Officer BVRCC Purushottam cast his vote at booth number 141 in Dehradun.#LokSabhaElections2024 pic.twitter.com/32SYUpTdI8
— ANI (@ANI) April 19, 2024
ఓటు హక్కు వేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్
మహారాష్ట్ర( నాగ్పూర్)
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు
తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది
#WATCH | Nagpur, Maharashtra: RSS chief Mohan Bhagwat shows his inked finger after casting his vote in the first phase of #LokSabhaElections2024 pic.twitter.com/rqZ2Fn0ZU1
— ANI (@ANI) April 19, 2024
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది
తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు క్యూలైన్లో నిల్చున్నారు
పోలీసులు అన్ని పోలింగ్ కేంద్రాల్లో భద్రత ఏర్పాటు చేశారు
పోలింగ్ సిబ్బంది ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు
నేడే లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్
పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన కేంద్ర ఎన్నికల సంఘం
తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్
తొలి దశలో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సాం, మహారాష్ట్రల్లో 5, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3,ఉత్తరాఖండ్లోని 5, అరుణాచల్ప్రదేశ్లోని 2, మేఘాలయలో 2, అండమాన్ నికోబార్లో 1, మిజోరాంలో 1, పుదుచ్చేరిలో 1, సిక్కింలో1, లక్షద్వీప్లోని 1 సీటు, మణిపూర్లో 3, జమ్మూ-కశ్మీర్, ఛత్తీస్గఢ్, త్రిపురలో ఒక్కో సీటుకి పోలింగ్
2019 ఎన్నికల్లో తొలి దశలో పోలింగ్ జరిగిన 102 స్థానాల్లో యూపీఏ 45, ఎన్డీయే 41 స్థానాలు గెలుపు
#WATCH | #LokSabhaElection2024 | Tamil Nadu: Polling preparations underway at polling booth number 134 in Sivaganga district
All 39 Lok Sabha seats in Tamil Nadu are going to polls today, in the first phase of the 2024 general elections. pic.twitter.com/EkLf5SPXPb
— ANI (@ANI) April 19, 2024
తొలిదశ బరిలో ప్రముఖులు:
కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, బిప్లబ్ దేబ్, నబమ్ టుకీ, సంజీవ్ బల్యాన్, డీఎంకే నేత ఎ రాజా, ఎల్ మురుగన్, కార్తీ చిదంబరం.
జూన్ 4న ఎన్నికల ఫలితాలు
#WATCH | #LokSabhaElection2024 | People queue up outside a polling station in Soreng, Sikkim.
Sikkim is represented by a single seat in the Lok Sabha, pic.twitter.com/69lLuyznaR
— ANI (@ANI) April 19, 2024
సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ అయిన లోక్సభ ఎన్నికల తొలి దశ పోరుకు సర్వం సిద్ధమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటితోపాటే అరుణాచల్ ప్రదేశ్లోని మొత్తం 60, సిక్కింలోని మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది.
స్థానిక పరిస్థితులను బట్టి పోలింగ్ వేళల్లో మార్పులుచేర్చే అవకాశముంది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్కుమార్ సుఖ్బీర్సింగ్ సంధూ పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఈసీ రాజీవ్కుమార్ విజ్ఞప్తి చేశారు.
తొలి దశలో బరిలో నిల్చిన నేతలు..
కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ(నాగ్పూర్ నియోజకవర్గం), కిరెన్ రిజిజు(అరుణాచల్ వెస్ట్), సంజీవ్ భలియా(ముజఫర్నగర్), జితేంద్ర సింగ్(ఉధమ్పూర్), అర్జున్ రామ్ మేఘ్వాల్(బికనీర్), ఎల్.మురుగన్(నీలగిరి), శర్బానంద సోనోవాల్(దిబ్రూగఢ్), భూపేంద్ర యాదవ్(అల్వార్) శుక్రవారం నాటి పోరులో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అరుణాచల్ మాజీ సీఎం నబాం టుకీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్కుమార్ దేవ్, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్, డీఎంకే నాయకురాలు కనిమొళి, బీజేపీ తమిళనాడు చీఫ్ కె.అన్నామలై, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ తనయుడు నకుల్నాథ్, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ నేత జితిన్ ప్రసాద, నితిన్ ప్రామాణిక్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్సెల్వం, కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం, ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ పోటీచేస్తున్న స్థానాల్లోనూ శుక్రవారమే పోలింగ్ జరుగుతోంది.
Polling team proceeding to Gate and Gasheng village under Payum circle in Siang District- Arunachal Pradesh, Dated 17th, April 2024.@ceoarunachal 🙌🤝#Elections2024 #IVoteForSure #ChunavKaParv #DeshKaGarv #saathchalenge #YouAreTheOne pic.twitter.com/hZ0YQ6sycr
— Election Commission of India (@ECISVEEP) April 18, 2024
భారీగా ఏర్పాట్లు
తొలి దఫా పోలింగ్ కోసం 18 లక్షల మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పోలింగ్, భద్రతా సిబ్బందిని తరలించేందుకు 41 హెలికాప్లర్లు, 84 ప్రత్యేక రైళ్లు, లక్ష వాహనాలు సమకూర్చారు.
తప్పకుండా ఓటేయాలి: సీఈసీ రాజీవ్
ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోసందేశం విడుదలచేశారు. ‘‘ భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనేవి అత్యంత రమణీయమైన భావన. ఇందులో ఓటింగ్కు మించింది లేదు. భారతీయ ఓటర్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ ఎండ వేడిమినీ అధిగమిస్తుంది. ఎన్నికలు మీవి. ఎవరిని ఎన్నుకోవాలనేది మీ ఇష్టం. మీ ప్రభుత్వాన్ని మీరే నిర్ణయించుకోండి. మీ కుటుంబం, పిల్లలు, పల్లె, గ్రామం.. అంతెందుకు దేశం కోసం మీరు వేస్తున్న ఓటు ఇది’ అని రాజీవ్ వ్యాఖ్యానించారు. 85 ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
నాడు ఈ 102 సీట్లలో 45 చోట్ల యూపీఏ గెలుపు
2019 లోక్సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 45 చోట్ల యూపీఏ కూటమి విజయం సాధించింది. 41 స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఈ 41లో బీజేపీ గెలిచినవే 39 ఉన్నాయి.
సమస్యాత్మక బస్తర్లోనూ..
మావోల దాడులు, పోలీసు బలగాల ఎదురుకాల్పుల మోతలతో దద్దరిల్లే ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలోనూ శుక్రవారమే పోలింగ్ జరుగుతోంది. బస్తర్లోని కాంకేర్ జిల్లాలో ఈనెల 16న జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది నక్సల్స్ మరణించిన నేపథ్యంలో ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బస్తర్లో 61 పోలింగ్బూత్లు సున్నితమైన ప్రాంతాల్లో, 196 బూత్లను సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు.
బస్తర్ నుంచి కాంగ్రెస్ ఫైర్బ్రాండ్ నేత కవాసి లఖ్మా బరిలో నిలిచారు. ఈయనకు పోటీగా మహేశ్ కశ్యప్ను బీజేపీ నిలిపింది. భద్రతా కారణాల రీత్యా కొన్ని బూత్లలో పోలింగ్ను మధ్యా హ్నం మూడు గంటలవరకే అనుమతిస్తారు. 191 ‘సంఘ్వారీ’ బూత్లను మహిళా సిబ్బంది నిర్వహిస్తారు. 42 ‘ఆదర్శ్’, 8 ‘దివ్యాంగ్జన్’, 36 యువ బూత్లనూ ఏర్పాటుచేశారు.